breaking news
Pakistan Hockey
-
షకీల్పై నిషేధం ఎత్తివేత
లాహోర్: పాకిస్తాన్ హాకీలో సంక్షోభం ముదురుతున్న వేళ ఆ దేశ సర్కారు జోక్యం చేసుకుంది. పాకిస్తాన్ హాకీ జట్టు కెప్టెన్ అమద్ షకీల్ భట్పై ఆ దేశ హాకీ సమాఖ్య (పీహెచ్ఎఫ్) విధించిన రెండేళ్ల నిషేధాన్ని పాక్ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ నిషేధం నియమావళికి విరుద్ధమని ప్రభుత్వం ప్రకటించింది. ఆ్రస్టేలియా పర్యటనలో పీహెచ్ఎఫ్ నిర్వహణ లోపంతో పాకిస్తాన్ హాకీ ఆటగాళ్లు వీధిన పడ్డారు. బసచేస్తున్న హోటల్కు నిధులు విడుదల చేయకపోవడంతో ఆటగాళ్లంతా రోడ్లపై పడిగాపులు కాశారు. దీంతో పీహెచ్ఎఫ్ నిర్వాకంపై కెప్టెన్ షకీల్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. దీన్ని సహించలేకపోయిన పీహెచ్ఎఫ్ అధ్యక్షుడు తారిఖ్ బగ్తీ క్రమశిక్షణ చర్యల కింద కెప్టెన్పై నిషేధం విధించారు. తర్వాత తన ఆధ్యక్ష పదవికి బగ్తీ రాజీనామా చేశారు. ఆసీస్లో పాక్ అప్రతిష్టపాలుపై గుర్రుగా ఉన్న పీహెచ్ఎఫ్ ప్యాట్రన్ ఇన్ చీఫ్, దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్... బగ్తీ రాజీనామాను వెంటనే ఆమోదిస్తూ అహ్మద్ అధ్యక్షతన అడ్హక్ కమిటీని నియమించారు. అలాగే కెపె్టన్ షకీల్పై నిషేధం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని బగ్తీ విధించిన సస్పెన్షన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. -
అంట్లు తోముకోవాల్సి వచ్చింది: మండిపడ్డ పాక్ కెప్టెన్
పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ (పీహెచ్ఎఫ్) తీరుపై ఆ దేశ హాకీ జట్టు కెప్టెన్ షకీల్ అమ్మద్ బట్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. PHF ప్రస్తుత యాజమాన్యంతో కలిసి తాము పనిచేయలేమని తేల్చిచెప్పాడు. దేశం కాని దేశంలో తమను రోడ్ల వెంట పరిగెత్తించి.. ఆఖరికి అంట్లు తోముకునేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.అసలేం జరిగిందంటే.. FIH Pro Leagueలో భాగంగా తమ మ్యాచ్లు ఆడేందుకు పాక్ జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లింది. అయితే, వారి వసతికి సంబంధించి సరైన ఏర్పాట్లు చేయడంలో PHF విఫలమైంది. కాన్బెర్రా వెళ్లేందుకు పాక్ జట్టు సిడ్నీ విమానాశ్రయంలో దాదాపు 13-14 గంటల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది.అనంతరం హోటల్కు వెళ్లిన తర్వాత పాక్ హాకీ జట్టుకు మరో ఘోర అవమానం ఎదురైంది. వారి పేరిట అడ్వాన్స్ బుకింగ్ లేకపోవడంతో హోటల్ మేనేజ్మెంట్ అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించింది. దీంతో గంటల పాటు పాక్ హాకీ ఆటగాళ్లు రోడ్ల మీద తిరగాల్సి వచ్చింది. ఆ మరుసటి రోజు మధ్యాహ్నమే మ్యాచ్ ఆడాల్సి ఉండగా.. ఆసీస్ చేతిలో పాక్ ఓడిపోయింది. అనంతరం జర్మనీ చేతిలోనూ ఓటమిపాలైంది.మా అంట్లు మేమే తోముకోవాల్సి వచ్చిందిఈ నేపథ్యంలో తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి పాకిస్తాన్ హాకీ జట్టు కెప్టెన్ షకీల్ అహ్మద్ బట్ స్వదేశానికి వచ్చిన తర్వాత లాహోర్ ఎయిర్పోర్టులో మీడియాకు వెల్లడించాడు. ‘‘ప్రస్తుత హాకీ ఫెడరేషన్ యాజమాన్యంతో కలిసి మేము పనిచేయలేము.మ్యాచ్ ఆడేందుకు వెళ్లే ముందు మా అంట్లు మేమే తోముకోవాల్సి వచ్చింది. అలాంటపుడు మ్యాచ్ ఫలితం గురించి ఆలోచించే సమయం మాకు ఎక్కడ ఉంటుంది?.. అసలు మ్యాచ్ ఆడతామో లేదో తెలియని పరిస్థితి. ఇక ఫలితం గురించి అడగటం ఎందుకు?మాకు విదేశీ కోచ్ కావాలిమేము పది రోజుల పాటు చీప్ ఏరియాలో ఉండాల్సి వచ్చింది. ఇంతకంటే ఘోరం ఏముంటుంది? ఈ విషయాల గురించి మీడియాతో మాట్లాడవద్దని మా ఫెడరేషన్ హెచ్చరికలు జారీ చేసింది. అయితే, ఆస్ట్రేలియాలో మాకు ఏం జరిగిందో అందరికీ తెలియాలి కాబట్టే నేను మాట్లాడుతున్నాను.మాకు విదేశీ కోచ్ కావాలి. అప్పుడే అనుకున్న ఫలితాలు రాబట్టగలము. యాజమాన్యం కూడా మంచిగా ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది’’ అని షకీల్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా పాక్ హాకీ ఫెడరేషన్కు ప్రాటన్-ఇన్-చీఫ్గా ప్రధాని షెబాజ్ షరీఫ్ ఉంటారు.ప్రధాని దృష్టికి తీసుకువెళ్తాముఈ నేపథ్యంలో పీఎస్బీ డైరెక్టర్- జరనల్ నూర్ సభా స్పందిస్తూ.. ఆటగాళ్ల ఆరోపణలపై విచారణ చేస్తున్నామని.. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్తామని చెప్పుకొచ్చాడు. కాగా FIH Pro Leagueలో పాకిస్తాన్ ఆడిన ఎనిమిది మ్యాచ్లలో ఎనిమిది ఓడిపోయి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానం (తొమ్మిది)లో ఉంది. మరోవైపు.. బెల్జియం ఎనిమిదింట ఏడు గెలిచి అగ్రస్థానంలో ఉండగా.. భారత్ నాలుగింటికి నాలుగు ఓడి ఎనిమిదో స్థానంలో ఉంది.చదవండి: IND vs PAK: అసలైన హీరో మీరే: పీసీబీ చైర్మన్ -
రోజుకు 40 డాలర్లేనా!.. ఇలాగే కొనసాగితే...
లాహోర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ తొలి దశ మ్యాచ్లకు గాను ఇచ్చిన మ్యాచ్ ఫీజుపై పాకిస్తాన్ హాకీ ప్లేయర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ తొలి దశ మ్యాచ్ల్లో భాగంగా... ఈ నెల అర్జెంటీనాలో పాకిస్తాన్ జట్టు నాలుగు మ్యాచ్లు ఆడింది. వాటికి సంబంధించిన రోజూవారీ భత్యాలు తాజాగా అందించారు. అయితే ముందు చెప్పిన దాంట్లో మూడో వంతు ఫీజులు కూడా ఇవ్వకపోవడంపై జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరగనున్న ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ మ్యాచ్ల్లో ఆడబోమని వెల్లడించారు. ఇది చాలా అవమానకరం‘అర్జెంటీనాలో జరిగిన ప్రొ లీగ్ సందర్భంగా రోజుకు 30,000 రూపాయలు ఇస్తామని ముందు చెప్పారు. కానీ దానికి బదులు రోజుకు 11,000 చొప్పున ఇచ్చారు. ఇది చాలా అవమానకరం. అంటే డాలర్ల రూపంలో చూసుకుంటే రోజుకు 110 డాలర్లు ఇస్తామని చెప్పి 40 డాలర్లు కూడా ఇవ్వలేదు. చెప్పిన దానికి ఇచ్చిన దానికి చాలా తేడా ఉంది’ అని ఒక ఆటగాడు పేర్కొన్నాడు. ‘ఆటగాళ్లకు 30,000 రూపాయలు రోజూవారీ భత్యం చెల్లించాలనేది పాకిస్తాన్ హాకీ సమాఖ్య విధానం. మేము ఏమీ చేయలేంకానీ ప్రొ లీగ్ రెండు దశలకు జట్టు మొత్తం ఖర్చులను పాకిస్తాన్ స్పోర్ట్స్ బోర్డు నిధులు సమకూరుస్తున్నందున ఈ విషయంలో మేము ఏమీ చేయలేం’ అని ఎఫ్ఐహెచ్ కార్యదర్శి రాణా ముజాహిద్ పేర్కొన్నాడు. కాగా అర్జెంటీనా అంచె పోటీల్లో ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ పాకిస్తాన్ జట్టు పరాజయం పాలైంది. -
ఆసియా కప్లో నేడు భారత్-పాకిస్తాన్ ‘ఢీ’
చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జకార్తాలో నేడు జరిగే తొలి మ్యాచ్తో భారత హాకీ జట్టు ఆసియా కప్ టైటిల్ వేటను ప్రారంభించనుంది. బీరేంద్ర లాక్రా కెప్టెన్సీలో భారత్ బరిలోకి దిగనుంది. సీనియర్లు విశ్రాంతి తీసుకోవడంతో భారత జట్టులో 10 మంది కొత్త ఆటగాళ్లకు తొలిసారి అవకాశం లభించింది. సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్ చానెల్లో, డిస్నీ–హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
వరల్డ్కప్ నుంచి పాకిస్తాన్ ఔట్..
భువనేశ్వర్: జూనియర్ హాకీ ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించింది. గ్రూప్ ‘డి’లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 3–4 గోల్స్ తేడాతో అర్జెంటీనా చేతిలో ఓడింది. దాంతో గ్రూప్ ‘డి’లో ఒక విజయం, రెండు ఓటములతో 3 పాయింట్లు సాధించిన పాక్ మూడో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు (క్వార్టర్ ఫైనల్స్) అర్హత సాధించలేకపోయింది. అర్జెంటీనా తరఫున బాటిస్టా (10వ ని.లో), నార్డోలిలో (20వ ని.లో), ఫ్రాన్సిస్కో (30వ ని.లో), ఇబార (47వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. పాక్ ఆటగాళ్లు రాణా అబ్దుల్ (17వ నిమిషంలో), రిజ్వాన్ అలీ (28వ నిమిషంలో), అహ్మద్ (53వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. చదవండి: BAN Vs PAK: పాకిస్తాన్కు చుక్కలు చూపించిన బంగ్లాదేశ్ బౌలర్.. ఏకంగా 7 వికెట్లు... -
పాక్ హాకీ సెక్రటరీగా షెహజాద్ అహ్మద్
కరాచీ : పాకిస్తాన్ హాకీ సమాఖ్య సెక్రటరీగా పాక్ దిగ్గజ ఆటగాడు షెహజాద్ అహ్మద్ ను నియమించారు. హాకీ వరల్డ్ కప్ గెలిచిన పాక్ జట్టు కెప్టెన్ గానూ ఆయన ప్రసిద్ధి. అయితే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాక, అతడు పాక్ హాకీకి చాలా దూరంగా ఉన్నాడు. హాకీ సమాఖ్య మాజీ అధ్యక్షుడు ఖాలీద్ ఈజాజ్ చౌదరి ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించాడు. అతడు మూడేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నాడని వెల్లడించాడు. ఇప్పటివరకు సెక్రటరీగా ఉన్న రాణా ముజాహిద్ 2013 డిసెంబర్ నుంచి జట్టుకు సేవలందిస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం కోల్కర్ హాకీ అధ్యక్షుడిగా కొనసాగతున్నారు.


