-
కేశవరెడ్డికి కన్నీటి వీడ్కోలు
డిచ్పల్లి/నిజామాబాద్: ప్రముఖ నవలా రచయిత డాక్టర్ కేశవరెడ్డి అంత్యక్రియలు శనివారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి శివారులోని విక్టోరియా ఆస్పత్రి ఆవరణలో జరిగాయి. ఈ ఆస్పత్రిలో డాక్టర్ కేశవరెడ్డి సుమారు 30 ఏళ్లపాటు కుష్టు వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలందించారు. తన భౌతికదేహాన్ని ఇక్కడే ఖననం చేయాలన్న ఆయన కోరిక మేరకు శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు హాస్పిటల్ ఆవరణలోని సీఎంసీ చర్చి ప్రాంగణంలో కేశవరెడ్డి పార్థివదేహాన్ని సందర్శనార్ధం ఉంచారు. రెవరెండ్ ఎం.చరణ్ నేతృత్వంలో ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం డాక్టర్ భౌతికదేహాన్ని సమాధుల స్థలం వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ ఖననం చేశారు. కేశవరెడ్డి అంత్యక్రియలకు ప్రజాకవి, గాయకుడు గోరేటి వెంకన్న, నాళేశ్వర శంకర్, బైస రామదాసు, ప్రముఖ కార్టూనిస్ట్ మోహన్, సైదాచారి, ఉష, అరవి, ఎనిశెట్టి శంకర్, సూర్యప్రకాశ్, చందన్రావు, మేక రామస్వామి, సిద్దార్థ, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి ఆశ నారాయణ, మానవ హక్కుల సంఘం సభ్యుడు గొర్రెపాటి మాధవరావు, న్యాయవాదులు, పలువురు జర్నలిస్టులు పాల్గొని కేవశరెడ్డి భౌతికదేహం వద్ద నివాళులు అర్పించారు. డాక్టర్ కేశవరెడ్డితో తన అను బంధాన్ని గుర్తు చేసుకుంటూ గోరెటి వెంకన్న ‘బతుకు మర్మమెరిగిన నవలా శిల్పి, మర్మయోగి గొంతు మూగబోయేనా’ అంటూ పాడిన పాట అంద రి హృదయాలను బరువెక్కించింది. -
కేశవరెడ్డికి ఘన నివాళి
డిచ్పల్లి: ప్రముఖ తెలుగు నవలా రచయిత, వైద్యుడు కేశవరెడ్డికి సాహితీ ప్రియులు శనివారం ఘనంగా నివాళి అర్పించారు.ఆయన అంత్యక్రియలు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని విక్టోరియా ఆస్పత్రి ఆవరణలో శనివారం మధ్యాహ్నం జరిగాయి. అంత్యక్రియలకు ప్రముఖ రచయిత గోరటి వెంకన్న, కాలేశ్వరం శంకర్, ప్రముఖ కార్టూనిస్ట్ మోహన్తో పాటు జిల్లాకు చెందిన కవులు, కళాకారులు, సాహితీ ప్రియులు హాజరై కేశవరెడ్డికి ఘనంగా నివాళి అర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నర్సింగ్హోమ్లో శుక్రవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు.‘‘అతడు అడవిని జయిం చాడు, మూగవాని పిల్లనగ్రోవి, సిటీ బ్యూటిపుల్, మునెమ్మ, శ్మశానాన్ని దున్నేరు, చివరి గుడిసె, రాముడుం డాడు-రాజ్జిముండాది..’’ వంటి నవలలు రాసి జాతీయస్థాయిలో పేరొందారు. -
నవలా రచయిత కేశవరెడ్డి కన్నుమూత
- ‘లింగ్ఫోమా’ క్యాన్సర్తో బాధపడుతూ ఆస్పత్రిలో మృతి - నిజామాబాద్లో నేడు అంత్యక్రియలు - నిజామాబాద్ జిల్లాలో 30 ఏళ్లపాటు కుష్టురోగులకు సేవలు - రచయితగా జాతీయస్థాయి ఖ్యాతి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రముఖ నవలా రచయిత, వైద్యుడు డాక్టర్ పి.కేశవరెడ్డి శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలం గా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిజామాబాద్లోని ప్రగతి ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ‘‘అతడు అడవిని జయిం చాడు, మూగవాని పిల్లనగ్రోవి, సిటీ బ్యూటిపుల్, మునెమ్మ, శ్మశానాన్ని దున్నేరు, చివరి గుడిసె, రాముడుం డాడు-రాజ్జిముండాది..’’ వంటి నవలలు రాసి జాతీయస్థాయిలో పేరొం దిన డాక్టర్ కేశవరెడ్డి (69) మరణం సాహితీలోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయనకు భార్య ధీరమతి, కుమారుడు డాక్టర్ నందన్రెడ్డి, కుమార్తె డాక్టర్ దివ్య ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తలపులపల్లికి చెందిన ఆయన 30 సంవత్సరాల క్రితం నిజామాబాద్ జిల్లాలో స్థిరపడ్డారు. వృత్తిరీత్యా వైద్యుడైన కేశవరెడ్డి జిల్లా వ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో సేవలందించారు. డిచ్పల్లి మండలం విక్టోరియా ఆస్పత్రిలో వైద్యాధికారిగా పదవీ విమరణ చేశారు. నిజామాబాద్, ఆర్మూరుల లో ప్రజావైద్యశాలలు నిర్వహిస్తూనే సాహితీవేత్తగా జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన నవలలు రాశారు. ఆయన రచనలపై విద్యార్థులు పరిశోధనలు చేసి పలు విశ్వవిద్యాలయాల్లో పరిశోధన పత్రాలు సమర్పించారు. నేడు అంత్యక్రియలు శనివారం నిజామాబాద్లో డాక్టర్ కేశవరెడ్డికి అంత్యక్రియలు నిర్వహిం చనున్నారు. ఐదు మాసాలుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. చివరకు లింగ్ఫోమా క్యాన్సర్ వ్యాధిగా వైద్యులు నిర్ధారిం చడంతో ఆయనకు కుటుంబ సభ్యు లు హైదరాబాద్లోని కిమ్స్, నిజామాబాద్లోని విజన్, ఎస్ఎస్కే హార్ట్ ఆస్పత్రులలో చికిత్స చేయిం చారు. శుక్రవారం తెల్లవారు జామున పరి స్థితి విషమించడంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నర్సింగ్హోమ్కు తరలించగా ఉదయం 10.15 గంటలకు తుదిశ్వాస విడిచారు. కేశవరెడ్డి చర్మవ్యాధుల నిపుణుడిగా పేరు ప్రఖ్యాతులు గడించారు. చిత్తూరు జిల్లాలో జననం ఏపీలోని చిత్తూరు జిల్లా తలుపులపల్లిలో 1946 మార్చి 10న జన్మించిన కేశవరెడ్డి తిరుపతిలో పి.యు.సి., పాండిచ్చేరిలో ఎం.బి.బి.ఎస్. చేశా రు. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో గల విక్టోరియా మెమోరియల్ ఆస్పత్రిలో 3 దశాబ్దాలపాటు కుష్టు రోగులకు సేవలందించి ఉద్యో గ విరమణ పొందారు. విక్టోరియా ఆస్పత్రిలో వైద్య సేవలందిస్తూనే వారంలో రెండు రోజులు ఆర్మూర్లో కూడా కుష్టురోగులకు ఉచితంగా వైద్య సేవలందించారు. కుష్టువ్యాధిపై ఆయన రాసిన పరిశోధనా పత్రాలు పలు జాతీయ, అంతర్జాతీయ మెడికల్ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. ఆయన రాసిన ‘అతడు అడవిని జయించాడు’ నవలను నేషనల్ బుక్ట్రస్ట్ వారు 14 భారతీయ భాషల్లోకి అనువదించారు. ఇన్ క్రెడిబుల్ గాడెస్ నవలను మరాఠీ, కన్నడ భాషల్లోకి అనువదించారు. అంతర్జాతీయ తెలుగు సాహితీ సాంస్కృతిక సంస్థ అజో-విభో ఫౌండేషన్ నుంచి ఆయన ఉత్తమ నవలా రచయిత పురస్కారం అందుకున్నారు. సమాజంలో పాతుకుపోయిన పేదరికం, మూఢనమ్మకాలు.. సామాజిక రుగ్మతులను నిర్మూలించేందుకు... పలు కథాంశాలు ఎంచుకుని... ప్రజలను చైతన్యపరిచేలా పలు నవలలు రచించారు. మూగవాని పిల్లన గ్రోవి (1996), చివరి గుడిసె (1996) అతడు అడివిని జయించాడు (1980), ఇన్ క్రెడిబుల్ గాడెస్ (క్షుద్ర దేవత) (1979), శ్మశానం దున్నేరు (1979), సిటీ బ్యూటిఫూల్ (1982), మునెమ్మ (2008) తదితర రచనలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఎంపీ కవిత సంతాపం ప్రముఖ నవలా రచయిత డాక్టర్ కేశవరెడ్డి మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కేశవరెడ్డి మృతిపట్ల నిజామాబాద్ ఎంపీ కవిత సంతాపం తెలిపారు. డాక్టర్ కేశవరెడ్డి డిచ్పల్లిలో కుష్టురోగులకు అందించిన సేవలు మరువలేనివని కవిత పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement