breaking news
oyc
-
Hyderabad: ఒవైసీ-మిధాని జంక్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం
-
ఒంటరిగానే పోటీ చేస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ది అనైతిక పొత్తు అని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి వాఖ్యానించారు. శనివారం ఢిల్లీలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ సిద్ధాంతాలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు చంద్రబాబును తిప్పికొట్టాలని అన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటనతో రాష్ట్ర ప్రజలంతా ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ఆనాటి రజాకార్ల పాలనను అక్బరుద్దీన్ మళ్ళీ తెరపైకి తీస్తున్నారని అన్నారు. ఎంఐఎం సీట్లలో టీఆర్ఎస్ ముస్లిం అభ్యర్థులను ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ వల్లే ఎంఐఎం ముఖ్యమంత్రి పదవి కావాలని ప్రకటన చేస్తోందని, టీఆర్ఎస్, కాంగ్రెస్కు ఓటేస్తే ముఖ్యమంత్రి అయ్యేది మాత్రం ఓవైసీ సోదరులేనని పేర్కొన్నారు. 119 స్థానాల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన తెలిపారు. ఈ నెల 15న బీజీపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల శంఖారావం పూరిస్తారని చెప్పారు. నాటికి నేటికి పరిస్థితి ఏమి మారిందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత బీజేపీ అభ్యుర్ధులను ప్రకటిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. -
ఐఎస్కు ఇస్లాంతో సంబంధం లేదు: అసదుద్దీన్
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)తో ఇస్లాంకు ఎలాంటి సంబంధం లేదని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో విలేకరులతో మాట్లాడారు. పారిస్లో ఉగ్రవాదుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.5 లక్షల ముస్లింలను ఐఎస్ ఉగ్రవాదులు హతమార్చారన్నారు. ఇస్లామిక్ స్కాలర్స్ ఐఎస్కు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేశారని గుర్తు చేశారు. ఇస్లాంకు ఐఎస్ మచ్చలాంటిదన్నారు. ఈ సంస్థపై యూపీ మంత్రి ఆజంఖాన్ వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. ఇరాన్, అఫ్ఘానిస్తాన్ దేశాల్లో ఏర్పడిన పరిస్థితులు ఐఎస్ అనుకూలంగా మలుచుకొంటుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ సంస్థను వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాది పార్టీని రక్షించడం ఏ కూటమికీ సాధ్యం కాదన్నారు.