-
SONY: భారత్ మార్కెట్కు ప్రాధాన్యత
న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్తో ప్రతిపాదిత విలీనం రద్దయిన నేపథ్యంలో ఇతర అవకాశాలను అన్వేషించనున్నట్లు జపనీస్ దిగ్గజం సోనీ తాజాగా వెల్లడించింది. దేశీ మార్కెట్లో వృద్ధి అవకాశాలరీత్యా మరొక కొత్త ప్రణాళికకు తెరతీయనున్నట్లు తెలియజేసింది. దీర్ఘకాలంలో భారీ వృద్ధికి వీలున్న దేశీ మార్కెట్లో సొంత కార్యకలాపాలకూ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. అత్యంత అవకాశాలున్న భారత్ మార్కెట్లో పెట్టుబడులను కొనసాగించేందుకే కట్టుబడి ఉన్నట్లు సోనీ ప్రెసిడెంట్, సీవోవో, సీఎఫ్వో హిరోకీ టొటోకీ పేర్కొన్నారు. వెరసి వివిధ అవకాశాలను అన్వేషించనున్నట్లు తెలియజేశారు. కొత్తగా అవకాశం లభిస్తే పాత ప్రణాళికస్థానే అమలు చేయనున్నట్లు తెలియజేశారు. ‘జీ’తో ప్రతిపాదిత విలీనం రద్దయిన నేపథ్యంలో హిరోకీ భారత్ మార్కెట్లో కంపెనీ వ్యూహాలపై స్పందిస్తూ పలు అంశాలను ప్రస్తావించారు. గత పెట్టుబడుల ప్రణాళికలు లేదా ఆలోచనల్లో ఎలాంటి మార్పులూ లేవని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతానికి నిర్దిష్ట ప్రణాళికలు లేవని వెల్లడించారు. కల్వెర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్(గతంలో సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా) ద్వారా దేశీయంగా కార్యకలాపాలు విస్తరించనున్నట్లు హీరోకీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
సేఫ్ సెకండ్ ఒపీనియన్ ప్లీజ్!
ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు డాక్టర్కు చూపించుకుని, ఆయన సూచించిన చికిత్స సక్రమమైన మార్గంలోనే వెళ్తుందా లేదా అని తెలుసుకోడానికి సెకండ్ ఒపీనియన్ కోసం చాలామంది మొగ్గుచూపుతుంటారు. తమ చికిత్స సక్రమమైన మార్గంలోనే సాగుతుందని మరో డాక్టర్ కూడా భరోసా ఇస్తే... బాధితులకు అదో ధీమా. నిజానికి మొదటి డాక్టర్ మీద సందేహం కంటే... ఈ భరోసా కోసం, ఈ ధీమా కోసమే చాలావరకు సెకండ్ ఒపీనియన్ కోసం వెళ్తుంటారు. ఒకరికి ఇద్దరు డాక్టర్లు ఒకేమాట చెబితే మనసుకెంతో ఊరట. కానీ ఒక్కోసారి సెకండ్ ఒపీనియన్ మరీ తేడాగా ఉంటే... మరోసారి మనం సందర్శించిన మొదటి డాక్టర్తోనూ ఒక మాట మాట్లాడటం ఎంతో అవసరం. అదెందుకో చూద్దాం. ఓ కేస్ స్టడీ: వైద్య విషయాలపై మంచి అవగాహన ఉన్న వ్యక్తి ఓ డాక్టర్ను సంప్రదించారు. ఆయనకు కడుపులో ట్యూమర్స్ వంటివి ఉన్నాయనీ, ఆపరేషన్తో తొలగించాల్సిన అవసరముందని డాక్టర్ చెప్పారు. మరో ఒకరిద్దరు డాక్టర్ల దగ్గర సెకండ్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు వారూ శస్త్రచికిత్స తప్పదని చెప్పడంతో... బాధితుడు సర్జరీ చేయించుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం ఇచ్చే పోస్ట్ ఆపరేటివ్ మందుల్లో ఒకదాని గురించి డాక్టర్ ఓ మాట చెప్పారు. ‘‘ఈ మందు మీకు కాస్త ఇబ్బందిని తెచ్చిపెట్టవచ్చు. అందరికీ అలా జరగాలని లేదు. ఒకవేళ మీ విషయంలో ఇబ్బంది కలిగితే నాకు చెప్పండి. నేను మందు మారుస్తాను’’ అని చెప్పారు డాక్టర్. ఎప్పటిలాగే సెకండ్ ఒపీనియన్లో భాగంగా ఆ పేషెంట్ ఆ మందు గురించి మరో డాక్టర్ను అడిగారు. ‘‘ఆ... అదంత ముఖ్యమైన మందు కాదులే’’ అని ఆ డాక్టర్ చెప్పడంతో బాధితుడు ఆ మందు తీసుకోలేదు. బాధితుడికి ఆర్నెల్లలోనే కడుపులో ట్యూమర్ మరోసారి పెరిగింది. సమస్య ఎందుకు పునరావృతమైందో తెలియక డాక్టర్ తలపట్టుకున్నారు. ఈ ఆర్నెల్ల కాలంలో బాధితుడి దగ్గర్నుంచి ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రయత్నంలో తాను మొదట ఇచ్చిన మందుల్లో ఒకదాన్ని బాధితుడు వాడలేదని తెలియవచ్చింది. దాంతో డాక్టర్ కాస్తంత ఆగ్రహం చూపాల్సివచ్చింది. ‘‘నిజానికి అదో కీమో తరహా మందు. కీమో అన్న మాట వినగానే తమకు క్యాన్సరేనేమో అని పేషెంట్ అపోహ పడవచ్చు. కానీ కాన్సర్ కానటువంటి కొన్ని రకాల (నాన్ క్యాన్సరస్) ట్యూమర్లు మళ్లీ మళ్లీ రాకుండా కీమోలాంటి చికిత్సనే అందించే ఓరల్ ట్యాబ్లెట్లను డాక్టర్లు ఇస్తుంటారు. ట్యూమర్ తొలగింపులో... దాన్ని పూర్తిగా తొలగించడానికి వీలుకాని ప్రదేశంలో సూక్షా్మతిసూక్ష్మమైన భాగం కొంత మిగిలిపోతే... మళ్లీ పెరగకుండా ఉండేందుకు ఇచ్చిన మందు అది. మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం తప్పుకాదు. కానీ ఆ తర్వాత మళ్లీ నాతో మాట్లాడితే... నేను మరింత వివరించేవాణ్ణి. ఇప్పుడు మరోసారి సర్జరీ చేయాల్సి వస్తోంది. అది కూడా గతంలో కంటే పెద్ద సర్జరీ. ఖర్చు కూడా దాదాపు రెట్టింపు’’ అంటూ మందలించారు డాక్టర్. ఇదీ మరోమారు జబ్బు రిలాప్స్ (పునరావృతం) అయిన ఓ బాధితుడి వాస్తవ గాధ. ఆందోళన కలిగించే విషయాలు అనవసరం : ఈ కేస్ స్టడీలో డాక్టర్ కావాలనే కొన్ని విషయాలను బాధితలకు విపులంగా చెప్పలేదు. దానికీ కారణం ఉంది. నిజానికి డాక్టర్ ఇచ్చిన మందు వాడేసి ఉంటే... ఆ మిగిలిపోయిన భాగమూ మృతిచెంది... రోగి పూర్తిగా స్వస్థుడయ్యేవాడు. కానీ ఈ మందు కీమో వంటిది అనగానే రోగిలో అనవసరమైన ఆందోళన మొదలయ్యే అవకాశం ఉంటుంది. దాంతో లేనిపోని ఊహలూ, అనవసరమైన సందేహాలతో మరింతమంది డాక్టర్లను సంప్రదించవచ్చు. దాంతో డబ్బూ, సమయమూ వృథా కావడమే కాదు... అవసరమైన యాంగై్జటీ, కుంగుబాటుకు తావిచ్చినట్టు అవుతుంది. అందుకే రోగి మానసిక ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని అతడికి అనవసరమైన విషయాలను చెప్పకపోవచ్చు. లేదా ఒకవేళ బాధితులు మంచి విద్యావంతులే అని చెపినప్పటికీ, వారిలో మరిన్ని సందేహాలు చెలరేగే అవకాశాలు ఎక్కువ. నిజానికి ఇలాంటి సందేహాలు విద్యావంతుల్లోనే ఎక్కువ అని డాక్టర్లు అంటుంటారు. సరికొత్త అనర్థాలకు తావిచ్చే గూగుల్ : ఏదైనా విషయాన్ని డాక్టర్లు యథాలాపంగా చెప్పినా సరే... చాలామంది విద్యావంతులు గూగుల్ను ఆశ్రయిస్తారు. వైద్యవిజ్ఞానానికి చెందిన చాలా అంశాలు గూగుల్లో విపులంగా ఉంటాయి. నిజానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది వ్యక్తికీ, వ్యక్తికీ వేరుగా ఉండవచ్చు. కొన్ని అంశాలు వారికి వర్తించకపోవచ్చు. అవి డాక్టర్కు తెలుస్తాయి. కానీ గూగుల్లో మొత్తం సమాచారమంతా ఉంటుంది. అది తమకు వర్తించదన్న అంశాన్ని గ్రహించలేని పేషెంట్లు... ఆ అనవసర పరిజ్ఞానాన్ని తలకెక్కించుకుని మరింతమంది డాక్టర్ల చుట్టూ తిరుగుతూ మనశ్శాంతిని దూరం చేసుకుంటుంటారు. ఫేస్బుక్, యూట్యూబ్లలో పనికిరాని పరిజ్ఞానం : దీనికి తోడు ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలో మరిన్ని క్లిప్స్ ఉంటాయి. తమ లైక్స్ కోసం లేదా తమ పాపులారిటీని పెంచుకునేందుకు అర్హత లేని నకిలీలు (క్వాక్స్) కూడా ఏమాత్రం శాస్త్రీయతకు తావు లేని అంశాలతో వీడియోలు చేసి పెడుతుంటారు. వీటిని చూసి బాధితులు మరింత అయోమయానికి గురవుతుంటారు. సెకండ్ ఒపీనియన్ బాధితుల హక్కు నిజానికి మరో డాక్టర్ దగ్గర్నుంచి వారి అభిప్రాయం తీసుకోవడం పేషెంట్స్ హక్కు. మరొకరి ఒపీనియన్ తీసుకున్న తర్వాతే చికిత్సకు రమ్మని చాలామంది డాక్టర్లూ సూచిస్తుంటారు. దానికి కారణమూ ఉంది. సెకండ్ ఒపీనియన్ వల్ల పేషెంట్స్లో మంచి నమ్మకమూ, తాము తీసుకునే చికిత్స సరైనదే అనే విశ్వాసం పెంపొందుతాయి. అది బాధితులను మరింత వేగంగా కోలుకునేలా చేస్తుంది. చాలా సందర్భాల్లో తొలి డాక్టర్ చెప్పిన విషయాలూ, సెకండ్ ఒపీనియన్ ఇచ్చిన్న డాక్టర్ చెప్పిన అంశాలు నూటికి తొంభై పాళ్లు ఒకేలా ఉంటాయి. కొన్ని అటు ఇటుగా ఉన్నప్పటికీ మొదటి డాక్టర్ చెప్పిన అంశాలను చాలావరకు రెండో డాక్టర్ విభేదించరు. ఒకవేళ విభేదిస్తే కారణాలు చెబుతారు. కానీ తాము తీసుకున్న సెకండ్ ఒపీనియన్ గనక మన డాక్టర్ చెప్పిన విషయాలకు దాదాపుగా పూర్తిగా భిన్నంగా ఉన్నప్పుడు అదే విషయాన్ని మనం చికిత్స తీసుకునే డాక్టర్తో ఆ విషయాలపై స్పష్టంగా, నిర్భయంగా, విపులంగా చర్చించవచ్చు. మన సందేహాలనూ, సంశయాలనూ తీర్చడం డాక్టర్ విధి కూడా. అలాంటప్పుడు ఒకసారి మన డాక్టర్తోనూ మాట్లాడటం మంచిది. డాక్టర్ షాపింగ్ వద్దు ఓ డాక్టర్ను సంప్రదించాక... ఇంకా తమ సందేహాలు తీరలేదనో లేదా మరోసారి డాక్టర్ను అడిగితే ఏమనుకుంటారనో ఒకరి తర్వాత మరొకరి దగ్గరకు వెళ్తుంటారు. దీన్నే ‘డాక్టర్ షాపింగ్’ అంటారు. నిజానికి డాక్టర్ షాపింగ్ అన్నది మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుందని గ్రహించడం మంచిది. డాక్టర్ జి. పార్థసారధి, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ -
జేఈఈ దరఖాస్తుల్లో ‘అదర్స్’ ఆప్షన్
తెలంగాణ ఇంటర్ విద్యార్థుల కోసం మార్పులు చేసిన సీబీఎస్ఈ సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) దరఖాస్తుల్లో తెలంగాణ ఇంటర్ బోర్డుకు స్థానం లభించింది. అయితే ఇప్పటికిప్పుడే తెలంగాణ ఇంటర్మీయట్ బోర్డు పేరుతో సాఫ్ట్వేర్లో మార్పులు చేయడం సాధ్యం కానందున.. విద్యార్థుల కోసం ‘అదర్స్ (ఇతరులు)’ ఆప్షన్ను అందుబాటులో ఉంచుతున్నామని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు విద్యార్థులంతా ‘అదర్స్’గా విద్యార్హతల ఆప్షన్ను మార్చుకోవాలని వివరించింది. కొద్దిరోజుల్లో తాము సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసి.. అదర్స్ పేరుతో ఆప్షన్ ఇచ్చిన విద్యార్థులందరినీ తెలంగాణ బోర్డు కిందకు తీసుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు జేఈఈకి దరఖాస్తు చేసుకున్న తెలంగాణ విద్యార్థులంతా వెబ్సైట్లో తమ ఆప్షన్ను ‘అదర్స్’గా ఈ నెల 31లోగా మార్పు చేసుకోవాలని విద్యార్థులకు సూచించింది. ఈ మేరకు ఆన్లైన్ దరఖాస్తుల్లో సీబీఎస్ఈ గురువారం మార్పులు చేసిందని విద్యా మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఏప్రిల్లో జరిగే జేఈఈ మెయిన్ పరీక్షకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల్లో.. ఏ బోర్డు నుంచి ఇంటర్/12వ తరగతి చదువుతున్నారనే సమాచారాన్ని నమోదు చేయాల్సిన ఆప్షన్లలో నవంబర్లో దరఖాస్తుల సమయంలో తెలంగాణ ఇంటర్ బోర్డును చేర్చలేదు. దీంతో రాష్ట్ర విద్యార్థులంతా ఏపీ బోర్డు ఆప్షన్తో దరఖాస్తు చేసుకున్నారు. దీనివల్ల తెలంగాణ బోర్డు నుంచి ఇంటర్ పూర్తిచేసే విద్యార్థులకు జేఈఈ మెయిన్ తుది ర్యాంకు ఖరారులో ఇంటర్ మార్కులకిచ్చే 40 శాతం వెయిటేజీని కోల్పో యే పరిస్థితి రావడంతో వారంతా ఆందోళన చెందారు. దీనికితోడు ఆన్లైన్ దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు అవకాశం ఇచ్చినా.. ఆ ఆప్షన్లలోనూ తెలంగాణ ఇంటర్ బోర్డును చేర్చలేదు. దీనిపై స్పందించిన రాష్ట్ర ఇంటర్ బోర్డు బుధవారమే సీబీఎస్ఈకి లేఖ రాసింది. ప్రభుత్వంతో పాటు బోర్డు అధికారులు గురువారం సీబీఎస్ఈ అధికారులతో మాట్లాడారు. తెలంగాణ బోర్డును చేర్చకపోతే రాష్ట్ర విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన సీబీఎస్ఈ వెంటనే జేఈఈ మెయిన్ దరఖాస్తుల సవరణ లింక్లో అదర్స్ ఆప్షన్ను అందుబాటులోకి ఉంచింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement