కాంగ్రెస్, టీడీపీ పొత్తు అనైతికం: జోయల్ ఓరం
సాక్షి, మరిపెడ: కాంగ్రెస్, టీడీపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపెట్టుకోవడం అనైతికమని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జోయల్ ఓరం అన్నారు. ఆదివారం మరిపెడ మండల కేంద్రం లో జిల్లా అధ్యక్షుడు యాప సతీయ్య అధ్యక్షనత జరిగిన బహిరంగసభకు ముఖ్యఅతిథిగా కేంద్ర గిరిజన శాఖ మంత్రి జోయల్ ఓరం హాజరై మాట్లాడారు. దేశంలో రాహుల్, రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబపాలనలకు అంతం పలకాలన్నారు. కాంగ్రెస్ పార్టీ జవహార్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్గాంధీ ప్రధానులుగా ఇప్పుడు రాహుల్గాంధీ ఇలా ఎంతకాలం దేశంలో కుటుంబపాలన కొనసాగుతుందన్నారు. ఇలా కుటుంబపాలన కొనసాగుతుంటే కాంగ్రెస్లో సామాన్య రాజకీయ నాయకుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సాధనలో 1250 మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటే కేసీఆర్ కుటుం బం మాత్రమే బాగుపడిందన్నారు.
బీజేపీ దళిత, గిరిజనులకు గుర్తింపు తీసుకొచ్చిన పార్టీ అన్నారు. ఉజ్వల పథకం కింద పేదలకు 5 కోట్ల గ్యాస్ కనెక్షన్లు అందించిందన్నారు. పేద ప్రజలు ఆత్మగౌరంగా బతకాలనే ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కట్టుకునేలా ప్రోత్సాహం అందించిందన్నారు. కేసీఆర్ గత ఎన్నికల్లో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలుచేయకుండా ప్రజలను వంచించిన పచ్చి మోసగాడు కేసీఆర్ అని ఆరోపించాడు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే లక్ష్మణ్నాయక్ పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్దించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాత సీత య్య, గాదె రాంబాబు, డోర్నకల్ బీజేపీ అభ్యర్థి గుగులోతు లక్ష్మణ్నాయక్, బుల్లెట్ కృష్ణ, బా లునాయక్, జిల్లా ఉపాధ్యక్షురాలు కాంతమ్మ, చీకటి మహేష్, చిన్నగూడూరు మండల అధ్యక్షుడు లక్షణ్నాయక్ తదితరులు పాల్గొన్నారు.