breaking news
open urinating
-
గుంజీలు తీసి క్షమాపణలు చెప్పిన ఐఏఎస్ ఆఫీసర్
తప్పులెన్నువారు తండోపతండంబు.. అనే ఓ వేమన పద్యం ఉంది. దాని తాత్పర్యం ఏంటంటే.. ఎదుటివారి తప్పులను లెక్కించేవారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. కానీ తాము చేసిన తప్పులను తెలుసుకొనేవారు మాత్రం కొంతమందే ఉంటారు. అయినా ఇతరుల తప్పులను లెక్కించేవారు తమ తప్పులను మాత్రం తెలుసుకోలేరని. అలాంటి బాపతు ఓ అధికారికి అనుకోని నిరసన ఎదురైతే.. దెబ్బకు గుంజీలు తీయాల్సి వచ్చింది.ఉత్తరప్రదేశ్ షాజహాన్పూర్ జిల్లా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్గా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ఐఏఎస్ రింకు సింగ్ రాహీకి చేదు అనుభవం ఎదురైంది. పబ్లిక్గా ఆయన అందరి ముందు గుంజీలు తీసి చెంపలు వేసుకుని క్షమాపణలు వచ్చింది. అందుకు కారణం లేకపోలేదు.సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ హోదాలో తొలిరోజే ఆయన తహసీల్దార్ కార్యాలయం వద్ద తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో కొంతమంది అక్కడ బహిరంగ మూత్రవిసర్జన చేస్తూ కనిపించాడు. దీంతో వాళ్లను పిలిపించుకున్న ఆయన గుంజీలు తీయించాడు. టాయిలెట్లు వాడమని అక్కడ సూచన బోర్డులు ఉన్నప్పటికీ.. కొంతమంది ఇలా బహిరంగ విసర్జనకే మళ్లుతున్నారని, అందుకే శిక్షగా గుంజీలు తీయించామని ఆయన మీడియాతో చెబుతూ కనిపించాడు. అంతేకాదు.. కొంత మంది పిల్లలు బడి ఎగ్గొట్టి ఆ కాంపౌండ్లో తిరుగుతున్నారని.. బాధ్యతగా లేని వాళ్ల తల్లిదండ్రులకు ఇదే తరహా శిక్ష తప్పదని హెచ్చరించారాయన. అయితే ఈలోపు..తహసీల్దార్ వద్ద ఉన్న కొంత మంది లాయర్లు ఇదంతా గమనించారు. గుంజీలు తీసిన వాళ్లలో తమకు చెందిన క్లర్క్ ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎస్డీఎం రింకు సింగ్ను నిలదీశారు. దానికి ఆయన సమాధానం ఇవ్వగా.. అక్కడి టాయిలెట్లు మరీ అధ్వాన్నంగా ఉన్నాయని, పరిసరాలు చెత్తాచెదారంతో నిండిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. ఇందుకు బాధ్యత వహిస్తూ మీరూ గుంజీలు తీస్తారా? అని నిలదీస్తూ ఆ లాయర్లు బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో.. ఏం పాలుపోనీ ఆయన ‘అవును’ అంటూ చెంపలేసుకుంటూ ఆయన గుంజీలు తీస్తూ క్షమాపణలు చెప్పారు. దీంతో ఆ లాయర్లు శాంతించి నిరసన విరమించారు. తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో చెత్త పేరుకుపోయిందని, టాయిలెట్లు పాడైపోయిన స్థితిలో ఉన్నాయనే విషయాన్ని ఓ అధికారి 10రోజుల కిందటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడట. అయినా ఆ ప్రాంగణమంతా శుభ్రం కాకపోవడం తమ తప్పిదమేనంటూ ఆ ఐఏఎస్ పేర్కొన్నారు. తాను చేసిన పనికి నామోషీగా భావించడం లేదని అంటున్నారాయన.‘Our fault, I accept it’: On Day 1 of posting, #UP SDM Rinku Singh Rahi does sit-ups in front of advocates; takes responsibility for tehsil filthMore details 🔗 https://t.co/7Bm3up0dPp#UttarPradesh pic.twitter.com/Nuglfm9rQK— The Times Of India (@timesofindia) July 30, 2025 -
ఉమ్మినా, మూత్రం పోసినా భారీ ఫైన్
స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా కేంద్రప్రభుత్వం సరికొత్త నిర్ణయాలు ప్రకటించింది. ఇక మీదట బహిరంగ స్థలాల్లో మూత్రవిసర్జన చేసినా, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉమ్మినా భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించింది. అలాగే రోడ్ల మీద చెత్త వేయడం, నిర్మాణ సామగ్రిని ఎప్పటికప్పుడు తొలగించకపోవడం లాంటి వాటికి కూడా జరిమానాలు తప్పవు. ఈ విషయాన్ని అన్ని మంత్రివర్గ కార్యాలయాలకు పంపారు. ముఖ్యంగా ఆఫీసులు స్వచ్ఛంగా ఉండేలా చూడాల్సిన బాధ్యతను ఉద్యోగులే తీసుకోవాలని తెలిపారు. ప్రతి శాఖలోను జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో పారిశుధ్య కమిటీని నియమించుకోవాలని, వాళ్లు ఈ వ్యవహారాలను పర్యవేక్షించాలని చెప్పారు. అలాగే కాంట్రాక్టర్లు కూడా భవనాలను కూల్చినప్పుడు, నిర్మాణ సమయంలోను మిగిలే వ్యర్థాలను పని పూర్తికాగానే తొలగించాలని, లేకపోతే వారికి కూడా జరిమానా విధించాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో గుట్కా, పాన్ మసాలా మరకలు ఎక్కడపడితే అక్కడ కనిపించడం ఇక మీదట కుదరదని, అందుకోసం సిబ్బందికి కావల్సినన్ని చెత్తబుట్టలు, సిబ్బంది సంఖ్యను బట్టి తగినన్ని యూరినల్స్ కూడా ఏర్పాటు చేయాలని కేంద్రం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.