-
ఆన్లైన్ ఇన్సూరెన్స్ మార్కెట్పై ఫ్లిప్కార్ట్, అమెజాన్ కన్ను
న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్ ఇండియా, ఫ్లిప్కార్ట్ (వాల్మార్ట్)లు భారత ఆన్లైన్ ఇన్సూరెన్స్ మార్కెట్లో అవకాశాలపై కన్నేశాయి. రూ.35,000 కోట్ల విలువతో, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత ఆన్లైన్ ఇన్సూరెన్స్ మార్కెట్లోని అవకాశాలను చేజిక్కించుకునేందుకు అవి సన్నద్ధం అవుతున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గ్రోసరీలతో ఈ కామర్స్లో ఈ రెండు సంస్థలు భారీ మార్కెట్ను సృష్టించుకున్న విషయం తెలిసిందే. ఆన్లైన్ ఇన్సూరెన్స్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు గత నాలుగు నెలలుగా బ్లూప్రింట్ను సిద్ధం చేసే పనిలో ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి 2019 ఆరంభం నుంచే ఇవి బీమా ఉత్పత్తులను తీసుకురావాలనుకోగా, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన ఎఫ్డీఐ నిబంధనల కారణంగా ఈ ప్రణాళికలు వాయిదా పడినట్టు తెలిసింది. ‘‘కార్పొరేట్ ఏజెన్సీ లైసెన్స్ను బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ నుంచి అందుకున్నందుకు సంతోషంగా ఉంది. భారత్లో ఉన్న అవకాశాలను గుర్తించే పనిలో ఉన్నాం. మా కస్టమర్లకు కావాల్సిన ఇన్సూరెన్స్ సొల్యూషన్లపై దృష్టి పెట్టాం’’ అని అమెజాన్ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. ‘‘ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇండియా రెండు కూడా స్టాండలోన్ బీమా ఉత్పత్తులను తీసుకురానున్నాయి. అలాగే ఇతర విభాగాల్లోకీ ఇవి ప్రవేశించనున్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ రెండూ తమ ప్లాట్ఫామ్పై ట్రావెల్, టికెట్ వెర్టికల్స్ను కలిగి ఉంటాయి. ప్యాకేజీలో భాగంగా ప్రయాణ బీమాను కూడా అందించనున్నాయి. అలాగే, అధిక విలువైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల చోరీ, నష్టానికి సంబంధించిన బీమాను కూడా ఆఫర్ చేయవచ్చు. సాధారణ, జీవిత బీమా పాలసీల విక్రయాన్ని త్వరలోనే ప్రారంభించనున్నాయి’’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మొబైల్ బీమా విక్రయాలు నిజానికి ఫ్లిప్కార్ట్ గతేడాదే బీమా సేవలను ఆరంభించింది. కార్పొరేట్ ఏజెంట్ లైసెన్స్ గతేడాది రాగా, పూర్తి స్థాయి మొబైల్ కవరేజీ ప్లాన్ను తన ప్లాట్ఫామ్లపై విక్రయించే మొబైల్స్తో పాటు ఆఫర్ చేయడం ఆరంభించింది. ఇందుకు బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్తో టై అప్ అయింది. అమెజాన్ కూడా అకో జనరల్ ఇన్సూరెన్స్తో కలసి ఇదే తరహా బీమా ప్లాన్లను తన ప్లాట్ఫామ్పై ఆఫర్ చేస్తుండడం గమనార్హం. ఫ్లిప్కార్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిన్సీ బన్సల్ అకో జనరల్ ఇన్సూరెన్స్లో పెట్టుబడులు పెట్టడం ఆసక్తికరం. -
వాహనానికీ ఆన్లైన్ బీమా ఉంది!
ఆఫ్లైన్తో పోలిస్తే చౌకగానే పాలసీలు ప్రీమియంలు తక్కువ మీరో వాహనం కొన్నారు. బీమా తప్పనిసరి కదా!! మరేం చేస్తారు? అంతా షోరూమ్లోని ఏజెంట్లనే ఆశ్రయిస్తారు. కొందరైతే సదరు షోరూమ్ డీలర్నో, తమకు రుణమిచ్చిన బ్యాంకర్నో సంప్రతిస్తారు. బీమా తీసుకుంటారు కూడా. కానీ చౌకగా కావాలంటేనో...!! ఇదిగో ఇక్కడే ఆన్లైన్ మార్గం కనిపిస్తుంది మనకు. ఇంటర్నెట్ చార్జీలు తగ్గుతూ స్మార్ట్ఫోన్ల వాడకం పెరగడం ఆన్లైన్ కొనుగోళ్లకు ఊతమిస్తోంది. ఇపుడీ రూట్లో బీమా పాలసీలు తీసుకునేవారూ పెరుగుతున్నారు. దానిపై అవగాహన కల్పించటమే ఈ కథనం ఉద్దేశం. నిత్యం రోడ్డు ప్రమాదాలతో మన రహదారులు బోలెడంత అపప్రద మూటగట్టుకున్నాయి. దీంతో, ఇటీవలే మోటార్ వెహికల్ బిల్లుకు కొత్త సవరణలు చేశారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు విధించడం వంటివి ఇందులో ఉన్నాయి. అయినప్పటికీ.. చాలామంది వాహనదారులు.. పాలసీ తీసుకోవడమంటే సంక్లిష్టమైన ప్రక్రియగా భావించి బీమా లేకుండానే వాహనాలు నడిపించేస్తుంటారు. నిజానికపుడు సింపుల్గా ఫారం నింపి, ప్రీమియం లెక్కించుకుని, ఆన్లైన్లో కట్టేస్తే చాలు. అంతే..!! ఎలాంటి పేపర్ వర్కూ లేకుండా అప్పటికప్పుడు బీమా కవరేజీ లభిస్తోంది. ఆఫ్లైన్ పాలసీలతో పోలిస్తే ఆన్లైన్ పాలసీల ప్రీమియం కొంత తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మీరు నేరుగా బీమా కంపెనీ పోర్టల్ నుంచే కొనుగోలు చేయడం వల్ల ఏజెంట్లు, ఇతరత్రా అడ్మినిస్ట్రేషన్ ఖర్చుల వంటివి తగ్గుతాయి. పోల్చి చూసుకోవచ్చు.. ఆన్లైన్ ఇన్సూరెన్స్ విధానంలో ప్రీమియంలను, క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తులను, కాల వ్యవధులను, ఇతరత్రా అదనపు ఫీచర్లను పోల్చిచూసుకోవచ్చు. వాహన బీమా విషయంలో ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వేల్యూ (ఐడీవీ) చాలా కీలకమైనది. ఆన్లైన్ బీమాతో వివిధ సంస్థలు మీ వాహనానికి లెక్కకడుతున్న ఐడీవీని పోల్చి చూసుకుని, మెరుగైన పాలసీని ఎంచుకోవచ్చు. ఏజంట్లు ఏవో మాయమాటలు చెప్పి తమకు ఎంతమాత్రం ఉపయోగపడని పాలసీలను అంటగట్టారంటూ చాలా మంది పాలసీదారుల నుంచి సాధారణంగా ఆరోపణలు వస్తుంటాయి. అదే ఆన్లైన్లో అయితే అన్ని వివరాలు మీ ముందే ఉంటాయి కాబట్టి మీకు అనువైన పాలసీ గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ఎంపిక చేసుకోవచ్చు. సులభతరంగా రెన్యువల్.. పోర్టల్లో లాగిన్ కావడం, అవసరమైన పాలసీని ఎంచుకోవడం (ఇప్పటికే ఉన్నదైనా లేదా వేరే బీమా సంస్థ నుంచి బదలాయించేదైనా), వివరాలు.. ఫోన్ నంబర్ మొదలైనవి ఫారంలో నింపడం చేస్తే చాలు. రెన్యువల్ నోటీసు పేజీ వస్తుంది. అందులో పేమెంట్ ఆప్షన్ను క్లిక్ చేసి చెల్లింపులు చేస్తే చాలు.. కవరేజీ అప్పటికప్పుడు రెన్యువల్ అయిపోతుంది. ప్రాసెసింగ్ ఖర్చులు తగ్గించేందుకు, ఉత్పాదకతను పెంచుకునేందుకు బీమా కంపెనీలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని గణనీయంగా ఉపయోగించుకుంటున్నాయి. పెట్రోల్ బంకులతోనూ భాగస్వామ్యాలు కుదుర్చుకుంటున్నాయి. దీంతో వాహనంలో ఇంధనం నింపుకోవడానికి వచ్చిన వారు అక్కడికక్కడే మోటార్ ఇన్సూరెన్స్ తీసుకునే వెసులుబాటు లభిస్తోంది. మొబైల్ ప్రింటర్లతో కస్టమర్లకు అప్పటికప్పుడే పాలసీ కాపీ కూడా లభిస్తోంది. ఆన్లైన్ పాలసీ తీసుకునేటప్పుడు తగిన సలహాలు, సూచనల కోసం ఆన్లైన్ చాటింగ్ సహాయం తీసుకోవచ్చు. షరా మామూలుగా ఆన్లైన్లో అయినా సరే ముందుగా తగినంత అధ్యయనం చేసిన తర్వాతే మీ అవసరాలకు అనుగుణమైన పాలసీని ఎంచుకోండి.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న ఓటింగ్
కేజ్రీవాల్కు పిగ్గీ బ్యాంక్ - వీడియో వైరల్
మహిళలు ఓటు వేస్తున్నారా..! ఈ ఎన్నికల్లో మీదే కీలక తీర్పు..!
ఆ దేవుడు పిలుస్తున్నాడు..నటి పవిత్ర ఆఖరి ఇన్స్టా పోస్ట్, వీడియో వైరల్
ఓటర్లకు జార్ఖండ్ సీఎం విజ్ఞప్తి
సెంట్రల్ రైల్వే కారిడార్లో నిలిచిపోయిన రైళ్లు.. కారణం..
ఓటు హక్కు వినియోగించుకున్న రోజా,కుమార్తె అన్షు
ఏపీ కోసం మేము సైతం అంటూ.. ఓటు వేసిన వృద్దులు, దివ్యాంగులు (ఫొటోలు)
RCB- Virushka: అనుష్క శర్మ సెలబ్రేషన్స్.. కోహ్లి రియాక్షన్ వైరల్
ఓటు లేని భార్యతో పోలింగ్ కేంద్రంలో కి పవన్ కళ్యాణ్
తప్పక చదవండి
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- శ్రీనగర్లో రికార్డులను అధిగమించనున్న ఓటింగ్ శాతం?
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్!
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
- నయవంచనకు చెక్ పెడదాం
- జనస్వామ్యమా! జయీభవ!!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement