breaking news
online affair
-
ఆన్లైన్ క్లాసులు పక్కనపెట్టి నగ్న వీడియోలతో బాలిక
అహ్మదాబాద్: ఆన్లైన్ క్లాసుల కోసం ఇప్పుడు పిల్లలకు విధిగా ఓ ఫోన్ ఇవ్వాల్సి వస్తోంది. అయితే ఆ పిల్లలు ఆ ఫోన్లను దుర్వినియోగం చేస్తూ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు తలనొప్పి తీసుకువస్తున్నారు. కొందరు ఆటలు ఆడుతూ డబ్బులన్నింటినీ తగిలేస్తుండడంతో మరికొందరు వివిధ వెబ్సైట్లు తెరచి అందులో కూడా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇక అమ్మాయిలు ఆన్లైన్లో పరిచయమైన వారితో రహస్య వీడియోలు పంపుతుండడం.. అవి ఘోర సంఘటనలకు దారి తీస్తున్నాయి. తాజాగా ఓ అమ్మాయి నగ్న వీడియోలు తీసుకుని ఓ వెబ్సైట్లో పోస్టు చేయడంతో వారికి గుండెపోటు వచ్చింది. ఈ సంఘటన గుజరాత్లో జరిగింది. (చదవండి: సమాజం తలదించుకునే ఘటన.. మహిళను వివస్త్ర చేసి.. కారం చల్లి) అహ్మదాబాద్కు చెందిన బాలిక (15)కు తల్లిదండ్రులు ఆన్లైన్ క్లాసుల కోసం కొన్నిరోజుల కిందట స్మార్ట్ఫోన్ కొనిచ్చారు. అప్పటి నుంచి బాలిక ఆన్లైన్ క్లాసులు వింటోంది. అయితే ఇటీవల తల్లిదండ్రులకు తమ కుమార్తె నగ్న వీడియో కనిపించింది. ఈ విషయాన్ని బంధువులు వారికి చెప్పారు. ఆ వీడియో చూసిన తల్లిదండ్రులు గుండెపోటుకు గురయ్యారు. బంధువుల సహాయంతో వారు ఆస్పత్రిలో చేరారు. అనంతరం బాలికను వీడియో గురించి ఆరా తీయగా విస్తుగొల్పే విషయాలు తెలిపింది. ప్రత్యేక గదిలో ఆన్లైన్ క్లాసులు వింటున్న సమయంలో ఓ వైబ్సైట్ కనిపించింది. అది తెరచి చూడగా మొత్తం నగ్న వీడియోలు, చిత్రాలు ఉన్నాయి. వాటిని చూడడం ప్రారంభించిన బాలిక వాటికి కామెంట్లు కూడా చేయడం మొదలుపెట్టింది. ఇది అలవాటుగా చేసుకుంది. ఈ క్రమంలో ఆన్లైన్లో కొందరితో పరిచయమైంది. వారు బాలికకు నీ వీడియో కూడా పెట్టు అని బలవంతం చేస్తున్నారు. తరచూ అడుగుతుండడంతో ఒకరోజు బాలిక తన నగ్న వీడియో, ఫొటోలను ఆ వెబ్సైట్లో పోస్టు చేసింది. ఆ వీడియోకు స్పందన బాగా వచ్చింది. దీంతోపాటు తమ బంధువుల పిల్లలకు కూడా ఆ వెబ్సైట్ను ఫాలో కావాలని.. మీరు కూడా ఫొటోలు, వీడియోలు పంచుకోవాలని చెప్పింది. ఈ విషయం తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు చీవాట్లు పెట్టి ఈ బాలిక తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. ప్రత్యేక గదిలో చదువుకుంటుందని భావించగా ఇలాంటి పనులు చేస్తుందని తెలిసీ ఆ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మీ పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి. దీనిపై 181 కు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. బాలికకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తొలగించేశారు. ఆ వెబ్సైట్ వివరాలు తెలుసుకుంటున్నారు. చదవండి: తొందరపడుతున్న నవ జంటలు అలా పెళ్లి.. ఇలా విడాకులు -
అతిగా వాడి.. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు!
సాక్షి, భువనగిరి: నేటి యువత స్మార్ట్ఫోన్లో మునిగితేలుతోంది. ఎంతలా అంటే తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేనంతలా అందులో లీనం అవుతున్నారు. నిత్యం ఫేస్బుక్, వాట్సాప్ తదితర వాటిల్లో మునిగి తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. అపరిచిత వ్యక్తులతో చాటింగ్ చేసి మోసపోతున్నారు. కొంత మంది దుండగులు అమాయక యువతులనే ఆసరా చేసుకొని వలలో వేసుకుంటున్నారు. ఇటీవలే మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఓ బాలిక ఫేస్బుక్లో ఓ యువకుడితో పరిచయం పెంచుకొని, చివరికి తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు తమ పిల్లలు ఫోన్లలో ఏం చేస్తున్నారో ఓ కంట కనిపెట్టాల్సి న అవసరం ఉంది. పిల్ల్లలు ఫోన్లను మితిమీరిగా వినియోగించకుండా తల్లిదండ్రులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. స్మార్ట్ఫోన్ చేతిలో ఉంటే చాలు ఫేస్బుక్, వాట్సాప్, షేర్చాట్, ఇన్స్ట్రాగామ్, టిక్టాక్, తదితర వాటిపై మునిగిపోతుంది నేటి యువత. సమయం తెలియకుండానే కాలాన్ని గడుపుతున్నారు. తాము చేసే పని వల్ల ఇతరులకి ఇబ్బందులు పెట్టడంతోపాటు, పరువు పోగొట్టుకోవడంతో చివరికి చావుకు దారితీసే పరిస్థితి వరకు వెళ్తున్నాయి. ఇంటర్నెట్ అపరిమితంగా అందుబాటులోకి రావడంతో జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. టిక్టాక్ మోజులో పడి ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు. ఒకరకంగా ప్రస్తుతం నేరాల సంఖ్య పెరగడానికి సోషల్ మీడియానే కారణంగా చెప్పవచ్చు. ఫేస్బుక్లో నకిలీ అకౌంట్లను ఓపెన్ చేసి అమ్మాయిలను స్నేహం, ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపి వారి జీవితాలతో ఆడుకోవడంతోపాటు ప్రాణాలు సైతం హరింపజేస్తున్నారు. ఫేస్బుక్లో పెట్టే ఫొటోలను నిజమా, అబద్దమా గుర్తించకుండా అపరిచితులను పరిచయాలను చేసుకుంటూ అనర్థాలకు దారి తీసుకుంటున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఫేస్బుక్లో పుట్టినతేదీ, తదితర తమ పర్సనల్ వివరాలు పెట్టకూడదు. ఒకవేళ పెట్టినా తనకు దగ్గర ఫ్రెండ్స్ ఉన్నవారికి మాత్రమే వివరాలు కనిపించే విధంగా జాగ్రత్త పడాలి. లోకేషన్ హాలీడే ఫొటోలు ఫేస్బుక్లో పెట్టకూడదు. ఇలాంటి ఫొటోలు పెట్టడం వల్ల తాము ఎక్కడ ఉన్నదనేది గమనించి వారి ఇళ్లల్లో చోరీకి పాల్ప డే అవకాశం ఉంటుంది. ఆఫీస్ కార్యాలయాల్లో పనిచేసే వ్యక్తులు వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఫొటోలను ఫేస్బుక్లలో పోస్టు చేయకూడదు. ఇలాంటి ఫొటోలు పోస్టు చేయడం వల్ల కార్యాలయ వాసులు తెలుసుకుని వారిని చులకనగా చూడడంతోపాటు అవమానపర్చే విధంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఫోన్ నంబర్లను ఎట్టి పరిస్థితుల్లో ఫేస్బు క్లో పెట్టకూడదు. ఫోన్ నంబర్లు ప్రైవసీ సిట్టింగ్లలో మాత్రమే పెట్టాలి. మద్యం తాగే ఫొటోలు పెట్టడం వల్ల యువత ఉద్యోగాలను పొందే సమయంలోగాని, వివాహం చేసుకునే సమయంలోగాని వారి జీవితాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఫేస్బుక్లలో మాజీ ప్రియుడు, ప్రియురాళ్లతో ఫొటోలు అప్లోడ్ చేయకూడదు. ఇలాంటి ఫొటోలు పెట్టడం వల్ల వివాహ జీవితం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. ఫేస్‘బుక్’ నల్లగొండ: సామాజిక మాధ్యమాల ద్వారా మంచిని తెలుసుకోవాల్సిన యువత పెడదోవపడుతూ ఫేస్‘బుక్’ అవుతుతోంది. నకిలీ ఫేస్బుక్ అకౌంట్లను తెరిచి ఫేస్బుక్ డీపీగా అమ్మాయిల ఫొటోలు పెట్టి ఇతర అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి పరిచయం చేసుకొని ఆతర్వాత ఫోటోలు షేర్ చేసుకొని ఇద్దరి మధ్య స్నేహ సంబంధం బలంగా ఏర్పడిన తర్వాత తాను అమ్మాయిని కాదని, అబ్బాయిని అని చెప్పి స్నేహాన్ని కొనసాగించి ప్రేమ పేరుతో వంచనకు గురి చేస్తున్నారు. మరికొందరు ఫేస్బుక్ ద్వారా పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి చివరికి ముఖం చాటేస్తున్నారు. పొరపాటున వచ్చిన ఫోన్కాల్తో మరికొందరు మోసగాళ్ల చేతిలో పడి విలువైన జీవితాన్ని కోల్పోతున్న సంఘటనలు అనేకం. అమ్మాయి పేరిట.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి నాగరాజు అమ్మాయి పేరిట ఫేస్బుక్ అకౌంట్ను ప్రారంభించి నల్లగొండకు చెందిన డిగ్రీ విద్యార్థితో పరిచయం ఏర్పర్చుకున్నాడు. డిగ్రీ విద్యార్థిని వివరాలను సేకరించి నేను కూడా మీ పాఠశాల, మీ కళాశాలలోనే చదివానని, అమ్మాయి ఫొటోతో వివరాలు ఫేస్బుక్లో పెట్టాడు. దీంతో ఇరువురి మధ్య పరిచయం ఏర్పడింది. చూడాలనిపిస్తుందని, నిన్ను చూసి చాలా ఏళ్లు గడిచాయని మధురమైన మాటలు చెప్పాడు. ఫుల్ ఫొటో పంపించాలని కోరడంతో మోపోయిన ఆ అమ్మాయి ఫొటోలను పంపించింది. ఆ తర్వాత నాగరాజు తాను అమ్మాయిని కాదని, పెళ్లి చేసుకుందామని చెప్పడంతో అందుకు నిరాకరించిన ఆమెను బెదిరింపులకు గురి చేశాడు. ఇద్దరు కలిసి ఉన్నట్లుగా, ముద్దు పెట్టుకుంటున్నట్లుగా ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫోటోలు పంపించాడు. డబ్బులు ఇవ్వకపోతే ఫేస్బుక్లో పెడతానని, పరువు పోతుందని బెదిరించడంతో పరువుపోతుందని రూ.3వేలు నాగరాజు ఖాతాలో వేసింది. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో గత ఏడాది సెప్టెంబర్లో పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. పూల వ్యాపారి వలలో... వరంగల్కు చెందిన ఒక ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థిని నల్లగొండలోని పూలు అమ్ముకునే ఒక వ్యాపారికి పొరపాటున ఫోన్ టచ్ అయి వచ్చింది. ఫోన్ మిస్డ్ కాల్స్ ఉన్నాయంటూ, మీ ఫ్రెండ్ను అంటూ మాటల్లో పెట్టి స్నేహం పెంచుకున్నాడు. 10వ తరగతి కూడా చదవని పూల వ్యాపారి వరంగల్కు చెందిన ఆ విద్యార్థినిని వలలో వేసుకున్నాడు. ఆ విద్యార్థిని పెళ్లి చేసుకుందామని నల్లగొండకు రావడంతో పూల వ్యాపారి భయపడి మైనార్టీ తీరలేదని, పెళ్లి చేసుకుంటామని పోలీసులను ఆశ్రయించాడు. 2ఏళ్ల క్రితం పోలీసులు విద్యార్థిని తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి నేటి యువత స్మార్ట్ఫోన్ దొరికితే చాలు సమయం తెలియకుండా గడుపుతున్నారు. ఫేస్బుక్లలో వ్యక్తుల గురించి తెలుసుకోకుండా పరిచయం చేసుకుని చాటింగ్లు చేస్తున్నారు. ఫేస్బుక్లో పెట్టే ఫొటోలకు, కామెంట్లకు ఆకర్షితులవుతున్నారు. దీంతో వ్యక్తుల మధ్య ఎలాంటి విషయాలు తెలుసుకోకుండా పరిచయం పెంచుకుని అనర్థాలకు దారితీసుకుంటున్నారు. కొన్ని పరిచయాలు మరణాలకు సైతం దారితీస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలని గాని పరిమితికి మించి వాడకూడదు. వ్యక్తిగత సమాచారాలను ఫేస్బుక్లో పెట్టకూడదు. ఫేస్బుక్ పట్ల యువతులు అప్రమత్తంగా ఉండాలి. – భుజంగరావు, ఏసీపీ భువనగిరి నిబంధనలు అమలు చేయాలి ప్రైవేట్ విద్యాసంస్థల్లో నిబంధనలు లేకపోవడం వల్ల స్మార్ట్ఫోన్లను విరివిగా వాడుతున్నారు. చాటింగ్, వాట్సాప్, ఫేస్బుక్లతో కాలం గడుపుతున్నారు. ఫేస్బుక్ పరిచయాల వల్ల అనర్థాలకు దారితీస్తోంది. యువతీ యువకుల మధ్య ఫేస్బుక్ ద్వారా ఏర్పడ్డ పరిచయాలతో ప్రాణాలు సైతం పొగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి సమయంలో నూతన చట్టాలను తీసుకువచ్చి మూడు నెలల్లో శిక్ష అమయ్యేలా చూడాల్సిన అవసరం ఉంది. – గొట్టిపాముల బాబురావు, అడ్వకేట్ యువత సోషల్ మీడియాతో చిత్తవుతోంది నేటి యువత సోషల్ మీడియా మత్తులో చిత్తయిపోతుంది. సోషల్ మీడియా ప్రభావం మత్తు పదార్థాల కన్నా ఎక్కువగా ఉంటుంది. టిక్టాక్ మోజులో పడి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకోవడం మనం చూశాం. నేరాలకు ఒకరకంగా సోషల్ మీడియానే కారణం అవుతోంది. వాట్సాప్, ఫేస్బుక్లలో కనిపించని మనుషులతో కబుర్లు ఆడుతూ విలువైన కాలాన్ని హరింపజేసుకుంటున్నారు. కొంతమంది ఫేస్బుక్లో నకిలీ అకౌంట్లు ఓపెన్ చేసి అమ్మాయిలను స్నేహం, ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపి వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. స్నేహం చేసేటప్పుడు అవతలి వ్యక్తి నిజమా, అబద్దమా తెలియకుండా గుడ్డిగా ఆడపిల్లలు ప్రేమ పేరుతో మోసపోవడం అనేది పరిపాటిగా మారింది. వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకోవడం, ఫొటోలను షేర్ చేయడం ద్వారా కూడా ఎదుటి వారి ఉచ్చులోకి పడిపోతున్నారు. ముఖ్యంగా యువతనే కాకుండా ఎవరైనా సరే అప్రమత్తంగా ఉండాలి. జీవితానికి ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకొని లక్ష్య సాధనలో ప్రతి క్షణం కష్టపడాలి. – గంజి భాగ్యలక్ష్మి, మోటివేషనల్ స్పీకర్, నల్లగొండ -
ఆన్లైన్ ఎఫైర్స్ వదిలించుకోవడం చాలా కష్టం..
లండన్ : ఆడ, మగ అనే భేదాలు లేకుండా ఎవరైనా సరే ఒకసారి ఆన్లైన్లో ఎఫైర్ మొదలెట్టారంటే వదిలించుకోవడం చాలా కష్టమట. ఈ విషయాన్ని బ్రిటన్కు చెందిన కొందరు సైకాలజీ ప్రొఫెసర్లు తమ రీసెర్చ్ ద్వారా వెల్లడించారు. సోషల్ మీడియా(ఫేస్బుక్, ట్విట్టర్), ఈమెయిల్స్, తదితర ఇంటర్నెట్ వినియోగ యాప్స్ నుంచి మనం చేసుకునే పరిచయాలు, స్నేహం, ప్రేమ లాంటి సంబంధాలను ఆన్లైన్ ఎఫైర్స్ అని చెప్పవచ్చు. ఆండ్రియాస్ వొస్లర్, నయోమి మొల్లర్ అనే సైకాలజీ ప్రొఫెసర్లు కొందరు వ్యక్తులను పరిశీలించి వారితో మాట్లాడి ఈ విషయాన్ని వెల్లడించారు. తన భర్త మామాలుగా అయితే చాలా సిగ్గరి అని, కానీ ఆన్లైన్ విషయానికొచ్చేసరికి చాలా కాన్ఫిడెంట్గా ఉండి పరాయి మహిళను బుట్టులో వేయగలడని చెప్పిందని వారు తెలిపారు. 20 నుంచి 70ఏళ్ల వయసు ఉన్న వారిని తమ రీసెర్చ్లో భాగంగా పరిశీలించారు. ఆన్లైన్ ఎఫైర్స్ అంత త్వరగా వదిలించుకోలేమని, అవి తమకు వ్యసనంగా మారుతున్నాయని ఎక్కువ మంది తమ అనుభవాలలో పేర్కొన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఆన్లైన్ అడిక్షన్ స్త్రీ, పురుషులలో ఒకే విధంగా ఉండదని, అలాగని ఒకే జెండర్ కలిగిన వ్యక్తులలో కూడా ఒకే తరహాలో ఉండదని.. ప్రతివ్యక్తి ఒక్కోలా వ్యవహారిస్తారని వోస్లర్ అన్నాడు. ఇంటర్నెట్ సౌకర్యం వల్ల భార్య, భర్త ఎవరైనా సరే పరాయి వ్యక్తులతో సంబంధాలు పెట్టుకునేందుకు అధికంగా అవకాశాలుంటున్నాయని కొందరు తమతో చెప్పినట్లు రీసెర్చర్స్ వెల్లడించారు. మరికొందరైతే ఆన్లైన్ ఎఫైర్స్, బయట కలిసినప్పుడు ఏర్పడే సంబంధాల కంటే చాలా త్వరగా కనెక్ట్ అయి రిలేషన్స్కు అడిక్ట్ అవుతారని తమ రీసెర్చ్లో తేలిందని బ్రిటన్ ప్రొఫెసర్స్ వివరించారు.