-
ఔటర్పై ‘వన్వే’ కష్టాలు
రాయదుర్గం: ఓఆర్ఆర్ సర్వీస్రోడ్డులో వన్వే ఏర్పాటు చేయడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నానక్రాంగూడ ఔటర్ జంక్షన్లో రెండు రోజులుగా భారీ ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. సోమవారం నుంచి ఈ వన్వేను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రారంభించారు. దీంతో నానక్రాంగూడ ఔటర్ జంక్షన్ నుంచి రోటరీ–1 నుంచి నార్సింగి వరకు వెళ్లే వాహనాలు మైహోమ్ అవతార్ వరకు వన్వే, నార్సింగి నుంచి వచ్చే వాహనాలు మైహోమ్ అవతార్ వద్ద లెఫ్ట్కు తీసుకొని నానక్రాంగూడ జంక్షన్కు వచ్చి అండర్పాస్ మీదుగా ఖాజాగూడవైపు వెళ్లాల్సి ఉంటుంది. ఈ కారణంగా ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు సాయంత్రం వేళల్లో రెండు గంటల పాటు వాహనాలు బారులుతీరుతున్నాయి. దీంతో ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇతర వాహనదారులు కనీసం గంటపాటు ట్రాఫిక్లో చిక్కుకొంటున్నారు. కొత్త నిబ«ంధనలతో నానా ఇబ్బంది పడాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. నానక్రాంగూడ ఔటర్ సర్వీసు రోడ్డులో రెండు వైపులా టూ వే ఉండడంతో ఎలాంటి సమస్యలు లేకుండా రాకపోకలు నిర్వహించేవి. కానీ రెండు రోజులలో కొత్త నిబంధనలు పెట్టి వన్వే ఏర్పాటు చేయడంతోనే ఈ సమస్య ఉత్పన్నమైందని వాహనదారులు వాపోతున్నారు. ముఖ్యంగా రాజేంద్రనగర్, నార్సింగి, మెహిదీపట్నం, అప్పా జంక్షన్ నుంచి సర్వీస్ రోడ్డులో నిత్యం పెద్ద సంఖ్యలో ఐటీ, ఇతర ఉద్యోగులు రాకపోకలు సాగిస్తారు. వారితోపాటు స్థానికులు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ విషయంలో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా రాకపోకలు నిర్వహించేలా, ఎక్కడా వాహనాలు ఆగకుండా చూడాలని కోరుతున్నారు. -
సైక్లింగ్ కోసం ప్రత్యేక ట్రాక్
నగరంలో సైకిళ్లను వినియోగించేవారిని ప్రోత్సహించాలని గుర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీజీ) కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా ఎనిమిది కిలోమీటర్ల పొడవైన ప్రత్యేక ట్రాక్ను ఏర్పాటు చేయనుంది. ఇందుకు రూ. 15 లక్షల వ్యయమవుతుందని సంబంధిత అధికారులు అంచనా వేశారు. దీంతోపాటు మెట్రో రైల్ స్టేషన్ల వద్ద సైకిల్ స్టేషన్లను నిర్మించనున్నారు. సాక్షి, న్యూఢిల్లీ: సైకిళ్ల కోసం ప్రత్యేక ట్రాక్ నిర్మించాలని గుర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీజీ) యోచిస్తోంది. ఎనిమిది కిలోమీటర్ల పొడవుండే ఈ ట్రాక్ హుడా సిటీ సెంటర్ మెట్రో స్టేషన్ నుంచి మొదలై వన్ వే రోడ్, గలేరియా మార్కెట్ గుండా గోల్ఫ్ కోర్సు రోడ్ వద్ద ముగుస్తుంది. తక్కువ వ్యయంతో, ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా ట్రాక్ నిర్మించడం కోసం గుర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ పలు డిజైన్లను పరిశీలిస్తోంది. ట్రాక్ నిర్మాణం వారం రోజులలో మొదలవుతుందని సంబంధిత అధికారులు అంటున్నారు. మామూలుగా వాహనాలు నడిచే రోడ్డుకు భిన్నంగా కనిపించడం కోసం సైకిల్ ట్రాక్లకు ప్రతే ్యక రంగు తో పెయింట్ చేస్తారు. వాటిపై రెట్రో రిఫ్లెక్టివ్ పెయింట్తో సైకిల్ లోగోలను పెయింట్ చేసి క్యాట్ ఐ లైట్లను అమరుస్తారు, ఈ మార్గంలో ఇతర వాహనాలు ప్రయాణించకుండా ఉండడం కోసం అక్కడక్కడా సైకిళ్లకు మాత్రమే అని తెలియజెప్పే సైనేజ్లను అమర్చడంతో పాటు బొల్లార్డ్ వంటి బారియర్లను ఏర్పాటుచేస్తారు. ఒక్కొక్క లేన్ 1.5 మీటర్ల వెడల్పు, నాలుగు మీటర్ల పొడవు ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు రూ. 15 లక్షల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు, గుర్గావ్లో సైక్లింగ్ చేసేవారు తక్కువని, నగరంలో సైక్లింగ్ను ప్రోత్సహించడం ప్రత్యేక ట్రాక్లు నిర్మిస్తున్నట్లు ఎంసీజీ కమిషనర్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఎక్కువ మంది సైకిళ్లను వాడేవిధంగా ప్రోత్సహిండం కోసం మెట్రో స్టేషన్ల ఎదుట సైకిల్ స్టేషన్లను నిర్మించాలని కూడా యోచిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మెట్ గాలాలో మెరిసిన అలియా.. చీరలో ఎంత అందంగా ఉందో..!(ఫోటోలు)
అభిమాని ఐఫోన్ బద్దలు కొట్టాడు.. గ్లౌవ్స్ గిఫ్ట్గా ఇచ్చాడు! వీడియో
విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
టాలీవుడ్ హీరో కూతురి ప్రేమ పెళ్లి.. తేదీ ఫిక్స్!
వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి
ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్
చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన స్టార్ హీరో.. కారణమేంటి?
సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ
బాబును చీల్చి చెండాడిన మహిళలు
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement