breaking news
old style
-
ఐపీఎల్ మళ్లీ పాత ఫార్మాట్లో...
వచ్చే ఏడాది ఐపీఎల్ పూర్తి స్థాయిలో పాత ఫార్మాట్లో నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించారు. కరోనాకు ముందు ఉన్న విధంగా ప్రతీ జట్టు తమ సొంత మైదానంలో ఒక మ్యాచ్, ప్రత్యర్థి మైదానంలో మరో మ్యాచ్ ఆడుతుందని ఆయన వెల్లడించారు. ఇప్పుడు ఐపీఎల్లో 10 జట్లు ఉండగా, ప్రతీ టీమ్ మిగిలిన 9 టీమ్లను రెండేసి సార్లు ఎదుర్కొంటుంది. 2022లో ఐపీఎల్ పూర్తిగా భారత్లోనే జరిగినా... కొన్ని వేదికలకే లీగ్ను పరిమితం చేశారు. వచ్చే సీజన్నుంచి అంతా సాధారణంగా మారిపోతుందని గంగూలీ స్పష్టం చేశారు. మరో వైపు 2023 సీజన్తో పూర్తి స్థాయిలో మహిళల ఐపీఎల్ కూడా నిర్వహిస్తామని గంగూలీ చెప్పారు. దీంతో పాటు టీనేజ్ అమ్మాయిల ప్రతిభను గుర్తించేందుకు తొలిసారి జాతీయ స్థాయిలో బాలికల అండర్–15 టోర్నీ కూడా జరపనున్నట్లు సౌరవ్ గంగూలీ వివరించారు. -
'పది’ పరీక్షలు పాత విధానంలోనే
బోధన మాత్రం కొత్త విధానంలో విజయవాడ: విద్యా వ్యవస్థను సంస్కరణల బాట పట్టిస్తామని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. పదో తరగతి పరీక్షలను ఈ ఏడాది పాత విధానం(11 పేపర్లు)లోనే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు విద్యాబోధన మాత్రం నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ)కు అనుగుణంగా మారిన పాఠ్యప్రణాళికతో జరగాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వంపై ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఒత్తిడి ఫలించినట్లయింది. నూతన విద్యావిధానంపై తొలుత కొన్ని ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసినా చివరికి అంగీకరించాయి. విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా పరీక్షలు ఏ విధానంలో నిర్వహించాలన్న అం శంపై విద్యాశాఖ నుంచి ఆదేశాలు అందక ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో చాలా రోజులుగా అయోమ యం నెలకొంది. సీసీఈకి అనుగుణంగా రూపొం దించిన పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రావడంతో నెలన్నర రోజులుగా నూతన విధానంలోనే విద్యాబోధన జరుగుతోంది. తీరా పాత విధానంలోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని ఉత్తర్వు లు జారీ కావడంతో ఉసూరుమంటున్నారు. బోధన ఒక విధానంలో చేస్తూ, పరీక్షలు మరో విధానంలో జరపడమేమిటని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.