-
పాతనోట్ల పై ఆర్బీఐ విచారణ
►రెండు రోజులుగా సహకార బ్యాంకుల శాఖల్లో తనిఖీలు ►డీసీసీబీలో ఉండిపోయిన రూ.11.27 కోట్లు మోర్తాడ్ (బాల్కొండ): జిల్లా సహకార బ్యాంకులో నిల్వ ఉండిపోయిన పాతనోట్ల వ్యవహారంలో నిజానిజాలను తేల్చడానికి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, నాబార్డు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. రూ.1,000, రూ.500 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయగా ఆ నోట్లను బ్యాంకుల్లో డిసెంబర్ 31, 2016వరకు డిపాజిట్ చేయడానికి కేంద్రం గడువు విధించిన విషయం విదితమే. నవంబర్ 9 నుంచి రద్దు అయిన నోట్ల డిపాజిట్కు అంగీకరించిన కేంద్రం సహకార బ్యాంకుల్లో అదే నెల 13 నుంచి స్వీకరణను నిలిపివేసింది. నిర్వహణ సరిగా లేక పోవడం, రాజకీయ నాయకుల జోక్యంతో ఎక్కువ జమ అయిన విషయాన్ని గుర్తించిన కేంద్రం సహకారం బ్యాంకుల్లో రద్దు అయిన నోట్ల డిపాజిట్కు బ్రేక్ వేసింది. నవంబర్ 9, 10, 11, 12 తేదిల్లో పాత నోట్లను స్వీకరించగా జిల్లా సహకార బ్యాంకు బ్రాంచీల నుంచి రూ.43 కోట్లను సేకరించారు. ఈ నోట్ల సేకరణపై ఆర్బీఐ అనుమానాలు వ్యక్తం చేస్తూ అప్పట్లోనే విచారణ నిర్వహించింది. చివరకు రూ.43 కోట్ల విలువ చేసే నోట్లను ఆర్బీఐ స్వీకరించింది. కాగా చివరి రోజున మొదట చెప్పిన లెక్క కంటే ఎక్కువ పాత నోట్లను పలు బ్రాంచీల నుంచి సేకరించారు. ఆలా సేకరించిన నోట్లు రూ.11.27 కోట్ల వరకు ఉన్నాయి. సహకార బ్యాంకుల్లో పాత నోట్ల స్వీకరణకు బ్రేక్ వేస్తు ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసిన సమయంలో కొన్ని బ్రాంచీల నుంచి హడావిడిగా పాత నోట్లను స్వీకరించినట్లు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. బ్లాక్ మనీని వైట్గా మార్చుకోవడానికి పలువురు సహకార బ్యాంకు శాఖలను ఎంచుకున్నారని, అదే నేపథ్యంలోనే నోట్ల స్వీకరణకు బ్రేక్ వేసే సమయానికి లెక్కకు మించి నోట్లను తీసుకున్నట్లు ఆర్బీఐ ఉన్నతాధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో పాతనోట్లను ఆర్బీఐ తీసుకోకపోవడంతో జిల్లా సహకార బ్యాంకు వద్ద రూ.11.27 కోట్ల విలువ చేసే నోట్లు ఉండిపోయాయి. ఈ నోట్లను ఆర్బీఐ తీసుకోకపోవడంతో సహకార బ్యాంకు నష్టాల్లో కూరుకు పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. బ్యాంకులోని ఒక ఉన్నతాధికారి నిర్వాకం మూలంగానే లెక్కకు మించిన నోట్ల సేకరణ జరిగింది. ఇది ఇలా ఉండగా తాము నిబంధనల ప్రకారమే పాత నోట్లను స్వీకరించామని ఇందులో ఎలాంటి తప్పులు లేవని బ్యాంకు ఉన్నతాధికారులు, పాలకవర్గం స్పష్టం చేస్తూ ఈ నోట్లను తీసుకోవాల్సిందిగా నాబార్డు, ఆర్బీఐ అధికారులకు లేఖ రాసింది. ఈ వివాదాన్ని తేల్చడానికి ఆర్బీఐ నుంచి ఇద్దరు, నాబార్డు నుంచి పదిమంది ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. సోమవారం నుంచి బ్యాంకుల్లో విచారణను అధికారులు నిర్వహిస్తున్నారు. బ్యాంకుల్లో డిపాజిట్లు చేసిన వ్యక్తుల ఆధార్ కార్డు జిరాక్సు కాపీలను, వారి లావాదేవీల వ్యవహారాలను ఆర్బీఐ, నాబార్డు అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. జిల్లాలోని 41 సహకార బ్యాంకుల శాఖలలో విచారణ నిర్వహిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన శాఖలను తనిఖీల నుంచి మినహాయించారు. -
పాత నోట్లతో లావాదేవీల వివరాలివ్వండి
కంపెనీలను కోరిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ: గతేడాది నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 వరకు చెల్లని రూ.500, రూ.1,000 నోట్లతో నిర్వహించిన లావాదేవీలు వివరాలు, ఆ సమయంలో ఎన్ని నోట్లు ఉన్నాయన్నది కంపెనీలు తమ వార్షిక బ్యాలన్స్ షీట్లలో వెల్లడించాలని కార్పొరేట్ వ్యవహారాల శాఖ కోరింది. అలాగే, ఆ కాలంలో చెల్లని నోట్లతో జరిపిన లావాదేవీల వివరాలను కంపెనీలు సరిగ్గానే వెల్లడించాయని ఆడిటర్లు తమ నివేదికల్లో పేర్కొనాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. -
జైలు లేదు జరిమానాయే
► గడువు తర్వాత పాతనోట్లున్న వారిపై కేంద్రం నిర్ణయం ► రూ.10వేల జరిమానా మాత్రమేనంటూ ఆర్డినెన్సులో మార్పు న్యూఢిల్లీ: రద్దయిన రూ.500, వెయ్యి నోట్లను పదికి మించి కలిగున్న వారికి రూ.10వేల వరకు జరిమానా విధించాలని కేంద్రం నిర్ణయించింది. దీన్నుద్దేశించి చేసిన ఆర్డినెన్సులో ఉన్నట్లుగా నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష విధించాలన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ‘ద స్పెసిఫైడ్ బ్యాంక్నోట్స్ సెస్సేషన్ ఆఫ్ లయబిలిటీస్ ఆర్డినెన్సు’కు బుధవారమే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినప్పటికీ జైలు శిక్ష విధించాలన్న నిబంధనను గురువారం తొలగించింది. రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్న ఆ ఆర్డినెన్సు డిసెంబర్ 31 నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం మార్చి 31 తర్వాత పాతనోట్లను కలిగున్నవారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవటంతోపాటు రూ.10వేల జరిమానా లేదా పట్టుకున్న ధనానికి ఐదురెట్ల జరిమానా విధించనున్నారు. జనవరి 1 నుంచి మార్చి 31 వరకు ప్రత్యేక కౌంటర్లలో పాతనోట్లను డిపాజిట్ చేస్తున్నప్పుడు డిక్లరేషన్ లో తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే.. రూ.5వేల జరిమానా లేదా డిపాజిట్ చేసిన మొత్తానికి ఐదురెట్లు (ఏది ఎక్కువైతే అది) వసూలు చేస్తారు. అయితే రీసెర్చ్ స్కాలర్స్ 25 నోట్ల వరకు తమ దగ్గర పెట్టుకునేందుకు ఈ ఆర్డినెన్సు అనుమతిచ్చింది కారణం లేకుంటే భారీ జరిమానా బ్యాంకులకు చేరని రద్దయిన నోట్లను చెల్లకుండా చేసేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ సవరణకు కూడా ఈ ఆర్డినెన్సు చట్టపరమైన మద్దతిస్తుంది. ఈ ఆర్డినెన్సు ఆరునెలల్లో పార్లమెంటు ఆమోదంతో చట్టంగా మారాల్సి ఉంటుంది. 1978లోనూ మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం రూ.1,000, రూ.5,000, రూ.10,000 నోట్లను రద్దుచేస్తున్నట్లు ఆర్డినెన్సు జారీ చేసింది. అయితే ఇప్పటివరకున్న సమాచారం ప్రకారం రూ.15.4 లక్షల కోట్ల కరెన్సీ (రద్దయిన నోట్లు)కి బదులుగా.. రూ. 14 లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్/మార్పిడి అయినట్లు తెలిసింది. నోట్ల మార్పిడికి నేడే ఆఖరు నవంబర్ 8 నిర్ణయం తర్వాత రద్దయిన నోట్లను మార్చుకునేందుకు కేంద్రం విధించిన గడువు నేటితో ముగియనుంది. ఇప్పటివరకు నోట్లను బదిలీ చేసుకోని వారు సరైన ఆధారాలను జతపరుస్తూ ఎంపిక చేసిన ఆర్బీఐ కౌంటర్లలో మార్చి 31 వరకు నోట్లు మార్చుకునేందుకు అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్నవారు, మిలటరీలో పనిచేసేవారు సరైన కారణాలను చూపిమాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. కాగా, నోటుపై సూచించిన సంఖ్యకు సమాన మొత్తాన్ని చెల్లిస్తామంటూ నోటుపై ఉండే హామీ ప్రకారం ప్రతి ఒక్కరికి తమవద్దనున్న నోట్లను తిరిగి ఇచ్చేందుకు సరైన సమయం ఇచ్చి.. గడువు పూర్తయ్యాక వాటిని రద్దు చేసేందుకు చట్టం చేయాల్సి ఉంటుంది. ∙నోట్ల మార్పిడికి నేటివరకు గడువుంది. -
నోటోపోటు
కథ ‘‘ఏంటిది?’’– గిన్నెలోని పసుపు పచ్చటి పదార్థం వైపు అనుమానంగా చూస్తూ అడిగాను.‘‘లెమన్ రైస్, అన్నా’’ అన్నాడు క్యాంటిన్ఓనర్. గిన్నెలో పదార్థం తీరు చూస్తుంటే లెమన్రైస్ నిర్వచనంలో ఏదో తేడా ఉందనిపించింది.‘‘పిచ్చోడా, మనోడు అన్నంలో పసుపు వేస్తే అదే లెమన్రైస్, అదే కాస్త జీలకర్ర వేసాడనుకో అది జీరారైస్, లేదంటే కాసిని కూరగాయలు తరిగి వేసాడనుకో, అదే వెజ్ బిర్యానీ... పేర్లేదైనా మూల పదార్థం ఒకటే నాయనా’’ అని పక్కనే ఉన్న మా సీనియర్ కొలీగ్ నాకు హితబోధ చేసాడు.‘సరే ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు కదా’ అని ఆ లెమన్రైస్ అనే బ్రహ్మపదార్థాన్ని ఆర్డరు చేశా. వెంటనే ఒక ప్లేటు నిండా పొర్లిపోయేలా పెట్టి ఇచ్చాడు క్యాంటీన్వాలా. ‘‘ఇదేంటి ఇంత పెట్టావు’’ అన్నాను భయంగా. ‘‘రేపు ఆదివారం, సరుకు మిగలకూడదు, రెండు ప్లేట్లకు తక్కువ, ఒక్కప్లేటుకు ఎక్కువగా ఉంది కాబట్టి నీపై అకాల ప్రేమ కలిగింది మనోడికి’’ అని అందులోని ఆర్థిక సూత్రాన్ని పక్కన ఉన్న నా ఉపనిషత్ గురువు వెంటనే వివరించాడు. విరక్తితో ఆ ప్లేటు తీసుకొని తినడానికి తయారయ్యాను. కానీ లెమన్రైస్, నా జీర్ణవ్యవస్థ అయస్కాంతంలోని సజాతి ధ్రువాల్లా వికర్షించుకోవడం ప్రారంభించాయి. ఈ పోరాటాన్ని కొనసాగిస్తే ప్రాణాపాయం కలుగుతుందన్న భయంతో విరమించి నా సీట్లోకి వచ్చి కూలబడ్డాను.‘‘నీదగ్గర పెద్ద నోట్లున్నాయా?’’ అని అడిగాడు మా ఇన్చార్జి. ‘‘ఉన్నాయండీ, రెండు వెయ్యి రూపాయల నోట్లున్నాయి’’ అని చెప్పాను.‘‘జాగ్రత్త, 500, 1000 నోట్లను ఇప్పుడే ప్రభుత్వం రద్దు చేసింది’’ అని నింపాదిగా చెప్పారాయన.ఒక్క క్షణం అర్థం కాలేదు. నోట్ల రద్దంటే ఇప్పుడు నా దగ్గరున్న 10 వేలూ పనికి రాకుండా పోతాయా? వామ్మో ఈ నెలంతా ఎలా? లాంటి తింగరి ఊహలు వచ్చాయి. రేపట్నించి బ్యాంకుల్లో మార్చుకోవచ్చని మా బాస్ భరోసా ఇచ్చారు. హమ్మయ్య అనుకొని నెట్ ఓపెన్ చేసి చూస్తే అన్ని సైట్లలో ఇదే రచ్చ. మరోవైపు ఎందుకు రద్దు చేశారు? పాతనోట్లు ఎలా మార్చుకోవాలి? ఎప్పటివరకు గడువు? దీంతో ఏం జరుగుతుంది? విత్డ్రా, డిపాజిట్ల పరిమితి ఎంత? ఇలా ప్రశ్నలు, సమాధానాలు చానెళ్లలో హోరెత్తుతున్నాయి. చాలామంది ప్రభుత్వ నిర్ణయాన్ని భేష్ అంటున్నారు. కొంతమంది మాత్రం ఈ చర్యతో ప్రజలకు నానా ఇబ్బందులు తప్పవంటున్నారు. పక్కింటోడికి కూడా తెలీని ముఖాలు చర్చాకార్యక్రమాల్లో ఎగిరెగిరిపడుతూ చర్చిస్తున్నాయి. ‘ఏంటీ గోల, రద్దయితే ఏమైంది, ఆకాశం కూలిపోయిందా? రేపట్నించి బ్యాంకులో తీసుకోవచ్చన్నారుగా, ఎందుకీ హడావుడి’ అనిపించింది. ఆ రోజంతా పేపర్లో ఇదే మ్యాటర్, ప్రముఖుల అభిప్రాయాలు, విశ్లేషణలు... ఇలా వర్క్ పూర్తయ్యి ఇంటికి చేరేటప్పటికి అర్ధరాత్రి దాటింది.పడుకునేముందు ‘రేపు వెళ్లి నా రెండు నోట్లు మార్చుకోవాలా? ఒకటి మార్చుకొని రెండోది గుర్తుగా ఉంచుకోవాలా?’ అన్న శాస్త్ర సంబంధ తర్క మీమాంస మనసులో బిగినయింది. టీవి చర్చల్లాగా దానికి ముగింపు రాకముందే నిద్రలోకి జారుకున్నాను. తెల్లారి లేవగానే నోట్ల విషయం గుర్తొచ్చింది. నెమ్మదిగా రెడీ అయి దగ్గర్లోని బ్యాంకుకు బయలు దేరాను. మధ్యలో టెస్టింగ్ కోసం కిరాణా కొట్టువాణ్ణి కదిలించా, ‘ఏమయ్యా పెద్దనోటుకు చిల్లరుందా?’ అని.‘‘ఉంది, కాకపోతే ఏమైనా కొంటేనే చిల్లరిసా’’్త అన్నాడు.ఇంకే పర్లేదు, అనుకొని బ్యాంకుకు వెళ్లాను. దారంతా తిరునాళ్ల సందడి. కలయో, వైష్ణవ మాయో అంటే అర్థం ఆ రోజే తెలిసింది.జీవితంలో ఏనాడూ తెల్లారి లేవడం అలవాటు లేని పలు జీవాలు బ్యాంకు ముందు మత్తుకళ్లతో నిల్చున్నాయి. నైట్డ్రస్సులు, పాచి కంపులు... నా జీవితంలో బ్యాంకు ముందు అంతమంది జనాలు అంత పొద్దున్నే గుమిగూడడం ఫస్ట్టైమ్ చూసాను. వీళ్లకు టీ అమ్మి క్యాష్ చేసుకుందామని ఫ్లాస్కులతో అటూ ఇటూ తిరుగుతున్న బాల కార్మిక వీరులు. టీ తాగాలని ఉన్నా, చిల్లర లేని జేబును చూసి గుడ్లనీరు కుక్కుకుంటున్నవాళ్లు.. ఇలా ఎందరో... వీళ్లందరూ నోట్లు మార్చుకొని నా వంతు వచ్చేదెప్పుడు? అని ప్రశ్నించుకొని రేపు అనేది ఒకటి ఉంది అని గుర్తుచేసుకొని గిరుక్కున వెనక్కి తిరిగి కిరాణా కొట్టు దగ్గరకు పోయాను. ‘‘ఒక వక్కపొడి పొట్లం ఇవ్వవోయ్,’’ అని 500 నోటు ఇచ్చాను. ‘‘వేళాకోళం ఆడకండి సార్’’ అన్నాడు వాడు.‘‘సరే ఒక యాభైరూపాయలకు ఏవైనా సరుకులు కొంటా కానీ, చిల్లర ఇవ్వు’’ అన్నాను. ‘‘కనీసం 450 రూపాయలకు ఏమైనా కొంటే చిల్లర ఇస్తా’’ అని నా నోటు వెనక్కు ఇచ్చాడు.‘‘ఒంటికాయ శొంఠికొమ్ము గాడ్ని, 450 రూపాయలకు ఏం కొనాలి నా బొంద’’ అనుకొని నీరసంగా ఇంటికి వచ్చా. గుమ్మంలోనే మా ఓనరు ముసలమ్మ బోసినోటితో నవ్వుతూ పలకరించింది. ‘‘ఏంటి’’ అని కళ్లెగరేసా, ‘‘ఒకటో తారీకు ఇచ్చిన అద్దె పాతనోట్లతో ఇచ్చావు, కాస్త వాటిని మార్చి కొత్తవి తెచ్చివయ్యా,’’ అని బాంబేసింది.నో.. కుదరదు, నా రెండు నోట్లే మారక చస్తుంటే నీగోలేంటి అని తిట్టుకుంటూ, ‘‘మీరు మార్చుకోవచ్చుగా’’ అన్నాను. ‘‘పెద్దదాన్ని నేను పోలేను, నువ్వే తెచ్చివ్వు’’ అని అద్దె మొత్తం తెచ్చి నా చేతిలో పోసింది. పొద్దున్నే పనిపిల్ల మీద విరుచుకపడేటప్పుడు, ఎప్పుడైనా కొంచెం లేటుగా లైట్లు ఆర్పితే గొంతేసుకొని మీద పడిపోయేటప్పుడు ముసల్దానికి పెద్దరికం గుర్తురాదు, ఇప్పుడు మాత్రం పెద్దరికం గుర్తొచ్చింది దొంగముఖానికి.. అయినా తప్పదు, కాదని చెప్తే ఈ సౌమ్యరూపం పోయి పిశాచ రూపంలో ఎగబడ్తుంది. ఏంచేస్తాం, అదేదో సినిమాలో డబ్బులు ఖర్చు చెయ్యాలని పందెం ఉంటే, హీరో దగ్గరకు మరింత డబ్బులు వచ్చిపడుతుంటాయి, అలాగే ఉంది నా పరిస్థితి. బ్యాంకులో మార్చడం తర్వాత, ముందు ఏటీఎంలో అయినా డ్రా చేసుకోకుంటే రోజు గడిచేలాలేదని దగ్గర్లోని ఏటీఎంకి వెళ్లాను. ‘నోక్యాష్’ అని బోర్డు కనిపించింది. పక్కన ఉన్న అతన్ని ‘‘ఇక్కడ ఇంకో ఏటీఎం ఎక్కడుందండీ’’ అనడిగా.‘‘కిలోమీటర్ దూరంలో ఉంది’’ అని బదులిచ్చాడు.సరే అని బండి స్టార్ట్ చేయబోతుంటే, నన్ను పిలిచి ‘డబ్బులు డ్రా చేయడానికైతే నా వెనక నిలబడు, నేనూ ఆ ఏటీఎం క్యూలోనే ఉన్నాను’ అని కేకేసాడాయన. అంటే క్యూ కిలోమీటర్ పొడవుందన్నమాట, దెబ్బకు మైండ్ తిరిగిపోయింది.రాత్రికి ఇంతమంది ఉండరు అప్పుడు డ్రాచేసుకుందాం అనుకొని ఆఫీసుకు పోయి, రాత్రి వచ్చేటప్పుడు చూస్తే ఎవరూ లేరు. హమ్మయ్య అని ఏటీఎం దగ్గరకు పోతే నో క్యాష్ బోర్డుంది. దీనమ్మ జీవితం అని తిట్టుకుంటుండగా, ఏదో వాట్సప్ మెసేజ్ వచ్చింది. దగ్గర్లో ఏ ఏటీఎంలో డబ్బులున్నాయో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి అని ఉంది. సరే అని నేనున్న ఏరియా పిన్కోడ్ కొట్టాను. దగ్గర్లో మరో ఏటీఎం ఉందని చూపింది. అది చూపే అడ్రస్ నాకు తెలీదు. సరే అని అడ్రస్ను గూగుల్ మ్యాప్లో వెతుక్కుంటూ బయలుదేరా. సందులు, గొందులు తిరిగిన నా ప్రయాణం ఒక డెడ్ ఎండ్ దగ్గర ఆగింది. అది ఏటీఎం ఉందని చెప్పిన ప్రాంతంలో పెద్ద మురికికాలువ ఉంది. జీపీఎస్ను బండబూతులు తిట్టుకుంటూ ఇంటికివచ్చా. ఇలాంటప్పుడే మనం కాస్త గిరీశంలాగా థింక్ చేయాలి అనుకొని గదిలో అటూఇటూ తిరుగుతూ ఆలోచించాను. ఆఫీసులో ఒకపెద్దాయనకు ఇవ్వాల్సిన 10వేల రూపాయల బాకీ గుర్తొచ్చింది. మర్నాడు వెళ్లడంతోనే ఆయన దగ్గరకు వెళ్లి ‘‘సార్ ఇవిగో మీకివ్వాల్సిన 10వేలు’’ అని చేతులో పెట్టాను. గొంగళిపురుగు మీదపడ్డట్లు ఒక్కసారిగా ఆయన దులపరించుకొన్నాడు. ‘‘అబ్బాయ్ నీ వేషాలు నాదగ్గర కాదు. నాకు కొత్త నోట్లు ఇవ్వు’’ అన్నాడు.‘‘అదేంటండీ మీరిచ్చినప్పుడు ఇవే ఇచ్చారు కదా’’ అన్నా లాజిక్గా‘‘నీకు అప్పిచ్చినప్పుడు ఇవి చెల్లుబాటులో ఉన్నాయ్, ఇప్పుడు లేవు’’ అన్నాడాయన మరింత లాజిక్గా‘‘గురువుగారు, డిసెంబర్ 30 వరకు ఇవి చెల్లుతాయండీ, తీసుకోండి పర్లేదు’’ అన్నాను కన్నింగ్గా‘‘బాబూ, డిసెంబర్ 30 వరకు బ్యాంకుల్లో మార్పిడికి మాత్రమే చెల్లుతాయి, వ్యక్తుల మధ్య లావాదేవీలకు చెల్లవు, సో నువ్వు మార్చి తెచ్చివ్వు’’ అన్నాడు మరింత కన్నింగ్గా.ఛీ, ఐడియా పనిచేయలేదు అనుకొని నా సీటు దగ్గరకు వచ్చాను. ఇంతలో మా సారు పిలిచి నోట్ల రద్దుపై ఎవరికి వాళ్లు సొంత స్టోరీ తయారుచేయాలని హుకుం జారీ చేశారు. సరే అని నెట్ ఓపెన్ చేద్దును కదా ఒకటే గోల. ఎర్ర వీరులు, కాషాయ యోధులు ఆన్లైన్ వేదికగా హోరా హోరీగా మహా సంగ్రామం చేస్తున్నారు. దేశానికి మంచిదని కొందరు, కాదని కొందరు. ప్రతి ఒక్కడూ ఆర్థికవేత్తే, ప్రతి ఒక్కడూ విశ్లేషకుడే, ప్రతి ఒక్కడూ విమర్శకుడే, ప్రతి ఒక్కడూ సలహాదారే.ఇందులో మళ్లీ బహిరంగ విమర్శక అంతర్గత సమర్థకులు, అంతర్గత విమర్శక బహిర్గత సమర్థకులు.. ఇలా ఎన్నో పక్షాలు, ఎన్నో వైరుధ్యాలు. ఇక జోకులు, కవితలు, పుకార్లు.. సరేసరి. అబ్బబ్బ దేశ ప్రజలకు కాలక్షేపానికి కొదవలేకుండా పోయింది ప్రభుత్వ నిర్ణయంతో అనిపించింది. వీళ్లతో మనకెందుకులే అని వ్యాపారాలంటూ తిరిగే కొంత మందికి ఫోన్ చేశా. తనకు నష్టం జరిగినా పక్కోడికి మరింత నష్టం జరిగిందని సంతోషించేవాళ్లు, తాను తినకపోతే ఎవరికీ దక్కకూడదని నోట్లను నాశనం చేసేవాళ్లు, ఇప్పుడు పోయి పన్ను కడతామంటే ఐటివాళ్లు ఏమంటారో అని భయపడేవాళ్లు, ఉద్యోగులు వద్దన్నా వడ్డీ లేకుండా అప్పులిస్తున్నవాళ్లు, పనోళ్లపేరు మీద అకౌంట్లు తీసి డిపాజిట్లు చేస్తున్నవాళ్ళు, హడావుడిగా చుట్టపక్కాలను పిలిచి వాళ్లొద్దన్నా చేబదుళ్లు ఇస్తున్నవాళ్లు .. ఇలా నోట్ల రద్దు విచిత్ర పర్యవసానాలను వివరించారు వాళ్లు. సందట్లో సడేమియాలాగా కమీషన్పై నోట్ల వ్యాపారం జోరందుకుందంట అని ఒక మిత్రుడు చెప్పి వాడికి తెలిసిన ఒకతని నెంబరు ఇచ్చాడు. సరే చూద్దాం అని ఆ నెంబరుకు ఫోన్ చేసి ‘‘నా దగ్గర పాతవి పది ఉన్నాయి, మారుస్తారా’’ అని అడిగా నెమ్మదిగా. వాడు మాత్రం బర్రె గొంతేసుకొని ‘‘35 శాతం కట్ అయిద్ది, ఓకేనా’’ అన్నాడు. ఏమి కట్ అయిద్ది అనుకొని ‘‘మరోమాట లేదా’’ అన్నా మరింత నెమ్మదిగా. ‘‘ఏందయ్యా నువ్వు అంత భయపడతా మాట్లాడతావ్, మార్చేవాడ్ని నాకు లేని బాధ నీకేంది, సరే 32 శాతం మీద ఓకేనా’’ అన్నాడు. రౌండ్ ఫిగర్ 30 శాతం మీద చెయ్యమన్నాను. ‘‘సరే ఫలానా చోటికి డబ్బు తీసుకొని రా, అంతపెద్ద మొత్తం జాగ్రత్తగా రాగలవా’’ అని అడిగాడు. పదివేలకు జాగ్రత్తేంటి అనుకొని మళ్లీ వెంటనే ‘‘నిజమేలే ఇప్పుడు పదివేలే పదికోట్లు’’ అన్నాను. వాడొక్క క్షణం నిశ్శబ్దంగా ఉండి ‘‘ఇంతకూ నువ్వు చెప్పిన పది అంటే పదివేలా’’ అన్నాడు నెమ్మదిగా.‘‘అదేంటోయ్ అంత చిన్నగా మాట్లాడతావ్, మరేం పర్లేదన్నావ్గా, అవును పదివేలే, నువ్వేంటి పది లక్షలనుకున్నావా, కోట్లనుకున్నావా?’’ అన్నాను నోట్లు మారుతున్నాయన్న ఆనందంతో నవ్వుతూ. అవతలపక్క దబ్ అని శబ్దం వచ్చింది.ఏంటి వీడు కొంపదీసి పదికోట్లనుకున్నాడా, ఏం? పదివేలు మాత్రం డబ్బులు కావా అని తిట్టుకొని ఫోన్ పెట్టేశా.మొత్తం మీద 30 శాతానికి నోట్లు మారుస్తున్నారన్నమాట. మరిన్ని వివరాలు కనుక్కుందాం అని ఇందాకటి మిత్రుడికి ఫోన్ చేసి ‘ఎవరైనా ఇలా మార్చిన వాళ్లు కానీ, మార్చబోతున్నవాళ్లు కానీ ఉన్నారా?’ అని అడిగా. వాడు రహస్యంగా ‘ఎవరో ఎందుకు, నేనే రాత్రికి కోటి రూపాయలు మార్చుకుంటున్నా, నువ్వు వస్తావా’ అని అడిగాడు. ఎగిరి గంతేసి ఒప్పుకున్నా. సాయంత్రం వాడి దగ్గరకు పోయేసరికి పాత 500, 1000 నోట్ల కట్టలు బ్యాగుల్లో పెట్టున్నాయి. ఇద్దరం కార్లో మార్పిడి ప్రాంతానికి పోయాం.‘‘అరేయ్ వాళ్లు ఇచ్చేవి మంచివో కాదో ఎలా తెలుస్తుంది, యూవీ లైట్ లాంటివి ఏమైనా ఉన్నాయా’’ అనడిగాను.‘‘అక్కర్లేదు నమ్మకమే జీవితం’’ అన్నాడు వాడు గంభీరంగా. అక్కడ వాళ్లు మాకోసం వంద నోట్ల కట్టలతో ఎదురు చూస్తున్నారు. నాకైతే మాఫియా మూవీ చూస్తున్నంత ఉత్కంఠ. వీళ్లు మార్చుకొని బ్యాగులు తెరిచి చూడబోతుండగా పోలీసు విజిల్స్ వినిపించాయి. వెంటనే హడావుడిగా అందరం ఎవరి కార్లలో వాళ్లం అక్కడి నుంచి జంప్ అయ్యాం. ఇంటికి వచ్చి మావాడు వాళ్ల బ్యాగు తీసి ఒక్కో కట్ట పరిశీలిస్తుంటే వాడి ముఖంలో రంగులు మారుతున్నాయి.‘‘ఏమైందిరా’’ అని అడిగా. ‘‘మోసం, దగా ఇందులో 99 శాతం దొంగనోట్లే’’ అని అరిచాడు.నాకు షాక్ తగిలింది. వీడికి తగిలిన దెబ్బ మామూలిది కాదు, కోటి రూపాయలంటే మాటలా, ఎలా ఓదార్చాలో కూడా మాటలు రాలేదు నాకు. గొంతుపెగుల్చుకొని ‘‘ఊర్కోరా, పోలీసులకు జరిగింది చెప్పి వాళ్ల నెంబరు ఇచ్చి ట్రేస్ చేయమందాం, మనవి మనకు దక్కితే టాక్స్ కట్టి మార్చుకుందువు’’ అని సముదాయించాను. పోలీసులనగానే మావాడి ఏడుపుకు బ్రేక్ పడింది. ‘‘వద్దులేరా’’ అన్నాడు. ‘‘ఏంట్రా నువ్వు భయపడకు, ఏంకాదు, ప్రెస్వాణ్ణి కదా, నేను మాట్లాడతా పోలీసులతో’’ అని అభయమిచ్చాను.వాడు కంగారుగా లేచి, ‘‘పోతే పోనీలేరా, మనం 100 శాతం దొంగనోట్లిచ్చాం, వాళ్లతో పోలిస్తే మనకు లక్ష లాభమే’’ అన్నాడు.ఒక్కక్షణం అర్థం కాలేదు. అంటే ఆ పోలీసు విజిల్స్ అన్నీ... అవికూడా నా సెటప్పేరా అన్నాడు వాడు.ఇసుక తక్కెడ, పేడ తక్కెడ సామెత గుర్తొచ్చింది.వీళ్ల పాడుగాను, మనిషి ప్రతి సంక్షోభంలో స్వార్థమే చూసుకుంటాడు అనుకొని ఆ షాక్లోనే ఇంటికి పోయాను.మర్నాడు బ్యాంక్లో అష్టకష్టాలు పడి నా నోట్లు మార్చుకున్నాను. కొత్త 2 వేల రూపాయల నోట్లు పట్టుకోగానే ఏదో నిధిని గెల్చుకున్న సంబరం కలిగింది. సన్నగా విజిలేసుకుంటూ ఇంటికొచ్చి ఓనర్కు అద్దె ఇచ్చి నా రెండువేల రూపాయల నోటును జాగ్రత్తగా జేబులో పెట్టుకొన్నాను. ఇంక పాతనోట్ల బాధ తప్పింది అని సంతోషిస్తూ కిరాణా కొట్టుకు పోయా. కానీ కొత్త కష్టాలు అప్పుడే బిగినయ్యాయని అర్థమయింది. ఎవరి దగ్గర చూసినా రెండువేల నోటే. 500 నోటు జాడే లేదు. వందలు ఎక్కడో బందీలయ్యాయి. 500 నోటుకు 450 కొంటే చిల్లరిస్తానన్న కొట్టువాడు 2000 నోటుకైతే 1950 రూపాయలకు సరుకులు కొనాలని తేల్చి చెప్పాడు. నోట్లు మార్చుకొని నేను సాధించేదేంటో నాకర్థం కాలేదు. పెద్దోళ్లు ఎలా మార్చుకుంటున్నారో తెలీదు, బక్కప్రాణులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలీదు. చిల్లర శ్రీమహాలక్ష్మి అన్న నానుడికి అర్థం తెలుస్తోంది. ఇన్నాళ్లూ పొదుపంటే ఏంటో తెలీని జనాలంతా ఖర్చు విషయంలో మహా పీనాసులయ్యారు. చిన్నా, పెద్ద తేడాలేకుండా డబ్బు విలువ తెలిసివస్తోంది. మరోవైపు చిన్న చితకా వ్యాపారాలు, మధ్య తరగతి జీవితాలు అతలాకుతలం అయిపోతున్నాయి. నిర్ణయాన్ని కొత్తల్లో సమర్థించిన వారిలో చాలామంది తిట్టుకోవడం బిగినయింది. నోట్ల మార్పిడి విషయంలో ఆర్బీఐ అంచనాలు ఎంతగా విఫలం అయ్యాయో కనిపిస్తోంది. పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు చిన్న నోట్లను మరిన్ని చలామణీలోకి వదలకుండా మరింత పెద్ద నోటు వదలడం వెనక మతలబేంటో నాకేమీ అర్థం కాలేదు. ఒక రకంగా ఈ నిర్ణయం ఎకానమీకి మంచిదే అయినా, ముందస్తుగా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. ఏది ఏమైనా, ఈ దెబ్బకు సమాజం బాగుపడడమో, నాకి పోవడమో ఖాయం.రాత్రి ఇంటికి వచ్చి చొక్కాను హ్యాంగర్కు తగిలిస్తుంటే రంగంటినట్లు కనిపించింది. ఈ రంగెక్కడిది అనుకొని జేబులోంచి కొత్త నోటు తీసుకొని చూద్దును కదా, చెమటకు తడిసి రంగు వెలిసిపోయి కనిపించింది. ఖర్మరా బాబూ, మాములుగానే ఇవి మారడంలేదు, ఇప్పుడీ రంగువెలిసిన నోటును ఎవరు తీసుకుంటారన్న కొత్త భయం బిగినయింది. ఇంతలో వాట్సప్ మెసేజ్. కొత్తనోటులో చిప్ ఉందట, చిప్ సంగతి దేవుడెరుగు, నాణ్యత ఎంత చీప్గా ఉందో మెసేజ్ పంపిన దరిద్రుడికి తెలుసా అని పట్టరాని కోపమొచ్చింది. దాన్ని ఎక్కడో పెట్టి చూస్తే ఏదో కనపడుతుంది అని ఇంకో మెసేజ్. మీ బొంద కనిపిస్తుంది, నాకైతే చుక్కలు కనిపిస్తున్నాయి. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత. నా చిల్లర కష్టాలు ఇప్పట్లో తీరవు కనీసం దేశానికి పట్టిన నల్లచీడైనా వదిల్తే బాగుండు, భారతమాతాకీ జై అనుకొని పడుకున్నాను. బ్యాంకులో మార్చడం తర్వాత, ముందు ఏటీఎంలో అయినా డ్రా చేసుకోకుంటేరోజు గడిచేలాలేదని దగ్గర్లోని ఏటీఎంకి వెళ్లాను. ‘నోక్యాష్’ అని బోర్డు కనిపించింది.పక్కన ఉన్న అతన్ని ‘‘ఇక్కడ ఇంకో ఏటీఎం ఎక్కడుందండీ’’ అనడిగా. పదివేలకు జాగ్రత్తేంటి అనుకొని మళ్లీ వెంటనే ‘‘నిజమేలే ఇప్పుడు పదివేలే పదికోట్లు’’ అన్నాను. వాడొక్క క్షణం నిశ్శబ్దంగా ఉండి ‘‘ఇంతకూ నువ్వు చెప్పిన పది అంటే పదివేలా’’ అన్నాడు నెమ్మదిగా. ∙డి. శాయి ప్రమోద్ -
ఇటు పాత రూ.కోట్లు అటు నకిలీ నోట్లు
ఎండాడ చెక్పోస్టు వద్ద రూ.కోటి పాత నోట్లు పట్టివేత సరైన ఆధారాలు చూపకపోవడంతో ఇద్దరిపై కేసు నమోదు వుడా కాలనీ మురుగునీటిలో నకిలీ నోట్ల బస్తాలు ఏరుకోవడానికి ఎగబడిన జనం రంగంలోకి ఐటీ అధికారులు విశాఖపట్నం/పీఎం పాలెం/మధురవాడ : అర్ధరాత్రి వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తే పోలీసుల కళ్లు చెదిరిపోయారుు. కోటి రూపాయల నగదు చూసి నోరెళ్లబెట్టారు. వెంటనే డబ్బు తరలిస్తున్న వాహనాన్ని, డ్రైవర్ను, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరో సంఘటనలో డబ్బుల బస్తాలు మురుగు కాలువలో దర్శనమిచ్చారుు. వాటిని గమనించిన స్థానికులు అందినకాడికి పట్టుకుని పరుగుతీశారు. ఇంకా ఏమైనా మిగిలిపోయాయోమోనని కొందరు మురుగుకాలువలో దేవులాడారు. చివరికి కేవలం ఐదు నోట్లు దొరికారుు. అవి కూడా నకిలీవని తెలిసి అవాక్కయ్యారు. నగరంలో బుధవారం జరిగిన ఈ రెండు సంఘటనలు పెద్ద నోట్ల రద్దుతో ’నల్ల’ పాములు బయటకొస్తున్నాయనడానికి నిదర్శనంగా నిలవడంతో పాటు నగరంలో నకిలీ నోట్ల చెలామణీకి అద్దం పట్టారుు. రాత్రివేళ వాహనంలో తరలింపు ఒడిశాకు చెందిన ప్రీతమ్కుమార్ బారిక్, తమిళనాడుకు చెందిన వెంకటపతి ఒ.డి.5 09ఇ-1199 నంబరు గల బొలోరా వాహనంలో మంగళవారం రాత్రి జాతీయ రహదారి మీదుగా రూ. కోటి రూపాయలు పాతనోట్లు తమ వెంట తీసుకెళ్తున్నారు. అదే సమయంలో ఆనందపురం ఎస్ఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో ఎండాడ చెక్ పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అక్కడకు చేరుకున్న బొలోరా వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 200 బండెల్స్ పాత ఐదు వందల రూపాయల నోట్ల కట్టలు (వాటి విలువ రూ. కోటి) కనిపించారుు. వెంటనే కారు డ్రైవర్ను, అతనితో ప్రయాణిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం నగరమంతా దావానలంలా వ్యాపించింది. కానీ పోలీసులు మాత్రం అత్యంత గోప్యత పాటించారు. రాత్రి వరకూ వివరాలు వెల్లడించలేదు. కాగా పట్టుబడిన వారు పోలీసుల విచారణలో తాము త్రివేణీ ఎర్త్ అనే ప్రైవేటు సంస్థ ప్రతినిధులమని మెకానికల్, డీజిల్ ఫైర్ పార్టులకు చెల్లింపుల కోసం ఈ సొమ్ము తరలిస్తున్నామని వారిలో ఒకరు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించిన విషయంలో ఈ నగదు చెల్లించాల్సి వచ్చిందని మరో వ్యక్తి పోలీసులకు వివరించారు. వారిద్దరూ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం మరింత పెరిగింది. ఇంత పెద్ద మొత్తంలో నగదు రూపేణా లావాదేవీలు జరగడం అంటూ ఉండదని, చెక్కు, డీడీ రూపంలో చెల్లింపులు ఉంటాయనే కోణంలో రికార్డులు చూపమని పోలీసులు వారిని అడిగారు. చూపిస్తామంటూ సాయంత్రం వరకూ కాలం గడిపినా సరైన ఆధారాలు ఇవ్వలేకపోయారు. నగదుకు సంబంధించి వారు సరైన ఆధారాలు చూపలేకపోయారని, దాంతో కేసు నమోదు చేశామని పీఎం పాలెం సీఐ లక్ష్మణమూర్తి తెలిపారు. నిందితులను రిమాండుకు తరలించామన్నారు. మరోవైపు ఐటీ ప్రతినిధులు ఈ ఉదంతంపై ఆరా తీశారు. తదుపరి చర్యల నిమిత్తం నివేదికను సీఐ వారికి అందజేశారు. మురుగు కాలువలో నకిలీ నోట్లు జీవీఎంసీ 5వ వార్డు మధురవాడ మిథిలాపురి వుడా కాలనీ రోడ్డులో బుధవారం ఉదయం దొంగనోట్లు కలకలం రేపారుు. ఉదయం 6గంటల సమయంలో మిథిలాపురి ఉడాకాలనీ రోడ్డులో లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్ సమీపంలో ఉన్న ఓ కల్వర్టు వద్ద మురుగునీటి కాల్వలో గుర్తు తెలియని వ్యక్తులు బస్తాలతో రు.500 నోట్లు పడేసి పరారయ్యారు. ఈ విషయం అందరికీ తెలియడంతో ఏరుకోవడానికి జనం పరుగులు తీశారు. మోకాలు లోతు నీటిలో సైతం నోట్ల కోసం వెతికారు. అవి దొంగనోట్లు అని తెలిసినా వెతుకులాట ఆపలేదు. పోలీసులు అక్కడకు చేరుకుని ఇవి చెల్లని నోట్లు అని అందరినీ చెదరగొట్టారు. అరుుతే సుమారు కోటి రూపాయలు విలువ చేసే నోట్లు బస్తాలతో పడేశారని, కొందరు వీటిని పట్టుకెళ్లిపోయారని, చాలా నోట్లు ఈ కాలువలో కొట్టుకు పోయాయని పుకార్లు షికారు చేశారుు. ఈ విషయంమై పీఎంపాలెం సీఐ లక్ష్మణమూర్తి వివరణ కోరగా నోట్లు ఎవరు పడేశారో, ఎంత మొత్తం అనే విషయాలు తెలియదన్నారు. అరుుతే అవి దొంగనోట్లు అని భావిస్తున్నామని తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement