breaking news
notional
-
ఒక్క రోజు ముందు రిటైరయ్యేవారికీ నోషనల్ ఇంక్రిమెంట్
న్యూఢిల్లీ: వార్షిక ఇంక్రిమెంట్ పెరగడానికి ఒక్క రోజు ముందు రిటైరైన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఇకపై ఆ లబ్ది చేకూరనుంది. వారికి నోషనల్ ఇంక్రిమెంట్ లబ్ధి ప్రయోజనాలు వర్తింపజేస్తామని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఉదాహరణకు రూ.79,000 వేతనం పొందే కేంద్ర ప్రభుత్వోద్యోగి జూన్ 30న రిటైరవడంతో జూలై 1న రావాల్సిన రూ.2,000 వార్షిక ఇంక్రిమెంట్ కోల్పోయాడు. పెన్షన్ గణింపులో మాత్రం ఆయన చివరి వేతనాన్ని రూ. 81,000గా పరిగణిస్తారు. దాంతో రిటైర్మెంట్ తాలూకు ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి. ఇకపై జూన్ 30, డిసెంబర్ 31న రిటైరయ్యే వారికి తదుపరి నోషనల్ ఇంక్రిమెంట్ను కూడా పరిగణనలోకి తీసుకుంటామని కేంద్రం వివరించింది. ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఆలిండియా ఎన్పీఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ దీన్ని స్వాగతించింది. నిబంధనల ప్రకారం కేంద్ర ఉద్యోగులకు జూలై 1, లేదా జనవరి 1న ఇంక్రిమెంట్ ప్రకటిస్తారు. -
‘నోషనల్’ బాధితులు 20 వేల మంది
కర్నూలు(అగ్రికల్చర్): రెవెన్యూ రికార్డుల ప్రకారం నోషనల్ ఖాతా నెంబర్లు కలిగిన రైతులు జిల్లాలో దాదాపు 20వేల మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఈ ఖాతా నెంబర్లను రెవెన్యూ అధికారులు తాత్కాలిక ప్రాతిపదిక ఇస్తారు. ఈ నెంబర్లు ఉన్న భూములను రిజిస్ట్రేషన్లు చేయవద్దని ప్రభుత్వం అదేశించడంతో రైతుల్లో గగ్గోలు మొదలైంది. రిజిస్ట్రేషన్ తరువాత కొందరు పట్టాదారు పాసుపుస్తకాలకు దరఖాస్తు చేసుకోరు. అటువంటి సందర్భాల్లో అధికారులు తాత్కాలికంగా 100000, 100001 అంకెల్లో నోషనల్ నెంబర్లు ఇస్తారు. భూముల వ్యవహారాలు కోర్టుల్లో ఉన్నపుడు కూడాఇలా నెంబర్లు ఇస్తారు. అప్పటికప్పుడు పని జరగడానికి వీటిని ఇస్తారు. శాశ్వత ఖాతా నెంబర్లు 1 నుంచి 4 అంకెల్లోపు మాత్రమే ఉంటాయి. నోషనల్ నెంబర్లు ప్రతి రెవెన్యూ గ్రామానికి లక్ష నుంచి మొదలవుతాయి. మండలాల వారీగా ఆరా..! నోషనల్ ఖాతా నెంబర్లు కలిగిన భూములను రిజిస్ట్రేషన్లు నిర్వహించరాదని ఆదేశాలు వెలువడిన నేప«థ్యంలో మండలాల వారిగా వాటి వివరాలు సేకరిస్తున్నారు. తాత్కాలిక అంచనాల ప్రకారం 20 వేల వరకు ఉన్నా.. గ్రామాల వారీగా ఎన్ని ఉన్నాయో లెక్కిస్తున్నారు. ఈ వివరాలు పక్కాగా వచ్చిన తర్వాత ప్రభుత్వానికి పంపుతారు.