breaking news
notice to Sakshi news paper
-
‘సాక్షి’ మీడియాకు నోటీసులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: సాక్షి మీడియాపై టీడీపీ నాయకులు కక్షగట్టారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అనధికార పీఏ సతీష్ అనైతిక వ్యవహారాలపై ఓ ఒంటరి మహిళ (దివంగత ఉపాధ్యాయుడి భార్య) ఆవేదనను, ఫిర్యాదులను ప్రజల ముందు ఉంచినందుకు కొందరు టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ వితంతు మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఆరి్థకంగా దోచుకోవడమే కాకుండా లైంగికంగా వేధించిన సతీష్ వ్యవహారాన్ని ‘సాక్షి’తో పాటు పలు మీడియా చానళ్లు ప్రజల ముందుకు తెచ్చాయి.ఈ తరుణంలో బాధితురాలికి అండగా నిలుస్తూ తన పీఏపై చర్యలు తీసుకోవాల్సిన మంత్రి సంధ్యారాణి కేవలం ‘సాక్షి’ మీడియాను టార్గెట్ చేశారు. తమపై వార్తలు ప్రచురించి, చానల్లో ప్రసారం చేయడాన్ని భరించలేక ఏకంగా ‘సాక్షి’ మీడియాపైకి పోలీసులను ఉసిగొల్పారు. సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నుంచి విజయనగరం ‘సాక్షి’ కార్యాలయానికి సోమవారం వచ్చిన పోలీసులు నోటీసులు అందజేశారు. పీఏ సతీష్కు వ్యతిరేకంగా కథనాలు ఇచి్చనందుకు పోలీస్ స్టేషన్కు వచ్చి వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.మక్కువ మండల టీడీపీ అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్నాయుడు లెటర్ హెడ్పై టీడీపీ సాలూరు పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, సాలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ తదితరుల ఫిర్యాదు మేరకు 353(1)(బి), 353(1)(సి), 356(1), 356(2) బీఎన్ఎస్ 67 ఐటీఏ–2000–2008 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. -
సాక్షి ప్రతినిధులకు బాబు సర్కార్ నోటీసులు
-
సాక్షి ప్రతినిధులకు బాబు సర్కార్ నోటీసులు
తెలుగువారి మనస్సాక్షి సాక్షిపై ఏపీ ప్రభుత్వం మరోసారి కక్షగట్టింది. ఏపీ రాజధానిలో జరగుతున్న భూ అక్రమాలపై వార్తల విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగింది. వార్తలను రాసిన సాక్షి ప్రతినిధులకు సర్కార్ నోటీసులు జారీ చేసింది. పోలీసుల విచారణకు హాజరు కావాలని నోటీసులు పేర్కొంది. నోటీసుల్ని శనివారం సాక్షి కార్యాలయం బయట అంటించి వెళ్లారు. ఇటు ప్రభుత్వ తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవాలను బయటపెట్టే మీడియాపై ప్రభుత్వం కక్షసాధింపుకు దిగడం సరికాదని సీనియర్ జర్నలిస్టులు మండిపడుతున్నారు. కోర్టు ద్వారా కాకుండా పోలీసులు సమక్షంలో సాక్షి ప్రతినిధులు విచారణకు హాజరు కావాలని పేర్కొనటం గమనార్హం. గతంలోనూ చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లకు ‘సాక్షి’ ప్రతినిధులను అనుమతించని విషయం తెలిసిందే. కాగా 'సాక్షి' విలేకర్లకు నోటీసులు ఇవ్వడాన్ని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఖండించింది. నోటీసులు ఇవ్వడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అని, ఇది భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి అని, ఆ వార్త సోర్స్ల వివరాలు చెప్పాలంటూ నోటీసులు ఇచ్చే అధికారం పోలీసులకు లేదని, ఏపీ పోలీసుల అణిచివేత ధోరణిని జర్నలిస్టులంతా ఖండించాలని ఐజేయూ ప్రెసిడెంట్ ఎస్.ఎన్.సిన్హా, సెక్రటరీ జనరల్ అమర్, ప్రెస్ కౌన్సిల్ సభ్యులు అమర్నాథ్, ప్రభత్ దాస్ పేర్కొన్నారు.


