breaking news
Nominal Rolls
-
గుర్తింపు ఏకం.. బడులు అనేకం!
► ఒకే గుర్తింపుపై రెండు.. అంతకన్నా ఎక్కువ ప్రైవేటు పాఠశాలలు ► ప్రమాణాలు లేకున్నా అనుమతినిచ్చిన డీఈవో, సిబ్బంది ► హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రైవేటు స్కూళ్ల భాగోతం సాక్షి, హైదరాబాద్: ఒక పాఠశాలకు ఒక గుర్తింపు మాత్రమే ఇస్తారు. కానీ రాష్ట్ర రాజధాని హైదరాబాద్తోపాటు పరిసర ప్రాంతాల్లో ఒకే గుర్తింపు పత్రంపై రెండు కంటే ఎక్కువ పాఠశాలలు దర్జాగా కొనసాగుతారుు. ఒక పేరుతో ప్రభుత్వ గుర్తింపు పొంది.. ఆదే గుర్తింపు పత్రంతో రెండు, అంతకంటే ఎక్కువ స్కూళ్లను వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహిస్తారు. ఇలా వేర్వేరు పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు చివరకు ప్రభుత్వం ఆమోదించిన పాఠశాల చిరునామాతో ధ్రువపత్రాలు జారీ చేస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రైవేటు ఉన్నత పాఠశాలల ఘనకార్యమిది. పట్టణ ప్రాంతాల్లో కొన్ని యాజమాన్యాలు ఇలా ఒకే అనుమతి పత్రంతో రెండుకుపైగా స్కూళ్లు నిర్వహిస్తూ నిబంధనలకు పాతరేస్తున్నాయి. ఆయా యాజమాన్యాలకు విద్యా శాఖ అధికారుల సహకారం అందుతుండటంతో వాటిపై చర్యలకు తావులేకుండా పోతోంది. ప్రస్తుతం ఈ మూడు జిల్లాల పరిధిలో 4,550 ప్రైవేటు స్కూళ్లు ఉండగా.. వీటిలో 1,866 ఉన్నత పాఠశాలలున్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నారుు. హైదరాబాద్ జిల్లాలో 972, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 894 హైస్కూళ్లు ఉన్నారుు. విద్యార్థుల వివరాలు ఇవ్వడంతో.. ప్రస్తుతం పదో తరగతి విద్యార్థుల వార్షిక పరీక్షలకు సంబంధించి ఫీజు స్వీకరణ ప్రక్రియ ముగిసింది. ఈ మేరకు ఆయా పాఠశాల యాజమాన్యాలు ఫీజు చెల్లించిన విద్యార్థుల ఎన్ఆర్ (నామినల్ రోల్స్)లను విద్యా శాఖకు సమర్పించాల్సి ఉంది. ఈ క్రమంలో పలు పాఠశాలల్లో నిబంధనలకు మించి విద్యార్థుల సంఖ్యను పేర్కొంటూ విద్యా శాఖ అధికారులకు ఎన్ఆర్లు సమర్పిస్తుండడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 60 మంది విద్యార్థులకు మించకూడదు సాధారణంగా ఒక పాఠశాలలో ఒక తరగతికి గరిష్టంగా 60 మంది విద్యార్థుల కు మించకూడదు. ఈ సంఖ్యను మించి తే ప్రతి సెక్షన్ (40 మంది విద్యార్థులు)కు ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. అయితే చాలా పాఠశాలలు ఈ నిబంధనలను పట్టించుకోకుండా విద్యార్థుల అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. ఒకే పేరుతో మరో ప్రాంతంలో పాఠశాల శాఖ (బ్రాంచ్)ను స్థాపించి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. రెండురోజుల కిందట హైదరాబాద్ జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో కొన్ని ప్రైవేటు పాఠశాలలు లెక్కకు మించి విద్యార్థుల సంఖ్యను చూపుతూ ఎన్ఆర్లు సమర్పించాయి. దీంతో విద్యార్థుల సంఖ్యపై అధికారులు ఆరా తీయగా.. గుర్తింపు లేకుండా స్కూళ్లు నిర్వహిస్తున్నట్లు తేలింది. కొన్ని పాఠశాల లు కనీస ప్రమాణాలు లేకున్నా.. డీఈఓ కార్యాలయంలోని సిబ్బందితో కుమ్మక్కై దర్జాగా అనుమతులు పొందినట్లు స్పష్టమైంది. అక్రమ అనుమతులు, గుర్తింపు లేకుండా కొనసాగుతున్న పాఠశాలలపై రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయంలోని ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదులు అందాయి. దీంతో జిల్లాల అధికారుల నుంచి సమాచారం తెప్పించుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. వారిచ్చే సమాచారం ఆధారంగా విజిలెన్స విభాగంతో తనిఖీలు చేపట్టనున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. -
రూల్స్.. రివర్స్..!
కేయూ, దూరవిద్య కేంద్రం బాగోతం ఫీజులు చెల్లించకుండానే పీజీ పరీక్షల నిర్వహణ నకిలీ హాల్ టికెట్లతో ఎంవోయూ సెంటర్ నిర్వాకం నామినల్ రోల్స్లో పేర్లు ఉన్న విద్యార్థుల ప్రశ్నపత్రాలనే మూల్యాంకనం చేయూలి. కానీ.. ఇక్కడ ఇవేమీ పట్టించుకోకుండా ప్రొవిజనల్, మెమోలు సిద్ధం చేస్తున్నారు..! ఇక.. ఎక్కడైనా అడ్మిషన్, టర్మ్ ఫీజు చెల్లించిన తర్వాతే తరగతులు ప్రారంభమవుతారుు. ఆ తర్వాత నామినల్ రోల్స్లో పేర్లు నమోదవుతారుు. ఈ మేరకు సదరు విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అర్హులు. కానీ.. ఇక్కడ పరీక్షలు రాసిన తర్వాతే అడ్మిషన్ తీసుకుంటున్నారు..! కేయూ, దూరవిద్య కేంద్రంలో నిరాటంకంగా సాగుతున్న ఈ తంతు కొందరికి కాసులు కురిపిస్తోంది. దూరవిద్యా కేంద్రం పరిధిలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎంఓయూ స్టడీ సెంటర్లో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటనే నిదర్శనం.. కొనసాగుతున్న అక్రమ బాగోతం ఇది. నకిలీ హాల్టికెట్లతో పరీక్షలు రారుుంచిన సదరు ఎంఓయూ స్టడీ సెంటర్పై చర్యలు తీసుకోకుండా.. ప్రేమ ఒలకబోయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నారుు. కేయూ దూరవిద్యా కేంద్రం పరిధిలోని రంగారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన ఓ డిగ్రీ కాలేజీ ఎంఓయూ స్టడీ సెంటర్లో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఈ స్టడీ సెంటర్లో 2011-12 అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు కొందరు ప్రథమ సంవత్సరం పూర్తి చేశాక.. ద్వితీయ సంవత్సరం 2012-2013 అడ్మిషన్లకు సంబంధించి దూరవిద్యా కేంద్రానికి ఎలాంటి టర్మ్, పరీక్ష ఫీజు చెల్లించలేదు. ఈ మేరకు వారికి యూనివర్సిటీ పరీక్షల విభాగం హాల్ టికెట్లు పంపిణీ చేయలేదు. కానీ, సంబంధిత ఎంఓయూ సెంటర్ యూజమాన్యం.. ఫీజు చెల్లించని వారిలో కొందరు విద్యార్థులకు 2013లో నిర్వహించిన పీజీ ఫైనలియర్ పరీక్షలకు అనుమతి ఇచ్చింది. అదీ.. నకిలీ హాల్టికెట్లను సృష్టించి, నామినల్ రోల్స్లో పేరు లేని అభ్యర్థులకు అందజేసి పరీక్షలు రాయించారు.ఆయా జవాబుపత్రాలను కేయూ పరీక్షల విభాగానికి పంపారు. నిబంధనల ప్రకారం నామినల్ రోల్స్లో పేరు లేని విద్యార్థుల జవాబు పత్రాలను వాల్యుయేషన్ చేయకూడదు. ఇదేమీ పట్టని కేయూ పరీక్షల విభాగం అధికారులు మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేసి, ఆ తర్వాత ఫలితాలను నిలిపివేశారు. దీంతో తాండూరు స్టడీసెంటర్ యాజమాన్యం పలు సార్లు కేయూ పరీక్షల విభాగం అధికారుల చుట్టు తిరిగారు. ఫీజులు చెల్లించకుండా విద్యార్థులతో పరీక్షలు రాయించడం నిబంధనలకు విరుద్ధమని, ఫలితాలు ప్రకటించేది లేదని కొద్దిరోజులుగా అధికారులు తిరస్కరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఏదోలా సదరు ఎంఓయూ సెంటర్ నిర్వాహకులు.. కేయూ పరీక్షల విభాగం అధికారులను మచ్చిక చేసుకుని కొంత ముట్టజెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా.. కొందరు విద్యార్థులు దూరవిద్యా కేంద్రం డెరైక్టర్కు లేఖపెట్టుకున్నారు. చివరకు ఒక్కో అభ్యర్థి రూ.7,200 ఫీజు చెల్లిస్తూ నో డ్యూస్ సర్టిఫికెట్ ఇస్తామని ఒప్పందానికి వచ్చారు. దీంతో రెండు రోజులుగా విద్యార్థులు దూరవిద్యా కేంద్రానికి ఫైన్తో సహా టర్మ్ ఫీజు చెల్లించి, కేయూలో ప్రొవిజనల్, మెమోలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 8 మంది అభ్యర్థులు సర్టిపికెట్లను తీసుకున్నారు. ఇందులో ఏడుగురు ఎంఏ సోషియాలజీ, ఒకరు ఎంఏ పోలిటికల్ సైన్స్ విద్యార్థులు ఉన్నారు. సదు ఎంఓయూ స్టడీ సెంటర్లో ఇలా 50 మంది వరకు విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. కానీ.. ఇక్కడ నకిలీ హాల్టికెట్లతో పరీక్ష రారుుంచిన ఎంఓయూ సెంటర్పై యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం.. పరీక్షలు రాసిన తర్వాత దూరవిద్యా కేంద్రం అధికారులు అడ్మిషన్లు తీసుకోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఉన్నతాధికారులు సైతం మిన్నకుండి పోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నారుు.