-
99 రూపాయలకే నోకియా స్మార్ట్ఫోన్
న్యూఢిల్లీ : ఈ - కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్కార్ట్, అమెజాన్ బిగ్ షాపింగ్ సీజన్ ముగిసి రెండు రోజులు కావోస్తుంది. అయ్యో ఇక మీదట తక్కువ ధరలో కొత్త స్మార్ట్ఫోన్ కొందామంటే ఇక కుదరదేమో అని నిరాశ పడుతున్నారా..? అయితే ఇది మీ కోసమే. నోకియా బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లను విక్రయిస్తున్న హెచ్ఎండీ గ్లోబల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం 99 రూపాయల డౌన్పేమంట్లో ఎంపిక చేసిన నోకియా బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయవచ్చని హెచ్ఎండీ గ్లోబల్ తెలిపింది. మిగతా మొత్తాన్ని నో - కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లో నెలవారీ ఇన్స్టాల్మెంట్లో చెల్లించవచ్చని పేర్కొంది. ఈ ఆఫర్ 2018 నవంబర్ 10 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ ఆఫర్లోనే హెచ్డీఎఫ్సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై 10 శాతం క్యాష్బ్యాక్ అందుబాటులో ఉంటుంది. హెచ్ఎండీ గ్లోబల్ లైనప్లో అందుబాటులో ఉన్న ప్రీమియం స్మార్ట్ఫోన్ నోకియా 8 సిరాకో పై హెచ్డీఎఫ్సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుదారులకు 15 శాతం క్యాష్బ్యాక్ లభిస్తోంది. అయితే ఈ క్యాష్బ్యాక్ కార్పొరేట్, బిజినెస్, కమర్షియల్ క్రెడిట్ కార్డులకు వర్తించదు. నోకాస్ట్ ఈఎంఐలో రూ.99కే అందుబాటులో ఉన్న ఫోన్లు... నోకియా 1, నోకియా 2.1, నోకియా 5.1, నోకియా 6.1, నోకియా 3.1 ప్లస్, నోకియా 8 సిరాకో. నోకియా 3.1ప్లస్ను ఇటీవలే లాంచ్ చేసింది. ఆఫర్ పొందడమెలా..? ఈ ఆఫర్ని పొందాలనే ఆసక్తి ఉన్న వారు దగ్గరలోని రిలయన్స్ జియో, జియో డిజిటల్ లైఫ్, క్రోమా స్టోర్లలో స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేసేటప్పుడు కనుగొనవచ్చు. అంతేకాక అధికారిక నోకియా ఆన్లైన్ స్టోర్లో కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. -
నోకియా బ్రాండులో మరో స్మార్ట్ఫోన్
నోకియా బ్రాండులో మరో స్మార్ట్ఫోన్ విడుదల కాబోతుంది. అయితే ఈ సారి చైనాలో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ ఈవెంట్కు సంబంధించి ఆహ్వాన పత్రికలను కూడా హెచ్ఎండీ గ్లోబల్ పంపించింది. గురువారం రోజు ఉదయం 8 గంటలకు ఓ ఈవెంట్ నిర్వహించనున్నట్టు పేర్కొంది. కంపెనీ విడుదల చేసిన టీజర్లో చైనీస్లో క్యూఐగా ఉంది. అంటే దీని అర్థం 7 తెలుస్తోంది. దీంతో చైనాలో లాంచ్ కాబోతున్న నోకియా బ్రాండు తర్వాతి ఫోన్ నోకియా 7గా ఊహాగానాలు ఊపందుకున్నాయి. నోకియా 8కి బదులు నోకియా 7ను హెచ్ఎండీ గ్లోబల్ అక్కడ విడుదల చేస్తుంది. నోకియా 7 స్పెషిఫికేషన్లు.. 5.2 అంగుళాల 1080పీ డిస్ప్లే 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ 4జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ స్నాప్డ్రాగన్ 630 ఎస్ఓసీ డ్యూయల్ కెమెరాలు -
మార్చికల్లా భారత్లో నోకియా స్మార్ట్ఫోన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం నోకియా స్మార్ట్ఫోన్ మార్కెట్లో రీ–ఎంట్రీ ఇచ్చింది. నోకియా–6 పేరుతో కంపెనీ తొలి ఆన్డ్రాయిడ్ స్మార్ట్ఫోన్ను హెచ్ఎండీ గ్లోబల్ చైనాలో ఆవిష్కరించింది. ధర రూ.16,739 ఉంది. భారత్లో మార్చికల్లా అడుగు పెట్టనుందని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు.2.5డీ గొరిల్లా గ్లాస్తో 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, డ్యూయల్ సిమ్ పొందుపరిచారు. ఎండ వెలుతురులోనూ స్క్రీన్ను చక్కగా చూడొచ్చు. మెటల్ బాడీతో రూపొం దించారు. ఆన్డ్రాయిడ్ నౌగట్ ఓఎస్, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ డ్యూయల్ టోన్ ఫ్లాష్తో 16 ఎంపీ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా,డాల్బీ అట్మోస్ టెక్నాలజీ డ్యూయల్ యాంప్లిఫయర్స్, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు ఉంది. మైక్రోసాఫ్ట్ నుంచి నోకియా బ్రాండ్ లైసెన్సింగ్ హక్కులను ఫిన్లాండ్కు చెందిన హెచ్ఎండీ గ్లోబల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. నోకియా ఫోన్లనుఫాక్స్కాన్ తయారు చేయనుంది. -
ఇక నోకియా ఆండ్రాయిడ్ మొబైల్స్
బార్సిలోనా: ఎట్టకేలకు మొబైల్ దిగ్గజం నోకియా కూడా ఆండ్రాయిడ్ బాట పట్టింది. భారత్ వంటి ప్రధాన మార్కెట్లలో చౌక స్మార్ట్ఫోన్లకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో తొలిసారిగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత మొబైల్స్ను తీసుకొచ్చింది. ఇక్కడ జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ప్రదర్శనలో నోకియా ఈ కొత్త స్మార్ట్ఫోన్లను సోమవారం ఆవిష్కరించింది. మార్పులు చేసిన ఆండ్రాయిడ్ ఓఎస్ వెర్షన్( ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్-ఏఓఎస్పీ)తో ప్రవేశపెట్టిన ఈ మొబైల్స్కు ‘ఎక్స్’ సిరీస్గా పేరు పెట్టింది. ఎక్స్, ఎక్స్ ప్లస్, ఎక్స్ఎల్ అనే మూడు మోడళ్లు ఇందులో లభ్యమవుతాయి. వీటి ధరలు వరుసగా 89, 99, 109 యూరోలుగా ఉంటాయని(పన్నులు కలపకుండా) కంపెనీ వెల్లడించింది. అంటే ఎక్స్ మోడల్ రేటు భారత్ కరెన్సీలో దాదాపు రూ.7,600. చౌక స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో అనూహ్య వృద్ధి నమోదవుతున్న మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని ఎక్స్ సిరీస్ను ప్రవేశపెడుతున్నట్లు నోకియా డివెజైస్ అండ్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్టీఫెన్ ఎలాప్ పేర్కొన్నారు. ఎక్స్ మోడల్ను త్వరలోనే మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నామని, మిగతా రెండు ఫోన్లను ఈ ఏడాది రెండో త్రైమాసికంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. మరో రెండు ఫోన్లు... ఇంటర్నెట్ సదుపాయం ఉన్న ఎంట్రీ లెవెల్ మొబైల్, ఆశా 230 పేరుతో మరో ఫోన్ను కూడా నోకియా ప్రవేశపెట్టింది. ఎంట్రీ లెవెల్ మొబైల్ ధర 29 యూరోలు కాగా, ఆశా 230 ఫోన్ 45 యూరోలకే లభిస్తుందని ఎలాప్ చెప్పారు. తక్షణం ఈ రెండు ఫోన్లను భారత్, ఆసియా-పసిఫిక్, యూరప్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా తదితర మార్కెట్లలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆశా టచ్ ఫోన్లలో అత్యంత చౌక మొబైల్ ఇదేనని.. సింగిల్, డ్యూయల్ సిమ్ ఆప్షన్స్తో లభిస్తుందని ఎలాప్ వివరించారు. ఇప్పుడు నోకియా 220 వంటి ఎంట్రీ లెవెల్ ఫోన్తో పాటు ఆశా సిరీస్, ఎక్స్ సిరీస్, లుమియా... ఇలా నాలుగు స్థాయిల్లో తమ కంపెనీ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లయిందని పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ హవాయే కారణం... ఆండ్రాయిడ్ ఓఎస్ హవాతో స్మార్ట్ఫోన్ల విభాగంలో నోకియా వెనుకబడిన సంగతి తెలిసిందే. దీంతో నోకియా ఆండ్రాయిడ్ మొబైల్స్ రావడం ఖాయమన్న వార్తలు ఇటీవల జోరందుకున్నాయి కూడా. ప్రస్తుతం నోకియా విండోస్ ఆధారిత స్మార్ట్ఫోన్లను(ప్రధానంగా లుమియా సిరీస్) మాత్రమే విక్రయిస్తోంది. నోకియాను మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ 7.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం, మరికొద్ది రోజుల్లో ఈ టేకోవర్ పూర్తికానున్న నేపథ్యంలో ఆండ్రాయిడ్ ఫోన్లను ప్రవేశపెట్టడం గమనార్హం. కాగా, ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(ఐడీసీ) గణాంకాల ప్రకారం.. ఆండ్రాయిడ్ ఓఎస్తో గతేడాది డిసెంబర్ క్వార్టర్లో 78.1 శాతం స్మార్ట్ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైనట్లు అంచనా. ఇదే కాలంలో మైక్రోసాఫ్ట్ విండోస్ మొబైల్ ఓఎస్ ప్లాట్ఫామ్ ఉన్న స్మార్ట్ఫోన్లు విక్రయాలు 3 శాతమేనని గణాంకాలు చెబుతున్నాయి. బ్లాక్బెర్రీ మెసెంజర్ కూడా... విఖ్యాత బ్లాక్బెర్రీ మెసెంజర్(చాటింగ్ అప్లికేషన్-బీబీఎం) త్వరలో విండోస్ ఫోన్(లుమియా సిరీస్ ఇతరత్రా), నోకియా ఎక్స్ సిరీస్ స్మార్ట్ఫోన్లలోనూ లభించనుంది. గతేడాది అక్టోబర్లో ఈ కెనడా మొబైల్ దిగ్గజానికి చెందిన బీబీఎం యాప్ను ఆండ్రాయిడ్, యాపిల్ ఐఓఎస్ డివైజ్లకు అనువుగా అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి దాదాపు 4 కోట్ల హ్యాండ్సెట్లలో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్లు అంచనా. ‘నోకియా ఫోన్లో బీబీఎం యాప్ను ప్రీలోడెడ్గా అందించనుండటం పట్ల మేం చాలా ఉత్సుకతతో ఉన్నాం. కొన్ని ఎంపిక చేసిన మార్కెట్లలో ఎక్స్ సిరీస్లో ఈ యాప్ను ముందుగా ప్రవేశపెడతాం. బీబీఎం సమూహంలోనికి నోకియా ఎక్స్ యూజర్లను ఆహ్వానిస్తున్నాం’ అని బ్లాక్బెర్రీ ప్రెసిడెంట్(గ్లోబల్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్) జాన్ సిమ్స్ పేర్కొన్నారు. శామ్సంగ్, యాపిల్, నోకియా స్మార్ట్ఫోన్లతో విపరీతమైన పోటీ కారణంగా బ్లాక్బెర్రీ అమ్మకాలు క్షీణిస్తున్న సంగతి తెలిసిందే. ఎక్స్ సిరీస్ ప్రత్యేకతలు ఇవీ... నోకియా ఎక్స్, ఎక్స్ ప్లస్లు రెండూ 4 అంగుళాల టచ్స్క్రీన్తో లభిస్తాయి. వీటిలో వెనుకవైపున 3 మెగా పిగ్జెల్ కెమేరా ఉంది. ఎక్స్ ప్లస్కు 768 ఎంబీ ర్యామ్, ఎక్స్ మోడల్లో 512 ఎంబీ ర్యామ్ను అమర్చారు. ఎక్స్ ఎల్ మోడల్లో 5 అంగుళాల టచ్ స్క్రీన్, వెనుకవైపున 5 ఎంపీ ఆటోఫ్లాష్ కెమేరా, ముందువైపు 2 ఎంపీ కెమేరా ఉంది. ర్యామ్ 768 ఎంబీ. మూడు ఫోన్లలో డ్యూయల్ సిమ్ సౌకర్యం ఉంది. ఇంటర్నల్ మెమరీ 4జీబీ, 32 జీబీ వరకూ ఎక్స్పాండబుల్ సదుపాయం. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ డ్యూయల్ కోర్ 1 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్తో ఇవి లభిస్తాయి. మైక్రోసాఫ్ట్ సేవలు, హియర్ మ్యాప్స్ వంటి నోకియా ప్రత్యేక అప్లికేషన్స్తో పాటు వీటిలో ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ కూడా పనిచేస్తాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement