breaking news
No use voting
-
4 లక్షల మంది ఓటుకు దూరం
ఆదిలాబాద్అర్బన్: భారత రాజ్యాంగం ప్రతీ పౌరుడికి కల్పించిన ఓటు హక్కు సద్వినియోగం కాలేకపోతోంది. ఓటు అనే వజ్రాయుధాన్ని పౌరులు సక్రమంగా వినియోగించుకోవడం లేదు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో కనిపించిన చైతన్యం లోక్సభ ఎన్నికల్లో కానరాలేదు. సుమారు 72 శాతం మంది ఓటింగ్లో పాల్గొనగా, ఇంకా 28 శాతం మంది ఓటు వినియోగానికి దూరంగా ఉన్నట్లు ఈ నెల 11న జరిగిన పోలింగ్ ద్వారా స్పష్టమైంది. ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి గురువారం పోలింగ్ జరగగా, నియోజకవర్గ పరిధిలో 14,88,353 మంది ఓటర్లు ఉన్నారు. అయితే 10,69,333 మంది ఓటర్లు ఓటింగ్లో పాల్గొనగా, మిగతా 4,24,617 మంది ఓటర్లు ఓటు వినియోగానికి దూరంగా ఉన్నారు. ఇదిలా ఉండగా, లోక్సభ ఓటర్లలోనే కాదు.. పోలింగ్లోనూ పురుషుల కంటే మహిళలే అధికంగా ఓటింగ్లో పాల్గొని ముందు వరుసలో నిలబడ్డారు. ఖానాపూర్, ముథోల్ అసెంబ్లీ పరిధిలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఓటింగ్లో పాల్గొనగా, మిగతా నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో జరిగిన ఓటింగ్లో పురుషులు ముందున్నారు. ఓటుకు దూరంగా 4 లక్షల మంది.. ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్, ఖానాపూర్, సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గంలో 70 శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది. వెనువెంటనే వచ్చిన లోక్సభ ఎన్నికల్లో మాత్రం పోలింగ్ శాతం తగ్గింది. పోలింగ్ 75 నుంచి 80 శాతం నమోదవుతుందని అధికార యం త్రాంగం అంచనా వేసినా.. పోలింగ్ లక్ష్యం చేరుకోలేకపోయిందని చెప్పవచ్చు. అయితే ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 14,88,353 మంది ఓటర్లు ఉండగా, 10,63,439 మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. మిగతా 4.24 లక్షల మంది ఓటర్లు ఓటు వినియోగానికి దూరంగా ఉన్నారు. సద్వినియోగం చేసుకున్న వారిలో 5,22,969 మంది పురుషులు ఉండగా, 5,39,862 మంది మహిళలు ఉన్నారు. ఇతరులు 56 మంది ఉండగా, 13 మంది ఓటేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. సిర్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో 2,03,165 మంది ఓటర్లు ఉండగా, 1,41,232 మంది ఓటేశారు. మిగతా 30,424 మంది పురుషులు, 31,507 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. దీంతో 69.52 శాతం పోలింగ్ నమోదైంది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 1,99,498 మంది ఓటర్లు ఉంగడా, 1,47,643 మంది ఓటు వినియోగించుకున్నారు. మిగతా 24,202 మంది పురుషులు, 27,647 మంది ఓటర్లు ఓటేయలేదు. దీంతో ఈ అసెంబ్లీ పరిధిలో పోలింగ్ 74.01 శాతం నమోదైంది. ఖానాపూర్ అసెంబ్లీ పరిధిలో 2,03,746 మంది ఓటర్లు ఉండగా, 1.44.986 మంది ఓటేశారు. 31,201 మంది పురుషులు, 27,554 మంది మహిళలు ఓటుకు దూరంగా ఉన్నారు. ఇక్కడ 71.16 శాతం నమోదైంది. ఆదిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో 2,19,612 మంది ఓటర్లు ఉండగా, 1,54,446 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. మిగతా 29,777 మంది పురుషులు, 35,383 మంది మహిళలు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోలేదు. దీంతో 70.33 శాతం పోలింగ్ నమోదైంది. బోథ్ పరిధిలో 1,93,373 మంది ఓటర్లు ఉండగా, 1,47,137 మంది ఓటేశారు. మిగతా 46236 మంది ఓటేయలేదు. ఇందులో పురుషులు 21,105 మంది పురుషులు ఉండగా, 25,128 మంది మహిళలు ఉన్నారు. ఇక్కడ పోలింగ్ 76.09 శాతం నమోదైంది. నిర్మల్ నియోజకవర్గంలో 2,38,371 మంది ఓటర్లు ఉండగా, 1,59,531 మంది ఓటర్లు ఓటేశారు. మిగతా 78,840 మంది ముఖం చాటేశారు. ఇందులో 40,183 మంది పురుషులు ఉండగా, 39,247 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అయితే ఈ సెగ్మెంట్లో పోలింగ్ 66.93 శాతం నమోదైంది. ఇక ముథోల్ అసెంబ్లీలో 2,30,588 మంది ఓటర్లు ఉండగా, 1,68,464 మంది ఓటేశారు. మిగతా 30,372 మంది పురుషులు ఉండగా, 31736 మంది ఓటు వినియోగానికి దూరంగా ఉన్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో పోలింగ్ 73.06 శాతం నమోదైంది. ఓటర్లలో కానరాని చైతన్యం.. లోక్సభ ఎన్నికలు–2019లో ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో పోలింగ్ 75 నుంచి 80 శాతం నమోదవుతుందనుకున్న అధికార యంత్రాంగం అంచనాలు తారుమారయ్యాయి. 14.88 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో 10.63 లక్షల మంది మాత్రమే ఓటింగ్లో పాల్గొనడంతో 71.45 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, లోక్సభ పరిధిలోని మూడు జిల్లాల యంత్రాంగం గత మూడు నెలల నుంచి ఓటు హక్కు వినియోగం, ఓటు విలువ గురించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించినా ఫలితం కనిపించలేదు. ఇటు యంత్రాంగం, అటు ఎన్నికల సంఘం పోలింగ్పై ఎన్ని విధాలుగా ప్రచారాలు, అవగాహన కార్యక్రమాలు, ఓటరు ర్యాలీలు చేపట్టినా ఓటర్లలో చైతన్యం రాలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో కనిపించిన ఓటరు ఉత్సాహం లోక్సభ ఎన్నికల్లో కన్పించలేదని పలువురు చర్చించుకుంటున్నారు. -
ఫలితమివ్వని చైతన్య కార్యక్రమాలు
సాక్షి, గుంటూరు :ఐదేళ్ళకోసారి వచ్చే వజ్రాయుధం లాంటి ఓటు హక్కును వినియోగించుకోని వారు జిల్లాలో 6,60,214 మంది ఉన్నారు. ఓటు హక్కు వినియోగంపై ఎన్నికల కమిషన్ ఈ దఫా విసృ్తత ప్రచారం నిర్వహించినా జిల్లాలో అధిక శాతం నిర్లక్ష్యం వహించారు. ఓటు హక్కు వినియోగంపై పదే పదే సదస్సులు నిర్వహించినా, స్వీప్ లాంటి కార్యక్రమాలు చేసినా ఫలితం లేకపోయింది. రాష్ట్రంలోనే గుంటూరు జిల్లాలో అధిక శాతం పోలింగ్ నమోదైనప్పటికీ అత్యంత రాజకీయ చైతన్యం గల జిల్లాలో 2009 ఎన్నికలతో పోలిస్తేస్వల్పంగానే పెరిగింది. 2009లో 77.88 శాతం పోలింగ్ నమోదు కాగా, 2014లో 81.89 శాతం పోలింగ్ జరిగింది. ఎన్నికల కమిషన్ జిల్లాలో 85 శాతంకు పైగా పోలింగ్ జరుగుతుందని భావించినప్పటికీ ఆ దిశగా పోలింగ్ నమోదు కాలేదు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో జిల్లాలో ఆరు లక్షలకు పైగా ఓటర్లు నిర్లిప్తత ప్రదర్శించడాన్ని ప్రజాస్వామ్యవాదులు తప్పు పడుతున్నారు. ఓటు హక్కు నమోదులో ప్రదర్శించిన ఉత్సాహం ఓటేయడంలో ప్రదర్శించలేదు. జిల్లాలో ఇతరుల ఓట్లు (హిజ్రాలు) 356 కాగా, వీరిలోనూ కేవలం 18 మందే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు ప్రదర్శించిన చైతన్యం పట్టణవాసులు ప్రదర్శించలేకపోయారు. అత్యధికంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 90,820 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేదు. అత్యల్పంగా తాడికొండలో 19,917 మంది ఓటర్లు పోలింగ్కు దూరంగా ఉన్నారు. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 3,32,359 మంది ఓటర్లు ఓటు హక్కు సద్వినియోగపరుచుకోలేకపోయారు. నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 2,37,628 మంది ఓటర్లు ఓటు హక్కుకు దూరంగా ఉన్నారు. ఇక బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90,227 మంది ఓటు వేయలేదు. జిల్లాలో ఎక్కడా రీ పోలింగ్కు అవకాశం లేకపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. గుంటూరులో 1,62,972 మంది బద్ధకస్తులు గుంటూరు నగరంలో 4,86,087 మంది ఓటర్లుండగా, వీరిలో ఓటు హక్కు వినియోగించుకోని వారి సంఖ్య 1,62,972. జిల్లా కేంద్రం గుంటూరులోని రెండు నియోజకవర్గాల్లో ఇంతమంది ఓటు హక్కు వినియోగించుకోకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. నియోజకవర్గాల వారీగా ఓటు హక్కు వినియోగించుకోని వారి సంఖ్య.. నియోజకవర్గం సంఖ్య తాడికొండ 19,917 మంగళగిరి 34,456 పొన్నూరు 32,176 తెనాలి 49,416 ప్రత్తిపాడు 33,422 గుంటూరు పశ్చిమం 90,820 గుంటూరు తూర్పు 72,152 పెదకూరపాడు 28,230 చిలకలూరిపేట 28,252 నరసరావుపేట 32,011 సత్తెనపల్లి 32,322 వినుకొండ 32,286 గురజాల 44,873 మాచర్ల 45,631 వేమూరు 26,585 రేపల్లె 34,136 బాపట్ల 29,506 మొత్తం 6,60,214