breaking news
NMDC Chairman
-
ఎన్ఎండీసీ చైర్మన్గా శ్రీధర్ నియామకం
సాక్షి, హైదరాబాద్: సింగరేణి సీఎండీ నడిమెట్ల శ్రీధర్కు మరో గౌవరం దక్కింది. నేషనల్ మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NMDC) చైర్మన్గా శ్రీధర్ నియామకమయ్యారు. వివరాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలెక్షన్ బోర్డు ఎన్ఎండీసీ చైర్మన్గా శ్రీధర్ను నియమించాలని సిఫారసు చేసింది. దీంతో కేంద్రం శ్రీధర్ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, శ్రీధర్ ప్రస్తుతం సింగరేణి సీఎండీగా కొనసాగుతున్నారు. శ్రీధర్ 1997 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. తెలంగాణ ఏర్పాట తర్వాత నుంచి 2015 జనవరి ఒకటి నుంచి ఇప్పటి వరకు సింగరేణి కంపెనీ కాలరీస్ లిమిటెడ్ సీఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. ఇది కూడా చదవండి: నాగ్పూర్ టూ విజయవాడ: ఎకనమిక్ కారిడార్కు లైన్క్లియర్ -
ఎన్ఎండీసీ- రెప్కో హోమ్.. జూమ్
వరుసగా ఐదో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 295 పాయింట్లు జంప్చేసి 39,08కు చేరగా.. నిఫ్టీ 76 పాయింట్లు ఎగసి 11,635 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా పీఎస్యూ దిగ్గజం ఎన్ఎండీసీ లిమిటెడ్, మార్టిగేజ్ సంస్థ రెప్కో హోమ్ ఫైనాన్స్ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. ఎన్ఎండీసీ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో కోవిడ్-19 నేపథ్యంలో ఎన్ఎండీసీ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ1(ఏప్రిల్-జూన్)లో నికర లాభం 55 శాతం క్షీణించి రూ. 533 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 3264 కోట్ల నుంచి రూ. 1938 కోట్లకు పడిపోయింది. అయితే లాక్డవున్ల కాలంలోనూ అంచనాలకు అనుగుణమైన పనితీరు చూపినట్లు ఎన్ఎండీసీ చైర్మన్ సుమీత్ దేవ్ పేర్కొన్నారు. ఇకపై మెరుగైన పనితీరును ప్రదర్శించగలమని అంచనా వేశారు. ఈ నెల మొదట్లో కంపెనీ ముడిఇనుము ధరలను టన్నుకి రూ. 300 చొప్పున పెంచింది. దీంతో టన్ను ధర రూ. 2,950కు చేరింది. కాగా.. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎన్ఎండీసీ షేరు 12.5 శాతం దూసుకెళ్లి రూ. 109 వద్ద ట్రేడవుతోంది. రెప్కో హోమ్ ఫైనాన్స్ రెప్కో హోమ్ ఫైనాన్స్ కంపెనీలో వాటాను ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ 4.86 శాతం నుంచి 6.14 శాతానికి పెంచుకున్నట్లు తాజాగా వెల్లడైంది. జూన్ చివరికల్లా రెప్కో హోమ్ ఫైనాన్స్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, డీఎస్పీ, హెచ్డీఎఫ్సీ స్మాల్క్యాప్ ఫండ్స్ వరుసగా 2.36 శాతం, 4.44 శాతం, 5.97 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెప్కో హోమ్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకి రూ. 186.5 వద్ద ఫ్రీజయ్యింది. గత 10 ట్రేడింగ్ సెషన్లలోనే ఈ షేరు 35 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! -
ఎన్ఎండీసీ సీఎండీగా నరేంద్ర కొఠారి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ ఎన్ఎండీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్గా నరేంద్ర కొఠారి సోమవారం బాధ్యతలు స్వీకరిం చారు. సెయిల్లో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉన్న కొఠారి ఈ పదవి చేపట్టకుముందు సెయిల్కి చెందిన ఇస్కో స్టీల్ ప్లాంట్ సీఈవోగా అక్టోబర్, 2012 వరకు బాధ్యతలు నిర్వహించారు. ఉక్కు, బొగ్గు దిగుమతి రంగాల్లో మంచి అనుభవం ఉన్న కొఠారి సీఎండీగా ఏప్రిల్, 21న పదవీ బాధ్యతలు స్వీకరించినట్లు ఎన్ఎండీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. కొఠారి నాయకత్వంలో ఎన్ఎండీసీ మరింత ఉన్నత శిఖరాలకు ఎదుగుతుందన్న ఆశాభావాన్ని ఉద్యోగులు వ్యక్తం చేశారు.