-
9వ నిజాంగా మహ్మద్ అజ్మత్ అలీఖాన్
సాక్షి, హైదరాబాద్: నిజాం 9వ వారసుడి పట్టాభిషేకం శుక్రవారం రాత్రి చౌమహల్లా ప్యాలెస్లో సాదాసీదాగా జరిగింది. ఇటీవల 8వ నిజాం ముకరంజా బహదూర్ కన్నుమూయడంతో ఆయన పెద్ద కుమారుడు మహ్మద్ అజ్మత్ అలీఖాన్ అజ్మత్ జాను 9వ నిజాంగా ప్రకటించారు. నిజాం సంస్థానానికి సంబంధించిన వ్యవహారాలను కట్టబెడుతూ నిజాం కుటుంబ సభ్యులు, ట్రస్టీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగా చౌమహల్లా ప్యాలెస్లో ఈ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఇక నుంచి అజ్మత్ అలీఖాన్ నిజాం ఆస్తులు, ఇతరత్రా వ్యవహారాలు పర్యవేక్షించనున్నారు. -
ఉట్టిపడే ‘రాజసం’..
అందమైన భాగ్యనగరం మనది. ఘన చరిత్రకు సాక్ష్యం...అద్భుతమైన వారసత్వ సంపదకు నిలయం ఈ నగరం. 400 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన హైదరాబాద్లో ఎన్నో అద్భుతమైన కట్టడాలు, ప్రాంతాలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. గత చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. చార్మినార్..గోల్కొండ.. అసెంబ్లీ భవనం.. చౌమహల్లా ప్యాలెస్, మక్కా మసీదు, సాలార్జంగ్ మ్యూజియం, సర్దార్ మహల్, మహబూబ్ మాన్షన్, కింగ్ కోఠి ప్యాలెస్.. ఇలా ఎన్నో అద్భుత నిర్మాణాలు వారసత్వ కట్టడాలుగా ఖ్యాతి పొందాయి. కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరాన్ని ‘హెరిటేజ్ ఇండియా ఫెస్టివల్’గా ప్రకటించిన నేపథ్యంలో మన అసెంబ్లీ భవనం ప్రత్యేకతలపై ‘సాక్షి’ కథనం.. సాక్షి, హైదరాబాద్: మన శాసనసభ నిర్మాణానికి పునాదిరాయి పడి ఎన్నేళ్లయిందో తెలుసా? రేపటితో అక్షరాలా 116 సంవత్సరాలు. ఇది నిర్మించి ఒక శతాబ్దంపైనే పూర్తయ్యింది. అయినా ఈ భవనం చెక్కు చెదరలేదు. ఉట్టిపడే రాజసానికి ప్రతీక ఇది. అప్పటి ఉమ్మడి రాష్ట్రం, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర చరిత్రను మలుపుతిప్పిన అనేక కీలకఘట్టాలు ఈ శాసనసభా ప్రాంగణంలోనే చోటుచేసుకున్నాయి. అద్భుతమైన నిర్మాణ శైలితో కట్టించిన ఈ భవనం హైదరాబాద్ నగరంలోనే ఒక అపురూప కట్టడం. అసెంబ్లీ భవన నిర్మాణానికి 1905 జనవరి 25న అంకురార్పణ జరిగింది. ప్రజా సమస్యలకు వేదికగా అప్పటి ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ పచ్చని ఉద్యానవనంలో ఈ భవనం నిర్మాణానికి శ్రీకారం చు ట్టారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఎంతో మంది ప్రజాప్రతినిధులు ఈ వేదిక నుంచే తమ వాణిని వినిపిస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభు త్వం 2021ని చారిత్రక కట్టడాల పరిరక్షణ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ‘హైదరాబాద్ హెరిటేజ్’ను పురస్కరించుకుని అసెంబ్లీ భవనంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం నిజాం నవాబు ప్రసంగించిన వేళ.. అది 1904వ సంవత్సరం.. ఓ రోజు నగరం అంతా సందడిగా ఉంది. ఢిల్లీలో జరిగిన సంస్థానాధీశుల దర్బార్ సమావేశాలకు వెళ్లిన మ హబూబ్ అలీఖాన్ ఆ రోజు సాయంత్రం నగ రానికి చేరుకోనున్నారు. ఆయన రాకకోసం జనం ఎదురుచూస్తున్నారు. సరిగా అయిదున్నర గంటల సమయంలో పబ్లిక్ గార్డెన్లోని సభాస్థలికి చేరుకున్నారు. మహబూబ్కు సాదర స్వాగతం లభించింది. ఆయన ప్రసంగించిన వేదిక చిరకాలం గుర్తుండిపోయేలా ఒక అందమైన భవనం కట్టించాలని తీర్మానించారు. అలా టౌన్హాల్ నిర్మాణానికి బీజం పడింది. హైదరాబాద్ సంస్థాన ప్రజలు చందాలు పోగుచేసి ఆ భవనాన్ని కట్టించారు. భవన శంకుస్థాపన ఇలా.. అప్పటికే ఎన్నో భవనాలు ఉన్నాయి. కానీ మంత్రులు, ఉన్నతాధికారులు, నగర ప్రముఖులు, సాధారణ ప్రజలనుద్దేశించి మాట్లాడేందుకు ఒక వేదిక లేదు. దీంతో 1905లో మహబూబ్ అలీఖాన్ 40వ పుట్టిన రోజు (హిజ్రీ క్యాలెండర్ ప్రకారం జనవరి 25) సందర్భంగా ఆయనకు నగరవాసుల బహుమానంగా అందమైన భవన నిర్మాణం చేపట్టారు. సమాజంలోని ఉన్నత వర్గాలే కాకుండా సాధారణ ప్రజలు సైతం తమవంతుగా విరాళాలు సమర్పించారు. ఈ కట్టడం కోసం అన్ని వర్గాల ప్రజలు పరిశ్రమించారు. అద్భుతమైన నిర్మాణ శైలి.. ఈ భవనం అందమైన గోపురాలు, ఆకాశాన్ని తాకే శిఖరాలు, మరెంతో అందంగా తీర్చిదిద్దిన డోమ్లతో ఆకట్టుకుంటుంది. భవనం గోడలపై మంత్రముగ్ధులను చేసే డిజైన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇప్పటికీ దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులను, పర్యాటకులను ఆకట్టుకుంటూనే ఉంది. ఇరానీ, మొగలాయి, రాజస్థానీ వాస్తు నిర్మాణ శైలులతో దీన్ని కట్టించారు. టౌన్ హాల్ నిర్మా ణం కోసం రాజస్థాన్లోని మఖ్రా నా నుంచి రాళ్లను తెప్పించారు. రెండంతస్తులతో ని ర్మించిన టౌన్హాల్ చు ట్టూ 20 గదులు ఉంటా యి. గోపురాల కోసం డంగు సున్నం, బంకమట్టి వినియోగించారు.గోపురాలు, కమాన్లు మొగలాయి వాస్తు శైలిని సంతరించుకుంటే గోడలపై రూపొందించిన కళాత్మక దృశ్యాలు, లతలు, వివిధ రకాల డిజైన్లు ఇరాన్, రాజస్థానీ శైలులతో రూపుదిద్దుకున్నాయి. అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు తట్టుకొనేలా దీనిని కట్టించారు. చక్కటి గాలి, వెలుతురు వస్తాయి. చలికాలంలో వెచ్చగా, వేసవిలో చల్లగా ఉంటుంది. పచ్చిక బయళ్లతో పరిసరాలు ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటాయి. అప్పట్లో రూ.20 లక్షల వ్యయంతో దీనిని నిర్మించారు. 1913లో నిర్మాణం పూర్తయ్యింది. మహబూబ్ అలీఖాన్ 1911లోనే చనిపోవడంతో ఆయన తనయుడు ఏడో నిజాం మీర్ఉస్మాన్ అలీఖాన్ భవన నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఈ శ్వేతసౌధానికి మహబూబ్ జ్ఞాపకార్థం మొదట మహబూబియా టౌన్ హాల్గా నామకరణం చేశారు. అదే రాష్ట్ర శాసనసభగా మారింది. అసెంబ్లీ భవనం ఫొటోతో పోస్టల్ స్టాంప్ 1913లో భవనం నిర్మాణం పూర్తి అయి ప్రజలకు అందుబాటులో రావడంతో ఈ భవనం ఫొటోతో ఏడో నిజాం సంస్థాన ప్రజల అందరికీ తెలిసేలా దీని ఫొటోతో పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. దీని విలువ అప్పటి రోజుల్లో ఒక అణాగా ఉండేది. -
ఆజాద్ హైదరాబాద్
చరిత్రను మలుపు తిప్పిన వేళ అది. నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన సమయం అది. అప్పటి వరకు ఏకఛత్రాధిపత్యంగా కొనసాగిన నిజాం రాచరిక పాలన శాశ్వత నిద్రలోకి జారుకున్న సందర్భం అది. రజాకార్ల అకృత్యాలతో,అరాచకాలతో ఎన్నో కష్టాలను, బాధలను అనుభవించిన ప్రజలు ఆ రోజు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. హైదరాబాద్ ఆనందంతో ఉప్పొంగింది. అడుగడుగునా త్రివర్ణ పతాకలు రెపరెలాడాయి. బొల్లారం నుంచి హైదరాబాద్ వైపు సాగిన భారత సైనిక బలగాలకు నగర ప్రజలు జయజయధ్వానాలు పలికారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ఆ రోజు జనసంద్రమైంది. అప్పట్లో మూసీనది 1911 నుంచి 1948 వరకు 37 సంవత్సరాల పాటు హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ సెప్టెంబర్ 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు తన ఓటమిని అంగీకరిస్తూ భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. ‘ఆపరేషన్ పోలో’ విజయవంతమైంది.ఇదంతా నాణేనికి ఒకవైపు అయితే మరోవైపు హైదరాబాద్ మహానగర అభివృద్ధికి సైతం ఆ మూడున్నర దశాబ్దాల నిజాం పరిపాలనే పునాదులు వేసింది. ఆధునిక హైదరాబాద్ నిర్మాణానికి బాటలు పరిచింది. విద్య, వైద్యం, ప్రజారోగ్యం, తాగునీరు, పారిశుధ్యం, ప్రజా రవాణా వంటి అనేక రంగాల్లో నిజాం నవాబు సరికొత్త శకానికి నాంది పలికారు. రైళ్లు,రోడ్డు రవాణా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. పరిశ్రమలు వెలిశాయి. ఆ పునాదులపైన మహానగరం విస్తరించుకుంది. అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది.‘ సెప్టెంబర్ 17’పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది. మీర్ ఆలం చెరువు హైదరాబాద్ సంస్థానంపై భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య సెప్టెంబర్ 13వ తేదీ సోమవారం తెల్లవారుజామున ప్రారంభమైంది. లెఫ్టినెంట్ జనరల్ మేజర్ రాజేంద్రసింగ్ నేతత్వంలో మేజర్ జనరల్ జేఏ చౌదరి దీనికి సారధ్యం వహించారు. భారత సైన్యం నలు వైపుల నుంచి హైదరాబాద్ భూభాగంలోకి చొచ్చుకొచ్చింది.షోలాపూర్ నుంచి బయలుదేరిన సైన్యం నల్దుర్గ్ కోటను స్వాధీనం చేసుకొని తల్ముడి, తుల్జాపూర్ మీదుగా హైదరాబాద్ వైపు వచ్చింది. మేజర్ జనరల్ డీఎస్ బ్రార్ ముంబై నుంచి, ఆపరేషన్న్ కమాండర్ మేజర్ జనరల్ ఏఏ రుద్ర విజయవాడ వైపు నుంచి బ్రిగేడియర్ శివదత్త బేరార్ నుంచి బయలుదేరారు. అన్ని వైపుల నుంచి భారత సైన్యం హైదరాబాద్ను ముట్టడించింది. లోయర్ ట్యాంక్ బండ్ భారత వైమానిక ఎయిర్ మార్షల్ ముఖర్జీ సైతం తన సేవలను అందజేసేందుకు సన్నద్ధమయ్యారు. దీంతో నిజాం మనుగడ ప్రశ్నార్ధకమైంది.1948 సెప్టెంబర్ 14వ తేదీన దౌలతాబాద్, జల్నా, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, నిర్మల్, సూర్యాపేట్, వరంగల్, ఖమ్మం ప్రాంతాలను సైన్యం తన స్వాధీనంలోకి తీసుకుంది. లాతూర్, జహీరాబాద్ ప్రాంతాలలో నిజాం సైనికులపై భారత సేనలు బాంబుల వర్షం కురిపించాయి. సెప్టెంబర్ 16వ తేదీన రాంసింగ్ నేతత్వంలోని సైనికులు జహీరాబాద్ను ఆక్రమించుకున్నారు. షోలాపూర్ నుంచి హైదరాబాద్ వరకు యూనియన్న్ సైనికులపాదాక్రాంతమైంది. నిజాం సైనికులు బీబీనగర్, పటాన్చెరు, గచ్చిబౌలి, లింగంపల్లి, మల్కాపూర్, తదితర ప్రాంతాల్లో మందుపాతర్లు పేల్చి సైన్యాన్ని అడ్డుకొనేందుకు విఫలయత్నం చేశారు. సైన్యం మరింత ముందుకు చొచ్చుకొని వచ్చింది. నిజాం సైన్యాధికారి ఎల్ ఇద్రూస్ చేతులెత్తేశారు. గత్యంతరం లేక ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. సెప్టెంబర్ 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు భారత సైనికులు హైదరాబాద్లోకి ప్రవేశించారు. కాసీం రజ్వీ, ఆజాం జా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్... నిజామ్ ప్రభువుల కాలంలో ఉన్నత వర్గాల వారి కోసం, నవాబులు, జాగీర్దార్లు, బ్రిటీష్ అధికారుల పిల్లల చదువుకోసం 1923లో ‘జాగీర్దార్ స్కూల్’ పేరుతో ప్రస్తుత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఏర్పాటైంది. లండ¯Œన్ లోని ఎల్టన్ కళాశాల భవనం తరహాలో దీన్ని నిర్మించారు. అద్భుతమైన డిజైన్లతో పూర్తిగా డెక్కన్ తరహా నిర్మాణ శైలితో పాఠశాల భవనాలను నిర్మించారు. బ్రిటీష్ విద్యావేత్త షాక్రాస్ మొదటి ప్రిన్సిపల్గా 1924లో 5 గురు విద్యార్థులు, ఆరుగురు అధ్యాపకులతో పాఠశాల మొదటి బ్యాచ్ ప్రారంభమైంది.1950లో ప్రభుత్వం జమీందారి వ్యవస్థను రద్దు చేయడంతో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉనికిలోకి వచ్చింది. మొదట్లో బాలురకు మాత్రమే పరిమితమైన పాఠశాలలో 1988 అమ్మాయిలకు ప్రవేశం కల్పించారు. పికెట్ట్యాంక్( నాడు) జూబ్లిబస్టాండ్ (నేడు) సిటీ కళాశాల.. ఆకుపచ్చ వనంలో వెలసిన రాజభవనంలా ఉంటుందా అరుణసౌధం. మూడంతలస్తుల భవనం.అరవై నాలుగు గదులు, విశాలమైన ఆవరణ.దారులకు ఇరువైపులా నిలువెత్తు వృక్షరాజాలు.. ఇదీ హైదరాబాద్ సిటీ కాలేజ్ అద్భుత దృశ్యం. అనేక సంవత్సరాలుగా, అనేక తరాలుగా విద్యనందజేస్తోంది. 1865లోనే మొట్టమొదటి ‘దారుల్ –ఉల్–ఉలుమ్’పాఠశాలగా ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ హయాంలో ప్రారంభమై 7వ నిజాం ఉస్మాన్ అలీఖాన్ హయాంలో 1920 నాటికి గొప్ప కళాశాలగా అభివృద్ధి చెందింది. ఇండో–సార్సెనిక్ శైలిలో మూసి నది తీరాన ముస్లిం జంగ్ బ్రిడ్జ్కు సమీపంలో కట్టించిన సిటీ కళాశాల ఒక రాజమందిరాన్ని తలపిస్తూంటుంది. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ మహబూబియా బాలికల కళాశాల న్యూ జనానా అంటే హైదరాబాద్లో చాలామందికి తెలియకపోవచ్చు. ఒకప్పటి ‘పరదా స్కూల్’ కూడా అంతే. చదువులకు దూరంగా ఉన్న బాలికలను బడిబాట పట్టించేందుకు ప్రారంభమైన పాఠశాలే పరదా స్కూల్. అదే న్యూ జనాన. ఆ తరువాత ఆ స్కూలే మహబూబియా బాలికల పాఠశాలగా, కళాశాలగా అభివృద్ధి చెందింది. ఆబిడ్స్ రోడ్డులో కనిపించే నిలువెత్తు రాతికట్టడం. ఏ రాణివాసమో అనిపించేలా అద్భుతమైన నిర్మాణశైలి. ఆరో నిజాం హయాంలో నిర్మించిన ఈ విద్యా మందిరానికి ఆయన పేరే పెట్టారు. ఆర్ట్స్ కళాశాల ప్రారంభోత్సవం ఉస్మానియా విశ్వవిద్యాలయం దార్–ఉల్–ఉలూం పేరిట 1913లో ఆనాటి విద్యార్థులంతా ఒక సంఘంగా ఏర్పడి నగరంలో విశ్వ విద్యాలయం తక్షణం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం 1917లో ఒక ‘ఫర్మానా’ జారీ చేసింది. మీర్ ఉస్మాన్ఆలీఖాన్ పేరిట 1918లో ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ప్రొఫెసర్ పాట్రిక్ గెడ్డెస్ నేతృతత్వంలో రామంతాపూర్, జమిస్థాన్పూర్, హబ్సిగూడ, అంబర్పేట్, లాలాగూడ గ్రామాల్లో 2400 ఎకరాల భూమిని వర్సిటీ కోసం సేకరించారు. బీదర్, గోల్కొండ, అజంతా, ఎల్లోరా, ఢిల్లీ తదితర ప్రదేశాల్లోని భారతీయ శిల్పకళా సంపదను, సంస్కతులను మేళవించి ఆర్ట్స్ కళాశాల భవనం నమూనాను రూపొందించారు. నయాపూల్ 1934 జులై 24న పునాది పడింది.110 మీటర్ల వెడల్పు, 119 ఎత్తున రెండంతస్తుల్లో 164 విశాలగదులతో ఆర్ట్స్ కళాశాల రూపుదిద్దుకుంది. కాలేజీలోని ప్రధాన హాలు 24/ 24 మీటర్ల పొడవు, వెడల్పుతో, 12 మీటర్ల ఎత్తున సున్నంతో చేసిన ఫిలిగ్రీ పనితనం కనిపిస్తుంది. 1939 డిసెంబర్ 5న మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ విశ్వవిద్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆపరేషన్ పోలో లో భాగంగా.. వారసులంతా విదేశాల్లోనే ఇదీనిజాం..‘ఖాన్’దాన్ కుతుబ్షాహీల తర్వాత హైదరాబాద్ రాజధానిగా పాలించిన అసఫ్జాహీల ఆనవాళ్లు నగరంలో వీధివీధికీ కనిపిస్తాయి. 1724 నుంచి 1948 వరకు హైదరాబాద్ స్టేట్ను మీర్ ఖమ్రుద్దిన్ ఖాన్, నిజాంఅలీ ఖాన్, అక్బర్అలీ ఖాన్, ఫరూకుద్దీన్ అలీఖాన్, తినాయత్ అలీఖాన్, మీర్ మహబూబ్ అలీఖాన్, మీర్ ఉస్మాన్ అలీఖాన్లు పాలించారు. మహబూబ్ లీఖాన్, ఉస్మాన్ అలీఖాన్ల పాలనా సమయంలో నగరం అనేక మైలు రాళ్లను దాటేసింది. 1948 సెప్టెంబర్ 17న భారత ప్రభుత్వం జరిపిన ఆపరేషన్ పోలోతో హైదరాబాద్ సంస్థానం అంతరించి దేశంలో కలిసిపోయింది. అయినా ఉస్మాన్ అలీఖాన్ 1956 వరకు రాజ్ప్రముఖ్గా పదవులు నిర్వహించారు. ఎంజే మార్కెట్కు శంకుస్థాపన ఆస్ట్రేలియాలో ఎనిమిదవ నిజాం : నిజాం వారసులంతా విదేశాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం ముఖర్రం ఝా ఆస్ట్రేలియాలో, ముఫకం జా లండన్లో స్థిరపడ్డారు. అడడపాదడపా హైదరాబాద్ వచ్చి వెళుతున్నారు. వీరిలో ముఖరం జా ఐదు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఎనిమిదవ నిజాంగా ప్రకటించుకున్న ముఖర్రం జా ఆధీనంలోనే ప్రస్తుతం హైదరాబాద్లో అత్యధిక ఆస్తులున్నాయి. ఫలక్నామా, చౌమహల్లా, చిరాన్ ప్యాలెస్లున్నాయి.లండన్ డూన్ స్కూల్, కేంబ్రిడ్జి యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి పట్టాలు అందుకున్న ముకర్రం జా జీవితాన్ని విలాసవంతంగా గడిపేస్తున్నాడు. అక్టోబర్ 6, 1933లో పుట్టిన ముఖరం జా తొలుత టర్కీ యువరాణి ఎస్త్రాబర్గిన్ను(1959–75), అనంతరం ఎయిర్హోస్టెస్ హెలెన్(1980–90).. ఆపై అప్పటి మిస్ టర్కీ మనోలియా ఒనోర్ను(1990–96) పెళ్లిచేసుకుని వివిధ కారణాలు ‘తలాఖ్’ చెప్పేశాడు. ముఖర్రం ఝా , ముఫకం ఝా ప్రస్తుతం మొరాకోకు చెందిన జమీలా, టర్కీకి చెందిన ప్రిన్సెస్ ఒర్చిడ్లను కలిసి ఉంటున్నాడు. మొత్తంగా చూస్తే మొదటి భార్య ద్వారా ఇద్దరు(కూతురు, కొడుకు), రెండో భార్య ద్వారా ఇద్దరు కొడుకులు, మూడవ భార్య కూతురు(నీలోఫర్), నాల్గవ భార్య ద్వారా ఓ కుమార్తెలు ఉన్నారు. వీరంతా టర్కీ, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లలో స్థిరపడ్డారు. ముఫకం జా మీర్ ఉస్మాన్ అలీఖాన్ రెండవ మనవడు. ఇతను ప్రస్తుతం లండన్లో నివాసముంటున్నారు. టర్కీకి చెందిన ఏసెన్ను పెళ్లి చేసుకున్న ముఫకం జా నగరంలో నిజాం మ్యూజియం, సిటీ మ్యూజియాల నిర్వహణను చూస్తున్నారు. నిజాం..ది రిచెస్ట్మ్యాన్ ప్రపంచ ధనవంతుల జాబితాలో ఉస్మాన్ అలీఖాన్ది ప్రముఖమైన పేరు. హైదరాబాద్ చుట్టూరా ఉన్న 23వేల ఎకరాల(సర్ఫెఖాస్) భూములతో పాటు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, ఊటీ, కోల్కతా,మహేబలేశ్వరం, తదితర ప్రాంతాల్లో ఉన్న 630 భవనాలు, భూములను ప్రైవేటు ఆస్తులుగా గుర్తిస్తూ అప్పటి భారత ప్రభుత్వ కార్యదర్శి సీఎస్ వెంకటాచారి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు ఒక్క హైదరాబాద్ నగరంలోనే చౌమహల్లా, ఫలక్నామ, చిరాన్, నజ్రీబాగ్, పరేడ్విల్లా, ఫెర్న్విల్లా, హిల్ఫోర్ట్, మౌంట్ప్లజెంట్ తదితర ప్యాలెస్లతో పాటు విలువైన వజ్ర ,వైఢూర్యాలు నిజాం ఫ్యామిలీ సొంతమైయ్యాయి. అయితే ఈస్తుల పరిరక్షణకు ట్రస్ట్లు ఏర్పాటు చేసి, అందులో ప్రభుత్వ ప్రతినిధులు సైతం సభ్యులుగా చేర్చింది. దీంతో ‘ది నిజామ్స్ ట్రస్ట్ డీడ్స్(వాలిడేషన్) యాక్ట్ 1950’. మేరకు 28 రకాల ట్రస్ట్లు ఏర్పడ్డాయి. ఈ ట్రస్టులకు భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యదర్శి ఛైర్మన్గా, సభ్యులుగా నిజాం కుటుంబసభ్యులతో పాటు మాజీ సివిల్ సర్వీసు అధికారులు వ్యవహరిస్తున్నారు. 1947 ఆగస్టు15 దేశమంతా స్వతంత్ర జెండాలెగిరితే..హైదరాబాద్లో మాత్రం నిజాం రాజుకు వ్యతిరేకంగా నిలబడ్డ యోధుల తలలు తెగాయి. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ యూనియన్లో కలపకుండా స్వతంత్ర రాజ్యంగా ఉండాలన్న లక్ష్యంతో పావులు కదిపిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏడాది కాలం పాటు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో వెల్లువెత్తిన సాయుధ రైతాంగ గెరిల్లాలను, మరో వైపు సత్యాగ్రహంతో రోడ్డెక్కిన కాంగ్రెస్ సమూహాల్ని ఏడాది పాటు నిలువరించగలిగాడు. చివరకు భారత సైన్యం హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకునేందుకు మూడువైపులా చుట్టుముట్టిన సమయంలో నిస్సహాయంగా మిగిలిన నిజాం అప్పటి హోంమంత్రి పటేల్ ముందు మోకరిల్లటంతో..ఆజాద్ హైదరాబాద్ అవతరించింది..లొంగుబాటు అనంతరం హైదరా బాద్ సంస్థానధీశులు ఎవరెక్కడ ఉన్నారు.. వారేం చేస్తున్నారు..వివరాలివీ నిజాముల పరివారం చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కుమారులు : ఆజంజా, మౌజం జా, కూతురు మహ్మద్ ఉన్నీసా బేగం ఆజంజా జా పరివారం : భార్య, దుర్రేషెవార్(టర్కీ),కుమారులు : ముకర్రం, ముఫకం జా మౌజం జా పరివారం : భార్యలు నీలోఫర్(టర్కీ), రజియాబేగం,అన్వరీబేగం సంతానం : ఫౌతిమా,ఫాజియఅమీనా,ఓలియా,శ్యామత్అలీఖాన్ -
నిజాం వారసుల సందడి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement