breaking news
Nitin Raut
-
లైట్లను ఆర్పేస్తే : గ్రిడ్ కుప్పకూలుతుంది
సాక్షి, ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజా పిలుపుపై స్వపక్షాలనుంచి హర్షంతో పాటు, కాంగ్రెస్ నేత శశిథరూర్ లాంటి విపక్షనేతలనుంచి, విద్యుత్తు ఇంజనీర్లు, నిపుణుల నుంచి కూడా విమర్శలు చెలరేగుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి డాక్టర్ నితిన్ రావత్ ఈ పిలుపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు(ఏప్రిల్ 5, ఆదివారం) రాత్రి 9 గంటలకు 9 నిమిషాలు లైట్లు ఆపివేయాలన్న సూచనపై పునరాలోచన చేయాలని లేదంటే అత్యసర సేవలకు విఘాతం ఏర్పడే అవకాశం వుందని ప్రజలను కోరారు. ఒకేసారి అన్ని లైట్లను స్విచ్ ఆఫ్ చేసే ముందు మనం పునరాలోచించాలనీ, ఇది గ్రిడ్ వైఫల్యానికి దారితీస్తుందని పేర్కొన్నారు. గ్రిడ్ వైఫల్యం చెందితే అత్యవసర సేవలను ప్రభావితం చేస్తుందని చెప్పారు. లాక్ డౌన్ కారణంగా, ఫ్యాక్టరీ యూనిట్లు లేనందున డిమాండ్ ఇప్పటికే 23,000 మెగావాట్ల నుండి 13,000 మెగావాట్లకు తగ్గింది... ఇక ప్రజలందరూ ఒకేసారి లైట్లను ఆపివేస్తే సరఫరాలో భారీ వ్యత్యాసంతో (భారీ లోడ్ అకస్మాత్తుగా పడిపోవడం) విద్యుత్తు గ్రిడ్ కుప్పకూలిపోవచ్చని రావత్ చెప్పారు. అంతేకాదు తిరిగిసేవలను పునరుద్ధరించడానికి 12-16 గంటలు పడుతుందన్నారు. ప్రస్తుత సంక్షోభంలో విద్యుత్తు చాలా ముఖ్యమైన అవసరమని ఆయన పేర్కొన్నారు. అటు మోదీ పిలుపుపై స్పందించిన మహారాష్ట్ర గృహనిర్మాణ మంత్రి జితేంద్ర ఇదొక మూర్ఖత్వపు సూచన, పిల్లతనం తప్ప మరొకటి కాదని అవద్ విమర్శలు గుప్పించారు. శశిథరూర్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రధానికి భవిష్యత్తుపైనగానీ, లాక్ డౌన్ తరువాత పరిస్థితులను ఎలా అంచనా వేయాలో తెలియదని, ఈ విషయంలో మోదీకి ఒక ‘విజన్’ అంటూ లేదని ఆయన ట్వీట్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రీ కూడా ఇలాగే స్పందించారు. దేశానికి జీడీపీలో 8 నుంచి 10 శాతం విలువైన ఆర్ధిక ప్యాకేజీని ముందు ప్రకటించాలని ట్వీట్ చేసిన ఆయన లాక్ డౌన్ సందర్భంగా ఉపాధిలేక తస్వస్థలాల బాట పట్టిన వేలాది కార్మికులకు, శ్రామిక జీవులకు వెంటనే వేతనాలు మంజూరు చేయాలని హితవు చెప్పారు. ఫేక్ న్యూస్ ని అణచివేత పేరుతో నిజమైన మాద్యమాలను నోరు నొక్కొద్దంటూ మహువా తీవ్రంగా హెచ్చరించారు.మరోవైపు ఇదే విషయంలో తెలంగాణా విద్యుతు ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పారిశ్రామిక డిమాండ్ భారీగా పడిపోయిన నేపథ్యంలో ఆకస్మికంగా అందరూ స్విచ్-ఆఫ్ చేస్తే గ్రిడ్ కూలిపోయే ప్రమాదముందని హెచ్చరించారు. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రులకు అవసరమైన విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా కరోనావైరస్ మహమ్మారితో దేశంలో అలుముకున్న చీకటితో పోరాడటానికి కొవ్వొత్తులు, మట్టి దీపాలు, లేదంటే కనీసం మొబైల్ టార్చి లైట్లను వెలిగించాలని, సామూహిక శక్తిని నిలపాలంటూ దేశ ప్రజలకు ఇచ్చిన ఒకవీడియో సందేశంలో ప్రధాని మోదీ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. (చదవండి : కరోనా సంక్షోభం: స్నాప్డీల్ డెలివరీ హామీ) -
ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారం
నాగపూర్: అన్ని విధాలా వెనుకబడ్డ విదర్భ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక రాష్ట్రం తప్ప ప్రత్యామ్నాయం లేదని రాష్ట్ర ఉపాధి హామీ పథకం, నీటి సంరక్షణ శాఖ మంత్రి నితిన్ రావుత్ మంగళవారం స్పష్టీకరించారు. విదర్భ డిమాండ్కు రావుత్ బహిరంగంగా మద్దతు తెలపడం ఇదే తొలిసారి. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వ మంత్రి ఒకరు విదర్భకు మద్దతు తెలపడం కూడా ఇదే మొదటిసారి కావడం విశేషం. ‘గత వారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాగపూర్లో మెట్రోరైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పుడు ఉద్దేశపూర్వకంగానే విదర్భ అంశాన్ని పక్కన బెట్టడం నిరాశకు గురిచేసింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు గురించి ఆయన ప్రకటన చేస్తారని నేను భావించాను’ అని నాగపూర్ ఇన్చార్జి మంత్రి కూడా అయిన రావుత్ అన్నారు. ప్రత్యేక విదర్భకు అనుకూలమని పేర్కొంటూ భువనేశ్వర్లో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో బీజేపీ తీర్మానం చేసిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇటీవలి లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా బీజేపీ నాయకులు ప్రత్యేక రాష్ట్రం గురించి హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చాక ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు. విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా చేయడంతోపాటు ఎనిమిది కొత్త జిల్లాలను కూడా ఏర్పాటు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. పుసాద్, అచల్పూర్, చిమూర్, అష్టి, బ్రహ్మపురి, అమేరీ, ఖామ్గావ్, కటోల్ ప్రాంతాలను జిల్లాలుగా మార్చాలని డిమాండ్లు ఉన్నాయి. అయితే నాగపూర్లో భారీ ఎత్తున గొలుసు దొంగతనాలు జరుగుతుండడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు అన్నిచర్యలూ తీసుకుంటామని నితిన్ రావుత్ హామీ ఇచ్చారు. -
చవాన్ డుమ్మా కరెక్టే: నితిన్ రౌత్
నాగపూర్: ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమానికి తమ ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ గైర్హాజరు కావడాన్ని మహారాష్ట్ర ఉపాధి కల్పన శాఖ మంత్రి నితిన్ రౌత్ సమర్థించారు. సోలాపూర్ లో మోడీ సభలో పరాభవం ఎదువడంతో చవాన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ముఖ్యమంత్రులను అవమానించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్దమని అన్నారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా నాగపూర్ జిల్లాలో గురువారం నిర్వహించిన రెండు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ గైర్హాజరయ్యారు. హర్యానా, జార్ఖండ్ ముఖ్యమంత్రులు భూపిందర్సింగ్ హూడా, హేమంత్ సోరెన్కు కూడా మోడీ మద్దతుదారుల నుంచి అవమానం ఎదురైంది.