breaking news
newly wedded girl
-
తొలిరేయి నుంచే ఆమెకు నరకం
క్రైమ్: పెద్దల తొందరపాటు నిర్ణయంతో ఓ నవ వధువు(22) నరకం చవిచూసింది. ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఆమెకు.. వరుసగా ఒక్కో షాక్ తగులుకుంటూ వచ్చింది. చిన్నప్పటి నుంచి తెలిసివాడని, మంచోడని భావించిన భర్త.. మొదటి రాత్రి నుంచే ఆమెపై శాడిజం ప్రదర్శిస్తూ వచ్చాడు. పైగా పరాయి పురుషులకు పడక సుఖం పంచాలంటూ ఆమెపై ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలో మాట వినని ఆమెకు దారుణాతి దారుణంగా హింసించాడు. రాజస్థాన్ బికనీర్ ఫైవ్ స్టార్ హోటల్లో జరిగిన నవ వధువు వేధింపుల వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఓ ఫైవ్స్టార్ హోటల్లో మేనేజర్గా పని చేసే వ్యక్తి.. తన భార్యను అత్యంత పైశాచికంగా హింసించిన ఉదంతం విస్మయానికి గురి చేస్తోంది. శారీకంగా, మానసికంగా దెబ్బ తిన్న ఆమె అనారోగ్యం నుంచి కోలుకోవడానికి నెలల సమయమే పట్టింది. చివరకు పోలీసులను ఆశ్రయించడంతో ఆ భర్త కిరాతకాలు వెలుగులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్ భోపాల్ ఖోహేఫిజా ప్రాంతంలో ఇరు కుటుంబాలు పక్కపక్కనే ఉంటాయి. చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నవాళ్లు కావడంతో పెద్దలు, వాళ్ల పిల్లలకు ఈ ఏడాది జూన్లో వివాహం చేశారు. అయితే నవ వధువును తీసుకుని రాజస్థాన్ బికనీర్లో ఉన్న తమ ఇంటికి కాపురం వెళ్తానని అందరినీ నమ్మించాడు ఆ భర్త. తీరా అక్కడికి వెళ్లాక తాను పని చేసే ఫైవ్ స్టార్ హోటల్గదిలో ఆమెను బంధించాడు. తొలి రాత్రి నుంచే తన శాడిజంతో ఆమెకు చుక్కలు చూపించాడు. తమకు అసలు సొంతిల్లే లేదని.. ఇక్కడే ఉండాలంటూ ఆమెను బలవంతం చేశాడు. ఆపై ఆమె ఫోన్ లాక్కుని.. ఎవరితో కాంటాక్ట్ లేకుండా చేశాడు. చివరకు.. వైఫ్ స్వాపింగ్ గేమ్(ఒకరి భార్యతో మరొకరు శృంగారంలో పాల్గొనే క్రీడ)లో పాల్గొనాలని బాధితురాలిపై ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలో ఆమె మాట వినకపోవడంతో దారుణంగా హింసించాడు. ఆపై ఆమె కుటుంబ సభ్యుల్ని రూ. 50 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే ఆమె తల్లిదండ్రుల నుంచి సరైన స్పందన రాలేదు. ఈలోపు పదిహేను రోజుల పాటు హోటల్ గదిలోనే బంధించి.. ఆమె ముందు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. భార్యను మంచానికి కట్టేసి డ్రగ్స్ సేవించి.. ఆమె ఎదురుగానే అమ్మాయిలతో పాటు మగవాళ్లతోనూ శృంగారంలో పాల్గొన్నాడు. అంతటితో ఆగకుండా ఆమెతో అసహజ శృంగారంలో పాల్గొని నరకం చూపించాడు. ఈ తరుణంలో ఆమె ఆత్మహత్యయత్నం చేయగా.. హోటల్ నుంచి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ అదనపు కట్నం కోసం అత్తమామ, భర్త కలిసి ఆమెను వేధించడం మొదలుపెట్టారు. ఎలాగోలా పుట్టింటికి ఫోన్ చేసి సమాచారం అందించిన ఆమె.. మేనమామ సాయంతో ఆ నరకం నుంచి బయటపడింది. ఈలోపు ఆరోగ్యం క్షీణించడంతో ఆమెకు ఇన్నాళ్లపాటు చికిత్స అందించారు. చివరకు స్వస్థలం చేరుకుని భోపాల్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకున్నారు పోలీసులు. అయితే ఇంతవరకు నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంతో.. బాధిత కుటుంబం ఆందోళనకు సిద్ధమైంది. ఇదీ చదవండి: యువతుల కోసం అపార్ట్మెంట్కు సాఫ్ట్వేర్ ఉద్యోగి.. షాకింగ్ ట్విస్ట్ -
పాపం నవ వధువు.. పెళ్లైన నెలలోపే..
సాక్షి, గంగవరం: పెళ్లయిన నెలలోపే నవ వధువును డెంగీ మహమ్మారి కబళించింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కూర్నిపల్లిలో ఆదివారం ఈ ఘటన వెలుగు చూసింది. హరీష్కు కర్ణాటకలోని కోగిలేరుకు చెందిన గీత(21)తో గత నెల 24న వివాహమైంది. వధూవరులు ఈ నెల 5న కూర్నిపల్లికి వచ్చారు. గీతకు జ్వరం రావడంతో పలమనేరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందింది. కోలుకోవడంతో మూడో మెరివలికి వధువు స్వగ్రామానికి వెళ్లారు. మళ్లీ జ్వరం రావడంతో బెంగళూరు మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి డెంగీగా నిర్ధారించారు. ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో గత శనివారం ఆస్పత్రిలో మృతిచెందింది. (చదవండి: ఇన్ఫోసిస్లో జాబొచ్చింది కానీ అంతలోనే..) -
పరీక్షలు రాసిన పెళ్లికూతురు!
ఓ అమ్మాయికి ఆరోజే పెళ్లయింది. కానీ అదేరోజు పరీక్ష కూడా ఉంది. ఇటు జీవితంలో పరీక్ష, అటు పుస్తకాల పరీక్ష.. దేన్నీ వదులుకోవడం కుదరదు. అందుకే.. పెళ్లి చేసుకుని, ఆ పెళ్లి దుస్తుల్లోనే నేరుగా వచ్చి బీఏ మొదటి సంవత్సరం పరీక్ష రాసేసింది. పరీక్ష అయిపోయిన తర్వాత అప్పుడు అప్పగింతల కార్యక్రమంలో పాల్గొంది. రాజస్థాన్లోని బలేశ్వర్ ప్రాంతానికి చెందిన సంతోష్ ప్రజాపత్కు సోమవారం రాత్రి పెళ్లయింది. అప్పగింతల కార్యక్రమం మంగళవారం జరగాల్సి ఉంది. అయితే.. మంగళవారమే ఆమెకు బీఏ మొదటి సంవత్సరం పరీక్ష కూడా ఉంది. దానికి అందరూ ఏర్పాట్లు చేసుకుంటుండగా.. సంతోష్ మాత్రం తనకు పరీక్ష ఉందని, అందువల్ల అది అయిపోయిన తర్వాత పరీక్ష రాస్తానని పెళ్లివాళ్లను కోరింది. ఎలాగోలా వాళ్లను నానా తంటాలు పడి ఒప్పించి.. చివరకు పెళ్లి దుస్తులతోనే పరీక్ష రాసింది. ఆ పరీక్ష రాయకపోతే.. విద్యాసంవత్సరం మొత్తం వృథా అవుతుందనే తాను వాళ్లను ఒప్పించి పరీక్ష రాసినట్లు చెప్పింది.