breaking news
New Delhi Airport
-
అది.. ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్టు!
దేశ రాజధానిలో గల ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐఏ) 2014 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా ఎంపికైంది. ఏడాదికి 2.5-4 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించిన విభాగంలో ఈ అవార్డు వచ్చింది. ఎయిర్పోర్టు సేవల నాణ్యత అవార్డును ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ సంస్థ ఇటీవల జోర్డాన్లో జరిగిన ఓ కార్యక్రమంలో అందించింది. ఎయిర్పోర్టు భాగస్వాములు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ నిరంతరం శ్రమించి వినియోగదారులకు అత్యుత్తమ అనుభవం అందించేందుకు కృషిచేశారని, అందుకే తమకు ఈ స్థానం దక్కిందని ఢిల్లీ ఎయిర్పోర్టు సీఈవో ఐ. ప్రభాకర రావు చెప్పారు. వినియోగదారులకు సేవల విషయంలో 300 మంది సభ్యుల బృందం 5 పాయింట్లను చూడగా, అందులో ఢిల్లీకి 4.90 స్కోరు వచ్చింది. 2011, 2012, 2013 సంవత్సరాల్లో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ.. తర్వాతి సంవత్సరానికి తన పనితీరు మెరుగుపరుచుకుంది. ఇక్కడినుంచి గడిచిన సంవత్సరంలో దాదాపు 4 కోట్ల మంది ప్రయాణికులు 58 స్వదేశీ, 62 అంతర్జాతీయ గమ్యాలకు వెళ్లారు. సగటున రోజుకు 885 విమానాలు వెళ్లాయి, వాటిలో 6.96 లక్షల టన్నుల కార్గోను తీసుకెళ్లారు. -
50 బంగారు బిస్కెట్లు పట్టివేత.. నిందితుడి అరెస్ట్
న్యూఢిల్లీ: దుబాయ్ నుంచి 50 బంగారు బిస్కెట్లను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుకున్నారు. కేంద్ర పారిశ్రామిక భద్రత సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకుని బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం ఈ సంఘటన జరిగింది. సీఐఎస్ఎఫ్ అధికారులు కేరళకు చెందిన ఆష్రఫ్ను తనిఖీ చేయగా ఈ విషయం వెలుగు చూసింది. నిందితుడిని బంధించి కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. అతడి నుంచి 50 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్టు సీఐఎస్ఎఫ్ ప్రతినిధి చెప్పారు. కస్టమ్స్ అధికారులు నిందితుడిని ప్రశ్నిస్తున్నారు.