breaking news
Nethanna Nestham Scheme
-
‘షాక్’ ఇస్తే సర్వీసులెలా పెరిగాయి?.. ఈనాడు కథనం అవాస్తవం
సాక్షి, అమరావతి: ఏపీ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్)లో గత రెండున్నరేళ్లలో చేనేత విద్యుత్ సర్వి సులు పెరిగాయని సంస్థ సీఎండీ కె. సంతోషరావు తెలిపారు. ‘నేతన్నలకు కరెంట్ షాక్’ అనే శీర్షికతో ఈనాడులో వచ్చిన కథనంపై గురువారం ఆయన స్పందించారు. నేతన్నలకు ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 2021–22 వరకూ 9,912 విద్యుత్ సర్వీసులు వుండగా, 2022–23 నాటికి ఆ సర్వి సుల సంఖ్య 10,125కు పెరిగిందని.. 2023–24 జూలై నాటికి మొత్తం 10,157 సర్వి సులున్నాయన్నారు. అయితే, వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా పవర్ లూమ్స్ విద్యుత్ సర్వి సుల సంఖ్య తగ్గినట్లు ఈనాడు కథనంలో రాయడం అవాస్తవమన్నారు. షాక్ ఇస్తే సర్వి సులు ఎలా పెరిగాయని ఆయన ప్రశ్నించారు. చేనేత కార్మికులకు ఇంధన చార్జీల్లో 50 శాతం రాయితీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని తెలిపారు. అలాగే, చేనేత కార్మికుల గృహాలకు నెలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తున్నామని, నేతన్నల అభ్యర్థన మేరకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) కిలోవాట్ హవర్ (కేడబ్ల్యూహెచ్) బిల్లింగ్ విధానానికి అనుమతించిందని తెలిపారు. ఈ ఉత్తర్వులవల్ల మగ్గాలకు సంబంధించిన సర్వీసుల విద్యుత్ బిల్లు కొంతమేరకు తగ్గినట్లు సీఎండీ వెల్లడించారు. -
సీఎం వైఎస్ జగన్ కు నేతన్నల సంఘీభావం
-
నేతన్నల భారీ బైక్ ర్యాలీ
ధర్మవరం: సీఎం వైఎస్ జగన్ నాలుగో విడత ‘నేతన్న నేస్తం’ నిధులను విడుదల చేయడంపై హర్షం వ్యక్తంచేస్తూ శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో శుక్రవారం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి వేలాది మంది చేనేత కార్మికులు తరలివచ్చారు. పట్టణంలోని కదిరిగేట్ వద్ద ఉన్న నేతన్న విగ్రహానికి పూలమాలలు వేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడుతూ నేతన్న నేస్తం పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 80,546 మంది నేతన్నలకు రూ.193.31 కోట్లను ఖాతాల్లో జమ చేయడం గొప్ప విషయమన్నారు. జిల్లాలో 15,981 మంది కార్మికులకు రూ.38.35 కోట్ల లబ్ధి చేకూరిందని చెప్పారు. చేనేతకు పూర్వ వైభవం జగనన్నతో సాధ్యమవుతోందన్నారు. ఇదీ చదవండి: Andhra Pradesh: ప్లాస్టిక్ బ్యానర్లు బ్యాన్ -
Nethanna Nestham Scheme: నేతన్నలకు భరోసా!
చేనేతలను ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. నేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర సర్కారు పెద్ద పీట వేస్తున్నది. బతుకమ్మ చీరల ఆర్డర్లతో మరమగ్గాల కార్మికులకు బతుకునిస్తూనే, ప్రతి సోమవారం అధికారులంతా నేత దుస్తులు ధరించాలని పిలుపునిచ్చి చేనేతకు చేయూతనిస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా ‘తెలంగాణ వీవర్స్ థ్రిప్ట్ ఫండ్ సేవింగ్స్ అండ్ సెక్యూరిటీ స్కీమ్ (టీఎఫ్ఎస్ఎస్)ను 2017లో ప్రవేశపెట్టింది. అలాగే నేత కార్మికులకు పొదుపు పథకాలనూ అమలు చేస్తోంది. రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికులందరినీ ‘త్రిఫ్ట్’ పథకంలో చేర్పించాలని చేనేత జౌళి శాఖ అధికారులను ఆదేశించింది. గతంలో రూ. 12 కోట్లతో ప్రారం భించిన ఈ పథకానికి ఈ ఏడాది రూ. 30 కోట్లు విడుదల చేయించారు. కార్మికుడిని యజమానిని చేయాలన్న ఉద్దేశంతో ‘వర్కర్ టూ ఓనర్’ పథ కాన్ని ప్రవేశపెట్టింది. బతుకమ్మ చీరల తయారీకి ఇప్పటి వరకు రూ. 2,000 కోట్లకు పైగా ఆర్డర్లు ఇచ్చింది. చేతి నిండా పని, పనికి తగ్గ వేతనం సంపాదిస్తున్న కార్మికులకు పొదుపు (త్రిప్టు) పథకాన్ని ప్రవేశపెట్టి చేయూతనిస్తున్నది. లాక్డౌన్ నేప థ్యంలో పరిశ్రమలు బంద్ అయ్యాయి. ఫలితంగా కార్మి కులు ఉపాధి కోల్పోయారు. కార్మికులు జమ చేసిన నగదుతో పాటు ప్రభుత్వం ఇచ్చే నిధులు మూడేండ్లకు ఇవ్వాల్సి ఉండగా, రెండేళ్లకే తిరిగి చెల్లించి వారి కుటుం బాలకు చేయూత నిచ్చింది. ఈ పథకం ఈ ఏడాది నుంచి పునః ప్రారంభిస్తున్నందున కార్మికులు చేరేందుకు ఆసక్తి చూపు తున్నారు. దేశంలో నేతన్నల సంక్షేమం కోసం ఎక్కడా లేని విధంగా చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఆగస్టు 7న నుంచి రైతు బీమా తరహాలో ‘నేతన్న బీమా’ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వార్షిక ప్రీమియం కింద చేనేత, పవర్ లూం కార్మికులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం కోసం 50 కోట్లు కేటాయించి... ఇప్పటికే 25 కోట్లు విడుదల చేసింది. (క్లిక్: ఎలా చూసినా సంక్షేమ పథకాలు సమర్థనీయమే!) 60 ఏళ్ల లోపు వయసున్న అర్హులైన సుమారు 80 వేల మంది కార్మికులకు ‘నేతన్న బీమా’ పథకం అమలు కోసం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసేందుకు కార్యా చరణ మొద లెట్టినారు. ఈ నేపథ్యంలో బీమా కాలంలో లబ్ధిదారులైన... చేనేత, మర మగ్గాల కార్మికులు ప్రమాద వశాత్తు మరణించినా, సహజంగా మరణించినా, ఏదైనా ప్రమాదంలో పూర్తి అంగ వైకల్యం కలిగినా... కుటుంబానికి ఆర్థిక భరోసాగా 10 రోజుల్లో నామినీకి రూ. 5 లక్షల బీమా సొమ్ము అందుతుంది. ఇలా నేతన్నలకు చేయూతనిస్తున్న తెలంగాణ ప్రభుత్వం సేవలు అభినందనీయం. ‘ఇంటింటికీ త్రివర్ణ పతాకం’ కార్యక్రమం కోసం 33 లక్షల మీటర్ల నేత వస్త్రాన్ని టెస్కో ద్వారా కొనుగోలు చేయటం నేతన్నలపట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలుపుతోంది. – డాక్టర్ సంగని మల్లేశ్వర్ కాకతీయ యూనివర్సిటీ జర్నలిజం విభాగాధిపతి