breaking news
NDSL workers
-
ఇష్టారాజ్యం!
నెలన్నర రోజులుగా కార్మికులకు అందని వేతనాలు ఆరునెలలుగా బిల్లులకు నోచుకోని రైతులు ఎన్డీఎస్ఎల్ తీరుపై కార్మికులు, కర్షకుల గుర్రు త్వరలో సమస్యలు తీరుస్తామంటున్న డిప్యూటీ స్పీకర్ మెదక్ రూరల్ : నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్) యాజమాన్యం మొండివైఖరి కారణంగా అటు కార్మికులు, ఇటు కర్షకులు అవస్థలు పడుతున్నారు. నెలన్నర రోజులుగా జీతాలు లేక కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. చెరకును ఫ్యాక్టరీకి తరలించి ఆరు నెలలు కావస్తున్నా బిల్లులు అందక రైతులు సతమతమవుతున్నారు. ఈ యేడు ఎన్డీస్ఎల్ 95 వేల టన్నుల చెరకును గానుగాడించింది. ఆలస్యంగా క్రషింగ్ ప్రారంభించడంతో రైతులు చెరకును ఇతర ఫ్యాక్టరీలకు తరలించారు. ప్రస్తుతం కార్మికుల సంఖ్య కూడా 170కి పడిపోయింది. ఫ్యాక్టరీలో వాటాను కొనుగోలు చేసిన దక్కన్ పేపర్ మిల్లు యజమాని ఇస్టానుసారంగా వ్యవహరిస్తూ అటు కార్మికులను ఇటు కర్షకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కార్మికులకు ప్రతినెలా ఒకటి నుంచి ఏడో తేదీ మధ్య జీతాలు ఇవ్వాల్సి ఉన్నా ప్రస్తుతం నెలన్నర రోజులైనా వేతనాలు అందని పరిస్థితి. ఫలితంగా కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. క్రషింగ్కు సంబంధించిన డబ్బులు రైతులకు రూ.21 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం రూ.7కోట్లు మాత్రమే చెల్లించారు. మరో రూ.14 కోట్లు బకాయిలున్నాయి. ఆరు నెలలు కావస్తున్నా బిల్లులు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ యేడు 75 వేల క్వింటాళ్ల చక్కెరను యాజమాన్యం విక్రయించినట్టు సమాచారం. ప్రస్తుతం ఫ్యాక్టరీలో నిలువ ఉన్న చక్కెర కేవలం 9 వేల క్వింటాళ్లు మాత్రమేనని తెలిసింది. రైతులకు డబ్బులు చెల్లించడంలో జాప్యం జరిగినందున మిగతా చక్కెరను విక్రయించరాదని కేన్ కమిషనర్ నుంచి ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఆదేశాలు అందినట్లు తెలిసింది. అయినప్పటికీ యాజమాన్యం స్పందించక పోవడంతో అటు కార్మికులు, ఇటు కర్షకులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రెండుసార్లు వేతన సవరణను ఎగ్గొట్టారు... నిబంధనల ప్రకారం మూడేళ్లకోసారి వేతన సవరణ జరగాల్సి ఉంది. ఫ్యాక్టరీ యజమాన్యం ఇప్పటికే రెండుసార్లు వేతన సవరణను ఎగ్గొట్టింది. ఈ విషయమై లేబర్ కమిషనర్కు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయింది. - ముక్తార్ హైమద్, టీఎంఎస్ సంఘ్ ప్రధాన కార్యదర్శి అర్ధాకలితో అలమటిస్తున్నాం... అసలే అరకొర వేతనాలు. ఆ వేతనాలు కూడా సరిగా రావడం లేదు. నెలన్నరైనా జీతాలు రాకపోవడంతో మా కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. యాజమాన్యం స్పందించి వెంటనే వేతనాలు చెల్లించాలి. - సత్తయ్య, ఎన్డీఎస్ఎల్ కార్మికుడు వారం రోజుల్లో బిల్లులు.. వారం రోజుల్లో చెరకు రైతులకు బిల్లులు చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఫ్యాక్టరీ యాజమాన్యం టన్ను చెరకు ధరను రూ.2,260 కన్నా ఎక్కువగా ఇవ్వనని మొండికేస్తే సీఎం కేసీఆర్ రైతుల బాగుకోరి టన్నుకు రూ.340 చొప్పున ఫ్యాక్టరీ యాజమాన్యానికి చెల్లించారు. అయినా యాజమాన్యం రైతులకు బిల్లులు చెల్లించ డం లేదు. ప్రభుత్వమే చొరవ తీసుకొని వారం రోజుల్లో రైతులకు డబ్బులు చెల్లించడంతోపాటు కార్మికులకు సైతం వేతనాలు ఇప్పిస్తాం. ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సీఎం ఆశీస్సులతో రైతులు, కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటాం. - పద్మాదేవేందర్రెడ్డి, డిప్యూటీ స్పీకర్ -
చిమ్నీ ఎక్కిన కార్మికులు
వేతన సవరణ చేశాకే ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బుధవారం బోధన్ చక్కెర కర్మాగారం (ఎన్డీఎస్ఎల్)లో పలువురు కార్మికులు పొగ గొట్టం పైకి ఎక్కారు. తమ డిమాండును అంగీకరించపోతే దూకుతామని హెచ్చరించారు. వారికి మద్దతుగా సీఐటీయూ, ప్రజా సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న ఎన్డీఎస్ఎల్ వైస్ ప్రెసిడెంట్ జానకీ మనోహర్, బల్దియా చైర్మన్ ఆనంపల్లి ఎల్లం అక్కడి చేరుకొని కార్మిక సంఘాల నాయకులతో మాట్లా డారు. జనవరి 31 లోగా మధ్యంతర భృతి, బాయిలు చెల్లిస్తామని, వేతన సవరణ కూడా చేస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు కిందికి దిగి వచ్చారు. - పొగ గొట్టం ఎక్కిన ఎన్డీఎస్ఎల్ కార్మికులు - జనవరి 31 వరకు అమలు చేస్తామని అసిస్టెంట్ కేన్ కమిషనర్ హామీ బోధన్ టౌన్ : యాజమాన్యం వేతన సవరణను దాటవేస్తూ కార్మికులను విస్మరిస్తోందని ఎన్డీఎస్ఎల్ కర్మాగారంలో బుధవారం కార్మికులు ఆందోళన చేపట్టారు. పొగగొట్టం పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. సీఐ టీయూ కార్మిక సంఘం, ప్రజా సంఘాల నాయకులు ఫ్యాక్టరీలో ఆందోళనకు దిగారు. వేతన సవరణ చేపట్టాకే ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో విధులకు వచ్చిన కార్మికులు సాయిలు, శ్రీనివాస్ కర్మాగారంలో 160 ఫీట్లు గల పొగ గొట్టం ఎక్కి వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు, సీటీయూ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు అక్కడికి చేరుకొని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొనగా, సీఐ రామకృష్ణ వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. యాజమాన్యం దిగి వచ్చి వేతన సవరణ చేయాలని పట్టుబట్టారు. సమాచారం తెలుసుకున్న ఎన్డీఎస్ఎల్ వైస్ ప్రెసిడెంట్ జానకీ మనోహర్, బల్దియా చైర్మన్ ఆనం పల్లి ఎల్లం అక్కడికి చేరుకొని కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడారు. నేరుగా యాజమాన్యంతో మాట్లాడి తమకు వేతన సవరణపై హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామన్నారు. వేతన సవరణపై స్పష్టమైన హా మీ ఇవ్వాలని యాజమాన్యాన్ని బల్దియా చైర్మన్ ఎల్లం, టీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు కోరారు. దీంతో వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఇటీవల హైదరాబాద్లో కార్మిక సంఘంతో యాజమాన్యం చర్చ లు జరిపిందన్నారు. చర్చల్లో కార్మికులు 14 నెలల ఐఆర్, ఏరియర్స్ నాలుగు విడతలుగా ఇవ్వాలని, మార్చి అనంతరం వేతన సవరణ చేపట్టాలని యాజమాన్యానికి సూచించారని తెలిపారు. దీనికి కార్మిక సంఘం నాయకులు, యాజమాన్యం ఒప్పుకున్నాయన్నారు. అయినా కార్మికులు ససేమిరా అన్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు కుమార స్వామి, ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ తమకు వేతన సవరణపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం చెరకు ఉత్పత్తి దారుల సంఘం నాయకులు మాట్లాడుతూ.. కార్మిక సంఘాల నాయకులు క్రషింగ్కు సహకరించాలని, రైతుల శ్రేయస్సు దృష్ట్యా ఆలోచించాలన్నారు. తాముసైతం కార్మికులకు అండగా ఉండి వేతన సవరణ అయ్యే వరకు పోరాడుదామని కార్మికులను సముదాయించే ప్రయత్నం చేశారు. కార్మికులు ససేమిరా అనడంతో చర్చించి సమస్య పరిష్కరించుకుందామని తెలిపారు. ప్రజా సంఘాల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ ఇవ్వాలని సూచించారు. దీంతో అసిస్టెంట్ కేన్ కమిషనర్ జాన్ విక్టర్ కర్మాగారానికి చేరుకొని చర్చలు జరిపారు. కార్మికులకు నాలుగు విడతలుగా ఇస్తామన్న ఐఆర్, ఏరియర్స్ రెండు విడతల్లో జనవరి 31 వరకు చెల్లిస్తామని, దీంతో పాటు వేతన సవరణ సైతం అప్పటి వరకు చేస్తామని హామీ ఇచ్చారు. క్రషింగ్ కు అందరు సహకరించాలని కోరారు. దీంతో కార్మికులు ఆందోళన విరమించారు.