-
విదేశాల్లో పెట్టుబడులు.. ఇప్పుడెంతో ఈజీ !
ఉదయం నిద్ర లేవడం మొదలు.. రాత్రి తిరిగి విశ్రమించే వరకూ ముఖ్యమైన ముచ్చట్లు ‘ఫేస్బుక్’ పేజీలోకి ఎక్కాల్సిందే. ప్రతీ ప్రత్యేక జ్ఞాపకాన్ని బంధు మిత్రులు, సన్నిహితులతో షేర్ చేసుకోవాల్సిందే. తాజా వార్తా, విశేషాల సమాచారం కోసం ఫేస్బుక్ను ఓపెన్ చేయాల్సిందే..! ఇక గ్రోసరీ నుంచి కావాల్సిన స్మార్ట్ ఫోన్ వరకు అమెజాన్లో ఆర్డర్ చేసేవారూ మన చుట్టూ చాలా మందే ఉన్నారు. సమాచారం ఏది తెలుసుకోవాలన్నా.. గూగుల్లో (ఆల్ఫాబెట్) వెతికేయడం, ఆండ్రాయిడ్ ఓఎస్, గూగుల్ క్రోమ్, గూగుల్ పే, గూగుల్ ఫొటోస్ ఇవన్నీ కూడా జీవనంలో భాగమైనవే. చేతిలో యాపిల్ ఫోన్ ఉంటే ఆ ఆనందమే వేరు..! ఇవన్నీ కూడా అమెరికాకు చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు. వీటి అవసరం లేకుండా ఆధునిక తరం రోజు గడవదంటే అతిశయోక్తి కానే కాదు. ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా.. దీర్ఘకాలంలో మంచి లాభాలు వెనకేసుకోవాలన్న ఆలోచన భారత ఇన్వెస్టర్లలో క్రమంగా పెరుగుతోంది. ఇటీవలి కాలంలో విదేశీ స్టాక్స్లో పెట్టుబడులకు డిమాండ్ పెరిగిన నేపథ్యంతో.. ఈ సేవలు అందించేందుకు ఎన్ఎస్ఈ కూడా రంగంలోకి దిగింది. ఎన్ఎస్ఈ అందిస్తున్న ఈ సేవల సమాచారమే ఈ వారం ప్రాఫిట్ప్లస్ కథనం.. త్వరలోనే ఎన్ఎస్ఈ సేవలు భారతీయ ఇన్వెస్టర్లు అమెరికాలో లిస్ట్ అయిన స్టాక్స్ కొనుగోలు, విక్రయాలు చేసుకునేందుకు వీలుగా అవసరమైన వేదికను ఏర్పాటు చేయాలని నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ)కి చెందిన ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ నిర్ణయం తీసుకుంది. ప్రణాళిక మేరకు పనులు పూర్తయితే త్వరలోనే ఫ్యాంగ్ స్టాక్స్ (ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, నెట్ఫ్లిక్స్, గూగుల్), మైక్రోసాఫ్ట్, టెస్లా తదితర ఎన్నో స్టాక్స్లో లావాదేవీలు సులభతరం కానున్నాయి. సెబీ, ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా కేవైసీని పూర్తి చేసిన (కస్టమర్ గుర్తింపు వివరాల ధ్రువీకరణ) కస్టమర్లు యూఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. ప్రస్తుతానికి దేశీయ బ్రోకరేజీ సంస్థలు కొన్ని యూఎస్ స్టాక్స్లో నేరుగా పెట్టుబడులకు వీలు కల్పిస్తున్నాయి. కానీ, స్థానికంగా ఒక ఎక్సే్ఛంజ్ ప్లాట్ఫామ్ లేదు. ఆ లోటును ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ భర్తీ చేయనుంది. ప్రత్యేక ఖాతా అక్కర్లేదు! సుమారు 40 దేశీయ బ్రోకరేజీ సంస్థలు గుజరాత్లోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ/గిఫ్టి సిటీ)లో కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాయి. మరికొన్ని కేంద్రాలను ఏర్పాటు చేసే క్రమంలో ఉన్నాయి. విదేశీ స్టాక్స్లో నేరుగా ఇన్వెస్ట్ చేసుకోవాలని భావించే ఇన్వెస్టర్లు గిఫ్ట్ సిటీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే బ్రోకర్ల వద్ద ట్రేడింగ్–డీమ్యాట్ ఖాతాలను తెరవాల్సి ఉంటుంది. అయితే, ఎన్ఎస్ఈ నియంత్రణ సంస్థలతో సంప్రదింపులు నిర్వహిస్తోంది. ఇప్పటికే కేవైసీ వివరాలు సమర్పించి ట్రేడింగ్/డీమ్యాట్ ఖాతా కలిగిన వారు యూఎస్ స్టాక్స్లో పెట్టుబడుల కోసం ప్రత్యేకంగా ఖాతా తెరవాల్సిన అవసరం లేకుండా అనుమతి పొందే ప్రయత్నం చేస్తోంది. ఇది ఫలిస్తే.. ఇన్వెస్టర్లు ప్రస్తుత తమ ట్రేడింగ్ ఖాతా నుంచే దేశీయ స్టాక్స్ మాదిరే.. యూఎస్ స్టాక్స్లోనూ కొనుగోలు, విక్రయాలు చేసుకోవచ్చు. ఇందుకోసం తమ సమ్మతి తెలియజేస్తూ ప్రత్యేకంగా ఒక పత్రం సమర్పిస్తే సరిపోతుంది. గిఫ్ట్సిటీ అన్నది అంతర్జాతీయ కార్యకలాపాల కోసం ఉద్దేశించిన ప్రత్యేక ప్రాంతం. మరిన్ని విదేశీ స్టాక్స్కూ అవకాశం మనదేశంలోని రెండు డిపాజిటరీ సంస్థలైన సీడీఎస్ఎల్, ఎన్ఎస్డీఎల్ కూడా గిఫ్ట్ సిటీలో అనుబంధ సంస్థలను ఇప్పటికే ఏర్పాటు చేశాయి. విదేశీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలనే కొత్త ఇన్వెస్టర్లకు ఈ డిపాజిటరీల నుంచి డీమ్యాట్ ఖాతాలను బ్రోకరేజీ సంస్థలు ఆఫర్ చేయనున్నాయి. ప్రారంభంలో యూఎస్ స్టాక్స్లో లావాదేవీలకే పరిమితమైనప్పటికీ.. తర్వాత ఇతర విదేశీ స్టాక్స్లోనూ పెట్టుబడులకు అవకాశం అందుబాటులోకి రానుంది. విదేశీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు తమ బ్యాంకు శాఖను సంప్రదించాల్సి ఉంటుంది. గిఫ్ట్ సిటీలోని బ్రోకర్ వద్ద తన ఖాతాకు నిధులు బదిలీ చేయాలని కోరాల్సి ఉంటుంది. ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద ఒక ఏడాదిలో 2,50,000 డాలర్లు (సుమారు రూ.1.85కోట్లు) విదేశాలకు పంపుకోవచ్చు. స్టాక్స్, మ్యచువల్ ఫండ్స్ యూనిట్ల కొనుగోలు, ఈటీఎఫ్ల కోసం ఈ నిధులను వినియోగించుకోవచ్చు. కాకపోతే ఎల్ఆర్ఎస్ కింద పంపుకునే నిధులతో విదేశీ డెరివేటివ్ సాధనంలో ఇన్వెస్ట్ చేయకూడదు. ఖాతాదారు కోరిక మేరకు బ్యాంకు ఎల్ఆర్ఎస్ పరిమితిని పరిశీలించిన తర్వాత గిఫ్ట్ సిటీలో బ్రోకర్ ఖాతాకు నిధులను బదిలీ చేస్తుంది. ప్రస్తుత తమ బ్యాంకు శాఖ నుంచే ఈ సేవలను పొందొచ్చు. ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను ఇందుకోసం తెరవాల్సిన అవసరం ఉండదు. తొలుత టాప్–50కే పరిమితం నిధుల బదిలీ అనంతరం విదేశీ స్టాక్స్లో క్రయ, విక్రయాలు నిర్వహించుకోవచ్చు. తొలుత యూఎస్కు చెందిన టాప్–50 స్టాక్స్లో లావాదేవీలకు ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ అనుమతించనుంది. తర్వాత మరిన్ని స్టాక్స్లో లావాదేవీలకు అవకాశం కల్పించాలన్నది ఎన్ఎస్ఈ ప్రణాళిక. ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ ప్రత్యేకంగా అంతర్జాతీయ బ్రోకరేజీలను నియమించుకోనుంది. ఈ బ్రోకర్లు అమెరికా స్టాక్ ఎక్సే్ఛంజ్లలో షేర్లను కొనుగోలు చేసి, డిపాజిటరీ రిసీప్ట్ (సర్టిఫికెట్ ఆఫ్ ఓనర్షిప్)ను గిఫ్ట్సిటీలోని ఇన్వెస్టర్లకు కేటాయించనున్నాయి. మన దేశంలో పాక్షిక షేర్లకు అవకాశం లేదు. కనీసం ఒక షేరును లావాదేవీగా నిర్వహించాల్సిందే. కానీ, అమెరికాలో పాక్షిక షేర్లను కూడా సొంతం చేసుకోవచ్చు. 3 డాలర్లు, 6 డాలర్ల డినామినేషన్లో పాక్షిక షేర్లను పొందే అవకాశం గిఫ్ట్ సిటీ ఇన్వెస్టర్లకు ఉంటుంది. ఉదాహరణకు యాపిల్ ఒక షేరు సుమారు 149 డాలర్ల వద్ద ఉంది. ఒక్క షేరు కొనుగోలుకు పెట్టుబడి రూ.11వేలపై మాటే. ఇంత ఇన్వెస్ట్ చేయలేని వారు పాక్షిక షేర్లను కొనుగోలు చేసుకోవచ్చు. లావాదేవీలకు ఎన్ఎస్ఈ క్లియరింగ్ కార్పొరేషన్ హామీదారుగా ఉంటుంది. టీప్లస్3 సెటిల్మెంట్ అమలవుతుంది. లావాదేవీ నమోదైన రోజు కాకుండా తర్వాతి మూడవ పనిదినం ముగింపు నాటికి షేర్లు డీమ్యాట్ ఖాతాలో జమ అవుతాయి. ఈ బ్రోకర్ల నుంచి సేవలు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, జియోజిత్, మోతీ లాల్ ఓస్వాల్, యాక్సిస్ సెక్యూరిటీస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, మ్యాటర్ట్రస్ట్, విన్వెస్టా, వెస్టెడ్ ఫైనాన్స్ తదితర సంస్థలు ఇప్పటికే యూఎస్ స్టాక్స్ లో పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇం దుకోసం ఈ సంస్థలు అమెరికాకు చెందిన బ్రోకరేజీ సంస్థలతో భాగస్వామ్యాలను కూడా కుదుర్చుకున్నాయి. ఈ ప్లాట్ఫామ్ల ద్వారా విదేశీ స్టాక్స్, బాండ్లు, రీట్, ట్రెజరీ బాండ్లలోనూ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఒక్క డాలర్ నుంచి పెట్టుబడులకు ఇవి అనుమతిస్తున్నాయి. వేగంగా, సులభంగా ఖాతా తెరిచే సేవలను ఇవి అందిస్తున్నాయి. పన్ను ఇక్కడే చెల్లించాలి.. విదేశీ స్టాక్స్లో లాభాలపై దేశీయంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే స్థానిక స్టాక్స్లోని లాభాలపై పన్నుతో పోలిస్తే భిన్నమైన రేట్లు అమల్లో ఉన్నాయి. అమెరికా, బ్రిటన్ తదితర చాలా దేశాల్లో విదేశీ ఇన్వెస్టర్లు ఆర్జించిన ఈక్విటీ (స్టాక్స్,ఫండ్స్) లాభాలపై మూలధన లాభాల పన్ను లేదు. డివిడెండ్లు, వడ్డీ రాబడి కూడా పన్ను రహితమే. కానీ, ఆయా లాభాలు, ఆదాయంపై ఇక్కడ పన్ను చెల్లించాలి. విదేశీ ఎక్సే్ఛంజ్ల్లో లిస్ట్ అయిన షేరు లేదా ఫండ్లో రెండేళ్ల తర్వాత పెట్టుబడులను విక్రయించగా వచ్చిన లాభాన్ని దీర్ఘకాల మూలధన లాభంగా చట్టం పరిగణిస్తోంది. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించగా మిగిలిన లాభంపై 20%పన్ను చెల్లించాలి. దేశీయ స్టాక్స్, ఈక్విటీ ఫండ్స్లో దీర్ఘకాల మూలధన లాభం మొదటి రూ.లక్ష (ఒక ఆర్థిక సంవత్సరంలో) పై పన్ను లేదు. కానీ, విదేశీ మూలధన లాభాలకు ఇది వర్తించదు. విదేశీ స్టాక్స్ లేదా ఈక్విటీ ఫండ్స్లో పెట్టుబడులను రెండేళ్లలోపే విక్రయించినట్టయితే.. లాభాన్ని తమ ఆదాయం కింద రిటర్నుల్లో చూపించాలి. అప్పుడు తమకు వర్తించే శ్లాబు రేటు కింద పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం.. విదేశీ పెట్టుబడుల వివరాలను (విదేశీ ఆస్తులు, విదేశీ ఆదాయం) ఎప్పటికప్పుడు ఐటీఆర్లో విధిగా పేర్కొనాల్సిందే. స్టాక్స్ కొనుగోలు క్రమం ఇదీ ► డీమ్యాట్ ఖాతా ఉంటే చాలు. ఇప్పటి వరకు డీమ్యాట్ ఖాతా లేని వారు గిఫ్ట్ సిటీ కేంద్రంగా పనిచేస్తున్న బ్రోకర్ల వద్ద ఖాతా తెరవాల్సి ఉంటుంది. కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ► ఆర్బీఐ ఎల్ఆర్ఎస్ కింద బ్యాంకు నుంచి గిఫ్ట్ సిటీలోని ఖాతాకు ఒక ఏడాదిలో 2.5లక్షల డాలర్లను పంపుకోవచ్చు. ► యూఎస్ స్టాక్స్లో పాక్షిక వాటాలనూ సొంతం చేసుకోవచ్చు. తొలుత యూఎస్ టాప్–50 స్టాక్స్ అందుబాటులో ఉండనున్నాయి. ► ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ క్లియరింగ్ కార్పొరేషన్ ఈ లావాదేవీల సెటిల్మెంట్ను చూస్తుంది. -
చేదు మిగిల్చిన ‘షుగర్స్’
♦ ఎన్డీఎస్ఎల్ కార్మికుల కన్నీటి వ్యథ ♦ ఆరునెలలుగా మూతపడ్డ ఫ్యాక్టరీ ♦ ఆకలితో అలమటిస్తున్న కార్మికులు ♦ గుండెపగిలి ఇద్దరి మృతి ♦ నేడు ‘మే డే’ సందర్భంగా ప్రత్యేక కథనం.. మెదక్/మెదక్ రూరల్: ప్రపంచ కార్మికులంతా ఆనందోత్సాహాల మధ్య మేడే జరుపుకొంటుంటే మెదక్ ఎన్డీఎస్ఎల్ కార్మికులు కన్నీళ్లను దిగమింగుకుంటూ బేల చూపులు చూస్తున్నారు. ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామనే టీఆర్ఎస్ హామీ గాల్లో కలిసింది. ఆరునెలల క్రితం కుంటి సాకులతో ఎన్డీఎస్ఎల్ యా జమాన్యం అక్రమ లేఆఫ్ ప్రకటించి కార్మికులను రోడ్డున పడేసింది. దీంతో వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మంభోజిపల్లి శివారులో 30ఏళ్ల క్రితం నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ఏర్పాటైంది. ప్రారంభంలో 500మంది పనిచేసేవారు. సీజన్లో వేల మంది పని చేస్తుంటారు. సీజన్లో ఫ్యాక్టరీలో 5 లక్షల టన్నుల చెరుకు గానుగాడించే వారు. 12 మండలాల రైతులకు, కార్మికులకు ఫ్యాక్టరీ కల్పతరువుగా నిలిచింది. అప్పటి సీఎం చంద్రబాబు హ యాంలో 51 శాతం వాటాను ప్రైవేటుకు కట్టబెట్టడం ద్వారా తొలిసారిగా కార్మికుల పొట్టకొట్టారు. అప్పటి నుంచి రైతులకు దెబ్బపై దెబ్బ తగులుతూనే ఉన్నాయి. కొత్త యాజమాన్యం వచ్చీ రాగానే వందలాది మందికి బలవంతంగా వీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపింది. నిబంధనల ప్రకారం ప్రతి మూడేళ్లకోసారి వేతన సవరణ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు మూడుసార్లు వేతన సవరణ ఎగ్గొట్టింది. అక్రమ లేఆఫ్తో కార్మికులు రోడ్డుపాలు ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం ఫ్యాక్టరీకి అక్రమ లేఆఫ్ ప్రకటించి కార్మికులను రోడ్డున పడేసింది. కార్మికులకు చెల్లించాల్సిన వేతన సవరణను ఎన్నోసార్లు ఎగ్గొట్టింది. రిటైర్డ్ అయిన ఎందరో కార్మికులను ఒట్టి చేతులతో గెంటేసింది. దశాబ్దాల తరబడి తమ జీవితమంతా కండలు పిండిచేసుకొని ఫ్యాక్టరీలో పనిచేస్తే రిటైరయ్యే నాటికి పీఎఫ్ డబ్బులకూ నోచుకోక ఇటీవలే ఇద్దరు కార్మికులు గుండె ఆగి మరణించారు. పలు కార్మిక కుటుంబాలు పస్తులుంటున్నాయి. పూట గడవక కార్మికులు అడ్డాపై కూలీకి నిల్చుంటున్నారు. వేతనాలు, పీఎఫ్ డబ్బులు ఇవ్వాలంటూ ఎన్నోసార్లు ఆందోళనలు, ధర్నాలు చేసినా యాజమాన్యం స్పందించిన పాపాన పోలేదు. టీఆర్ఎస్ హామీ నెరవేరేదెప్పుడు? టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా సమస్యలు పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడని కార్మికులు అంటున్నారు. నిబంధనల ప్రకారం తమకు రావాల్సిన వేతనాలను నెలనెలా ఇప్పించాలంటూ పాలకుల చుట్టూ తిరిగినా ఎవరు పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. ప్రజాప్రతినిధులు ఎంతమందికి విన్నవించినా ఫలితం కరువైంది. గత ఆరు నెలల్లో నలుగురు కార్మికులు పదవీ విరమణ పొందారు. వీరికి ఎలాంటి ప్రయోజనాలు అందలేదు. ఈ క్రమంలోనే మరో ఇద్దరు కార్మికులు శనివారం రిటైర్డ్ అయి కన్నీటి పర్యంతమవుతూ ఇళ్లకు వెళ్లారు. రోడ్డుపైనే రిటైర్మెంట్లు.. అక్రమ లేఆఫ్తో యాజమాన్యం ఫ్యాక్టరీకి తాళం వేయగా, రిటైరైన కార్మికులను తోటి కార్మికులు చం దాలు వేసుకొని గేటుముందే సన్మానించుకోవాల్సిన దుస్థితి.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు. -
నిజామ్ షుగర్స్ కథ కంచికి
హైదరాబాద్: నష్టాలను సాకుగా చూపుతూ 2015-16 క్రషింగ్ సీజన్లో చెరుకు గానుగను నిలిపివేసిన నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ యాజమాన్యం.. ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేసే దిశగా అడుగులు వేస్తోంది. గత ఏడాది డిసెంబర్లో లే ఆఫ్ను ప్రకటించిన యాజమాన్యం.. కార్మికుల వేతనాలు కూడా చెల్లించడం లేదు. చెరుకు తరలింపులో భాగంగా రవాణాకు సంబంధించిన మొత్తం ప్రభుత్వం నుంచి విడుదల కావడం లేదు. ఇదిలావుంటే.. బ్యాంకర్ల నుంచి ఒత్తిడి, వరుస నష్టాలతో ఫ్యాక్టరీని నడిపించే పరిస్థితిలో లేనందున ఖాయిలా పడిన పరిశ్రమల జాబితాలో చేర్చాలంటూ ఎన్డీఎస్ఎల్ ప్రైవేటు భాగస్వామ్య సంస్థ డెల్టా పేపర్ మిల్స్ (డీపీఎం) ఇటీవల పారిశ్రామిక, ఆర్దిక పునర్నిర్మాణ మండలిని (బీఐఎఫ్ఆర్) ఆశ్రయించింది. అయితే బీఐఎఫ్ఆర్ వద్ద పేరుకు పోయిన ఖాయిలా పడిన పరిశ్రమల జాబితాను పరిశీలిస్తే.. ఎన్డీఎస్ఎల్ వ్యవహారం కొలిక్కి వచ్చేందుకు కనీసం నాలుగేళ్లు పడుతుందని చక్కెర పరిశ్రమ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పేరుకు పోయిన వేతన బకాయిలు చెరుకును గానుగ ఆడించలేమని ప్రకటించిన ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం.. గత ఏడాది డిసెంబర్ 23వ తేదీన లే ఆఫ్ ప్రకటించింది. దీంతో ఎన్డీఎస్ఎల్ పరిధిలోని మూడు యూనిట్లలో పనిచేస్తున్న 307 మంది కార్మికులు వేతనాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేతనాలకు సంబంధించి ఇప్పటి వరకు రూ.2.27 కోట్ల బకాయిలతో పాటు, పీఎఫ్ వంటి ఇతర చెల్లింపులు మరో రెండు కోట్ల రూపాయల మేర వుంటాయని అంచనా. వేతన బకాయిలు రూ.4.27 కోట్లు చెల్లించడంతో పాటు, ఫ్యాక్టరీని తిరిగి తెరవాలంటూ ఉద్యోగులు ఆందోళన బట్టినా అటు ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం, ఇటు ప్రభుత్వం నుంచి స్పందన కనిపించడం లేదు. ఎన్డీఎస్ఎల్ పరిధిలో రైతులు సాగు చేసిన సుమారు 1.80లక్షల మెట్రిక్ టన్నుల చెరుకును ప్రైవేటు ఫ్యాక్టరీలకు తరలించి గానుగ ఆడించారు. రవాణా వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇవ్వగా.. మెట్రిక్ టన్నుకు రూ.300 నుంచి రూ.450 వరకు దూరాన్ని బట్టి చెల్లించాలని నిర్ణయించారు. అయితే క్రషింగ్ ముగిసినా.. ప్రభుత్వం ప్రకటించిన రవాణా వ్యయం రూ.6 కోట్లు విడుదల కాకపోవడంతో.. ప్రైవేటు ఫ్యాక్టరీల నుంచి రైతులకు పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగడం లేదు. -
ఎన్డీఎస్ఎల్ మూత..?
జాడలేని జీఎం అయోమయంలో చెరకు రైతులు ఇక క్రషింగ్ లేనట్టే! కార్మికులకు అందని వేతనాలు కాలనీకి సైతం నీటి సరఫరా బంద్ ఫ్యాక్టరీ వదిలివెళ్లిన జీఎం కార్మికులు నివసించే కాలనీకి తాగునీటి సరఫరా బంద్ రెండు నెలలుగా అందని వేతనాలు చెరకు రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం మెదక్: నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ (ఎన్డీఎస్ఎల్) మూతపడింది. దీంతో చెరకు రైతుల బతుకులు అగమ్యగోచరంగా మారాయి. జీఎం నాగరాజు ఫ్యాక్టరీలోని కార్యాలయాన్ని వదిలి వెళ్లిపోయాడు. మరోవైపు రెండు నెలలుగా వేతనాలు అందక కార్మికులు అవస్థలు పడుతున్నారు. మంభోజిపల్లి గ్రామ శివారులో నిజాం షుగర్ ఫ్యాక్టరీని 1988లో అప్పటి ప్రభుత్వం నిర్మించింది. నాటి నుంచి ఫ్యాక్టరీ పరిధిలోని 12 మండలాలకు చెందిన చెరకు రైతులకు కల్పవల్లిగా మారింది. అప్పట్లో దీని పరిధిలో 5 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు గానుగాడేది. 600 మంది రెగ్యులర్ కార్మికులు పనిచేయగా, 1000 మంది సీజనల్ కార్మికులు పనిచేసేవారు. 2002లో నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఫ్యాక్టరీలోని 51 శాతం వాటాను ప్రైవేట్ కంపెనీకి అప్పగించారు. దీంతో ఫ్యాక్టరీలోని కార్మికుల సంఖ్యను 140కి కుదించారు. గతేడాది కేవలం 97 మెట్రిక్ టన్నుల చెరకును మాత్రమే గానుగాడించిన యాజమాన్యం ఈ యేడు ఫ్యాక్టరీనే లాకౌట్ చేసేం దుకు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభించక పోవడంతో దీని పరిధిలోని 12మండలాల చెరకు రైతులు సాగుచేసిన 1.27 లక్షల మెట్రిక్ టన్నుల చెరకును నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని గాయత్రి ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. దీంతో టన్ను ఒక్కటికి రూ.1200 అదనపు ఖర్చు వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ర్టంలో మూతపడనున్న మొదటి ఫ్యాక్టరీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నాయకులు మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలోని ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీలను తాము అధికారంలోకి రాగానే స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దగ్గర పడుతున్నా ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేసుకోవడం కాదు కదా.. కనీసం సీజన్లో నడిపించలేక పోయారని చెరకు రైతులు వాపోతున్నారు. భిక్షాటనకు సిద్ధమవుతున్న కార్మికులు ఫ్యాక్టరీ మూసి రైతులను రోడ్డున పడేసిన యాజమాన్యం కార్మికులకు రెండు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. పాతికేళ్లుగా ఫ్యాక్టరీలో పనిచేసిన తమకు అటు ప్రభుత్వం, ఇటు ఫ్యాక్టరీ యాజమాన్యం అన్యాయం చేసిందని, నిబంధనల ప్రకారం వేతన సవరణ చేపట్టలేదన్నారు. ఇక వేతనాలు చెల్లించలేమంటూ యాజమాన్యం మొండికేస్తోదని, మరో రెండు రోజుల్లో వేతనాలు రాకుంటే భిక్షాటన చేసి కుటుంబాలను పోషించుకుంటామన్నారు. కాలనీకి నీటిసరఫరా బంద్ ఫ్యాక్టరీ సమీపంలోని కార్మికుల కాలనీలో 100కుపైగా కుటుంబాలు ఉంటున్నాయి. కాలనీకి ర్యాలమడుగు శివారులోని పసుపులేరు నుంచి నీటి సరఫరా అవుతుంది. పది రోజుల క్రితం వాగులో నీటి ఊటలు తగ్గడంతో నీటి సరఫరా నిలిచి పోయింది. దీంతో కార్మికులే రింగుల నుంచి ఇసుకను తొలగించారు. అలాగే రెండుచోట్ల పైప్లైన్ పగలడంతో కార్మికులే మరమ్మతులు చేసుకుంటున్నారు. మా భవిష్యత్తు ఏమవుతుందో.. ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభించని యాజమాన్యం మా భవిష్యత్తు గురించి ఆలోచించాలి. రెండు నెలలుగా జీతాలు రాక మా కుటుంబాలు అర్థాకాలితో అలమటిస్తున్నాయి. యాజమాన్యం స్పందించకుంటే మాకు ఆత్మహత్యలే గతి. -ప్రభాకర్,టీఎంఎస్వర్కింగ్ప్రెసిడెంట్ జీతాలు రాకుంటే భిక్షాటనే గతి మాకు రావాల్సిన రెండు నెలల జీతాలు వెంటనే చెల్లించకుంటే మెదక్ పట్టణంతోపాటు పరిసర గ్రామాల్లో భిక్షాటన చేస్తాం. ఇప్పటికే పస్తులుంటున్న మా కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలి. -ముక్తార్, టీఎంఎస్ సెక్రటరీ -
తీపి కబురు
⇒ ప్రయివేటీకరణ చెర వీడనున్న ఎన్డీఎస్ఎల్ ⇒ సీఎం సమక్షంలో ఎట్టకేలకు వీడిన సందిగ్ధత ⇒ రైతులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం ⇒ చెరుకు ధరపై స్పష్టత ఇచ్చిన కేసీఆర్ ⇒ టన్నుకు రూ. 340 ప్రభుత్వమే భరిస్తుందని హామీ బోధన్: బోధన్ ప్రాంత రైతులు, కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు తీపికబురు అందించారు. ‘నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్’కు ప్రయివేటు చెర విడిపించేందుకు భరోసా ఇచ్చారు. పుష్కర కాలంగా ఈ అంశం పెండింగ్లో ఉంది. ఎన్డీఎస్ఎల్ను ప్రభు త్వ పరం చేస్తామని, ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తెస్తామ ని టీఆర్ఎస్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. ఇపుడు ఆ హామీ నెరవేరేలా ఓ అడుగు ముందుకు పడింది. సోమవారం సీఎం హైదరాబాద్లోని సచివాల యంలో బోధన్, కరీంనగర్ జిల్లా మెట్పల్లి, మెదక్ జిల్లాకు చెందిన ఎన్డీఎస్ఎల్ యూనిట్ల పరిధిలోని రైతులతో సమావేశమయ్యారు. నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీలు కల్వకుంట్ల కవిత, బీ బీ పా టిల్, రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, బోధన్, మెట్పల్లి, మెదక్ ఎమ్మెల్యేలు మహ్మద్ షకీల్, వి ద్యాసాగర్రావు, పద్మాదేవేందర్రెడ్డి ఇందులో పా ల్గొన్నారు. ఈ సందర్భంగా చక్కెర ఫ్యాక్టరీ భవితపై నిర్ణయం తీసుకునేందుకు రైతులతో సమావేశాలు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ విషయా న్ని బోధన్ చెరుకు ఉత్ప త్తిదారుల సంఘం అధ్యక్షు డు కెపీ శ్రీనివాస్రెడ్డి ఫోన్లో ‘సాక్షి’కి తెలిపారు. కొ ద్ది రోజుల క్రితమే ఎమ్మెల్యే షకీల్ నేతృత్వంలో రైతులు ఎంపీ కవితను కలిసి చెరుకు ధర, ఫ్యాక్టరీ భవిత అంశాలపై చర్చించారు. ఆమె చొరవ తీసుకుని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సమావేశాలు ఇలా ఫ్యాక్టరీ భవిత గురించి చర్చించేందుకు మూడు ఫ్యాక్టరీల పరిధిలో రైతులతో సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ సూచించారు. ఈ నెల 7న మెట్పల్లిలో, 10న మెదక్లో, 11న బోధన్లో సమావేశాలు నిర్వహిస్తారు. బోధన్ సమావేశానికి ఎంపీ కవిత హాజరవుతారు. ఫ్యాక్టరీని ప్రభుత్వమే నిర్వహించాలా? రైతుల భాగస్వామ్యంతో నడుపాలా అనే అంశంపై అభిప్రాయాలు సేకరించనున్నారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలో సహకార పద్ధతిన నడుస్తున్న ఫ్యాక్టరీల నిర్వహణపై అధ్యయనం చే యాలని సీఎం సూచించినట్టు రైతు నాయకులు తెలిపారు. ఒక్క పైసా ఖర్చు బరువు పడకుండా ప్రభుత్వం ఫ్యాక్టరీని ఆధునీకరిస్తుందని హామీ ఇచ్చారన్నారు. 2014-15 క్రషింగ్ సీజన్కుగాను ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం టన్నుకు రూ. 2260 ధర చెల్లిస్తామంటోంది. రైతులు రూ. 2600 చెల్లిం చాలని కోరుతున్నారు. దీనికీ సీఎం అంగీకరించి, రెండు మూడు రోజులలో జీఓ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. 12 ఏళ్లుగా నాటకీయ పరిణామాలు ఆసియాలోనే అతి పెద్ద వ్యవసాయాధార పరిశ్రమగా ఖ్యాతి పొందిన బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ నిజాం పాలకులు 1938లో నిర్మించారు. ప్రభుత్వరంగ సంస్థగా ఉండగా ఇది ఓ వెలుగు వెలిగింది. వేలాది మంది కార్మికులకు జీవనోపాధి కల్పించిం ది.రైతులకు లాభసాటి ధర అందించింది. 2002లో చంద్రబాబు దీనిని ప్రయివేటీ కరించారు. వారికే నిర్వహణ అధికారం కట్టబెట్టారు. దీంతో రైతులు, కార్మికులు తీవ్ర కష్టాల పాలయ్యారు. వందలాది మంది కార్మికులను ఉద్యోగాలు కోల్పోయారు. రై తులు లాభసాటి ధర అందక అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ప్రయివేటీకరణను రద్దు చేయాలని రైతులు, కార్మికులు దశాబ్ద కాలం నుంచీ పోరాడుతున్నారు. నిజాం షుగర్స్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎం అప్పిరెడ్డి, పలువురు రైతు, కార్మిక సం ఘాలు హైకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేశారు. ఇపుడు ఈ పోరాటం ఫలిం చబోతోంది. 2004లో వైఎస్ఆర్ హయాంలో సభా సంఘం 2004లో అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిజాం షుగర్స్ ప్రయివేటీకరణలో అవినీతి,అక్రమాల నిగ్గు తేల్చేందుకు సభా సంఘాన్ని నియమించారు. 2006 ఆగస్టు 31న ఇది నివేదిక ఇచ్చింది. ఫ్యాక్టరీని తిరిగి స్వా దీనం చేసుకోవాలని సిఫారసు చేసింది. ఆయన మరణానంతరం ఈ అంశం కోర్టు విచారణకు వ చ్చిన సందర్భంలో ఉమ్మడి రాష్ట్రం ప్రభుత్వం మీనమేషాలు లెక్కించింది. ఫ్యాక్టరీ స్వాధీనం అంశాన్ని పట్టించుకోలేదు. దాంతో విషయం మరుగున పడిపోయింది. ఎట్టకేలకు సీఎం కేసీఆర్ ఫ్యాక్టరీపై స్పష్టత ఇవ్వడంతో రైతులు, కార్మికులలో హర్షం వ్యక్తం అవుతుంది. సీఎంతో జరిగిన సమావేశంలో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు కెపీ శ్రీనివాస్రెడ్డి,ఉపాధ్యక్షుడు శివరాజ్పాటిల్, ప్రధాన కార్యదర్శి గోపాల్ రెడ్డి, బి. సుబ్బారావు, మారుతీపటేల్, ఆర్ విఠల్, నిజాం షుగర్స్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎం అప్పిరెడ్డితోపాటు మరో 30 మంది రైతులు, మెట్పల్లి, మెదక్కు చెందిన రైతు నాయకులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
వరల్డ్కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?: సీఎం జగన్
IPL 2024: నేను ఏమాత్రం సంతోషంగా లేను: ప్రీతి జింటా ట్వీట్ వైరల్
పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement