Naya Bazar
-
ప్రైవేట్ లాకర్లలో కోట్లాది రూపాయలు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని చాందినీ చౌక్లో ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తున్న లాకర్లలో భారీగా సొత్తు బయటపడింది. ఖారి బౌలి, చాందినీ చౌక్, నయా బజార్ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఈ సంస్థకు చెందిన 350 లాకర్లలో డబ్బు, నగలు దాస్తుంటారు. అయితే, వ్యాపారులు పన్నులు ఎగవేసేందుకు లెక్కల్లో చూపని ఆదాయాన్ని ఇక్కడున్న సుమారు 100 లాకర్లలో దాచి ఉంటారని ఆదాయ పన్ను శాఖ(ఐటీ) అధికారులు అనుమానిస్తున్నారు. 39 లాకర్లను తెరిచి చూడగా రూ. 30 కోట్ల నగదు బయటపడిందని, దీన్ని స్వాధీనం చేసుకున్నామని సోమవారం అధికారులు తెలిపారు. మిగతా లాకర్లను కూడా తనిఖీ చేస్తామన్నారు. అయితే, ఎలాంటి అక్రమాలు, అనధికార లావాదేవీలకు పాల్పడలేదని, తమ సంస్థకు 1992లోనే ఆర్బీఐ అనుమతి లభించిందని ఆ సంస్థ నిర్వాహకుడు స్పష్టం చేశారు. -
ఢిల్లీలోని నయాబజార్లో పేలుడు
-
బ్రేకింగ్ న్యూస్: ఢిల్లీలో పేలుడు..!
-
బ్రేకింగ్ న్యూస్: ఢిల్లీలో పేలుడు..!
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ మంగళవారం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పాత ఢిల్లీలోని ఓ వోల్సేల్ మార్కెట్లో పేలుడు సంభవించింది. చాందినీ చౌక్ మార్కెట్ లేదా నయా బజార్గా పేరొందిన ప్రాంతంలో రద్దీ ప్రదేశంలో పేలుడు జరిగినట్టు తెలుస్తోంది. ఈ పేలుడులో ఒకరు మృతిచెందగా.. ఐదుగురు గాయపడ్డారు. దీంతో హుటాహుటీన పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడు జరిగిన ప్రాంతంలో పెద్దసంఖ్యలో టపాసుల కార్ఖానాలు ఉన్నాయి. ఒక బ్యాగులో భారీ ఎత్తున టపాసులు తరలిస్తుండగా అవి ఒక్కసారిగా పేలినట్టు ప్రాథమిక దర్యాప్తు ప్రకారం తెలుస్తోంది. అయితే, పేలుడు ఎలా జరిగింది? కారణం ఏమిటి? అన్న దానిపై అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. ఫోరెన్సిక్ నిపుణులు, స్పెషల్ సెల్ దర్యాప్తు అధికారులు సంఘటనా స్థలం చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీపావళి పండుగ నేపథ్యంలో ఈ పేలుడు ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ అంతటా భద్రత కట్టుదిట్టం చేశారు.