breaking news
natakalalu
-
నాటకరంగ ఘనాపాఠి కొర్రపాటి
స్త్రీ పాత్రలు లేని ప్రదర్శన యోగ్యమైన నాటికల కోసం ఆంధ్రనాటక రంగం ఎదురు చూస్తున్న తరుణంలో ఆ లోటు పూడ్చిన ఘనత డాక్టర్ కొర్రపాటి గంగాధరరావుది. 1950–80 మధ్య దశాబ్దాల్లో తెలుగు నాటక రంగాన్ని ఆయన సుసంపన్నం చేశారు. 110కి పైగా నాటికలు, నాటకాలు రాసి ‘శతాధిక నాటక రచయిత’గా ఖ్యాతి గడించారు. వృత్తిరీత్యా వైద్యుడైన కొర్రపాటి 1922 మే 10న బందరులో జన్మించారు. అభ్యుదయ భావాలతో, సంస్కరణాభిలాషతో, సమసమాజ స్థాపనా ధ్యేయంతో ఆయన రాసిన నాటికలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ఆసక్తిదాయకంగా ప్రేక్షకుల హృదయాలలో పదికాలాల పాటు నిలిచిపోయే విధంగా పాత్రలను తీర్చిదిద్దడంలో ఆయన సిద్ధహస్తుడు. గంభీరమైన సన్నివేశాల మధ్య కూడా ఒక సునిశితమైన హాస్య సంఘటనను చొప్పించి నాటకాలను రంజింపజేయడంలో ఆయనది అందెవేసిన చేయి. ‘యథా ప్రజా తథా రాజా’, ‘పెండింగ్ ఫైలు’, ‘తెరలో తెర’, ‘కమల’, ‘ఆరని పారాణి’, ‘తారా బలం’, ‘తెలుగు కోపం’, ‘కొత్త చిగురు’, ‘లోక సంగ్రహం’ వంటివి వందలాది ప్రదర్శనలకు నోచుకున్నాయి. కొర్రపాటి గొప్ప నటుడు కూడా! చిన్నతనం నుండి నాటకాలు వేసేవారు. అందరూ ఆయన్ని ‘రంగబ్బాయి’ అని పిలిచేవారు. 14 ఏళ్ల వయసులోనే ‘హతవిధీ’ అనే నాటిక రాసి ఆడారు. ప్రధానంగా స్త్రీ పాత్రలు వేసేవారు. ‘విడాకులా’ అనే నాటికలో ఆయన స్త్రీ పాత్ర నటన పలువురి ప్రశంసలు పొందింది. స్వాతంత్రోద్యమ కాలంలో ‘నా దేశం’ నాటకంలో ‘కామ్రేడ్’ పాత్రను పోషించారు. తర్వాతి కాలంలో సినీరచయితగా, నవలా రచయితగా కూడా పేరు గడించారు కొర్రపాటి. ‘ఇద్దరు మిత్రులు’, ‘మాయని మమత’ వంటి చిత్రాలకు మాటలు రాశారు. ఇవిగాక షాడోరైటర్గా కూడా ఇంకా చాలా సినిమాలకు మాటలు రాశారు. కొర్రపాటి సుమారు పది నవలలు రాశారు. వాటిలో ‘లంబాడోళ్ళ రాందాసు’, ‘గృహ దహనం’, ‘ధంసా’ అధిక ప్రాచుర్యాన్ని పొందాయి. ఆంధ్ర నాటక కళా పరిషత్ నుండి అసంఖ్యాకంగా బహుమతులు పొందారు. ‘రంగరచనా ప్రవీణ’ అనే బిరుదాన్ని పొందారు. ఆంధ్ర సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీలలో సభ్యుడిగా నియమితులైనారు. ( చరిత్ర చెక్కిలిపై చెరగని సంతకం) ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వడానికి కొర్రపాటి నాటక శిక్షణాలయాన్ని కూడా నడిపారు. ‘పద్మశ్రీ’ స్థానం నరసింహారావు, బందా కనకలింగేశ్వరరావు, గరికపాటి రాజారావు, పినిశెట్టి, రామచంద్ర కాశ్యప, పృథ్వీ రాజ్ కపూర్ వంటి వారితో కొర్రపాటికి సాన్నిహిత్యం ఉండేది. సినీనటులు పి.ఎల్.నారాయణ, చంద్రమోహన్, నూతన ప్రసాద్, కె.ఎస్.టి. సాయి వంటివారు ఆయన శిష్యవర్గంగా ఉండేవారు. కొర్రపాటి మద్రాస్ మెడికల్ కాలేజీలో వైద్యంలో సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసిన తర్వాత బాపట్లలో వైద్యుడిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. గొప్ప హస్తవాసి కలవారని పేరుండేది. ఆయన సౌమ్యులు, మితభాషి, అభ్యుదయవాది, హాస్యప్రియులు. 1986 జనవరి 27న బాపట్లలో తనువు చాలించారు. – డాక్టర్ పి.సి. సాయిబాబు, రీడర్ ఇన్ కామర్స్(విశ్రాంత) (మే 10న కొర్రపాటి గంగాధరరావు శతజయంతి) -
గౌరీశంకరుల వార్షికోత్సవం ప్రారంభం
ధర్మవరం (ప్రత్తిపాడు) : గ్రామంలో శ్రీ గౌరీశంకరుల 80వ వార్షిక మహోత్సవాలు శుక్రవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. జువ్వలవారి వీధిలో నాటక మహోత్సవాలను సొసైటీ అధ్యక్షుడు జువ్వల చినబాబు ప్రారంభించారు. ఈసందర్బంగా ఏర్పాౖటెన సభలో కళాకారులు దొడ్డిపట్ల సోమన్నదొర, సానా నూకరాజు నాయుడు, ౖవైఎస్సార్సీపీ నాయకుడు పుణ్యమంతు ల కామరాజు, కోనేటి రాజబాబు, సొసైటీ డైరెక్టర్ జువ్వల దొరబాబు, మాజీ వైస్ ఎంపీపీ బొల్లు కొండబాబు తదితరులు మా ట్లాడుతూ 80 ఏళ్లుగా గ్రామంలో నాటక ప్రదర్శనలు చేస్తున్న ఉత్సవ కమిటీని అభినందించారు. కార్యక్రమంలో కోలా తాతబాబు, మచ్చెర్ల దాసు, సిద్దా అప్పలరాజు పాల్గొన్నారు. ఆకట్టుకున్న నాటికలు తొలిరోజు రాత్రి నంది నాటకోత్సవాలలో ప్రదర్శనకు ఎంపికైన ‘కృషి’ నాటికను ధర్మవరం శ్రీ ప్రతిభ విద్యాలయ విద్యార్థులు ప్రదర్శించారు. చదువు పరామార్ధాన్ని ఈ నాటిక చాటిచెప్పింది. ఈ నాటికలో అమరాధి శ్రీరమ్య, సఖిలేటి స్వామి, ఐతి సువర్ణ కీర్తి, మేకల కోటేశ్వర అభిరామ్, పెదిరెడ్డి రాజా, నల్లా నూకరాజు నటన ఆకట్టుకుంది. స్నేహా ఆర్ట్స్, చంద్రమాంపల్లి వారిచే ‘నమో నమః,’ పురోహితిక నాటక కళా పరిషత్ వారిచే ‘మాతృత్వం’ సాంఘిక నాటికలను ప్రదర్శించారు. రంజింపజేసిన ‘శ్రీరామాంజనేయ యుద్ధం’ శనివారం రాత్రి ప్రదర్శించిన శ్రీరామాంజనేయ యుద్ధం పౌరాణిక నాటకం ప్రేక్షకులను రంజింపజేసింది. వీఎస్ఎ¯ŒS రాజు (మీసాల రాజు), ఆవాల గన్నిబాబు, శవనగాని శ్రీనివాస్, సాగి రవివర్మ, దాట్ల రంగరాజు, కొండపల్లి సింగన్న, గ్రామస్తుల సహకారంతో గౌరీ శంకర ఉత్సవ కమిటి ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసింది. శ్రీరాముడుగా శ్రీనివాస్, 1వ ఆంజనేయ పాత్రలో నాగూర్బాబు (ధర్మవరం), 2వ ఆంజనేయునిగా బెండపూడి రామారావు పోటీ పడి నటించారు. మిగిలిన వారు పాత్రోచితంగా నటించారు. ఈనాటకానికి హార్మోనియంతో కలిగట్ల రమణ సహకారం అందించారు. గ్రామానికి చెందిన కళాకారుడు దొడ్డిపట్ల జగ్గారావు ‘దుర్యోధన’ ఏకపాత్రాభినయాన్ని ప్రదర్శించారు.