14 ఎర్రచందనం దుంగల పట్టివేత
చంద్రగిరి: చిత్తూరు జిల్లాలో మరోసారి ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. టాస్క్ఫోర్స్ పోలీసులు చంద్రగిరి మండలం నరసింగాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి కూంబింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా 14 ఎర్రచందనం దుంగలను తరలించడానికి కూలీలు సిద్ధంగా ఉన్నారు. పోలీసులను చూసి కూలీలు పరారవగా ఒక్క కూలీ మాత్రం పట్టుబడ్డాడు. ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.