-
చంద్రబాబు మోసగించారు: నరసమ్మ
పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తిలో మార్చి 28న జరిగిన సీఎం ఎన్నికల ప్రచార సభలో హల్చల్ చేసిన కొత్తచెరువు మండలం మీర్జాపురం అవ్వ నరసమ్మను ఆదివారం ‘సాక్షి’ కలిసింది. టీడీపీదీ అంతా మోసమని.. తాను కూడా మోసపోయానని నరసమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది. సీఎం సభకు వస్తే మాకు రూ.5 వేలు ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని వాపోయింది. కాస్త వదులు ‘బాబూ’.. దిగిపోతా..! ఏదో డబ్బులు వస్తాయని పోయాను తప్ప నాకు జగన్ అంటే అభిమానమని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తానని చెప్పింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీడీపీ నాయకుల గుట్టు రట్టయింది. డబ్బులు ఇచ్చి జనాన్ని తరలించారని , అన్ని గ్రామాల నుండి డ్వాక్రా మహిళలను తరలించడంతో అంతమంది కనిపించారని ప్రజలు అంటున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి దుద్దకుంట శ్రీధర్రెడ్డి నామినేషన్కు అశేష జనవాహిని రావడం చూసిన టీడీపీ అభ్యర్థి .. సీఎం సభకు జనం రాకపోతే జనంలోకి చెడుగా మెసేజ్ పోతుందని భావించే డబ్బు విపరీతంగా వెదజల్లి జనాన్ని తరలించారని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
పదిహేను వేల కాన్పుల నర్స్అమ్మ
మొదట నరసమ్మ. తర్వాత డా‘‘ సులగట్టి నరసమ్మ. ఇటీవలి వరకు దాదాపు పదిహేను వేల సుఖ ప్రసవాలు చేశారు. డెబ్బయ్ ఎనిమిదేళ్ల క్రితం మొదటి ప్రసవం చేశారు. గ్రామానికి ప్రధాన మంత్రసాని అయ్యారు. ఏడు దశాబ్దాలుగా అదే వృత్తిలో కొనసాగారు. ఆవిడ హస్తవాసి మంచిదన్న పేరుంది. ఆ పేరును ఇక్కడే వదిలేసి, నరసమ్మ మూడు రోజుల క్రితం డిసెంబరు 25, 2018న నిండు వయసులో 98 సంవత్సరాలు పూర్తిచేసుకుని ఆ భగవంతుడి సన్నిధికి చేరుకున్నారు. నరసమ్మ పురుడు పోస్తే, సుఖప్రసవం కావడమే కాదు, ఆరోగ్యకరమైన పిల్లలు పుడతారని గ్రామంలోని వారి నమ్మకం. నరసమ్మ దగ్గర ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. ఇన్నివేల పురుళ్లు పోసినా, ఒక్కరిదగ్గరా ఒక్క పైసా తీసుకోలేదు. స్వచ్ఛంద సేవ చేయడానికే ఇష్టపడ్డారు వృద్ధురాలైన నరసమ్మ. ఇన్ని సేవలు చేసినందుకే ఆవిడను ‘సులగట్టి’ బిరుదుతో సత్కరించారు. ఈ కన్నడ పదానికి ‘పురుడు పోయడం’ అని తెలుగు అర్థం. అయితే ఆమె జీవితాన్ని సరిగ్గా నిర్వచించాలంటే, ‘ఎన్నో కుటుంబాలో సంతోషాన్ని తీసుకువచ్చిన వ్యక్తి’. నరసమ్మ అమ్మమ్మ మార్గమ్మ కూడా ఆ రోజుల్లో మంత్రసానిగా పని చేశారు. ఆవిడ నుంచే ఈ విద్యను నేర్చుకున్నారు నరసమ్మ. సులువుగా పురుడు పోయడం కూడా అమ్మమ్మ దగ్గర నుంచే అబ్బింది. టుంకూరు జిల్లా పావ్గడ్ గ్రామంలో జన్మించారు నరసమ్మ. 2014లో కర్ణాటక టుంకూర్ విశ్వవిద్యాలయం నరసమ్మను డా. సులగట్టి నరసమ్మగా గౌరవించింది. ప్రసవాలు చేయడమే కాదు, చాలామందికి తన గుడిసెలో ఆశ్రయం కూడా ఇచ్చారు. అనేక సంచార జాతుల వారు ఈ గ్రామానికి వచ్చి ఆమె దగ్గర సేదతీరి వెళ్లేవారట. వారికి సహాయం చేయడమంటే నరసమ్మకు పరమానందమని ఆమె కుటుంబ సభ్యులు చెప్పుకుంటారు. గర్భిణుల కోసం ఆకులతో మందులు తయారు చేసేవారు నరసమ్మ. ఈ మందులే ఆమె విజయానికి కారణం అయ్యాయి. గర్భంలో ఉండే బిడ్డకు తల భాగం ఎక్కడ ఉంది, లోపల బిడ్డ ఆరోగ్యం ఎలా ఉందో కూడా చేతితో ముట్టుకుని చెప్పేవారు నరసమ్మ. ఈ ఏడాది ఆమెకు పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఆరోగ్య రహస్యం నరసమ్మకు 12 మంది పిల్లలు, 22 మంది మనవలు. తాను ఆరోగ్యంగా ఉండటం మాత్రమే కాకుండా, అందరికీ సుఖప్రసవం చేశారు నరసమ్మ. చిరుధాన్యాలు మాత్రమే ఆహారంగా తీసుకునేవారు. 90 సంవత్సరాల వయసులో కూడా ఆవిడకు కళ్లజోడు లేదు. శరీర భాగాలన్నీ ఆరోగ్యంగా పనిచేశాయి. బంగారంలాంటి మనసు ఆవిడది. తనకున్న పరిజ్ఞానంతో 180 మంది విద్యార్థులను పరీక్షలో ఉత్తీర్ణులను చేశారు. ఆఖరి అమ్మాయి జయమ్మను కూడా మిడ్వైఫ్ను చేశారు. – జయంతి -
మహామాతకు పద్మశ్రీ
సాక్షి, బెంగళూరు: ఆమె ఎన్నో వేల మందికి ప్రసవాలు చేసి తల్లీబిడ్డలకు ప్రాణాలు నిలిపింది. తల్లులకే తల్లిగా ప్రసిద్ధిచెందింది. కర్ణాటక మహామాతగా పేరుగాంచిన సూలగిత్తి నరసమ్మను పద్మశ్రీ పురస్కారం వరించింది. గురువారం ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. 97 ఏళ్ల నరసమ్మ స్వస్థలం తుమకూరు జిల్లా పావుగడ తాలుకాలోని కృష్ణాపురం గ్రామం. ఆమె 70 ఏళ్లుగా సుమారు 15 వేల మందికి పైగా గర్భిణిలకు కాన్పులు చేశారు. ఒక్కరి నుంచి కూడా డబ్బు తీసుకోరు. తన చల్లని చేతులతో బిడ్డను తల్లి ఒడిలో పెట్టి మనసు నిండా సంతృప్తితో ఇంటిముఖం పడతారు. ఇటీవలే తుమకూరు విశ్వవిద్యాలయం ఆమెను గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. ఆమె తుమకూరు, చిత్రదుర్గం జిల్లాలతో పాటు అనంతపురం సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామీణ మహిళలకు పురుడు పోయడం గమనార్హం. మహామాత నరసమ్మ చేసిన ఘనమైన సేవలకు గుర్తింపుగా కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. -
కానుగ కాయల కోసం వెళ్లి..
లేపాక్షి (హిందూపురం) : కానుగ కాయల కోసం వెళ్లిన ఓ వృద్ధురాలు చివరకు కానరాని లోకాలకు వెళ్లిన విషాదకర సంఘటన ఇది. లేపాక్షి మండలం నాయనిపల్లికి చెందిన నరసమ్మ(70) పొట్ట కూటి కోసం మూడ్రోజుల కిందట కానుగకాయలు తెచ్చి అమ్ముకునేందుకు వెళ్లిందని ఏఎస్ఐ సుబ్బరామ నాయక్ తెలిపారు. అయితే రాత్రైనా రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారన్నారు. శిరివరం చెరువులో వృద్ధురాలి మృతదేహం తేలియాడుతుండగా బుధవారం రాత్రి గ్రామస్తులు కొందరు గమనించారు. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. గురువారం మృతదేహాన్ని వెలికితీశారు. నాయనిపల్లికి చెందిన నరసమ్మగా గుర్తించారు. కానుగకాయల కోసం వెళ్లిన ఆమె ఎండవేడిమికి తట్టుకోలేక కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ట్రాక్టర్ బోల్తా.. పెళ్లింట్లో విషాదం
కర్నూలు: మూడు ముళ్ల బంధం కోసం బయల్దేరిన పెళ్లి కూతురి తరఫు వారి వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నరసమ్మ(55) అనే వృద్ధ మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీంతో పెళ్లింట్లో విషాదం అలముకుంది. జిల్లాలోని అస్పరి మండలం ములుగుందం గ్రామానికి చెందిన తిక్కయ్య కూతురు లక్ష్మికి పత్తికొండ మండలం అటికెలగుండు నాగేష్ కొడుకు రాజుతో వివాహం నిశ్చయమైంది. ఆదివారం పెళ్లి కొడుకు ఇంటికి తలంబ్రాలు తీసుకెళ్లాల్సివుండటంతో అమ్మాయి తరఫు వారు 40 మంది ట్రాక్టర్లో అటికెలగుండుకు బయల్దేరారు. ములుగుందం దాటిన తర్వాత కైరుప్పల పాఠశాల వద్దకు రాగానే ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో నరసమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. పెళ్లి కూతురితో పాటు మరో 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్ధితి విషమంగా ఉంది. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement