breaking news
nandi statue theft
-
నంది విగ్రహం ధ్వంసం: 8మంది అరెస్ట్
సాక్షి, తిరుపతి : చిత్తూరు జిల్లా లో నంది విగ్రహం ధ్వంసం కేసును పోలీసులు ఛేదించారు. మొత్తం 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుల నుంచి నంది విగ్రహం ధ్వంసం కోసం వినియోగించిన పనిముట్లను స్వాదీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపిన వివరాల మేరకు ఈ నెల 27 న జిల్లాలోని ఆగర మంగళం గ్రామం లోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ని నంది విగ్రహాన్ని దుండగులు పెకిలించి తర్వాత ధ్వంసం చేశారు. ఈ ఘటన మీద వెంటనే విచారణ చేపట్టామని తెలిపారు. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నామన్నారు. (చిత్తూరు జిల్లాలో నంది విగ్రహం ధ్వంసం) ముఠాలో మొత్తం 8 మంది ఉన్నారని తెలిపారు. ఇందులో.5గురు కర్ణాటక వాసులు కాగా ఇద్దరు చిత్తూరు జిల్లా వాలు ఒకరు కర్నూలు వాసి అని తెలిపారు. ఈ ముఠాకు కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన సోమశేఖర్ నాయకత్వం వహిస్తున్నారని అన్నారు. ఈ ముఠా చిత్తూరు, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలో పురాతన ఆలయాల్లో దోపిడీలకు పాల్పడుతూ వచ్చిందంన్నారు. గుప్త నిధుల కోసం విగ్రహాలను ధ్వంసం చేయడమే ఈ ముఠా పనిగా పెట్టుకొందన్నారు. ముఠా నుంచి విగ్రహాల ధ్వంసానికి వినియోగించిన పని ముట్లను కూడా స్వాదీనం చేసుకున్నామని తెలిపారు. (‘ఈ తీర్పుతో సనాతన ధర్మం రక్షించబడింది’) -
నంది విగ్రహం అపహరణ
కుందుర్పి: పోలీసుల నిర్లక్ష్యం.. గ్రామస్తుల అభద్రతాభావం కారణంగా దుండగులు గుప్త నిధుల కోసం నిజవళ్లి గ్రామంలోని పురాతన శివాలయంలో గల నంది విగ్రహాన్ని ఎత్తుకుపోయారు. శనివారం అర్ధరాత్రి సమయంలోనే ఐదుగురు వ్యక్తులు ఓమిని వాహనంలో వచ్చి శివాలయంలో నంది విగ్రహానికి పూలు చేశారు. విగ్రహాన్ని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసినా గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించే ప్రయత్నం చేయలేదు. ఆదివారం తెల్లవారుజాముకల్లా నంది విగ్రహం కనిపించలేదు. అర్ధరాత్రి వచ్చి పూజలు చేసిన వారే విగ్రహాన్ని అపహరించుకుపోయి ఉంటారని భావించి కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణకు గ్రామస్తులు ఫిర్యాదు చే శారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్ఐ శ్రీనివాసులు, జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక పోలీసు బృందం వచ్చి పరిశీలించారు. గతంలో కూడా ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయి.