నంది విగ్రహం ధ్వంసం: 8మంది అరెస్ట్‌ | Police Arrested Culprit Ofcr Nandi Idol Destroyed Case In Chittoor District | Sakshi
Sakshi News home page

నంది విగ్రహం ధ్వంసం కేసును ఛేదించిన పోలీసులు

Sep 30 2020 3:30 PM | Updated on Sep 30 2020 4:05 PM

Police Arrested Culprit Ofcr Nandi Idol Destroyed Case In Chittoor District - Sakshi

సాక్షి, తిరుపతి : చిత్తూరు జిల్లా లో నంది విగ్రహం ధ్వంసం కేసును పోలీసులు ఛేదించారు. మొత్తం 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుల నుంచి నంది విగ్రహం ధ్వంసం కోసం వినియోగించిన పనిముట్లను స్వాదీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపిన వివరాల మేరకు ఈ నెల 27 న జిల్లాలోని ఆగర మంగళం గ్రామం లోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ని నంది విగ్రహాన్ని దుండగులు పెకిలించి తర్వాత ధ్వంసం చేశారు. ఈ ఘటన మీద వెంటనే విచారణ చేపట్టామని తెలిపారు. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నామన్నారు. (చిత్తూరు జిల్లాలో నంది విగ్రహం ధ్వంసం)

ముఠాలో మొత్తం 8 మంది ఉన్నారని తెలిపారు. ఇందులో.5గురు కర్ణాటక వాసులు కాగా ఇద్దరు చిత్తూరు జిల్లా వాలు ఒకరు కర్నూలు వాసి అని తెలిపారు. ఈ ముఠాకు కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన సోమశేఖర్ నాయకత్వం వహిస్తున్నారని అన్నారు. ఈ ముఠా చిత్తూరు, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలో పురాతన ఆలయాల్లో దోపిడీలకు పాల్పడుతూ వచ్చిందంన్నారు. గుప్త నిధుల కోసం విగ్రహాలను ధ్వంసం చేయడమే ఈ ముఠా పనిగా పెట్టుకొందన్నారు. ముఠా నుంచి విగ్రహాల ధ్వంసానికి వినియోగించిన పని ముట్లను కూడా స్వాదీనం చేసుకున్నామని తెలిపారు. (‘ఈ తీర్పుతో సనాతన ధర్మం రక్షించబడింది’)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement