breaking news
nalgonda railway station
-
రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
నల్లగొండ : రైలు కిందపడి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన నల్లగొండ రైల్వే స్టేషన్లో బుధవారం చోటుచేసుకుంది. పానగల్కు చెందిన మహేష్ రైల్వే స్టేషన్లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ విఫలమడంతోనే మహేష్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
రైలు కింద పడి తల్లి సహా చిన్నారి మృతి
-
రైలు కింద పడి తల్లి సహా చిన్నారి మృతి
నల్లగొండ: రెండేళ్ల చిన్నారితోపాటు ఓ తల్లి రైలు కిందపడి మృతి చెందింది. ఈ ఘటన నల్లగొండ పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారు జామున తల్లీకూతుళ్ల మృతదేహాలను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, పట్టాలు దాటుతుంటే రైలు ఢీకొని మృతిచెంది ఉంటారా లేక కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుందా అనే వివరాలు, వారి పేర్లు తదితర సమాచారం తెలియరాలేదు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.