రైలు కింద పడి తల్లి సహా చిన్నారి మృతి | Bodies of mother and daughter found on railway tracks | Sakshi
Sakshi News home page

May 27 2015 12:19 PM | Updated on Mar 21 2024 6:38 PM

రెండేళ్ల చిన్నారితోపాటు ఓ తల్లి రైలు కిందపడి మృతి చెందింది. ఈ ఘటన నల్లగొండ పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారు జామున తల్లీకూతుళ్ల మృతదేహాలను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, పట్టాలు దాటుతుంటే రైలు ఢీకొని మృతిచెంది ఉంటారా లేక కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుందా అనే వివరాలు, వారి పేర్లు తదితర సమాచారం తెలియరాలేదు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement