రైలు కిందపడి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన నల్లగొండ రైల్వే స్టేషన్లో బుధవారం చోటుచేసుకుంది.
నల్లగొండ : రైలు కిందపడి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన నల్లగొండ రైల్వే స్టేషన్లో బుధవారం చోటుచేసుకుంది. పానగల్కు చెందిన మహేష్ రైల్వే స్టేషన్లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ విఫలమడంతోనే మహేష్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.