రైలు కింద పడి తల్లి సహా చిన్నారి మృతి | mother died with her child at nalgonda railway station | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి తల్లి సహా చిన్నారి మృతి

May 27 2015 11:18 AM | Updated on Sep 3 2017 2:47 AM

రెండేళ్ల చిన్నారితోపాటు ఓ తల్లి రైలు కిందపడి మృతి చెందింది.

నల్లగొండ: రెండేళ్ల చిన్నారితోపాటు ఓ తల్లి రైలు కిందపడి మృతి చెందింది. ఈ ఘటన నల్లగొండ పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారు జామున తల్లీకూతుళ్ల మృతదేహాలను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, పట్టాలు దాటుతుంటే రైలు ఢీకొని మృతిచెంది ఉంటారా లేక కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుందా అనే వివరాలు, వారి పేర్లు తదితర సమాచారం తెలియరాలేదు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement