breaking news
Naga Durga
-
ఓటీటీలోకి నాగదుర్గ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
తెలంగాణ ఫోక్ సాంగ్స్తో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబర్ నాగదుర్గ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఈమె గతంలో 'కలివనం' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. గతేడాది ఇది థియేటర్లలో ఆపై ఓటీటీలోకి వచ్చింది గానీ జనాలకు దీని గురించి అస్సలు తెలీదు. అయితే ఈమె రీసెంట్గా తమిళంలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ధనుష్ మేనల్లుడు మూవీలో చేసింది. ఇప్పుడీ చిత్ర ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.(ఇదీ చదవండి: 'జన నాయగన్' తొలిరోజు కలెక్షన్ ఎన్ని కోట్లు?)నాగదుర్గ తమిళంలో చేసిన తొలి సినిమా 'లవ్ ఓ లవ్'. పవిష్ హీరో. ఈ నెల 10న తమిళంతో పాటు తెలుగులనూ రిలీజైంది గానీ జనాలు అస్సలు పట్టించుకోలేదు.. దీంతో డిజాస్టర్ అయింది. ఇప్పుడీ చిత్రం ఈ నెల 31 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుందని పోస్టర్ రిలీజ్ చేశారు.'లవ్ ఓ లవ్' విషయానికొస్తే.. రఘు(పవిష్), అవంతిక(నాగదుర్గ)ని ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అయితే ప్రేమలో పడిన తర్వాత సినిమాలు, షికార్లు, షాపింగ్ పేరుతో రఘు డబ్బులన్నీ అవంతిక అవగొట్టేస్తుంది. చివరుు క్రెడిట్ కార్డులు, అప్పులు తీసుకునేలా చేస్తుంది. కానీ కొన్నాళ్ల తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్లిన రఘు.. అవంతిక తనకు లవ్, రఘు వద్దని ఓ బ్రేకప్ లెటర్ మీద సంతకం పెట్టాలని లేదంటే ప్రేమలో తనకు చేసినవన్నీ ఓ నాలుగు నెలలు తన స్థానంలో ఉండి తను చేసినవన్నీ చేయాలని అడుగుతాడు. దీంతో అవంతిక రఘుని చూసుకుంటానని చెబుతుంది. తర్వాత ఏమైంది? ఈ క్రమంలో అవంతిక ఎదుర్కున్న ఇబ్బందులేంటి? చివరకు వీళ్లిద్దరూ ఒక్కటయ్యారా అనేది మిగతా స్టోరీ.ఇక ఈ వారం ఓటీటీల్లో రిలీజైన సినిమాల విషయానికొస్తే నాగబంధం, పురుషః లాంటి తెలుగు సినిమాలతో పాటు కాన్ సిటీ, పల్లిచట్టంబి తదితర డబ్బింగ్ చిత్రాలు.. ముసాఫిర్ కేఫ్, ఆదర్శ్ బాలవిద్యాలయ లాంటి డబ్బింగ్ సిరీస్లు స్ట్రీమింగ్లోకి వచ్చాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా) -
డిసెంబర్లో ‘ఇడుపు కాయితం’!
తెలంగాణ ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ, ప్రియదర్శి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వంశీరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బన్నీవాసు, సుకుమార్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది.‘ఇడుపు కాయితం’సినిమా టైటిల్ నేపథ్యంగా సాగిన చర్చ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టైటిల్ తోనే ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అతి తక్కువ టైమ్ లో మరే చిత్రానికీ లేనంతగా ఈ సినిమా వార్తల్లో నిలిచింది. దీంతో ప్రేక్షకుల దృష్టిని ఈ సినిమా బాగా ఆకర్షిస్తోంది. సినిమా పూజా కార్యక్రమాల సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. "ఇడుపు కాయితం" త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఈ సినిమాను డిసెంబర్ ఫస్ట్ వీక్ లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రేజీ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో దర్శక నిర్మాతలు షేర్ చేసుకోనున్నారు. -
తెలుగు ప్రేక్షకులు ఎలాంటి తేడా చూపించరు : విశ్వక్ సేన్
‘‘లవ్ ఓ లవ్’ యూనివర్సల్ రొమాంటిక్ కామెడీ మూవీలా అనిపిస్తోంది. కథ, కంటెంట్ బాగుంటే తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరిస్తారు. అది తెలుగు సినిమా అయినా, తమిళ సినిమా అయినా భేదం చూపరు. సూర్య, కార్తీ, ధనుష్, ప్రదీప్ రంగనాథన్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో తెలిసిందే. ‘లవ్ ఓ లవ్’ విజయం సాధించి, పావిష్ కూడా వారి జాబితా లో చేరాలని కోరుకుంటున్నాను’’ అని హీరో విశ్వక్ సేన్ పేర్కొన్నారు. పావిష్ నారాయణన్, నాగ దుర్గ జంటగా మాగేశ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ ఓ లవ్’. మహేందర్ రావు వంగపల్లి సమర్పణలో దినేష్ రాజ్, జి. ధనంజయన్ నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీవైష్ణవి పిక్చర్స్ సంస్థ ఈ నెల 10న తెలుగులో విడుదల చేస్తోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి విశ్వక్సేన్, నిర్మాతలు సి. కల్యాణ్, దామోదర్ ప్రసాద్, డైరెక్టర్ జి. నాగేశ్వర రెడ్డి హాజరై, సినిమా సక్సెస్ అవ్వాలన్నారు. ధనంజయన్ మాట్లాడుతూ–మా సినిమాపై నమ్మకంతో సుబ్బారావుగారు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడానికి ముందుకు రావడం ఆనందాన్ని కలిగించిందనీ, మీ ప్రేమ, ఆశీర్వాదాలు మా చిత్రానికి ఉండాలనీ అన్నారు మాగేశ్ రాజేంద్రన్. ‘‘ధనంజయన్గారితో కలిసి చేసిన నా తొలి చిత్రం ‘లవ్ ఓ లవ్’’ అని దినేష్ రాజ్ పేర్కొన్నారు. ‘‘మా సినిమాను చూసి ఆశీర్వదించండి’’ అని పావిష్ నారాయణన్ తెలిపారు. ‘‘తెలుగు అమ్మాయి అయిన నేను తమిళ చిత్రంతో హీరోయిన్గా పరిచయం కావడం హ్యాపీగా ఉంది’’ అని నాగ దుర్గ పేర్కొన్నారు. -
నాగదుర్గ విచిత్రమైన లవ్ స్టోరీ.. తెలుగు ట్రైలర్
తెలంగాణ ఫోక్ సాంగ్స్తో యూట్యూబ్లో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న నాగదుర్గ.. తమిళంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 'లవ్ ఓ లవ్' పేరుతో తీసిన ఓ సినిమా చేసింది. హీరో ధనుష్ మేనల్లుడు పవిష్ హీరో. ఈ మూవీని ఈ శుక్రవారం(జూలై 10) తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఆ ఒక్క కారణం వల్లే 'అబ్సెషన్' చూశారు: నాగవంశీ)ట్రైలర్ బట్టి చూస్తే అవంతిక(నాగదుర్గ), రఘు(పవిష్) ప్రేమించుకుంటారు. కానీ ప్రతిచిన్నదానికి రఘుతోనే అవంతిక ఖర్చు చేయిస్తూ ఉంటుంది. అలా నాలుగేళ్లు అయిపోతాయి. ఇక వల్ల కాదని ఫిక్స్ అయిన రఘు.. ఇప్పటివరకు తాను ఎలా అయితే ఖర్చు పెట్టి చూసుకున్నాడో.. తనని అవంతిక ఓ నెలలు చూస్తే చాలని అంటాడు. అప్పుడు ఏమైంది? చివరకు డబ్బు కంటే ప్రేమ గొప్పదని తెలుసుకున్నారా? లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్ అయితే బాగానే ఉంది. మరి నాగదుర్గ ఈ మూవీతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో?(ఇదీ చదవండి: అవార్డులకు ఎన్నో దారులు.. చిరు వ్యాఖ్యలపై రాజేంద్రప్రసాద్ రియాక్షన్) -
‘ఇడుపు కాయితం’ వివాదం.. ట్రెండింగ్లో తెలంగాణ పిల్ల
‘ఇడుపు కాయితం’.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ సినిమా టైటిల్ గురించే చర్చ. ఈ సినిమాని ఏపీలో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తారా అని కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. మా యాసని అవమానిస్తారా అంటూ తెలంగాణ నెటిజన్స్, మెధావులు ఫైర్ అవుతున్నారు. టైటిల్ని అవమానిస్తూ వెతకారంగా పెట్టిన పోస్టులకు కౌంటర్గా తెలంగాణ నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇలా ఈ వ్యవహారం ఇప్పుడు రెండు రాష్ట్రాల నెటిజన్స్ మధ్య పెద్ద చర్చకు తెరలేపింది. అయితే ఈ క్రమంలో ‘ఇడుపు కాయితం’ హీరోయిన్ నాగదుర్గ గురించి కూడా ఆరా తీస్తున్నారు. ఆమె చేసిన ఫోక్ సాంగ్స్ వీడియో క్లిప్పులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నాగదుర్గ నేపథ్యం గురించి, ఆమె కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు..→ తెలంగాణ జానపద పాటలకు ఈ మధ్య ఆదరణ పెరిగింది. సినిమాల్లోనూ తెలంగాణ ఫోక్ సాంగ్స్ని వాడుతున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని పల్లె మట్టివాసనలు గల ఎంతో మంది కళాకారులు వెలుగులోకి వస్తున్నారు. వారిలో డిజిటల్ స్క్రీన్పై, యూట్యూబ్ జానపద గీతాల్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబడుతూ 'ఫోక్ స్టార్'గా గుర్తింపు తెచ్చుకున్న నృత్యకారిణి నాగదుర్గ (గుత్తా నాగదుర్గ) ఒకరు.→ నాగదుర్గ స్వస్థలం నల్గొండ జిల్లా అడ్డగూడూరు. ఆమె తల్లిదండ్రులు గుత్తా చలపతిరావు, వాసవి దంపతులు ఉద్యోగరిత్యా నల్గొండ పట్టణంలో స్థిరపడ్డారు. పదో తరగతి వరకు నల్గొండలోనే చదివిన నాగదుర్గ.. ఇంటర్, డిగ్రీ, పీజీ హైదరాబాద్లో పూర్తి చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి కూచిపూడి నృత్యంలో మాస్టర్స్ (పీజీ) పూర్తి చేశారు.→ నాగదుర్గకు చిన్నతనం నుంచే నృత్యంపై విపరీతమైన ఆసక్తి ఉండేది. స్థానిక రామాలయంలో జరిగే భజనలు, నృత్యాలను చూసి ఇంటికొచ్చాక చున్నీ కట్టుకుని డాన్స్ ప్రాక్టీస్ చేసేదట. కూతురిలోని ఈ తపనను గమనించిన తల్లి వాసవి.. ఆమెను నాట్యం వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో నాగదుర్గనే చెప్పారు.జానపదంతో జాతకం మారింది→ కూచిపూడి బ్యాక్గ్రౌండ్ ఉన్న నాగదుర్గ కోవిడ్ సమయంలో జానపద గీతాల వైపు అడుగులు వేసింది. కోవిడ్ టైమ్లో అప్పటికే యూట్యూబ్లో రిలీజ్ అయిన 'ధన్ ధన ధన్' అనే ఫోక్ సాంగ్కి స్టెప్పులేసి ఆ వీడియోని తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిందట. అది చూసే తొలి పాట ‘తిన్నా తీరం పడతలే’ చాన్స్ వచ్చింది. ఫోక్ డ్యాన్సర్గా ఎంట్రీ ఇచ్చిన తొలి పాటనే సూపర్ హిట్ అయింది. యూట్యూబ్లో మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత నాగదుర్గు జాతకమే మారిపోయింది.→ కూచిపూడి నేర్చుకోవడం వల్ల నాగదుర్గకు ముఖ కవళికలు (ఎక్స్ప్రెషన్స్) పలకడం చాలా సులువైంది. జానపద పాటల్లోని ఎనర్జిటిక్ స్టెప్స్కు తన క్లాసికల్ హావభావాలను జోడించి ఆమె చేసిన డ్యాన్స్ వీక్షకులను కట్టిపడేసింది. అందుకే ఆమె చేసిన తొలి సాంగ్ ‘తిన్నా తీరం పడతలే’ నుంచి ఇటీవల వచ్చిన ‘లగారే సౌండ్ సాలా’ వరకు ప్రతి పాట మిలియన్ల వ్యూస్ సాధించాయి. ఆమె కట్టు బొట్టు, పల్లెటూరి పడచులా అమాయకత్వంతో కూడిన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ సోషల్ మీడియాలో ఆమెను స్టార్ను చేశాయి.→ నాగదుర్గకు గ్లామర్ దుస్తుకంటే సాంప్రదాయ చీరకట్టు, హాఫ్ శారీస్ అంటేనే ఇష్టం. స్క్రీన్పై కూడా మితిమీరిన గ్లామర్కు ఆమె ఒప్పుకోరు. అందుకే చాలా సినిమా అవకాశాలను వదులుకుంది.→ సినిమా ఇండస్ట్రీలో తనకు రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఎనలేని అభిమానమని, ఆయన సినిమాలో ఒక చిన్న పాత్ర దొరికినా చాలని ఓ ఇంటర్వ్యూల్లో నాగదుర్గ చెప్పింది.→ తెలుగులోలో కలివి వనం అనే సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో ‘లవ్ ఓ లవ్’ అనే సినిమా చేసింది. ఇప్పుడు ప్రియదర్శి జోడిగా ఇడుపు కాయితం అనే సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రాన్ని సుకుమార్, బన్నీ వాసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజ్ చేశారు. ఇందులో ‘శ్రీలత’ అనే తెలంగాణ పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా టైటిలే ఇప్పుడు నెట్టింట నాగదుర్గను ట్రెండింగ్గా మార్చింది. -
'ఇడుపు కాయితం' అంటే ఏంటి? సోషల్ మీడియాలో తెలంగాణ vs ఆంధ్రా
యూట్యూబ్ సెన్సేషన్ నాగదుర్గ.. హీరోయిన్గా చేస్తున్న లేటెస్ట్ తెలుగు సినిమా 'ఇడుపు కాయితం'. ప్రియదర్శి హీరోగా నటిస్తుండగా వంశీరెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాయి. బన్నీవాసు, సుకుమార్ రైటింగ్స్ పతాకంపై కలిసి నిర్మిస్తున్నారు. అయితే అసలు 'ఇడుపు కాయితం' అంటే ఏంటి అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రా, తెలంగాణ నెటిజన్ల మధ్య వార్ నడుస్తోంది.(ఇదీ చదవండి: జైలులో హీరో దర్శన్.. కారు యాక్సిడెంట్ వివాదంలో కొడుకు)'ఇడుపు కాయితం' అనేది పక్కా తెలంగాణ గ్రామీణ పదం కావడంతో ఆంధ్రాతో పాటు హైదరాబాద్లో నివసిస్తున్న చాలామందికి దీని అర్థమేంటి అనేది తెలియడం లేదు. ఇడుపు కాయితం అంటే విడాకుల పత్రం. భార్యభర్తలు విడిపోవడానికి పెద్దల సమక్షంలో కుదుర్చుకున్న ఒప్పంద పత్రాన్ని ఇలా పిలుస్తారు. ఇప్పుడంటే విడాకుల కోసం కోర్టులకు వెళ్తున్నారు. డివోర్స్ అని ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు.కానీ కొన్నాళ్ల క్రితం కలిసి బతకలేం అని నిర్ణయించుకున్న దంపతులు.. పెద్ద మనుషుల సమక్షంలో విడిపోవడానికి ఒప్పందం చేసుకునేవాళ్లు. దీన్ని ఇడుపు కాయితం అని పిలిచేవాళ్లు. హైదరాబాద్ లాంటి నగరాల్లో దీన్ని పెద్దగా ఉపయోగించట్లేదు గానీ తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఇడుపు కాయితం రాసుకుని విడిపోతున్న జంటలు ఉన్నాయి. ఇడుపు, ఇడుసు అంటే వదిలిపెట్టడం. ఇడుపు కాయితం అంటే విడిపోయేటప్పుడు రాసుకునే అగ్రిమెంట్.అయితే ఈ పదం అంటే ఏంటో తెలియని కొందరు ఆంధ్రా నెటిజన్లు.. ఈ సినిమా తెలుగులో డబ్బింగ్ చేస్తారా అని ఫన్నీ పోస్టులు పెట్టడంతో తెలంగాణకు చెందిన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ చిన్న సినిమా టైటిల్ గురించి పెద్ద చర్చే నడుస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే మూవీ టీమ్కి ఇది ప్లస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే షూటింగ్ మొదలవకముందే మూవీ గురించి నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారుగా మరి!(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ మిస్టరీ థ్రిల్లర్.. గొర్రెలు డిటెక్టివ్స్ అయితే? తెలుగు రివ్యూ) -
ఈ కథ మూలాలు ప్రతి ఇంట్లో ఉంటాయి – ప్రియదర్శి
ప్రియదర్శి, నాగదుర్గ (తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఫేమ్) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో బన్నీ వాసు వర్క్స్, సుకుమార్ రైటింగ్స్పై బన్నీ వాసు, సుకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గురువారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. తమిళ దర్శక–నిర్మాత, నటుడు లోకేష్ కనగరాజ్ ముఖ్య అతిథిగా హాజరై, ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. తొలి సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. ప్రియదర్శి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో శ్రీనివాస్ అనే పాత్ర చేస్తున్నాను. తెలంగాణ నేపథ్యంతో కూడిన ఈ సినిమాలో తెలంగాణ భాష, యాస, తిండి, బట్ట అంతా కనిపించవచ్చు. కానీ ఇదొక గ్లోబల్ అని గర్వంగా చెప్పగలను. ఈ కథ మూలాలు ప్రతి ఇంట్లో ఉంటాయి’’ అన్నారు. ‘‘నేను పక్కా తెలంగాణ అమ్మాయిని. ఈ కథ విన్నప్పుడు బాల్యంలోకి వెళ్లిపోయాను. మనం ఈ సినిమా చేస్తున్నాం అని సుక్కుకు చె΄్పాను. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో ఇదొక మైల్స్టోన్ మూవీ’’ అన్నారు నిర్మాత తబిత సుకుమార్. ‘‘ఈ కథ చెప్పగానే నమ్మి, సినిమా చేస్తున్నామని చెప్పిన మా ఆడబిడ్డ తబితగారితో పాటు సుకుమార్, బన్నీ వాసు, దర్శి, బూసం జగన్మోహన్ రెడ్డిగార్లకు, వేణు ఊడుగుల, పూజారి నాగేశ్వరరావులకు థ్యాంక్స్’’ అన్నారు వంశీకృష్ణ. ‘‘ఈ సినిమా రిలీజ్ అయ్యాక అమ్మాయి అయితే... వాళ్ల అత్తామామను తీసుకుని థియేటర్కి వెళ్లండి. బయటకు వచ్చాక మీ అత్త మీ చేతులు పట్టుకుంటుంది. అబ్బాయి అయితే అత్తామామను తీసుకుని విడిగా థియేటర్కు వెళ్లండి. అల్లుడి చేతులు మామగారు పట్టుకుంటారు’’ అన్నారు బన్నీ వాసు. ‘‘యూట్యూబ్లో నా పాటలు చూసి, విని ఉంటారు. ఇప్పుడు ఈ సినిమాతో హీరోయిన్గా మీ ముందుకు వస్తున్నాను. ఇందులో నేను చేస్తున్న శ్రీలత పాత్ర చాలా బరువైనది’’ అన్నారు నాగదుర్గ. -
నాగదుర్గ 'ఇడుపు కాయితం' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
నాగదుర్గ.. యూట్యూబ్ సాంగ్స్ నుంచి హీరోయిన్ ఛాన్స్ల వరకు (ఫొటోలు)
-
హీరోయిన్గా ఫోక్ సింగర్
తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ హీరోయిన్గా పరిచయం కానున్నారు. ప్రియదర్శి హీరోగా నటించనున్న ఈ సినిమాకి వంశీ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. బన్నీ వాసు వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించనున్న ఈ సినిమా ఈ నెల 25న ప్రారంభం కానుంది.ఈ సినిమాతో నాగదుర్గ హీరోయిన్గా పరిచయం కానున్న విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ‘‘నాగదుర్గ చేసిన అనేక తెలంగాణ ఫోక్ సాంగ్స్ రికార్డ్ స్థాయి వ్యూస్ సాధించాయి. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ స్టోరీతో ఈ సినిమాను వంశీ రెడ్డి రూపొందించనున్నారు. జూలైలో రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
హీరోయిన్గా ఫేమస్ తెలుగు యూట్యూబర్ నాగదుర్గ.. టీజర్ రిలీజ్
తెలుగులో పదుల సంఖ్యలో ఆల్బమ్ సాంగ్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దారిపొంటొత్తుండు, పెద్దిరెడ్డి, నా పేరు ఎల్లమ్మ లాంటి హిట్ సాంగ్స్ మిలియన్ల కొద్ది వ్యూస్ సొంతం చేసుకున్నాయి. అయితే తెలుగులో 'కలివనం' అనే సినిమాలో హీరోయిన్గా చేసింది గానీ ఇదొకటి రిలీజైందనే సంగతి కూడా చాలామందికి తెలియదు! ఇప్పుడు తమిళంలో ఎంట్రీకి సిద్ధమైంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. కుర్చీ కోసం కొట్లాట)స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవిష్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలోనే నాగదుర్గనే మెయిన్ హీరోయిన్. 'లవ్ ఓ లవ్' పేరుతో తీస్తున్న ఈ సినిమాని వచ్చే నెలలో థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఇది చూస్తుంటే హీరోయిన్ పాత్రకు బాగానే ఇంపార్టెన్స్ ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రియుడితో ఇష్టమొచ్చినట్లు ఖర్చుపెట్టించే మోడ్రన్ అమ్మాయిగా నాగదుర్గ కనిపించనుంది. ఈ మూవీ హిట్ అయితే తమిళంలో మరిన్ని అవకాశాలు రావొచ్చు.ఇప్పటికే తమిళంలో గౌరిప్రియ, శ్రీదివ్య లాంటి తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నాగదుర్గ, వైష్ణవి చైతన్య లాంటి వాళ్లు కూడా తమిళంలోకి వెళ్లిపోతున్నారు. మరి తమిళంలో వీళ్లకు అవకాశాలు వస్తున్నాయి. తెలుగు దర్శకులు మాత్రం వీళ్లని పెద్దగా పట్టించుకోవట్లేదా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది) -
యూట్యూబ్ను షేక్ చేస్తున్న ‘పేరుగల్ల పెద్దిరెడ్డి’ సాంగ్
తెలంగాణ జానపదలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాయని, నృత్యకారిణి నాగదుర్గ నుంచి తాజాగా విడుదలైన పాట ‘పేరుగల్ల పెద్దిరెడ్డి’ ప్రస్తుతం యూట్యూబ్లో మరియు సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. తెలంగాణ ఫోక్ సాంగ్స్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ, ఈ కొత్త పాటతో మరోసారి ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. పేరుగల్ల పెద్దిరెడ్డి అంటూ వచ్చిన ఈ పాట తండ్రి మీద ప్రేమతో కూతురు చెబుతున్న నేపథ్యంలో ఉంది. పల్లెటూరి వాతావరణాన్ని, జానపద లయను ప్రతిబింబిస్తూ ఈ పాట ఆకట్టుకుంటుంది. ఎప్పటిలాగే, నాగదుర్గ ఈ పాటలో తనదైన శైలిలో చేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. శుక్రవారం విడుదలైన ఈ పాట కొద్ది గంటల్లోనే యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్ను సాధిస్తూ ట్రెండింగ్లో నిలిచింది. పల్లె జానపద పాటల అభిమానుల మధ్య ఈ పాట క్రేజీ హిట్గా మారడంతో నాగదుర్గ ఖాతాలో మరో విజయవంతమైన జానపద పాట చేరింది. ఈ పాటకు బుల్లెట్ బండి లక్ష్మణ్ సాహిత్యం అందించగా.. మమత రమేష్ గానం చేశారు. సంగీతాన్ని మదన్ కే అందించారు. -
Naga Durga: బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది.. కానీ నాకు గొడవ పడటం అస్సలు రాదు..
-
నాగదుర్గ హీరోయిన్గా తొలి చిత్రం..‘కలివి వనం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
తెలుగు ఫోక్ డ్యాన్సర్కి తమిళంలో హీరోయిన్ ఛాన్స్
ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాలు మాత్రమే. ఇప్పుడు టెక్నాలజీ చాలా మారిపోయింది. యూట్యూబ్లోనూ పలు ఆల్బమ్ సాంగ్స్ మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. అందులో యాక్ట్ చేసిన వాళ్లు మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాంటి వాళ్లలో నాగదుర్గ ఒకరు. గత కొన్నేళ్లలో ఫోక్ సాంగ్స్ చేస్తూ పేరు తెచ్చుకున్న ఈమె ఇప్పుడు ఏకంగా తమిళంలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది.(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి 'కాంతార-1')దారిపొంటత్తుండు, నా పేరు ఎల్లమ్మ, ఎర్ర రుమాల్, కాపోళ ఇంటికాడ తదితర సాంగ్స్తో ఈమె బోలెడంతమంది అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే 'కలివనం' అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా చేసినప్పటికీ ఇది రిలీజైందో, ఎప్పుడో రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి. కొన్నిరోజుల క్రితం ఈమె.. తెలుగు బిగ్బాస్ 9వ సీజన్లోనూ పాల్గొంటుందని అన్నారు. కానీ అవి రూమర్స్ మాత్రమే అని తేలిపోయింది.అలాంటిది ఇప్పుడు తమిళ సినిమాలో నాగదుర్గకు అవకాశం దక్కింది. ప్రముఖ హీరో ధనుష్ మేనల్లుడు పవీష్.. గతేడాది 'జాబిలమ్మ నీకు అంత కోపమా' అనే డబ్బింగ్ చిత్రంతో హీరోగా మారాడు. ఇప్పుడు ఈ కుర్రాడు కొత్త సినిమాలోనే నాగదుర్గ హీరోయిన్గా చేయనుంది. ఒకవేళ ఇది క్లిక్ అయితే తమిళంలో మరిన్ని అవకాశాలు రావొచ్చు. ఈమె కంటే ముందు శాన్వి మేఘన, గౌరీప్రియ లాంటి పలువురు తెలుగమ్మాయిలు తమిళ సినిమాల్లో ఛాన్సులు దక్కించుకున్నారు. బాగానే పేరు సంపాదించారు. ఎటొచ్చి టాలీవుడ్లోనే తెలుగమ్మాయిలు హీరోయిన్స్గా కనిపించట్లేదు!(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)


