-
హైటెక్సిటీకి ఎన్ జనార్థన రెడ్డి ఫౌండేషన్ వేశారు
-
పెద్దాయన ఇకలేరు..
జిల్లా రాజకీయాలను నాలుగు దశాబ్దాల పాటు శాసించిన యోధుడు. తలపండిన రాజకీయ ఉద్ధండులను ఎదిరించి నిలబడి ఎదిగిన భీష్మాచార్యుడు. శిఖరంగా నిలబడి ఎంతో మంది రాజకీయ ఎదుగుదలకు దోహదపడిన మార్గదర్శి. విలువలతో కూడిన రాజకీయాలు నెరిపిన ఆచార్యుడు. ప్రత్యర్థులను తన రాజకీయ చాతుర్యంతో మట్టి కరిపించిన అపర చాణక్యుడు. జిల్లాలోని రాజకీయ నేతలకు, ప్రజలకు పెద్దాయన అయిన డాక్టర్ నేదురుమల్లి జనార్దన్రెడ్డి ఉపాధ్యాయుడిగా జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర రాజకీయాల్లో కీలకభూమిక పోషించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం ఉదయం కాలధర్మం చెందారు. వెంకటగిరిటౌన్, న్యూస్లైన్: జిల్లాలో విలక్షణ రాజకీయాలు నెరపి తనదైన ముద్రవేసిన పెద్దాయన నేదురుమల్లి జనార్దన్రెడ్డి మృతితో శుక్రవారం వెంకటగి రి ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులే కా కుండా ఇతర పార్టీల నేతలు సైతం పెద్దాయనతో తమకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఒరేయ్ కిష్టయ్యా.. ఏరా రమణారెడ్డి అంటూ అప్యాయంగా పల కరించే పెద్దాయన ఇక లేరన్న వాస్తవాన్ని వారు జీర్ణించుకొలేకపోతున్నారు. వాకాడులో 1935 ఫిబ్రవరి 20న జన్మించిన నేదురుమల్లి రాజకీయ ప్రస్థానంలో ముఖ్యమంత్రి పదవిని పొందడం వెంకటగిరి నుంచి ప్రాతినిథ్యంతోనే సాధ్యమయింది. ఉపాధ్యాయుడిగా ఉద్యోగంతో ప్రారంభమయిన ఆయన జీవితం 1972లో రాజ్యసభ సభ్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన అప్పటి నుంచి ఢిల్లీ స్థాయి నాయకులతో సాన్నిహిత్యం నెరిపేవారు. అంచెలంచెలుగా ఎదిగి సీఎం పీఠం అధిరోహించారు. 1972 నుంచి 1978 వరకు రాజ్యసభ సభ్యుడిగా, 1978 నుంచి 1984 వరకు ఎమ్మెల్సీగా కొనసాగిన సమయంలోనే రాష్ట్ర రెవెన్యూ, పరిశ్రమలు, వ్యవసాయం, విద్యుత్ శాఖ ల మంత్రిగా పనిచేశారు. 1988-89లో పీసీపీ అధ్య క్షుడిగా పనిచేశారు. 1989 ఎన్నికల్లో వెంకటగిరి నుం చి ఎమ్మెల్యేగా ఎన్నికై 1990లో రాష్ట్రముఖ్యమంత్రి పదవిని పొందారు. అనంతరం 1988లో బాపట్ల, 1999లో నరసరావుపేట, 2004లో విశాఖపట్నం నుంచి ఎంపీ వరుస విజయాలు సాధించారు. 2009లో సోనియాగాంధీ సూచనతో రాజ్యసభ స భ్యుడుగా ఎంపికైనా తిరిగి 2010లో మరోసారి రా జ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. అలంకరించిన ఏ పదవికయినా వన్నె తెచ్చే పెద్దాయన కష్టాలు వచ్చినపుడు ధైర్యంగా ఎదుర్కోవడం, సమయం వచ్చినపుడు ప్రత్యర్థులను ముప్ప తిప్పలు పెట్టే రాజకీయ చతురత ఆయనకే సొంతమని రా జకీయ విశ్లేషకుల భావన. దాదాపు 30 ఏళ్ల పాటు జిల్లా రాజకీయాలను శాసించారు. పార్టీ వీర విధేయుడు నేదురుమల్లి జిల్లాలో తొలి నుంచి కాంగ్రెస్ పార్టీ విధేయుడిగా జనార్దన్రెడ్డి కొనసాగారు. ఎన్టీఆర్ ప్రభజనంతో టీడీపీ హవా కొనసాగిన రోజుల్లో సైతం పార్టీ కోసం కష్టపడి పని చేశారు. ఒ కానొక సందర్భంలో ఎమ్మెల్యే టికెట్ దక్కకపోయి నా అలకపాన్పు ఎక్కకుండా విలువలతో కూడిన రాజకీయం నెరపారు. పెద్దాయన కోసం ప్రాణత్యాగం 2007 సెప్టెంబర్ 7న జనార్దన్రెడ్డి జీవితంలో చేదుజ్ఞాపకాన్ని మిగిల్చింది. ఎస్వీ యూనివర్సిటీ ప్రకటించిన గౌరవ డాక్టరేట్ అందుకునేందుకు వెళుతుండగా ఆయనపై మావోయిస్టులు మందపాతర తో హత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో కారు డ్రైవ ర్ మల్లికార్జున్రెడ్డితో పాటు ముఖ్య అనుచరులు బి. నాగార్జున్రెడ్డి, వెంటగిరికి చెందిన పాయసం దశ య్య మృతి చెందడం నేదురుమల్లిని కలిచి వేసింది. తొలినాళ్లలో నల్లపరెడ్డి అనుచరుడు కోట : నేదురుమల్లి జనార్దన్రెడ్డి రాజకీయ ఆరంగేట్రం చేసిన తొలినాళ్లలో అప్పట్లో జిల్లాలో చక్రం తిప్పుతున్న నల్లపరెడ్డి చంద్రశేఖరరెడ్డి అనుచరుడుగా కొనసాగారు. అనంతరం జరిగిన పరిణామాలతో నల్లపరెడ్లతో విభేదించాడు. 1972లో అ ప్పటి సీఎం పీవీ నరసింహారావు నల్లపరెడ్లను కా దని గూడూరు టికెట్ను శారదాంబకు ఇచ్చారు. రెబల్ అభ్యర్థిగా నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పోటీ చేయడంతో శారదాంబను గెలిపించే బాధ్యత నే దురుమల్లిపై పడింది. దీంతో నల్లపరెడ్లతో విభేదించి నేదురుమల్లి ఆమె విజయానికి కృషి చేశారు. అప్పటి నుంచి పీవీ అనుచరుడిగా గుర్తింపు పొందారు. ఆ ఎన్నికల్లో శారదాంబ ఓడినప్పటికీ జనార్దన్రెడ్డి నరసింహారావు ఆశీస్సులతో రాజ్యసభ సభ్యుడయ్యారు. అప్పటి నుంచి నల్లపరెడ్లు, నేదురుమల్లి రాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగారు. గూడూరు నియోజకవర్గం ఎస్సీలకు కేటాయించడంతో వెంకటగిరి నుంచి రెండు వర్గాల వారు ఒకరిపై మరొకరు పోటీకి దిగేవారు. నేదురుమల్లి మృతి తీరని లోటు - నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్లైన్: మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్రెడ్డి మృతి జిల్లాకే కాక రాష్ట్రానికి కూడా తీరని లోటని వైఎస్సార్సీపీ కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో గుర్తింపు పొందారన్నారు. రాజకీయంగా జిల్లాకు పేరు తెచ్చిన జనార్దన్రెడ్డి నేడు ప్రజల మధ్యన లేకపోవడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి మనో ధైర్యాన్ని, గుండె నిబ్బరాన్ని ఇవ్వాలని భగవంతుడ్ని ప్రార్థించారు. రాజకీయ భిక్ష పెట్టింది జనార్దన్రెడ్డే : ఎల్లసిరి వాకాడు,న్యూస్లైన్ : తమ వంటి వారికి రాజకీయ భిక్షపెట్టింది నేదురుమల్లి జనార్దన్రెడ్డేనని వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్రెడ్డి అన్నారు. జనార్దన్రెడ్డి మరణవార్త వినగానే ఎల్లసిరి, గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ అభ్యర్థి పాశం సునీల్కుమార్ వా కాడులోని ఆయన సోదరుడు వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నేదురుమల్లి పద్మనాభరెడ్డిని పరామర్శించి, ఓదార్చా రు. ఎల్లసిరి విలేకర్లతో మాట్లాడుతూ జనార్దన్రెడ్డి రాజకీయంలో తనదైన శైలిలో చేయి తిరిగిన నేతగా చక్రం తిప్పుతూ ఉన్నత పదవులు పొందారన్నారు. తమ వంటి ఎంతో మందికి రాజకీయ ఓనమాలు నేర్పించి అవకాశాలు కల్పించారన్నారు. ఆయనకు తాను రాజకీయంలో తాత్కాలికంగా దూరమైనప్పటికీ ఒక మహోన్నతమైన రాజకీయ గురువును కోల్పోయినందుకు గుండెలు పిండుతున్నాయన్నారు. జిల్లాలో కాంగ్రెస్ కార్యాలయాన్ని నిర్మించాలని జనార్దన్రెడ్డి సంకల్పించినప్పుడు తామంతా ఆయనతో పాటు కష్టపడి పని చేసి నెల్లూరులో ఇందిరాభవన్ను ఏర్పాటు చేశామన్నారు. దీనిని చూసి ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలు నిర్మించారన్నారు. అయితే ఒకే ఒక బాధ మాత్రం తమని వేధిస్తోందన్నారు. జాతీయ నాయుకుడిగా ఎదిగి కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన జనార్దన్రెడ్డిని అధిష్టానం గుర్తించి కేంద్ర మంత్రిగా చోటు కల్పించలేదన్నారు. జనార్దన్రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులు రాజ్యలక్ష్మమ్మకు, రామ్కుమార్రెడ్డి, గౌతమ్రెడ్డి, భరత్రెడ్డి, అశోక్రెడ్డికి దైవ ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. నేదురుమల్లి కృషికి ప్రతిఫలం ఇందిరాభవన్ సాక్షి, నెల్లూరు : నెల్లూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటుకు నేదురుమల్లి జనార్దన్రెడ్డి చేసిన ప్రత్యేక కృషి ఫలితంగా 1987లో ఇందిరాభవన్ ఏ ర్పాటయింది. 1987 డిసెంబర్ 22న అప్పటి ఏఐసీసీ అధ్యక్షులు రాజీవ్గాం ధీతోఇందిరాభవన్ను ప్రారంభింపజేశారు. ఆ సమయంలో డీసీసీ అధ్యక్షుడి గా నువ్వుల వెంకటరత్నం నాయుడు ఉన్నారు. 2012లో ఇందిరాభవన్ను ఏఐసీసీ ట్రస్ట్కు అప్పగించారు. ఆయన చనిపోయేదేంది..? నేదురుమల్లి ప్రధాన అనుచరుల్లో ఒకరైన పట్రా ప్రకాశరావును శుక్రవారం ‘సాక్షి ప్రతినిధి’ మూలాపేటలోని ఆయన నివాసంలో కలిసి విషయం తె లియజేయగా ‘ఆయన చనిపోయేదేంది ...?’ అం టూ ప్రకాశరావు అమాయకంగా ముఖం పెట్టా రు. వయోభారంతో ఆయన ప్రస్తుతం మతిస్థిమి తం కోల్పోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. నేదురుమల్లి దంపతుల ఫొటోను ఆయనకు ఇవ్వ గా దాన్ని తదేకంగా చూశారు. ఎన్బీకేఆర్ హాస్టల్లో చదువుకుని వార్డెన్గా పనిచేస్తున్న ప ట్రా ప్రకాశరావును ఉద్యోగానికి రాజీనామా చేయించి మూడు సార్లు గూడూరు ఎమ్మెల్యేగా గెలిపించిన ఘనత నేదురుమల్లికే దక్కుతుంది. హెడ్నర్సుకు ఎమ్మెల్సీ పదవి... నెల్లూరు అమెరికన్ హాస్పిటల్లో హెడ్ నర్సుగా పనిచేస్తున్న ఎతిల్ తేరేను నేదురుమల్లి అప్పట్లో ఎమ్మెల్సీ చేశారు. డీపీఆర్ఓ పసల పెంచలయ్యను ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీగా చేశారు. గూడూరుకు చెందిన గౌస్మొహిద్దీన్ను రాజ్యసభ సభ్యుడిగా, బ్యాంక్ మేనేజర్ నెలవల సుబ్రహ్మణ్యంను ఎంపీ, ఎమ్మెల్యేను చేశారు. బీఎస్సీ పూర్తి చేసి ఇంట్లో ఉంటున్న కుడుముల పద్మశ్రీని సైతం ఎంపీ చేసిన ఘనత నేదురుమల్లిదే. ప్రస్తుత కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చింది నేదురుమల్లి. ఇలా అనేక మందిని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఘనత నేదురుమల్లికే దక్కుతుంది. జనార్దన్రెడ్డి మరణం తీరని లోటు సాక్షి, నెల్లూరు : మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్పార్టీ సీనియర్ నేత నేదురుమల్లి జనార్దన్రెడ్డి మృతికి వైఎస్సార్సీపీ నేతలు శుక్రవారం సంతాపం తెలిపారు. తీరనిలోటు : ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి సామాన్య ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన నేదురుమల్లి జనార్ద్దన్రెడ్డి మృతి రాష్ట్రానికి తీరని లోటని నెల్లూరు ఎంపీ, వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అలంకరించి జిల్లాకు గర్వకారణమయ్యారన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రతీక నేదురుమల్లి జీవితం అన్నారు. తన రాజకీయ ఆరంగేట్రానికి కారణమైన జనార్దన్రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. జనార్దన్రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. రాజకీయ దురందరుడు : వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్ జిల్లా ఖ్యాతిని జాతీయ వ్యాప్తంగా చాటిన రాజకీయ దురందురుడు జనార్దన్రెడ్డి మృతి తీరని లోటని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్ అన్నారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేం దుకు ఆయన చేసిన కృషిని మేరిగ మురళీ శ్లాఘించారు. జనార్దన్రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. తీరని లోటు : డాక్టర్ పి.అనిల్కుమార్యాదవ్, నగర ఎమ్మెల్యే అభ్యర్థి జిల్లా రాజకీయ పంధాను మార్చిన వ్యక్తిగా నేదురుమల్లి జనార్దన్రెడ్డి సేవలు ప్రశంసనీయమన్నారు. విలువలతో కూడిన రాజకీయంతో జిల్లా పేరును నిలబెట్టిన నేదురుమల్లి మరణం జిల్లా వాసులకు తీరని లోటని పేర్కొన్నారు. జనార్దన్రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. విలువలతో కూడిన రాజకీయాన్ని నడిపారు : డీసీసీబీ చైర్మన్ ధనుంజయరెడ్డి నేదురుమల్లి జనార్దన్రెడ్డి మరణం తీరని లోటని డీసీసీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నైతిక విలువలతో కూడిన రాజకీయాన్ని నడిపి జిల్లా గొప్పతనాన్ని ఢిల్లీ స్థాయిలో చాటిన వ్యక్తిగా జిల్లా ప్రజల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా ఉంటారన్నారు. జనార్దన్రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. సూళ్లూరుపేట అభివృద్ధి ప్రదాత నేదురుమల్లి సూళ్లూరుపేట, న్యూస్లైన్ : నేదురుమల్లి జనార్దన్రెడ్డి సూళ్లూరుపేట ని యోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బద్దెపూడి వేణుగోపాల్రెడ్డి అన్నారు. సూ ళ్లూరుపేట బస్టాండ్ సెం టర్లో ఆయన చిత్రప టం ఏర్పాటు చేసి కాంగ్రెస్ నాయకులు ఘన నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కొంతమంది నాయకులు కన్నీటి పర్యం తమయ్యారు. బద్దెపూడి మాట్లాడుతూ నేదురుమల్లి సూళ్లూరుపేటతో విడదీయరాని అనుబంధాన్ని కొనసాగించారన్నారు. సూళ్లూరుపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సూళ్లూరుపేట-కోట రోడ్డు, వేనాడు, ఇరకం, పేర్నాడు దీవులకు కరెంట్, రోడ్డు సౌకర్యం కల్పించారన్నారు. 1989లో ఆయన వ్యవసాయశాఖ, రెవెన్యూశాఖ మంత్రిగా ఉన్నపుడు తాగునీటి పథకాలు, పక్కా ఇళ్లు ఏర్పాటు చేయించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఎందరో నేతలకు ఆ యన రాజకీయ బాటలు వేశారన్నారు. చెంగాళమ్మ ఆలయ పాలకమండలి చైర్మన్ ఇసనాక హర్షవర్ధన్రెడ్డి మాట్లాడుతూ నేదురుమల్లి రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకి, సూళ్లూరుపేట ప్రాంతానికి తీరని లోటన్నారు. స్థానిక బజారు సెంట ర్లో ఉన్న నేదురుమల్లి జనార్దన్రెడ్డి కాంప్లెక్స్లోని వ్యాపారస్తులంతా ఆయ న చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ముత్తు ముద్దుకృష్ణ మొదలియార్, డీసీఎంఎస్ డెరైక్టర్ జెట్టి వేణుయాదవ్, జిల్లా ఎస్సీ సెల్ నేత బూదూరు వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలకా యుగంధర్, కోదండరామిరెడ్డి, నలుబోయిన రాజసులోచన మ్మ, దొరై, అయితా శ్రీధర్ నేదురుమల్లి చిత్రపటానికి నివాళులర్పించారు. రాజకీయ భీష్మాచార్యుడు నేదురుమల్లి సాక్షి, నెల్లూరు/ గూడూరు/వాకాడు: జిల్లాలో సుమారు నాలుగున్నర దశాబ్దాల పాటు తనదైన శైలిలో రాజకీయాలను శాసించిన భీష్మాచార్యుడు, పెద్దాయన మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ నేదురుమల్లి జ నార్దన్రెడ్డి శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్లో తుదిశ్వాస విడిచా రు. జిల్లా రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. వాకాడులో సామాన్య రైతు కు టుంబంలో జన్మించిన నేదురుమల్లి జనార్దన్రెడ్డి బడి పంతులుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుడు, ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి, ఎంపీగా అనేక పదవులను నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలోనే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి కడ వరకు కాంగ్రెస్లో ఉం టూనే ఆయన కాల ధర్మం చెందటం గమనార్హం. అనేక ఆటుపోట్లు ఎదురైనా పార్టీ పట్ల అంకితభావంతో, చిత్తశుద్ధితో ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుం చి పీసీసీ కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పార్టీ పదవులు అలంకరించిన ఘనత నేదురుమల్లికే ద క్కుతుంది. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి ఇం దిరాగాంధీ, రాజీవ్గాంధీ, సంజయ్గాంధీ, పీవీ నరసింహారావు వంటి మ హామహులతో ఆయన ఎంతో సాన్నిహిత్యం కొనసాగించారు. ఎంత ఎది గినా ఒదిగి ఉండే గుణంతోనే ఆయన ఈ స్థాయికి ఎదిగారు. 1970లో నె ల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ ఆ తర్వాత 1972లో అ ప్పటి ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు అండతో రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. 1978లో శాసన మండలి సభ్యుడుగా ఎంపికై రెవెన్యూ, వి ద్యుత్, భారీ పరిశ్రమలశాఖా మంత్రిగా పనిచేశారు. 1983లో తొలిసారిగా వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి నల్లపరెడ్డి చంద్రశేఖరరెడ్డి చేతిలో ఓటమిపాలైన నేదురుమల్లి 1988లో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1989లో వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా నేదురుమల్లి గెలుపొంది చెన్నారెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయం, అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం 1990-92 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. 1994లో వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ 1998లో బాపట్ల, 1999లో నరసారావుపేట నుంచి, 2004లో విశాఖపట్నం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. మూడుసార్లు లోకసభకు ఎన్నికైనప్పటికీ ఆయనకు నెల్లూరు లోక్సభ నుంచి ఎంపీగా కావాలనే కోరిక బలంగా ఉండేది. నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీలకు రిజర్వుడుగా ఉంటున్న నెల్లూరు పార్లమెంట్ స్థానాన్ని జనరల్కు కేటాయించే ప్రక్రియలో నేదురుమల్లి కృషి కూడా ఉంది. ఏఐసీసీలో కూడా నేదురుమల్లి జనార్దన్రెడ్డి కీలకంగా వ్యవహరించేవారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, స్టాండింగ్ కమిటీల చైర్మన్గా కూడా ఆయన పనిచేశారు. తీరని కలగా.. నేదురుమల్లికి నెల్లూరు ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రి కావాలనేది తీరని కలగానే మిగిలిపోయింది. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నేదురుమల్లి జనార్దన్రెడ్డి నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు అన్ని విధాలుగా సిద్ధమైనప్పటికీ, ప్రస్తుత ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రాజ్యసభకు ఎంపిక చేశారు. అప్పట్లో కేంద్ర మంత్రి అవుతానని భావించిన నేదురుమల్లి ఆశలు అడియాశలే అయ్యాయి. నేదురుమల్లి నీడలో ఎదిగిన నేతలు.. జిల్లా రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర వేశారు. ఆయన అండదండలతో ఎందరో నేతలుగా ఎదిగారు. నేదురుమల్లి రాజకీ యం విలక్షణంగా ఉంటుంది. ఆయన ఎంతో గుంబనం గా వ్యవహరిస్తూ చివరి నిమిషం వరకు తన మనస్సులోని మాటను బయటపెట్టేవారు కాదు. కలలో కూడా తాము రా జకీయాల్లో ఇంత స్థాయికి ఎదుగుతాయని ఊహించని ఎందరి నో ఆయన రాజకీయాల్లో ప్రవేశం కల్పించడమే కాకుండా వారు ఉన్నత స్థానానికి ఎదిగేందుకు దోహదపడ్డారు. తన మాటకు వి లువివ్వని, తనను ధిక్కరించిన వారికి తానేంటో చూపించడంలో కూడా ఆయనదో ప్రత్యేక శైలి. సుధీర్ఘకాలం తిరుపతి పార్లమెంట్ సభ్యుడుగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన డాక్టర్ చింతామోహన్కు సిట్టింగ్ ఎంపీ అయినప్పటికీ 1996లో పార్టీ టికెట్ కాకుండా చేసి ఒక బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తున్న నెలవల సుబ్రహ్మణ్యానికి టికెట్ ఇప్పించడమే కాకుండా ఎంపీగా చేసిన ఘనత కూడా ఆయనదే. జి ల్లాలో రాజకీయంగా ఎదిగిన వారిలో వేమారెడ్డి వెంకురెడ్డి(డీసీసీ అధ్యక్షుడు), గూడూరుకు చెందిన గౌస్మొహిద్దీన్ (ఎంపీ రాజ్యసభ), ఎతిల్ తేరే (ఎమ్మెల్సీ), మేకపాటి రాజమోహన్రెడ్డి, సీవీ శేషారెడ్డి, పట్రా ప్రకాశరావు, పసల పెంచలయ్య, చేవూరు దేవకుమార్రెడ్డి, కుడుముల పద్మశ్రీ, మాగుంట సుబ్బరామిరెడ్డి, పనబాక లక్ష్మి, నెలవల సుబ్రహ్మణ్యం, వాకా టి నారాయణరెడ్డి, జేకేరెడ్డి, ఎల్లసిరి గోపాల్రెడ్డి, చెంచలబాబుయాదవ్, కొ డవలూరు ధనుంజయరెడ్డి, కొండాపురం రామమ్మ, సరస్వతి వంటి నేతలు ఉన్నారు. తాను దేశ రాజకీయాల్లో కీలక నేతగా ఉంటున్నప్పటికీ గృహిణిగా నే ఉన్న తన సతీమణి రాజ్యలక్ష్మిని రెండుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చే యగలిగారు. అయితే ఎంతో కాలంగా తన పెద్ద కుమారుడు రాంకుమార్రెడ్డిని ఎమ్మెల్యేను చేయాలనే కోరిక తీరక ముందే తుది శ్వాస విడిచారు. -
నేదురుమల్లి కన్నుమూత
4 సభల్లో ప్రాతినిధ్యం వహించిన జనార్దన్రెడ్డి 1990 నుంచి 1992 వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నేడు వాకాడులో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు రాజకీయ దిగ్గజం మృతికి ప్రముఖుల సంతాపం సాక్షి, హైదరాబాద్/ నెల్లూరు: మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్దన్రెడ్డి శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 80 ఏళ్లు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నరాల సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనను చికిత్స కోసం ఏప్రిల్ 26న నిమ్స్లో చేర్పించారు. పరిస్థితి విషమించి శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయనకు భార్య రాజ్యలక్ష్మి, నలుగురు కుమారులున్నారు. సుదీర్ఘ రాజకీయానుభవం కలిగిన నేదురుమల్లి 1935 ఫిబ్రవరి 20న శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడులో జన్మించారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రంపై తనదైన ముద్రవేశారు. దేశ అత్యున్నత చట్టసభలన్నింటిలోనూ సుదీర్ఘకాలం ప్రతినిధిగా వ్యవహరించిన అరుదైన గౌరవం నేదురుమల్లికి దక్కింది. కీలకమైన నాలుగు చట్టసభలైన లోక్సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలిలో ఆయన ప్రాతినిథ్యం వహించడం విశేషం. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన రాజకీయాల్లోకి రాకముందు ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవారు. ఇందిరాగాంధీకి సన్నిహితుడిగా మెలగిన ఆయన రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగారు. మూడుసార్లు లోక్సభకు, మూడుసార్లు రాజ్యసభకు ఎన్నికవ్వడమే కాకుండా ముఖ్యమంత్రిగా సేవలందించారు.1972-78లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1978-1984 మధ్య ఎమ్మెల్సీగా పనిచేశారు. 1988-89లో పీసీసీ అధ్యక్షునిగా ఉన్నారు. 1989లో వెంకటగిరి (నెల్లూరు) నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. జలగం వెంగళరావు, టి.అంజయ్య, భవనం వెంకట్రామ్, కోట్ల విజయభాస్కరరెడ్డి, మర్రి చెన్నారెడ్డి కేబినెట్లలో మంత్రిగా చేశారు. రెవెన్యూ, పరిశ్రమలు, విద్యుత్తు, వ్యవసాయ అటవీ, ఉన్నత విద్య వంటి శాఖలు చూశారు. 1989లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వ చ్చాక సీఎంగా ఎన్నికైన మర్రిచెన్నారెడ్డి అర్ధంతరంగా దిగిపోవడంతో ఆయన స్థానంలో రాష్ట్రానికి 12వ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 1990 నుంచి 1992 దాకా సీఎంగా కొనసాగారు. తరవాత బాపట్ల (1998-99), నర్సరావుపేట (1999-2004), విశాఖపట్నం (2004-2009) లోక్సభ స్థానాల నుంచి పోటీచేసి గెలిచారు. 2009, 2010లో వరుసగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1983, 1994 ఎన్నికల్లో వెంకటగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. 2007 సెప్టెంబర్లో నక్సల్స్ దాడి నుంచి నేదురుమల్లి, ఆయన భార్య రాజ్యలక్ష్మి త్రుటిలో తప్పించుకున్నారు. రాజ్యలక్ష్మి 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు. ఆయన కుమారుడు రామ్కుమార్రెడ్డి ఈ ఎన్నికల్లో వెంకటగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. నేడు వాకాడులో అంత్యక్రియలు నేదురుమల్లి భౌతిక కాయానికి శనివారం ఆయన స్వగ్రామమైన నెల్లూరుజిల్లా వాకాడులో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. నేదురుమల్లి మృతికి సంతాపసూచకంగా జిల్లాలో రేపు అధికారిక సెలవు ప్రకటించారు. దీంతోపాటు అక్కడ మూడు రోజులు సంతాపదినాలుగా కొనసాగనున్నాయి. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నేదురుమల్లి భౌతిక కాయాన్ని శుక్రవారం ఉదయం నుంచి ఆయన నివాసంలో ఉంచి సాయంత్రం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన ఇందిరాభవన్లో కొంతసేపు ఉంచారు. అక్కడి నుంచి నేరుగా వాకాడుకు తీసుకువెళ్లారు. ప్రముఖుల సంతాపం మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్రెడ్డి మృతికి రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ సంతాపం తెలిపారు. ఈమేరకు రాష్ట్రపతి కార్యాలయం శుక్రవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. తనకు ఎన్నోఏళ్లుగా అత్యంత సన్నిహితుడైన మిత్రుడు, ఎంతో గౌరవించే సహచరుడిని కోల్పోయానని నేదురుమల్లి భార్య ఎన్.రాజ్యలక్ష్మికి పంపిన సంతాప సందేశంలో పేర్కొన్నారు. జనార్దన్రెడ్డి మృతిపట్ల రాష్ట్ర గవర్నర్ నరసింహన్, తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య వేర్వేరు సందేశాల్లో సంతాపం వ్యక్తపరిచారు. జనార్దన్రెడ్డి భౌతికకాయాన్ని ఆయన నివాసంలో పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి, కేంద్ర మంత్రులు చిరంజీవి, పల్లంరాజు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, సీపీఎం ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి పి.మధు, కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య, రాష్ట్ర మాజీ మంత్రులు ఇతర ముఖ్యులు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. జనార్దన్రెడ్డి మృతిపట్ట కేంద్రమంత్రి జైపాల్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, బీజేపీ సీనియర్నేత ఎం.వెంకయ్యనాయుడు, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఆ పార్టీ ఎంపీ సుజనా చౌదరి, సీనియర్నేత కంభంపాటి రామ్మోహన్రావు, సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, ఆ పార్టీ తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, లోక్సత్తా అధినేత జయప్రకాశ్నారాయణ్, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్కుమార్రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మహంతి, డీజీపీ ప్రసాదరావు, విద్యావేత్త చుక్కా రామయ్య, సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు తదితరులు సంతాపం ప్రకటించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement