breaking news
muthukumaran
-
Bigg Boss: ఒకరికి రూ.40 లక్షలు, మరొకరికి రూ.50 లక్షలు..
బిగ్బాస్ షో (Bigg Boss Reality Show) ముగిసింది. తమిళంలో ఎనిమిదో సీజన్, హిందీలో పద్దెనిమిదో సీజన్ విజయవంతంగా పూర్తయింది. జనవరి 19న ఈ రెండు భాషల్లో గ్రాండ్ ఫినాలే జరిగింది. తమిళ బిగ్బాస్ విషయానికి వస్తే యూట్యూబర్ ముత్తుకుమారన్ (Muthukumaran) విజేతగా నిలిచాడు. ఇతడు రూ.41 లక్షల ప్రైజ్మనీ అందుకున్నాడు. సౌందర్య ఫస్ట్ రన్నరప్గా, వీజే విశాల్ సెకండ్ రన్నరప్గా నిలిచారు. తమిళ బిగ్బాస్ ఎనిమిదో సీజన్కు విజయ్ సేతుపతి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.హిందీ రియాలిటీ షో విషయానికి వస్తే.. నటుడు కరణ్ వీర్ మెహ్రా (Karan Veer Mehra) బిగ్బాస్ ట్రోఫీ గెలిచాడు. గ్రాండ్ ఫినాలే స్టేజీపై హోస్ట్ సల్మాన్ ఖాన్ కరణ్ను విజేతగా ప్రకటించాడు. ఇతడు ట్రోఫీతో పాటు రూ.50 లక్షల ప్రైజ్మనీ గెలుచుకున్నాడు. నటుడు వివియన్ డిసేన ఫస్ట్ రన్నరప్గా, యూట్యూబర్ రజత్ దలాల్ సెకండ్ రన్నరప్గా నిలిచారు. కరణ్ ఇంతకుముందు ఖత్రోన్ కె ఖిలాడీ 14వ సీజన్ విజేతగా అవతరించాడు. ఇతడు పవిత్ర రిష్తా, యే రిష్తా క్యా కెహ్లాతా హై, పరి హూన్ మే, బడే అచ్చే లగ్తే హా, సాసురల్ సిమర్ కా, విరుద్ధ్ వంటి పలు సీరియల్స్లో నటించాడు. View this post on Instagram A post shared by Vijay Television (@vijaytelevision) View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) చదవండి: అదివారం నాడు నాకో సెంటిమెంట్ ఉంది.. ఈ పని మాత్రం చేయను:బాలకృష్ణ -
'అమ్మ' కోసం బంగారు ఆలోచన..
చెన్నై: అతడు అన్నాడీఎంకే పార్టీకి అభిమాని. ఎంజీ రామచంద్రన్ అంటే ఇష్టం. ముఖ్యమంత్రి జయలలిత అంటే ఆకాశమంత అభిమానం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధించి, అమ్మ మరోసారి సీఎం అయిన వేళ అభిమానాన్ని చాటుకోవడం ఎలా అని ఆలోచించాడు. అంతే బంగారం లాంటి ఆలోచన వచ్చింది. వెంటనే దానిని ఆచరణలో పెట్టాడు. తమిళనాడు రాష్ట్రం చిదంబరానికి చెందిన ముత్తుకుమరన్ బంగారు నగల తయారీదారుడు. 20 ఏళ్లుగా ఈ వృత్తిలో ఉంటూ ఎంతో అనుభవం పొందాడు. ముఖ్యంగా బంగారంతో సూక్ష్మమైన వస్తువులను తయారు చేయడంలో దిట్ట. గతంలో 90 మిల్లీగ్రాములతో తాళి, 140 మిల్లీ గ్రాములతో సీలింగ్ ఫ్యాన్, 2 గ్రాములతో నటరాజ ఆలయం, 8 గ్రాములతో తాజ్మహల్ తదితర సూక్ష్మ వస్తువులను తయారు చేశారు. ప్రస్తుతం అన్నాడీఎంకే మళ్లీ అధికారంలోకి రావడాన్ని పురస్కరించుకుని 3 గ్రాముల 400 మిల్లీగ్రాములతో తమిళనాడు అసెంబ్లీ భవనం, దానిపైన జాతీయ పతాకం, పక్కనే ముఖ్యమంత్రి జయలలిత బొమ్మను తీర్చిదిద్దాడు. ముత్తుకుమరన్ మీడియాతో మాట్లాడుతూ.. తమ కుటుంబ సభ్యులందరికీ జయలలిత అంటే ప్రాణమని, ప్రతిపక్ష పార్టీలన్నీ కట్టకట్టుకుని ఎదురు నిలిచినా అమ్మ అఖండ విజయం సాధించారని అన్నారు. ఇంతటి అపూర్వ ఘట్టాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, అమ్మను ప్రత్యేకంగా ఎలా అభినందించాలా అని ఆలోచించి ఇవి రూపొందించినట్లు వివరించాడు.