-
ముస్లింల సంక్షేమంలో సరికొత్త చరిత్ర
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో ముస్లిం సమాజానికి మేలు చేసిన గొప్ప నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని, తండ్రి కంటే రెండు అడుగులు ముందుకేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముస్లిం సంక్షేమంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజద్బాషా కితాబిచ్చారు. మంగళవారం జరిగిన శాసన మండలి క్వశ్చన్ అవర్లో సభ్యుల ప్రశ్నలకు మంత్రులు బదులిచ్చారు. ఈ సందర్భంగా అంజద్బాషా మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ముస్లింల సంక్షేమానికి రూ. 2,665 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, సీఎం జగన్ నాయకత్వంలో 2019 జూన్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ. 12,366 కోట్లకుపైగా ఖర్చు చేసినట్టు లెక్కలతో సహా వివరించారు. గత ప్రభుత్వం హయాంలో ఉర్దూ అకాడమీ నిర్వహణలో రూ. 14 కోట్ల అవినీతి జరిగిందని, దీనిపై సీఐడీ విచారణ కూడా జరిగిందన్నారు. ఉర్దూ అకాడమీకి చెందిన 36 కంప్యూటర్ కేంద్రాలను పునరుద్ధరించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా శిక్షణ ఇస్తామన్నారు. రానున్న రోజుల్లో మైనారిటీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసి గ్రూప్ 1, గ్రూప్ 2 పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తామని అంజద్బాషా వెల్లడించారు. వర్సిటీ ఖాళీలు త్వరలో భర్తీ: మంత్రి బొత్స విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. యూనివర్సిటీల్లో ఖాళీల విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి ఆయన అనుమతితో త్వరలో భర్తీ ప్రక్రియ చేపడతామన్నారు. రాష్ట్రంలో జగనన్న గోరుముద్ద పథకం ద్వారా 2019–20 నుంచి 2022–23 వరకు 1,54,50,580 మంది విద్యార్థులు లబ్ధి పొందారని, ఇందుకోసం ప్రభుత్వం రూ. 6,262.29 కోట్లు ఖర్చు చేసిందన్నారు. విద్యార్థులకు వారానికి 16 రకాల పదార్థాలను అందిస్తున్నామన్నారు. ఆర్బీకేల ద్వారా యంత్రసేవా పథకం: మంత్రి కాకాణి వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే) ద్వారా వైఎస్సార్ యంత్రా సేవా పథకాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. అత్యంత పారదర్శకంగా ఈ–క్రాప్ ద్వారా రైతులకు బీమా వర్తింపజేస్తున్నామన్నారు. కౌలు రైతులను కూడా అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని, కౌలుదారులకు కార్డులు జారీ చేసేలా ప్రత్యేక కార్యాచరణ (స్పెషల్డ్రైవ్) చేపడతామన్నారు. ప్రతి రూపాయీ సది్వనియోగం: మంత్రి అంబటి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. నీటిపారుదల ప్రాజెక్టులు వేగంగా నిర్మాణం జరగడంలేదనే అపోహ వద్దన్నారు. ప్రతి రూపాయిని ఈ ప్రభుత్వం బాధ్యతయుతంగా సద్వినియోగం చేస్తూ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తుందన్నారు. పోలవరం నిర్మాణం జాప్యానికి గత టీడీపీ ప్రభుత్వ నిర్వాకమే కారణమన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘించి కాఫర్ డ్యామ్ పనులు అసంపూర్తిగా చేయడం వల్లే డయాఫ్రంవాల్ కొట్టుకుపోయిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అప్పటి ప్రభుత్వం వేసిన అంచనాలు మరింత పెరిగాయని, సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదంతో పనులు వేగవంతం చేస్తామని అంబటి స్పష్టం చేశారు. మండలిలో సభ్యులు వరుదు కళ్యాణి, మొండితోక అరుణ్కుమార్, మర్రి రాజశేఖర్, రఘురాజు, కేఎస్ లక్ష్మణరావు, ఇళ్ల వెంకటేశ్వరరావు, షేక్ షాబ్జీ, అనంత సత్యఉదయభాస్కర్ పలు అంశాలను ప్రస్తావించారు. కాగా, అసెంబ్లీలో ఆమోదం పొందిన 11 బిల్లులను మండలిలో సంబంధిత మంత్రులు ప్రవేశపెట్టడంతో ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. -
రాష్ట్ర మైనార్టీ కమిషన్ కార్యాలయం ప్రారంభం
మంగళగిరి: ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన రాష్ట్ర మైనార్టీ కమిషన్ కార్యాలయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి, అంజాద్ బాషా బుధవారం ప్రారంభించారు. అనంతరం కమిషన్ చైర్మన్ జియావుద్దీన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహకారంతో మైనార్టీల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. కమిషన్ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యపైనా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రభుత్వ సహకారంతో త్వరలోనే పక్కా భవన నిర్మాణాన్ని చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముస్తఫా, అంబటి రాంబాబు, కిలారి రోశయ్య, మద్దాలి గిరిధర్, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, నాయకులు భీమనాథం భరత్రెడ్డి, కమిషన్ సెక్రటరీ మహ్మద్ మస్తాన్వలి తదితరులు పాల్గొన్నారు. -
ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తా
మైదుకూరు టౌన్ న్యూస్లైన్ : ముస్లింల సం క్షేమానికి కృషి చేస్తానని మైదుకూరు ఎమ్మె ల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పేర్కొన్నారు. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని షాదీఖానాలో సోమవారం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ అధ్వర్యంలో ముస్లిం పిల్లలకు ప్రతి సంవత్సరం వేసవిలో జరిపే ఖత్నా(ఒడుగుల) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం కుటుంబాలకు చెందిన పిల్లలు 70 మందికి మదనపల్లె డాక్టర్ జిఎస్మస్తాన్ బాషా ఒడుగుల కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఇలాంటి సామాజిక సేవలతోపాటు పేద ముస్లిం పిల్లలకు విద్యను అభ్యసించుటకు చేయూతనివ్వాలని కోరారు. గతంలో ముస్లిం ల కోసం ఉర్దూ మహిళా పాఠశాల ఏర్పాటుకు కృషి చేశామన్నారు. ఈ సారి ముస్లిం పిల్లలకోసం తగిన సహాయ సహకారాలు అందజేస్తామన్నారు.ఈ కార్యక్రమానికి ముస్లిం వెల్ఫేర్ యూనియన్ ప్రెసిడెంట్ మదీనా దస్తగిరి,సెక్రటరి అబ్దుల్లా, ఉపాధ్యక్షులు పాలమాబూ, యాకోబ్,మబూహుసేన్,గౌస్ ఖాదర్వలి,షరీఫ్, అమీర్ బాషా పాల్గొన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement