-
బ్యాట్స్మెన్ మళ్లీ విఫలం
సాక్షి, హైదరాబాద్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ బ్యాట్స్మెన్ మరోసారి విఫలమయ్యారు. ఫలితంగా ఉత్తర్ప్రదేశ్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. న్యూఢిల్లీలోని పాలం ఎయిర్ఫోర్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో జరుగుతోన్న ఈ టోర్నీలో హైదరాబాద్కిది వరుసగా రెండో ఓటమి. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు చేసింది. బావనక సందీప్ (31 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ అంబటి రాయుడు (31 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో అంకిత్ రాజ్పుత్ 3, అ„Š దీప్ నాథ్ 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్లో సురేశ్ రైనా (35 బంతుల్లో 54 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీ చేయడంతో ఉత్తర్ప్రదేశ్ 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 143 పరుగులు చేసి గెలుపొందింది. సమర్థ్ సింగ్ (36 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ బౌలర్లలో ఆశిష్ రెడ్డి 3 వికెట్లు పడగొట్టగా, సాకేత్కు ఒక వికెట్ దక్కింది. ఈసారి టాపార్డర్... పాండిచ్చేరితో జరిగిన తొలి మ్యాచ్లో లోయరార్డర్ రాణించకపోవడంతో విజయానికి 3 పరుగుల దూరంలో నిలిచిపోయిన హైదరాబాద్... ఈ మ్యాచ్లో టాపార్డర్ బ్యాట్ ఝళిపించకపోవడంతో సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (16; 2 ఫోర్లు, 1 సిక్స్), అక్షత్ రెడ్డి (9) త్వరగానే ఔటయ్యారు. వన్డౌన్ బ్యాట్స్మన్ ఆశిష్ రెడ్డి (16; 2 ఫోర్లు), బి. సందీప్ కాసేపు క్రీజులో నిలిచారు. వీరిద్దరూ మూడో వికెట్కు 42 పరుగుల్ని జోడించారు. క్రీజులో కుదురుకుంటోన్న ఈ జంటను అ„Š దీప్నాథ్ విడగొట్టాడు. కొద్ది పరుగుల వ్యవధిలోనే ఇద్దరినీ పెవిలియన్ చేర్చాడు. తర్వాత ప్రత్యర్థి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల వేగం నెమ్మదించింది. అంబటి రాయుడు ఆచితూచి ఆడగా... మరో ఎండ్లో కె. రోహిత్ రాయుడు (7), సీవీ మిలింద్ (1) క్రీజులో నిలవలేకపోయారు. ఈ దశలో రాయుడుకు సుమంత్ (18 నాటౌట్) అండగా నిలిచాడు. వీరిద్దరూ ఏడో వికెట్కు 26 పరుగులు జోడించాక అంకిత్ బౌలింగ్లో జట్టు స్కోరు 136 పరుగుల వద్ద రాయుడు ఎల్బీగా వెనుదిరిగాడు. రైనా మెరుపులు... సాధారణ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఉత్తర్ప్రదేశ్ జట్టుకు శుభారంభం దక్కింది. ఓపెనర్లు ఉపేంద్ర యాదవ్ (25), సమర్థ్ సింగ్ (36) తొలి వికెట్కు 48 పరుగులు జోడించారు. తర్వాత క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా ధాటికి లక్ష్యం కరిగిపోయింది. కెప్టెన్ అక్ష్ దీప్ నాథ్ (3), రింకూ సింగ్ (0) విఫలమైనప్పటికీ... ప్రియం గార్గ్ (19 నాటౌట్) తోడుగా రైనా సులువుగా లక్ష్యాన్ని ఛేదించాడు. స్కోరు వివరాలు హైదరాబాద్ ఇన్నింగ్స్: తన్మయ్ (బి) అంకిత్ 16; అక్షత్ రెడ్డి (బి) యశ్ దయాల్ 9, ఆశిష్ రెడ్డి (బి) అక్ష్ దీప్నాథ్ 16; సందీప్ (సి) బాబీ (బి) అ„Š దీప్నాథ్ 33; రాయుడు ఎల్బీ (బి) అంకిత్ 29; రోహిత్ రాయుడు (సి) ఉపేంద్ర (బి) సౌరభ్ కుమార్ 7; మిలింద్ (సి) రైనా (బి) అంకిత్ 1; సుమంత్ (నాటౌట్) 18; మెహదీ హసన్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–24, 2–26, 3–68, 4–92, 5–106, 6–113, 7–136. బౌలింగ్: అంకిత్ రాజ్పుత్ 4–1–31–3, యశ్ దయాల్ 3–8–21–1, శివ సింగ్ 4–7–24–0, బాబీ 2–6–10–0, సౌరభ్ 3–3–32–1, అ„Š దీప్ 4–7–18–2. ఉత్తర్ప్రదేశ్ ఇన్నింగ్స్: ఉపేంద్ర యాదవ్ ఎల్బీ (బి) ఆశిష్ రెడ్డి 25; సమర్థ్ సింగ్ (సి) రాయుడు (బి) సాకేత్ 36; రైనా (నాటౌట్) 54; అ„Š దీప్ ఎల్బీ (బి) ఆశిష్ రెడ్డి 3; రింకూ సింగ్ (సి) సుమంత్ (బి) ఆశిష్ 0; ప్రియం గార్గ్ (నాటౌట్) 19; ఎక్స్ట్రాలు 6; మొత్తం (18.3 ఓవర్లలో 4 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–48, 2–85, 3–97, 4–97. బౌలింగ్: సిరాజ్ 3–8–28–0, మిలింద్ 3.3–9–24–0, మెహదీహసన్ 4–9–32–0, సాకేత్ 4–9–23–1, ఆశిష్ రెడ్డి 4–8–33–3. -
సౌత్జోన్కు మరో పరాజయం
ముస్తాక్ అలీ టి20 టోర్నీ ముంబై: దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలో సౌత్జోన్ జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో ఈస్ట్జోన్ 6 వికెట్ల తేడాతో సౌత్జోన్ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన సౌత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (36 బంతుల్లో 72; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ వినయ్ కుమార్ (47 బంతుల్లో 68; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగారు. మనోజ్ తివారీకి 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఈస్ట్ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఇషాంక్ జగ్గీ (51 బంతుల్లో 90; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగి ఈస్ట్ను గెలిపించాడు. మరో మ్యాచ్లో సెంట్రల్ జోన్ 4 పరుగులతో నార్త్జోన్ను ఓడించింది. మహేశ్ రావత్ (40 బంతుల్లో 57 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), నమన్ ఓజా (34 బంతుల్లో 48; 6 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో సెంట్రల్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. అనంతరం శిఖర్ ధావన్ (39 బంతుల్లో 37; 5 ఫోర్లు), యువరాజ్ సింగ్ (20 బంతుల్లో 33; 4 సిక్సర్లు) రాణించినా నార్త్ జోన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులు మాత్రమే చేయగలిగింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement