breaking news
Munir. MD
-
జనుల కోసం తపించాడతడు!
పుట్టిన ప్రతి జీవి జీవితం బాగుండాలని తపించారాయన. జీవించే హక్కు కోసం తన చివరి ఊపిరి వరకు ఆయన పోరాడారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల పరి రక్షణ కోసం ఉద్యమించారాయన. చట్టాల ఉల్లంఘనను నిలదీశారు. ఆయనే కె. బాల గోపాల్! హింస ఏదైనా, ఎవరు చేసినా ఈ హక్కుల నేత, ప్రజల న్యాయవాది వ్యతి రేకించే వారు. అది రాజ్యహింస అయినా, ప్రైవేట్ వ్యక్తుల హింస అయినా దేనినీ సహించే వారు కాదు. అభివృద్ధి పథకాల పేరిట ప్రజల జీవించే హక్కును ప్రభుత్వాలు హరిస్తు న్నాయనీ; నేల, నీరు, అడవులు వంటి ప్రకృతి ఇచ్చిన సంపదను కోట్లాదిమంది జీవనోపాధికి ఉపయోగించాలనీ సెజ్లను వ్యతి రేకిస్తూ పోరాటం చేశారు. భూ నిర్వాసితుల పక్షాన నిలబడ్డారు. బాలగోపాల్ సర్ 2009 అక్టోబర్ 8న ఆకస్మికంగా హైదరాబాద్లో మరణించారు. ప్రముఖ జర్నలిస్ట్, ఆయన సహచరి వసంత లక్ష్మి, వారి కొడుకు కళ్ళ ముందే ఆయన ఊపిరి వదిలారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పౌరహక్కుల నిజమైన ఉద్యమ గొంతు మూగ వోయింది. సర్ ఇలా అకస్మాత్తుగా వెళ్ళిపోయి 14 ఏండ్లు దాటు తున్నా ఆయన ఎక్కడో ఇంకా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆయన చివరి సారిగా మంచిర్యాలలోని మా ఇంటికి భార్యాకుమారులతో కలిసి వచ్చి భోజనం చేసి శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించి నిర్వాసితులతో మాట్లాడిన విషయాలూ, ఆయన నింపిన మనో ధైర్యం నేటికీ గుర్తుకు వస్తున్నాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన మరణవార్త కలిచి వేసింది. హడావిడిగా మిత్రులతో హైదరాబాద్ వెళ్లి ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నాను. ఎన్కౌంటర్లపై న్యాయ విచా రణ జరపాలనీ, పోలీసుల మీద హత్యా నేరం కింద కేసులు నమోదు చేయాలనీ, సంఘటనా స్థలానికి వెళ్లి నిజనిర్దారణ చేసి మరీ డిమాండ్ చేసే వారు బాలగోపాల్. లాయర్గా ప్రాక్టీస్ మొదలు పెట్టిన తర్వాత చాలా కేసులను ఆయన తీసుకుని వాదించారు. రాజ్యానికి ఆయనంటే గుబులు, ఆందోళన. అందుకే ఆయన్ని భౌతిక దాడులతో భయపెట్టే ప్రయత్నం చేశారు. కొత్తగూడెంలో పోలీసులు బాల గోపాల్ మీద ప్రీ ప్లాన్డ్గా దాడి చేసి కొట్టి, గాయపరిచి చచ్చి పోయాడని భావించి కాలువలో పడేసి వెళ్లిపోయారు. అప్పుడు ఆయనను చూసిన కొందరు అభిమానులు కాపాడారు. కష్టపడే వారికి కనీస వేతనాల కోసం, ఆదివాసీల హక్కుల కోసం; బొగ్గు గని కార్మికుల, కాంట్రాక్టు కార్మికుల జీవితాల మెరుగు కోసం; కాలుష్య రహిత సమాజం కోసం... మొత్తంగా మానవ హక్కుల కోసం ఆయన పోరాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా బూటకపు ఎన్కౌంటర్లు జరిగినపుడు బాలగోపాల్ వెంట వచ్చిన టీమ్తో నేనూ వెళ్లే వాడిని. ఆయన, నేను కలిసి కాగజ్ నగర్ నుంచి ఒక సంఘటనలో ఒకే సైకిల్ మీద నిజ నిర్ధారణకు వెళ్లిన సందర్భం ఇంకా గుర్తుంది. ఓపెన్ కాస్ట్ గనులు సృష్టించే విధ్వంసం మీద పోరాట సందర్భం అది. ఆ గనులు వద్దని ప్రజలు చేసిన ఉద్యమంలో బాలగోపాల్ పాత్ర కీలకంగా ఉండేది. లాకప్ డెత్లకు వ్యతిరేకంగా కూడా ఆయన కేసులు వేశారు. రాజ్యంతో పోరాడారు. కార్మికుల న్యాయమైన సమ్మె పోరాటాలను కూడా సమర్థించి వాటిల్లో పాల్గొని మద్దతు ఇచ్చేవారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఆకాంక్షించే వారు. ఉద్యమానికి మద్దతు కూడా ఇచ్చారు. ఆయన లేని లోటు ఆయన మరణించి 14 ఏండ్లు దాటినా ఇంకా భర్తీ చేసేవారు రాలేదు. బాల గోపాల్ లాంటి మనుషుల కొరత ఈ సమాజానికి ఉంది. ప్రశ్నించే వారి మీద ఉపా లాంటి కేసులు పెరిగాయి. మానవ హక్కులు ఎక్కడికక్కడ హరించ బడుతున్నాయి. దేశంలో ఒక వర్గానికి చెందిన వారిని కులం, మతం పేరు ఎమీద తీవ్ర అణచివేతకు గురి చేస్తున్నారు. లాకప్ లలో పెట్టి, పబ్లిక్గా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. విద్వేషాలను రెచ్చగొట్టే ఉపన్యాసాలు, పెరుగుతున్న అమానవీయ చర్యలు, తద్వారా అధి కారం నిలబెట్టుకునే ప్రయత్నం, దేశంలో పెరిగిన నిరుద్యోగం, అసమానతలు, ఆకలి, అధిక ధరలు, ఆర్థిక ఇబ్బందులు, దేశ ప్రజలను విడదీసి పాలించే విధానం... ఇన్నింటి మధ్య నలుగుతున్న జనం హక్కుల గురించి ప్రశ్నించేవారు కరవవుతున్నారు. బాల గోపాల్ మళ్ళీ రావడం కుదరదు. కాబట్టి బుద్ధిజీవులే అందుకు సిద్ధం కావాలి. అందుకు సమయం ఇదే, ఛలో ఛలో కాలం పిలుస్తోంది. బాల గోపాల్ పిలుపు ఎక్కడి నుంచో వినిపిస్తున్నట్లుంది. ఛలో ఛలో కహీన్ దేర్ న హోజాయే! ఎం.డి. మునీర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు ‘ 99518 65223 (నేడు హైదరాబాద్ ఎస్వీకేలో బాలగోపాల్ 14వ సంస్మరణ సభ) -
పెళ్లికి నిరాకరించిందని..
నిర్మల్ అర్బన్ : నిర్మల్ పట్టణంలో శుక్రవారం యువతిపై జరిగిన యాసిడ్ దాడి సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎప్పుడూ నిర్మలంగా ఉండే పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓ పక్క సీఎం కేసీఆర్ యువతులపై దాడులు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న క్రమంలో.. బడ్జెట్లో మహిళల భద్రతకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి 48 గంటలైనా గడవకముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. పెళ్లికి జాప్యం చేస్తుందని ఆగ్రహించిన యువకుడు ఓ యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే... కడెం మండలానికి చెందిన ఎండీ మునీర్, లక్ష్మణచాంద మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన హంసరాణి నిర్మల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కలిసి చదువుకున్నారు. డిగ్రీ చదువుతుండగా ఇరువురి మధ్య పరిచయం ఏర్పడింది. మునీర్ ప్రస్తుతం హైదరాబాద్లో ప్రై వేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, హంసరాణి ఇటీవలే బీఈడీ పూర్తిచేసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి వచ్చిన మునీర్, న ర్సాపూర్(జి) గ్రామంలోని బంధువుల ఇంటి కి వెళ్లిన హంస మధ్యాహ్నం నిర్మల్లో కలుసుకున్నారు. బస్టాండ్ సమీపంలోని ప్రియదర్శినినగర్లో మాట్లాడుకుంటుండగా.. పెళ్లి విషయమై ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు వ చ్చాయి. దీంతో మునీర్ తనవెంట తెచ్చుకున్న యాసిడ్తో ఆమెపై దాడి చేశాడు. హంస నెత్తి పై యాసిడ్ పడటంతో మంటతో అరిచింది. దీంతో కంగారుపడ్డ నిందితుడు ఆమెను వెం టనే సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలిం చాడు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్ర యత్నించగా స్థానికులు పోలీసులకు సమాచా రం అందజేశారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న హంస నుంచి పట్టణ సీఐ పింగళి ప్రశాంత్రెడ్డి సమాచారాన్ని సేకరించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మునీర్పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ మాధవరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడిం చారు. దీనిపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యన్నగారి భూమయ్య విలేకరులతో మాట్లాడు తూ.. ప్రేమ పేరుతో విద్యార్థినులను టార్గెట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షుడు సింగరి వెంకటేశ్, ఉపాధ్యక్షుడు శేఖర్, పీవోడబ్ల్యూవో జిల్లా ఉపాధ్యక్షురాలు కె.లక్ష్మి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మహిళల భద్రతకు ప్రత్యేక బృందాలు.. జిల్లాలో మహిళల భద్రతకు ప్రత్యేక బృందా లు ఏర్పాటు చేస్తామని ఎస్పీ గజరావు భూపా ల్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం క్యాంప్ కార్యాలయంలో జిల్లాలోని పోలీసు ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ని ర్మల్లో యాసిడ్ దాడి వంటి ఘటనలు జిల్లా లో పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. కళాశాలల్లో, పార్కుల వద్ద మహిళ పోలీసులకు విధులు వేస్తామని ఎస్పీ ప్రకటించారు.