-
రూ.98వేల కోట్ల మోదీ డ్రీమ్ ప్రాజెక్ట్కు చిక్కులు
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీ డ్రీమ్... ముంబై-అహ్మదాబాద్ మధ్యలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ తొలి రన్ 2022 ఆగస్టు నుంచి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ఎంతో కృతనిశ్చయంతో ఉంది. ఈ ప్రాజెక్ట్కు అవసరమైన భూములను సేకరించడం కూడా మొదలుపెట్టింది. కానీ అసలు సమస్య ఇక్కడే ప్రారంభమైంది. భూమి కొనుగోలులో కేంద్ర ప్రభుత్వానికి చుక్కెదురవుతోంది. మహారాష్ట్రలోని పాల్గడ్ జిల్లాలో గిరిజన గ్రామాలు, స్థానిక కమ్యూనిటీలు తామెంతో ప్రాణప్రదంగా చూసుకునే భూమిని ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. పాల్గడ్ జిల్లాలో మొత్తం 70కి పైగా గిరిజన గ్రాములున్నాయి. ఆ గ్రామాల్లో 20కి పైగా గ్రామాలు ఈ ప్రాజెక్ట్కు భూమి ఇవ్వడానికి నిరాకరించాయి. ప్రతిపాదిత రైల్ కారిడర్కు వ్యతిరేకంగా నిరసన ఉద్యమాలు కూడా చేపట్టారు ఆ గ్రామ ప్రజలు. భారత తొలి హై-స్పీడ్ ట్రైన్ ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. 508 కిలోమీటర్లు ఈ ట్రైన్ కారిడర్ను నిర్మిస్తున్నారు. అసలు 2018 జూన్ నాటికే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం కావాల్సి ఉంది. కానీ భూమి కొనుగోలులో వచ్చిన చిక్కుతో దీని నిర్మాణాన్ని 2019 జనవరికు జరిపారు. ఈ ఏడాది చివరి వరకు ఎలాగైన ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్కు కావాల్సిన భూమిని సేకరించి, వచ్చే ఏడాది ప్రారంభించాలని చూస్తున్నారు. కానీ ఈ ఏడాది చివరి వరకైనా భూమిని సేకరిస్తారో లేదో స్పష్టత కావడం లేదు. పాల్గడ్ జిల్లా నుంచి వెళ్లే 110 కిలోమీటర్ల కారిడర్ మహారాష్ట్ర, గుజరాత్ రాజధానులను కలుపుతోంది. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో దీనికి వ్యతిరేకంగా నిరసనలు సాగుతున్నాయని కానీ అనుకున్న సమయానికి దీని నిర్మాణం చేపడతామని రైల్వే మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం సేకరించే భూమికి సర్కిల్రేటు కంటే ఐదు రెట్లు ఎక్కువగా చెల్లిస్తామని కూడా రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో 1400 ఎకరాలను, గుజరాత్లో రూ.10 కోట్ల భూమిని సేకరిస్తున్నట్టు దేశీయ రైల్వే పేర్కొంది. దీనిలో భాగంగా పాల్గడ్ జిల్లాలోనే 200 ఎకరాలను సేకరించాల్సి ఉంది. దీనిలో ఎక్కువ భాగం గిరిజనులవే. మొత్తం 73 గ్రామాల్లో 50 గ్రామాలు అధికారుల ఒప్పందానికి అంగీకరించాయని, కానీ 23 గ్రామాల గిరిజనులు మాత్రం రైల్వే అధికారులకు సహకరించడం లేదని దేశీయ రైల్వే పేర్కొంది. సర్వేకు వెళ్లిన వారిపై దాడులు చేస్తున్నట్టు తెలిపింది. ఈ ప్రాజెక్ట్కు ఇప్పటికే జపనీస్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ ఫండ్స్ను అందించింది. ముంబైలో కొన్ని ప్రాంతాల్లో భూమి కొనుగోళ్లు పూర్తయ్యాయి. -
జై జపాన్-జై ఇండియా
మేకింగ్ ఇండియాకు కట్టుబడి ఉన్నాం బుల్లెట్ రైలు శంకుస్థాపనలో జపాన్ ప్రధాని షింజో అబే రాబోయే రోజులు హైస్పీడ్ కారిడార్లవే జపాన్ మనకు నిజ స్నేహితుడు అబేకు కృతజ్ఞతలు తెలియజేసిన మోదీ సాక్షి, అహ్మదాబాద్: భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముందుచూపు ఉన్న నేత అని, అందుకే మేకింగ్ ఇండియా కలను సార్థకం చేసుకునేందుకు జపాన్ లాంటి దేశాన్ని భాగస్వామిగా ఎంచుకున్నారని జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే తెలిపారు. గురువారం ఉదయం సబర్మతిలో ప్రతిష్టాత్మక ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించగా, అనంతరం అబే ప్రసంగించారు. నమస్కారం అంటూ తన ప్రసంగం మొదలుపెట్టిన అబే.. భారత్ తో జపాన్ అనుబంధం ప్రత్యేకమైనదన్న ఆయన మేకింగ్ ఇండియాకు కట్టుబడి ఉన్న దేశం జపానేనని తెలిపారు. భారత్-జపాన్ల చేతులు కలిస్తే అన్ని సుసాధ్యాలే అని చెప్పిన అబే.. జై జపాన్-జై ఇండియా నినాదంతో ఇరు దేశాలు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. తన తదుపరి పర్యటనలో మళ్లీ ఇక్కడికి వస్తే మోదీతో కలిసి షింకసెన్(బుల్లెట్ ట్రైన్) లో కలిసి ప్రయాణించాలనుకుంటున్నానని షింజో అబే ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా భారత్ తో మరిన్ని వాణిజ్యపరమైన ఒప్పందాలు చేసుకుంటామని ఆయన ప్రకటించారు. బుల్లెట్ అసలు స్టోరీ ఇక ఏ దేశ అభివృద్ధికైనా రవాణా వ్యవస్థే ప్రాథమిక అవసరమని భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బుల్లెట్ ప్రాజెక్టును ఉద్దేశిస్తూ... తర్వాతి తరాలు హై స్పీడ్ కారిడార్లతోనే వృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. సాంకేతికతతో పేదలకు సాధికారత ప్రయత్నిస్తే పేదరికంపై విజయం సాధించినట్లేనని మోదీ పేర్కొన్నారు. మన రైల్వే సంస్థ చాలా పెద్దదని పేర్కొన్న మోదీ.. ఒక వారం రైళ్లలో ప్రయాణించే మన దేశ ప్రజల సంఖ్య.. జపాన్ మొత్తం జనాభాకు సమానమని చెప్పుకొచ్చారు. సగటు భారతీయుడికి మెట్రో రైలు ప్రయాణం అందుబాటులోకి తీసుకురావటమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా వేగవంతమైన రవాణా వ్యవస్థను నెలకొల్పటంతోపాటు ఉద్యోగాల కల్పన ఆస్కారం లభించదన్నారు. కాలుష్య రహితం అయిన ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు మన జీవితాలలో కీలకంగా మారబోతుందని అభిప్రాయపడ్డారు. ‘88,000 కోట్లను కేవలం 0.1 శాతం వడ్డీకే జపాన్ భారత్ కు ఇచ్చిందని, కీలకమైన మెట్రో ప్రాజెక్టు కోసం ఆర్థిక సాయంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందించేందుకు ముందుకు వచ్చిందని, అందుకే జపాన్ భారత్కు ఓ నిజమైన ఆత్మీయ దేశమని మోదీ చెప్పుకొచ్చారు. 2022-23 కల్లా మెట్రో రైలు ప్రారంభం అవుతుందన్న ఆకాంక్షను ప్రధాని వ్యక్తం చేశారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు విషయంలో ఎలాంటి అవాంతరాలు ఉండబోవని ప్రకటించిన జపాన్ ప్రధాని షింజో అబేకు.. మోదీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమానికి గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విజృంభిస్తున్న ఎండలు
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
పోలింగ్కు సర్వం సిద్ధం
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
Advertisement