breaking news
MRPS ts
-
తెలంగాణ మాదిరే డప్పు, చెప్పు ఉద్యమం
వర్గీకరణ డిమాండ్తో నవంబర్ 18న బహిరంగ సభ పాదయాత్రలో ఎమ్మార్పీఎస్(టీఎస్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ‘వంగపల్లి’ మహబూబాబాద్ : తెలంగాణ ఉద్యమం ఎంత న్యాయమైనదో.. డప్పు, చెప్పు ఉద్య మం కూడా అంతే న్యాయమైనదని ఎమ్మార్పీఎస్(టీఎస్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలన్న డిమాండ్తో శ్రీనివాస్ చేపట్టిన పాదయాత్ర మంగళవారం రాత్రి మానుకోటకు చేరుకుం ది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఆ యనకు ఘన స్వాగతం పలికారు. అనంత రం నెహ్రూ సెంటర్లో వంగపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు పార్లమెం ట్లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశా రు. సీఎం కేసీఆర్కు దళితుల పట్ల ఏ మా త్రం చిత్తశుద్ధి ఉన్నా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి, ఆ బిల్లుపై ఎంపీలు మాట్లాడే లా కృషి చేయాలన్నారు. పాదయాత్ర నవంబర్ 18న హైదరాబాద్ చేరుకుంటుందని, అదేరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. అయినా ప్రభుత్వం స్పందించకపోతే 19న హైదరాబాద్ను దిగ్బందిస్తామని శ్రీనివాస్ హెచ్చరించారు. వీరభద్రస్వామి ఆలయంలో పూజలు కురవి : ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం కో సం పాదయాత్ర చేపట్టిన వంగపల్లి శ్రీని వాస్ కురవిలోని శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. పాదయా త్ర కురవికి చేరుకున్న సందర్భంగా ఆయన పూజలు నిర్వహించడంతో పాటు సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. మేకల నరేందర్, కె.ఎల్లయ్య, సంజీవ, వెంకన్న, సునీల్, వెంకన్న, రుక్క మ్మ, టి.ప్రవీణ్, వెంకన్న పాల్గొన్నారు. -
తక్షణమే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి
బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన ఎమ్మార్పీఎస్ నాయకులు హన్మకొండ : ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని ఎమ్మార్పీఎస్ (టీఎస్) జిల్లా అధ్యక్షుడు సిలువేరు సాంబ య్య మాది గ డిమాండ్ చేశారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరు తూ నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయాన్ని బుధవారం ముట్టడించారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాంబయ్య మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ కు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన బీజేపీ.. రెండేళ్లు గడిచినా పట్టించుకోవడం లేదన్నారు. దీంతో మాదిగ, మాదిగ ఉపకులాలకు అన్యా యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత అశోక్రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అంశా న్ని బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళతానన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కొత్త దశరథం, ఎమ్మార్పీఎస్ (టీఎస్) యువతజిల్లాఅధ్యక్షుడు తాళ్లపల్లి విజయ్, డాక్టర్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ రామకృష్ణ, నాయకులు అనిల్కుమార్, దైద డేవిడ్, మాదాసు రాంబాబు, సంజీవ, మంద బాబురావు, కిశోర్, బాలయ్య, ఇల్లందుల రాజేష్ఖన్నా పాల్గొన్నారు.