breaking news
MP Shashi tharoor
-
దేశ సేవ నేరమా?
వాషింగ్టన్: దేశ ప్రయోజనాల కోసం పని చేయడం నేరమా? అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ప్రశ్నించారు. దేశానికి సేవ చేయడం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా భావించేవారు ఆత్మవిమర్శ చేసుకోవాలని పరోక్షంగా కాంగ్రెస్ నాయకత్వానికి చురక అంటించారు. వారిని వారు ప్రశ్నించుకుంటే అసలు నిజం ఏమిటో తెలుస్తుందన్నారు. కాంగ్రెస్కు రాజీనామా చేసే ఉద్దేశం లేదని స్పష్టంచేశారు. ఆపరేషన్ సిందూర్పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష బృందానికి నేతృత్వం వహిస్తున్న శశిథరూర్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. తాజాగా ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నానంటూ తనపై కొందరు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలపై స్పందించారు. దేశానికి సేవ చేస్తున్నప్పుడు ఇలాంటి చిల్లరమల్లర విమర్శలు, ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. తాను బీజేపీలో చేరబోతున్నానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ప్రజలు తనను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకున్నారని, ఎంపీగా పదవీ కాలం మరో నాలుగేళ్లు ఉందని, ఇలాంటి సమయంలో పార్టీ మార్పు ప్రశ్న ఎందుకు చర్చకు వస్తోందో తనకు అర్థం కావడం లేదన్నారు. పార్టీ మారాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని తేల్చిచెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలు ‘చిన్న విషయం’అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎదుట ప్రధాని నరేంద్ర మోదీ లొంగిపోయారని, అందుకే పాకిస్తాన్పై యుద్ధం హఠాత్తుగా ఆపేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన ఆరోపణల పట్ల శశి థరూర్ స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పారీ్టలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం సహజమేనని కొట్టిపారేశారు. అయినా తాము ఇక్కడికి రాజకీయ కార్యక్రమం కోసం రాలేదని, ఐక్య భారత్ ప్రతినిధులుగా వచ్చామని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశ సందేశానికి ప్రపంచ దేశాలకు చేరవేస్తున్నామని ఉద్ఘాటించారు. అఖిలపక్ష బృందంలో వేర్వేరు పార్టీల నేతలు సభ్యులుగా ఉన్నారని గుర్తుచేశారు. ఇది కూడా భిన్నత్వంలో ఏకత్వానికి సంకేతమని వివరించారు. మన మధ్య రాజకీయ విభేదాలు ఏవైనా ఉంటే అవి దేశ సరిహద్దుల్లోనే ఆగిపోవాలని, సరిహద్దు దాటితే మనమంతా భారతీయులమేనని గతంలో ఒక సందర్భంలో తాను చెప్పినట్లు గుర్తుచేశారు. భారత్–పాకిస్తాన్ మధ్య అణు యుద్ధాన్ని ఆపేశానంటూ ట్రంప్ పదేపదే చెబుతుండడంపై ప్రశ్నించగా, ‘‘ట్రంప్ వ్యాఖ్యలు, వాటిపై రాహుల్ విమర్శలు నిజానికి చిన్న విషయాలు’’ అంటూ థరూర్ ఆసక్తికరంగా స్పందించారు. ‘‘అమెరికా అధ్యక్షునిగా ట్రంప్పై భారత్కు ఎంతో గౌరవముంది. ఇలాంటి ఉదంతంతో ద్వైపాక్షిక సంబంధాలు సంక్లిష్టం కావడం భారత్కు ఇష్టం లేదు. ఒక్కటి మాత్రం సుస్పష్టం. మధ్యవర్తిత్వం కోసం ఎవరినో ప్రాధేయపడాల్సిన అవసరం భారత్కు లేదు. పాక్ దాడి చేస్తే గట్టిగా బదులిస్తామని, ఆపేస్తే తామూ ఆపేస్తామని భారత్ మొదట్లోనే చెప్పింది. అలాంటప్పుడు పాక్పై దాడులు ఆపాలని మాకు ఇంకెవరో చెప్పే సందర్భమే తలెత్తదు’’ అని కుండబద్దలు కొట్టారు. ఆపరేషన్ సిందూర్ను తట్టుకోలేక పాకే అమెరికా శరణుజొచ్చిందేమో. లేదంటే కాల్పుల విరమణ కోసం అమెరికాయే పాక్పై ఒత్తిడి చేసి ఉండొచ్చు’’ అన్నారు. -
థరూర్ సీపీఎంలో చేరబోరు: కారత్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ సీపీఎం పార్టీలో చేరతారంటూ వస్తున్న వార్తలను ఆ పార్టీ తాత్కాలిక సమన్వయకర్త ప్రకాశ్ కారత్ తోసిపుచ్చారు. ఆయన పార్టీ వీడుతున్నట్లు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదన్నారు. కేవలం కేరళలో స్టార్టప్లు సాధిస్తున్న గణనీయమైన ప్రగతి గురించి మాత్రమే మాట్లాడారని చెప్పుకొచ్చారు. శశిథరూర్ సాధారణ వ్యక్తి కాదని ప్రశంసించిన కారత్.. ఆయన నిక్కచ్చి అభిప్రాయాలు కొన్నిసార్లు కాంగ్రెస్కు అసౌకర్యాన్ని కలిగిస్తాయన్నారు. కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం సాధిస్తున్న పారిశ్రామికాభివృద్ధిని ప్రశంసిస్తూ థరూర్ గత నెలలో ఓ ఆంగ్ల పత్రికలో వ్యాసం రాశారు. ఇది రాజకీయ దుమారం రేపింది. కాంగ్రెస్ దానిపై ప్రశ్నల వర్షం కురిపించగా.. సీపీఎం వ్యాసాన్ని స్వాగతించింది. అయితే తాను ప్రభుత్వాన్ని ప్రశంసించలేదని, కేవలం స్టార్టప్ రంగంలో రాష్ట్ర ప్రగతిని ఎత్తి చూపానని థరూర్ స్పష్టం చేశారు. ఆ తరువాత మలయాళంలో ఓ పాడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేరళలో పార్టీ నాయకత్వ బాధ్యతలకు తాను అర్హుడినని ప్రకటించారు. సంసిద్ధతను సైతం వ్యక్తం చేశారు. ఈ ప్రకటన కాంగ్రెస్లో ఒక వర్గాన్ని కలవరపరిచింది. అయితే తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారంటూ థరూర్ మీడియాపై మండిపడ్డారు. -
గుర్రంపై కూర్చుని ఖడ్గమెత్తిన హీరో
కోల్కతా: ప్రధాని నరేంద్ర మోదీని హేళన చేస్తూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరోసారి వ్యాఖ్యలు చేశారు. తనకు అన్ని తెలుసని చెప్పుకునే మోదీ ‘తెల్లని గుర్రంపై కూర్చుని గాల్లోకి ఖడ్గాన్ని ఎత్తిన హీరో’ అని పేర్కొన్నారు. ఎన్డీయే హయాంలో ఒక్క వ్యక్తి(మోదీ) చేతిలోనే పాలన అంతా నడుస్తోందని అన్నారు. ‘మోదీ ప్రభుత్వానిది ఏక వ్యక్తి పాలన. మోదీ∙చెప్పిన ప్రతిదానికీ అంతా తలూపుతున్నారు. చరిత్రలో ప్రధాని కార్యాలయంలో పాలన ఇంతగా ఎప్పుడూ కేంద్రీకృతం కాలేదు. ప్రతి నిర్ణయాన్ని ప్రధాని కార్యాలయమే తీసుకుంటోంది. అనుమతి కోసం ప్రతి దస్త్రాన్ని అక్కడికే పంపుతున్నారు’ అని అన్నారు. మరోవైపు, ‘మోదీ శివలింగంపై తేలు వంటి వారు’ అంటూ కాంగ్రెస్ నేత శశిథరూర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత ఒకరు కోర్టుకెక్కారు. అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో ఢిల్లీ బీజేపీ ఉపాధ్యక్షుడు రాజీవ్ బబ్బర్ పరువు నష్టం కేసు వేశారు. -
హిందూ మతం అద్భుతమైనది: శశిథరూర్
న్యూయార్క్: హిందూమతం అద్భుతమైనదని కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ కొనియాడారు. అనిశ్చితితో కూడిన నేటి సమాజానికి సరిగ్గా సరిపోయేది హిందూ మతమేనని పేర్కొన్నారు. మనకు తెలియని చాలా విషయాలు ఈ మతంలో ఉన్నాయన్నారు. జైపూర్ సాహిత్య వేడుకలకు అనుబంధంగా న్యూయార్క్లో గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ హిందూ మతం అద్భుతమైదని కొనియాడారు. ‘అనిశ్చితి, సంశయాలను జయించే ఒకే ఒక గొప్ప మతం హిందూయిజం. హిందూమతానికి సంబంధించి చాలా పవిత్ర గ్రంథాలున్నాయి. నేర్చుకోవడానికి ఎంతో ఉంది. ఏది ఎంచుకోవాలన్నది వ్యక్తిగత నిర్ణయం. స్త్రీలను, కులాన్ని ద్వేషించే విషయాలను గ్రహించి, తన మతం ఇతరుల పట్ల వివక్ష చూపడానికి అనుమతిస్తోందని వాదిస్తే అది వ్యక్తి తప్పవుతుంది కానీ మతానికి కాదు’ అని థరూర్ పేర్కొన్నారు. -
చిల్లర కామెంట్లు.. ఆగ్రహజ్వాలలు
ఛండీగఢ్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ మిస్ వరల్డ్-2017 మానుషి చిల్లర్పై చేసిన ఓ ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. బీజేపీపై విమర్శలు చేసే క్రమంలో మానుషి పేరిట ఆయన ఓ అసంబద్ధ పోస్టును చేశారు. ‘‘నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని బీజేపీ ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది. మన డబ్బులకు అంతర్జాతీయ స్థాయిలో ఎంత గుర్తింపు ఉందో వారికి అర్థం కావట్లేదు. కావాలంటే చూడండి మన చిల్లర(మానుషి చిల్లర్) మిస్ వరల్డ్ అయ్యింది’’ అంటూ ట్వీట్ చేశారు. అంతే ఆయన ట్వీట్పై హర్యానా మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కవిత జైన్ తీవ్రంగా స్పందించారు. మానుషి హర్యానాకే కాదు.. యావత్ దేశానికి వన్నె తెచ్చారు. అలాంటి వ్యక్తిని ఉద్దేశించి ఇలాంటి ప్రేలాపనలు చేయటం థరూర్కి తగదు. మన ఆడబిడ్డలను ఆత్మగౌరవాన్ని ఆయన దెబ్బతీశారు. అంతేకాదు చిల్లర్ తెగను అవమానించేలా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి ఆలోచనలు ఉన్న నేతలు ఉన్నారు అంటూ కవిత, శశిథరూర్పై మండిపడ్డారు. ఇక ఆర్థిక మంత్రి కెప్టెన్ అభిమన్యు కూడా థరూర్ సిగ్గుచేటు వ్యాఖ్యలు చేశారని.. తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. వివాదం ముదరక ముందే శశిథరూర్ మానుషిని పొగుడుతూ మరో సందేశం ఉంచటం విశేషం. What a mistake to demonetise our currency! BJP should have realised that Indian cash dominates the globe: look, even our Chhillar has become Miss World! — Shashi Tharoor (@ShashiTharoor) November 19, 2017 What a terrific answer by this bright young woman -- a real credit to Indian values! #missworldmanushi https://t.co/0gCQxlqD5L — Shashi Tharoor (@ShashiTharoor) November 19, 2017 -
సునంద కేసులో నలుగురు కీలకం
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ హత్య కేసులో హస్తమున్న నలుగురు కీలక వ్యక్తులను పోలీసులు బుధవారం విచారించారు. పోలీసు అధికారులు వివరాలు వెల్లడించేందుకు నిరాకరించటంతో దర్యాప్తు బృందంమే సమాచారం అందించింది. ఇందులో భాగంగానే శశిథరూర్ వ్యక్తిగత సిబ్బంది, మరో ఇద్దరు బిజినెస్మేన్లను కూడా విచారించారు. శశిథరూర్ కుటుంబ సన్నిహితులు అయిన దేవన్ను బుధవారం విచారించినట్టు సమాచారం. అతడిని గత ఏడాదిలో రెండుసార్లు ప్రశ్నించారు. సునంద మృతి చెందినపుడు గత జనవరిలో, తరువాత నవంబర్లో కూడా విచారించినట్టు సమాచారం. -
శశిథరూర్ను ఇప్పుడు ప్రశ్నించం
ముందు మిగతా వారందరినీ విచారిస్తాం: పోలీసులు న్యూఢిల్లీ: సునందపుష్కర్ హత్య కేసులో ఆమె భర్త, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ను ప్రస్తుతానికి ప్రశ్నించబోమని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. తొలుత.. ఈ కేసుకు సంబంధించిన ఇతర వ్యక్తులందరనీ విచారించటంతో పాటు, లభ్యమైన సాక్ష్యాధారాలను పరిశీలిస్తామని చెప్పారు. సునంద అనుమానాస్పద మరణానికి ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంటుతో సంబంధం ఉండొచ్చన్న వార్తా కథనాలను ప్రస్తావించగా.. తమకు ఇంతవరకూ అటువంటి కోణమేదీ తారసిల్లలేదని పోలీసులు బదులిచ్చారు. కొత్తగా చెప్పటానికేం లేదు: థరూర్ సునందపుష్కర్ మృతి కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు తీరుపై శుక్రవారం మీడియా ఎదుట ఆందోళన వ్యక్తం చేసిన శశిథరూర్.. ఈ విషయంలో తాను కొత్తగా చెప్పేదేమీ లేదని శనివారం వ్యాఖ్యానించారు. ఆయన కొచ్చి పర్యటన సందర్భంగా మీడియా ప్రతినిధులు ఈ కేసు విషయాన్ని ప్రస్తావించగా పై విధంగా స్పందించారు.