సునంద కేసులో నలుగురు కీలకం | Sunanda case: Friend, ex-PSO quizzed | Sakshi
Sakshi News home page

సునంద కేసులో నలుగురు కీలకం

Jan 15 2015 9:25 AM | Updated on Mar 18 2019 9:02 PM

సునంద పుష్కర్ హత్య కేసులో హస్తమున్న నలుగురు కీలక వ్యక్తులను పోలీసులు బుధవారం విచారించారు.

న్యూఢిల్లీ: సునంద పుష్కర్ హత్య కేసులో హస్తమున్న నలుగురు కీలక వ్యక్తులను పోలీసులు బుధవారం విచారించారు. పోలీసు అధికారులు వివరాలు వెల్లడించేందుకు నిరాకరించటంతో దర్యాప్తు బృందంమే సమాచారం అందించింది. ఇందులో భాగంగానే శశిథరూర్ వ్యక్తిగత సిబ్బంది, మరో ఇద్దరు బిజినెస్మేన్లను కూడా విచారించారు.

శశిథరూర్ కుటుంబ సన్నిహితులు అయిన దేవన్ను బుధవారం విచారించినట్టు సమాచారం. అతడిని గత ఏడాదిలో రెండుసార్లు ప్రశ్నించారు. సునంద మృతి చెందినపుడు గత జనవరిలో, తరువాత నవంబర్లో కూడా విచారించినట్టు సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement