breaking news
Motorsports
-
‘మోటార్స్పోర్ట్’కు హైదరాబాద్ నుంచి ఏడుగురు
సాక్షి, హైదరాబాద్: అత్యంత ధైర్యసాహసాలతో మిళితమైన క్రీడ మోటార్స్పోర్ట్లో హైదరాబాద్కు చెందిన ఏడుగురు క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ‘ఆర్ఎఫ్సీ ఇండియా–2018 అంతర్జాతీయ ఆఫ్రోడ్ మోటార్స్పోర్ట్’లో భాగ్యనగరానికి చెందిన ఏడు జట్లు పాల్గొననున్నాయి. ఈ పోటీల్లో నగరానికి చెందిన ఎన్. అభినవ్ రెడ్డి, చల్లా చైతన్య, వంగల క్రాంతి కుమార్, రాజశేఖర ప్రభు, వెంకట్ దేవినేని, టి. సంతోష్గౌడ్, వి. సుఖేశ్వర్ రెడ్డి హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించనున్నారు. గోవా వేదికగా ఈనెల 21 నుంచి 28 వరకు జరిగే ఈ పోటీల్లో 41 జట్లు తలపడుతున్నాయి. ఈ రేసులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 26 స్టేజ్లను అందరికన్నా ముందుగా పూర్తిచేసిన వారికి ప్రైజ్మనీగా 10వేల అమెరికా డాలర్లు (రూ. 68.54 లక్షలు) అందుతాయి. దీనితో పాటు ఈ ఏడాది చివర్లో మలేసియాలో జరిగే ఆర్ఎఫ్సీ మోటార్ ఈవెంట్కు అర్హత సాధిస్తారు. -
ఎఫ్1 దిగ్గజం సర్ జాక్ బ్రాబమ్ కన్నుమూత
సిడ్నీ: ఫార్ములావన్ గ్రేట్గా పేరు ప్రతిష్టలు సాధించిన సర్ జాక్ బ్రాబమ్ సోమవారం కన్నుమూశారు. 88 ఏళ్ల ఈ ఆస్ట్రేలియన్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూడు ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్షిప్స్ సాధించడమే కాకుండా తాను సొంతంగా తయారుచేసుకున్న కారులోనే రేసులో విజేతగా నిలిచిన ఏకైక డ్రైవర్గా ఆయన పేరు తెచ్చుకున్నారు. 1955 నుంచి 1970 వరకు కెరీర్ కొనసాగించిన జాక్ 14 రేసుల్లో విజేతగా నిలువగా 31 పోడియంలు, 13 పోల్ పొజిషన్లు సాధించారు. అలాగే మోటార్స్పోర్ట్స్కు అందించిన సేవలకు గాను నైట్హుడ్ (1979లో) బిరుదు పొందిన తొలి ఎఫ్1 డ్రైవర్ జాక్.