-
ఆమెకు అప్ఘనిస్తాన్ తల వంచింది
సెప్టెంబర్ – 17 గురువారం అప్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని అక్కడి ‘జనాభా నమోదు చట్టాన్ని’ సవరిస్తూ ఒక చరిత్రాత్మక సంతకం చేశారు. ఈ ఒక్క సంతకంతో అప్ఘనిస్తాన్లో ఇకపై ఆడవాళ్ల పేర్లు వినపడనున్నాయి. పిల్లల గుర్తింపు కార్డు మీద తల్లి పేరు కనపడనుంది. డాక్టర్ మందు చీటి మీద పేరు కనపడనుంది. చనిపోతే డెత్ సర్టిఫికెట్ మీద కూడా పేరు కనపడనుంది. స్త్రీ పేరును బయటకు చెప్పడం అమర్యాదగా భావించే ఆ దేశంలో గత మూడేళ్లుగా పోరాడి మార్పు తెచ్చిన స్త్రీ లాలె ఉస్మాని. ‘వేర్ ఈజ్ మై నేమ్’ పేరుతో ఆమె నడిపిన ఉద్యమమే ఇందుకు కారణం. అప్ఘనిస్తాన్లో ఇలాంటి ఘటనలు మామూలు. ఒక మహిళకు ఆరోగ్యం బాగలేకపోతే వైద్యుని దగ్గరకు వెళ్లింది. అతను పరీక్షలు చేసి ఆమెకు ‘కరోనా’ అని నిర్థారణ చేశాడు. ఆమె ఇంటికి వచ్చి భర్తకు మందు చీటి ఇచ్చి మందులు తెమ్మంది. అతడు దానిని చూసిన వెంటనే ఆమెను చావబాదటం మొదలెట్టాడు. కారణం ఆ మందు చీటి మీద ఆమె పేరు ఉంది. అక్కడ ఆమె పేరుకు బదులు ‘ఫలానా అతని భార్య’ అని ఉండాలి. ఎందుకంటే అప్ఘనిస్తాన్లో స్త్రీ పేరు బయటకు చెప్పడం తప్పు. నిషిద్ధం. భార్య తన పేరును డాక్టరుకు చెప్పడం భర్తకు నామోషీ. అందుకే ఈ బాదుడు. అప్ఘనిస్తాన్లో ఆడపిల్ల పుడితే చిన్నప్పుడు ‘ఫలానా అతని కుమార్తె’గా, వయసులోకి వచ్చాక ‘ఫలానా అతని భార్యగా’, వృద్ధురాలయ్యాక ‘ఫలానా అతని తల్లిగా’ బతికి చనిపోవాలి. అన్నట్టు అక్కడ డెత్ సర్టిఫికెట్ మీద కూడా ఆమె పేరు రాయరు. సమాధి ఫలకం మీద కూడా ఆమె పేరు రాయరు. అన్నిచోట్ల ఆమె ఉనికి ఆ ఇంటి మగవాడి పేరుతో ముడిపడి ఉంటుంది తప్ప ఆమె పేరుతో ముడిపడి ఉండదు. 2001కి ముందు అప్ఘనిస్తాన్లో తాలిబన్ల ఏలుబడిలో స్త్రీల పరిస్థితి ఘోరంగా ఉంటే తాలిబన్ల పతనం తర్వాత ఏర్పడిన ప్రభుత్వ హయాముల్లో కూడా స్త్రీలు తమ కనీస హక్కు కోసం సుదీర్ఘంగా పోరాడుతూనే రావాల్సి వస్తోంది. విద్యా హక్కు కోసం, పని హక్కు కోసం, ఓటు హక్కు కోసం వారు మెరుగైన విజయాలు సాధించినా ప్రతి స్త్రీ తమ సొంత కుటుంబంలోని పురుషుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత, హింస చవిచూడాల్సి వచ్చింది. ఇవన్నీ ఎలా ఉన్నా కనీసం పేరు బయటకు రాని, చెప్పలేని పరిస్థితి ఉండటం అక్కడ హక్కుల కార్యకర్తలను పోరాటానికి దింపింది. ‘ఈ పరిస్థితిని ఎలాగైనా మార్చాలి అనుకున్నాను’ అంటారు 25 ఏళ్ల లాలె ఉస్మాని. పశ్చిమ అఫ్ఘనిస్తాన్ పట్టణమైన హెరత్కు చెందిన లాలె ఉస్మాని మూడేళ్ల క్రితం హ్యాష్ట్యాగ్ వేర్ ఈజ్ మై నేమ్’ కాంపెయిన్ను మొదలెట్టినప్పుడు ఇది వెంటనే అప్ఘనిస్తాన్లోని ఆలోచనాపరులందరినీ ఆకట్టుకుంది. దేశం బయట కూడా అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు పొందింది. దేశం బయట స్థిరపడిన అప్ఘన్ ఆలోచనాపరులు ఈ కాంపెయిన్ను ముందుకు తీసుకెళ్లారు. ‘స్త్రీల పేరు స్త్రీల హక్కు’ అని ఈ కాంపెయిన్ చెబుతుంది. ముఖ్యంగా అప్ఘనిస్తాన్లో ప్రభుత్వం జారీ చేసే పిల్లల గుర్తింపు కార్డుల్లో తల్లి పేరు ఉండాల్సిందేనని ఈ కాంపెయిన్ పట్టుబట్టింది. అయితే దీనికి లోపలి అంగీకారం రావడం అంత సులువు కాలేదు. అసలు అక్కడి స్త్రీలలో చాలామంది మా పేరు బయటకు రావడం ఎందుకు అనే భావజాలంలో ఉన్నారు. ‘నా పేరు బయటకి వస్తే ఇంటి పరువు ఏం కాను’ అని ఒక స్త్రీ అంది. ఇక చాందసులైన పురుషులు కొందరు లాలె ఉస్మానిని ఉద్దేశిస్తూ ‘నీ పిల్లల గుర్తింపు కార్డులో నీ పేరు ఎందుకు కావాలో మాకు తెలుసులే. ఆ పిల్లల తండ్రి ఎవరో నీకు తెలియదు కదా’ అని దారుణంగా కామెంట్ చేశారు. స్త్రీల పేర్లు గుర్తింపు కార్డుల్లో వచ్చేలా ‘జనాభా నమోదు చట్టం’ను సవరణ చేయాలనే ప్రతిపాదనలు వచ్చినప్పుడు పార్లమెంటులో కొందరు సంప్రదాయవాదులు గట్టి వ్యతిరేకత ప్రదర్శించారు. అయినప్పటికీ లాలె ఉస్మానీ ఆమె సహచరులు ఇంకా దేశ విదేశాల్లోని ఆలోచనాపరులు పదే పదే ఈ కాంపెయిన్ను కొనసాగించారు. చివరకు దేశాధ్యక్షుడైన అష్రాఫ్ ఘని స్త్రీల సంకల్పానికి తల వొగ్గారు. వ్యతిరేకతలు లెక్క చేయకుండా స్త్రీల పేర్లకు సంబంధించిన నిషేధాన్ని ఎత్తేశారు. ఇది ఒక పెద్ద, ఘనమైన విజయం. ప్రస్తుతం అక్కడ అప్ఘనిస్తాన్ ప్రభుత్వానికి తాలిబన్లకు శాంతి చర్చలు జరుగుతున్నాయి. శాంతి కోసం స్త్రీ స్వేచ్ఛను పణంగా పెట్టమని తాలిబన్లు కోరే వాతావరణం ఉన్నప్పటికీ అఫ్రాఫ్ ఘని ప్రభుత్వం స్త్రీల పురోభివృద్ధి గురించి తమ వైఖరి స్పష్టం చేస్తూ చట్ట సవరణ చేయడం చూస్తుంటే మున్ముందు అప్ఘనిస్తాన్లో స్త్రీ వికాసం మరింత జరుగుతుందనే ఆశ కలుగుతోంది. జరగాలనే కోరుకుందాం. – సాక్షి ఫ్యామిలీ -
మన క్రికెటర్లను ఇలా ఎప్పుడైనా చూశారా?
విశాఖపట్నం: న్యూజిలాండ్తో విశాఖపట్నంలో జరుగుతున్న ఐదో వన్డేలో భారత క్రికెటర్లు సరికొత్తగా కనిపించారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ధోనీసేన బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లు సహా బ్యాటింగ్కు వచ్చిన క్రికెటర్ల జెర్సీలపై ఎప్పుడూ లేనివిధంగా కొత్త పేర్లు కనిపించాయి. సాధారణంగా క్రికెటర్లు ధరించే జెర్సీలపై వారి సొంత పేర్లు ఉంటాయి. విశాఖ మ్యాచ్లో మాత్రం భారత క్రికెటర్లందరి జెర్సీలపైనా మహిళల పేర్లు ఉన్నాయి. ఆటగాళ్ల జెర్సీపై ఉన్న పేరు వారి తల్లి పేరు. తమ జీవితాల్లో అమ్మకు ఉండే ప్రాధాన్యాన్ని చెప్పడానికి క్రికెటర్లు ఇలా చేశారు. భారత క్రికెట్ బోర్డుతో కలసి స్టార్ ఇండియా చేపట్టిన మహిళల సాధికారిత ప్రచార కార్యక్రమంలో భాగంగా టీమిండియా క్రికెటర్లు తమ తల్లి పేరును జెర్సీపై వేయించుకున్నారు. సామాజిక మార్పు కోసం ఓ టీమ్ జర్సీని వాడటం ప్రపంచంలో ఇదే తొలిసారి అని స్టార్ ఇండియా చైర్మన్ ఉదయ్ శంకర్ చెప్పారు. తమ కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన బీసీసీఐ, భారత క్రికెటర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
మన క్రికెటర్లను ఇలా ఎప్పుడైనా చూశారా?
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
ధర్మాగ్రహం ముందు నిలవని దాదాగిరి
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement