-
జరిమానాలపై జనం బెంబేలు
కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి కొత్తగా అమల్లోకి తీసుకువచ్చిన మోటార్ వాహనాల (సవరణ) చట్టం ప్రకారం పడుతున్న భారీ జరిమానాలు ఇవి. చిన్న చిన్న ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించినందుకే వేలు దాటి లక్షల్లో పెనాల్టీ పడుతుంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ చట్టంతో సామాన్యులపై మోయలేని భారం పడుతోందని సగానికి పైగా రాష్ట్రాలు అమల్లోకి తీసుకురావడానికి నిరాకరించాయి. చివరికి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా కొత్త చట్ట ప్రకారం జరిమానాలు విధిస్తే జనంలో చెడ్డ పేరు వస్తోందని గగ్గోలు పెడుతున్నాయి. కేంద్రం చేసిన చట్టాన్ని తాము కూడా అమలు చేయలేమంటూ చేతులెత్తేశాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మొదట గుజరాత్ ఈ స్థాయిలో జరిమానాలు విధించలేమని తేల్చి చెప్పేస్తే, ఇప్పుడు అదే బాటలో మహారాష్ట్ర, కర్ణాటక కూడా నడుస్తున్నాయి. ప్రపంచంలోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారత్ ముందు వరసలో ఉందని, ప్రమాదాలు నివారించి, ప్రజల ప్రాణాలు కాపాడడానికే ఈ జరిమానాలు తీసుకువచ్చామని కేంద్ర రోడ్లు, రవాణా, హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమర్థించుకున్నా, సమాజంలో వివిధ వర్గాలతో సుదీర్ఘ చర్చల అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పినా ఆయనకు నిరసన సెగలు తగులుతున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు గడ్కరీ ఇంటి ముందు ధర్నాలకు దిగారు. ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ జరిమానాలపై తీవ్రంగా కామెంట్లు పెడుతున్నారు. జోకులు, మెమెలతో నెటిజన్లు హడావుడి చేస్తున్నారు. ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్థాయిలో జరిమానాలు విధించడం ఇష్టం లేక చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు జరిమానాలు తగ్గించడానికి కసరత్తు చేస్తున్నాయి. గుజరాత్ బాటలో..! బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్ ఈ పెనాల్టీలపై తొలిసారి నోరు మెదిపింది. ఈ స్థాయి లో జరిమానాలు సరైన పద్ధతి కాదంటూ సగానికి సగం జరిమానాలను తగ్గించింది. దాదాపుగా 90 శాతం కేసుల్లో జరిమానాల్లో మార్పులు చేసింది. హెల్మెట్ లేకపోతే రూ.500, లైసెన్స్ లేకపోతే రూ2000... ఇలా చాలా కేసులకు సంబంధించి జరిమానాలను సగానికి సగం తగ్గించింది. ఇక గుజరాత్ బాటలోనే ఉత్తరాఖండ్ కూడా నడిచింది. ఎన్నికలున్నాయనే... కొత్త చట్టం కింద పన్నులు విధించడానికి కొన్ని రాష్ట్రాలు వెనక్కి తగ్గడానికి, ఎన్నికలకు సంబంధం ఉందనే విశ్లేషణ లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో జార్ఖండ్, మహారాష్ట్ర, హరియాణాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకే మహారాష్ట్ర, జార్ఖండ్లు ఈ కొత్త చట్టాన్ని అమలు చేయలేమని చెప్పేశాయి. అయితే తాము తీసుకున్న ఈ నిర్ణయం ఎన్నికల కోసం కాదని, ప్రజల కోసమేనని మహారాష్ట్ర అంటోంది. భారీస్థాయిలో జరిమానాలు విధించలేమని తేల్చేసిన రాష్ట్రాలు: పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర జరిమానాలు తగ్గించడానికి కసరత్తు చేస్తున్న రాష్ట్రాలు: పంజాబ్, గోవా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఉత్తరాఖండ్ -
శాసన విధుల్లో జోక్యం చేసుకోలేం: సుప్రీం
న్యూఢిల్లీ: శాసన సంబంధ విధుల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం పెంపునకు సంబంధించిన బిల్లు రాజ్యసభలో పెండింగ్లో ఉన్నందున ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ కోయంబత్తూర్కు చెందిన డాక్టర్ ఎస్.రాజశేఖరన్ దాఖలు చేసిన పిటిషన్ సోమవారం అత్యున్నత న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. మోటారు వాహనాల(సవరణ) బిల్లు–2017 బిల్లును ఇప్పటికే లోక్సభ ఆమోదించగా రాజ్యసభలో పెండింగ్లో ఉంది. దీనిని వచ్చే శీతాకాల సమావేశాల్లో సభ ఆమోదించే అవకాశం ఉంది. ‘చట్టసభల విధుల్లో మేం జోక్యం చేసుకోలేము. రాజ్యసభలో ఆ బిల్లు పెండింగ్లో ఉందంటే దానర్థం మేం జోక్యం చేసుకోవాలని కాదు. ఆ పని మేం చేయలేం’ అని స్పష్టం చేసింది. ‘పరిహారం చెల్లింపులో ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉంది. ఎవరైనా రూ.2 లక్షల పరిహారం ఇస్తామంటే మేమేందుకు వద్దంటాం? అని ప్రశ్నించింది. -
ఆర్టీసీలో ఇక డ్రైవరే కండక్టర్
- తెలంగాణ వాహన చట్టానికి సవరణ సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ విధులను కూడా డ్రైవర్ నిర్వర్తించేలా మోటారు వాహనాల చట్టాన్ని ప్రభుత్వం సవరించింది. లెసైన్స్ లేకుండా కండక్టర్ విధులను డ్రైవర్ నిర్వర్తించకూడదనే నిబంధనను సడలించింది. సంబంధిత నోటిఫికేషన్ను విడుదల చేస్తూ రవాణాశాఖ మం గళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ బస్సు ల్లో డ్రైవర్లకు టిమ్ మిషన్లు ఇచ్చి కండక్టర్ విధులు చేయాలని పురమాయించడాన్ని సవాల్ చేస్తూ కొందరు కార్మికులు గతంలో కోర్టును ఆశ్రయిం చారు. చట్టంలో మార్పులు చేయకుండా డ్రైవర్లతో కండక్టర్ విధులు చేయించటం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చట్టసవరణ చేసింది. నోటిఫికేషన్లో కొన్ని అంశాలను పొందుపరిచింది. డ్రైవర్ కచ్చితంగా 8వ తరగతి ఉత్తీర్ణుడై ఉండాలని, ప్రథమ చికిత్సకు సం బంధించి నిర్ధారిత సర్టిఫికెట్ ఉండాలని, లెసైన్స్ను డ్రైవర్ వద్ద ఉంచుకుని తనిఖీ అధికారులకు చూపించాలి. కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో జీపీఎస్/జీపీఆర్ఎస్ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement