breaking news
Monetary bill
-
బాబు నిర్వాకంతో ఉద్యోగులకు జీతాలు ఆలస్యం
సాక్షి, అమరావతి: చంద్రబాబు నిర్వాకంతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ నెల 1న అందాల్సిన వేతనాలకు బ్రేక్ పడింది. గత నెల 17న ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీ ఆమోదించగా.. మండలిలో టీడీపీ సభ్యులు బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకున్నారు. బిల్లుకు ఆమోదం తెలపకుండానే డిప్యూటీ చైర్మన్ మండలిని నిరవధిక వాయిదా వేయడంతో ఈ నెల 1 నుంచి ఖజానా నుంచి పైసా వాడేందుకు వీల్లేకుండా పోయింది. ఫలితంగా ఉద్యోగులు, పెన్షనర్లకు 1న వేతనాలందలేదు. మండలి ఆమోదించకపోయినా..మండలిలో ప్రవేశపెట్టిన 14 రోజుల తర్వాత గవర్నర్ ఆమోదానికి ద్రవ్య వినిమయ బిల్లును పంపించడానికి అవకాశం ఉంటుంది. ఆ మేరకు బుధవారం అర్ధరాత్రితో 14 రోజులు పూర్తవుతుండటంతో బిల్లును గురువారం గవర్నర్ ఆమోదానికి పంపనున్నారు. బిల్లు ఆమోదానికి గవర్నర్ ఎంత సమయం తీసుకుంటారనే అంశంపై ఉద్యోగులకు జీతాల చెల్లింపు ఆధారపడి ఉంటుంది. గవర్నర్ ఆమోదం తర్వాత నోటిఫికేషన్ జారీ చేస్తే.. ఖజానా నుంచి డబ్బులు డ్రా చేసే అధికారం ప్రభుత్వానికి వస్తుంది. బిల్లుకు ఆమోదానికి గవర్నర్ 2–3 రోజుల సమయం తీసుకుంటే.. ఉద్యోగుల జీతాలు కూడా ఆలస్యమవుతాయి. తెలుగుదేశం వైఖరి వల్లే.. సాధారణంగా బడ్జెట్కు సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించడం శాసనసభతోపాటు శాసన మండలి ప్రాథమిక విధి. లాక్డౌన్ వల్ల రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను నిర్వహించలేని పరిస్థితేర్పడింది. ఈ కారణంగా అప్పట్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలకు(ఏప్రిల్–జూన్) ఖజానా నుంచి నిధుల వ్యయానికి గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేశారు. జూలై ఒకటి నుంచి ఖజానా నుంచి పైసా ఖర్చు చేయాలంటే ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభ, మండలి ఆమోదించాల్సి ఉంది. ఇందుకోసమే గత నెల 17న అసెంబ్లీ ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించగా.. దాన్ని మండలి ఆమోదానికి ప్రభుత్వం పంపింది. రాజధాని రాజకీయం పేరిట టీడీపీ ఎమ్మెల్సీలు రెచ్చిపోయి వ్యవహరించడంతో బిల్లు ఆమోదం పొందకుండానే మండలిని వాయిదా వేశారు. ఈ కారణంగా జూలై ఒకటి నుంచి ఖజానా నుంచి నిధులు వాడేందుకు వీల్లేకుండా పోయింది. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఒకటో తేదీన వేతనాలు పొందలేకపోయారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే.. జీతాలు రాక చిరుద్యోగుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. చంద్రబాబు, తెలుగుదేశం ఎమ్మెల్సీల నిర్వాకం వల్లే ఈ పరిస్థితి నెలకొందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
ఆందోళనల మధ్య బడ్జెట్ ఆమోదం
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభల్లో ఆందోళనలు 8వ రోజు కూడా కొనసాగాయి. సభ్యుల నిరసన మధ్యే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫైనాన్స్ బిల్లును, రూ.89.25 లక్షల కోట్ల ద్రవ్యవినియోగ బిల్లును ఎటువంటి చర్చా లేకుండానే లోక్సభ ఆమోదించింది. బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు ఆందోళన ప్రారంభించారు. ఈ గొడవ మధ్యనే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆర్థిక బిల్లును, రూ.89.25 లక్షల కోట్ల ద్రవ్యవినియోగ బిల్లును ప్రవేశపెట్టారు. వీటిని సభ్యులు మూజువాణి ఓటుతో ఆమోదించారు. కేవలం 25 నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగిసింది. ఆ వెంటనే సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. దీంతో మోదీ ప్రభుత్వం ఐదోది, ఆఖరు బడ్జెట్ ఆమోదం పొందినట్లయింది. ఈ బిల్లులను రాజ్యసభ ఆమోదించకున్నా ఆమోదం పొందినట్లే పరిగణిస్తారు. రాజ్యసభలో ఉదయం నుంచి విపక్షాలు ఆందోళన చేయటంతో గురువారానికి వాయిదావేశారు. -
ఫిరాయింపుదారులను ఇరుకునపెట్టే కాంగ్రెస్ వ్యూహం!
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుదారులను ఇరుకునపెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహం పన్నింది. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. తెలంగాణ శాసనసభలో శుక్రవారం ద్రవ్య బిల్లు చర్చకు రానుంది. ఈ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ ఓటింగ్కు పట్టుపట్టాలని నిర్ణయించుకుంది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు పార్టీ విప్ను ధిక్కరిస్తే, వారిని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ను కోరాలన్న ఆలోచనతోనే విప్ జారీ చేసింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీ విప్ ధిక్కరించినవారిని అనర్హులుగా ప్రకటించారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ అదే వ్యూహం పన్నింది. **