-
Ayodhya Ram Mandir: అయోధ్యలో యూపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
అయోధ్య/లక్నో: ఉత్తరప్రదేశ్కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిపి సుమారు 325 మంది అయోధ్యలో రామ్లల్లా దర్శనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం లక్నో నుంచి 10 బస్సుల్లో, కొందరు తమ కార్లలో బయలుదేరి అయోధ్యకు చేరుకున్నారు. నగరంలో వారికి ఘన స్వాగతం లభించింది. పుణేలో ఉన్న సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్యకు చేరుకుని వారితో కలిశారు. కొందరు శాసనసభ్యులు తమ కుటుంబసభ్యులతో కలిసి వచ్చారు. అంతా కలిపి సుమారు 400 మంది విడతల వారీగా సుమారు రెండున్నర గంటల సమయంలో బాల రాముడి దర్శనం చేసుకున్నారు. దర్శనం తర్వాత గ్రూప్ ఫొటోలు తీసుకున్నారు. రాముడిని దర్శించుకున్న వారిలో బీజేపీ మిత్ర పక్షాల శాసనసభ్యులతోపాటు కాంగ్రెస్, బీఎస్పీకి చెందిన వారు కూడా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యేలె వరూ ఈ కార్యక్రమానికి రాలేదు. ప్రస్తుతం యూపీ శాసనసభలోని 399 మందిలో బీజేపీకి 252 మంది, మిత్రపక్షాలకు 19 మంది సభ్యుల బలముంది. ప్రతిపక్షంలో ఎస్పీకి 108 మంది, ఇతరులకు 20 మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి సైతం ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ హాజరుకాలేదు. -
రాజకీయ కట్టప్పలు.. ఛీ కొడుతున్న ప్రజానీకం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: విశ్వసనీయత, విలువల్లేని రాజకీయ నేతల వల్ల నెల్లూరు జిల్లాకు చెడ్డపేరు వస్తోంది. వైఎస్సార్సీపీ బీ ఫారం ద్వారా ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి (నెల్లూరు రూరల్), మేకపాటి చంద్రశేఖర్రెడ్డి (ఉదయగిరి), ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి) పార్టీకి వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడంపై జనాగ్రహం వెల్లువెత్తుతోంది. వైఎస్ కుటుంబానికి వీరవిధేయులమని నిత్యం వల్లించిన ఆ ముగ్గురు శాసససభ్యులు డబ్బు కోసం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా ప్రవర్తించారని ప్రజానీకం ఛీ కొడుతోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై వైఎస్సార్సీపీ అధిష్టానం శుక్రవారం సస్పెన్షన్ వేటు వేయడంతో సింహపురి రాజకీయ కట్టప్పలకు సరైన గుణపాఠం చెప్పారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అప్పుడు తండ్రి, ఇప్పుడు తనయుడు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కుటుంబంలో రాజకీయ సస్పెన్షన్ల చరిత్ర ఉంది. టీడీపీలో సంక్షోభ సమయంలో నాదెండ్ల భాస్కర్రావుకి రామనారాయణరెడ్డి తండ్రి వెంకటరెడ్డి మద్దతు ఇవ్వడంతో అప్పట్లో ఆయన్ను సస్పెండ్ చేశారు. అనంతరం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రామనారాయణరెడ్డికి మంత్రి పదవి ఇచ్చి ఆ కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యత కల్పించారు. రాజకీయ గుర్తింపు వచ్చేలా చేశారు. వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా ఉండాల్సిన ఆనం కుటుంబం వ్యతిరేకంగా పనిచేసింది. అయినా 2019 ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి పెద్ద మనసు చేసుకుని వెంకటగిరి సీటును రామనారాయణరెడ్డికి ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించారు. మంత్రి పదవి ఇవ్వలేదని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో ఆయన్ను పార్టీ దూరంగా పెట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వెన్నుపోటు పొడవడంతో సస్పెండ్ చేసింది. గతంలో కూడా.. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఇప్పటికి రెండుసార్లు సస్పెండ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి చంద్రశేఖర్రెడ్డి 2007లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిని కాదని ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి విజయానికి సహకరించారు. దీంతో మేకపాటిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అప్పట్లో మేకపాటి వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. వైఎస్ కుటుంబానికి వీర విధేయుడిగా ఉన్న మేకపాటి రాజమోహన్రెడ్డి సోదరుడైన చంద్రశేఖర్రెడ్డికి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఘన విజయం దక్కేలా చేశారు. 2014లో ఓటమి చెందినా 2019లో మళ్లీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించారు. ఈ దఫా మాత్రం మేకపాటి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం సొంత కుటుంబంపైనే తిరుగుబాటు చేసినట్లు చెబుతున్నారు. అవినీతి, అక్రమాలను ప్రోత్సహించి వసూళ్ల రాజాగా మారారు. అతని తీరుపై ఫిర్యాదులు వెళ్లడంతో పార్టీ అధిష్టానం మందలించింది. ఈక్రమంలో వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదన్న సంకేతాలతో చంద్రశేఖర్రెడ్డి టీడీపీ నేతలతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారు. నమ్మకద్రోహం చేసిన చంద్రశేఖర్రెడ్డి దిష్టిబొమ్మను వింజమూరులో శుక్రవారం దహనం చేశారు. ఆది నుంచి శ్రీధర్రెడ్డిది అదే తీరు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తీరు ఆది నుంచి వివాదాస్పదమే. విద్యార్థి సంఘం నుంచి బీజేపీలో చేరిన ఆయన రూరల్ మండలాధ్యక్షుడిగా పోటీ చేసి ఓటమి చెందారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతుండడంతో 1989లో ఆ పార్టీ నుంచి సన్పెన్షన్కు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరి నేదురుమల్లి జనార్దనరెడ్డి సహకారంతో యూత్ కాంగ్రెస్ జిల్లా సెక్రటరీ పదవి తెచ్చుకున్నారు. తర్వాత నేదురుమల్లితో విభేదించి అప్పటి పీసీసీ చీఫ్ హనుమంతరావు చెంతన చేరారు. ఆపై పి.జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కర్రెడ్డి వద్దకు వెళ్లారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కోటంరెడ్డికి ప్రాధాన్యత ఇచ్చి ఓ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇచ్చారు. వైఎస్ మరణంతో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జగన్మోహన్రెడ్డి ఓదార్పు యాత్రలో శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు. జగన్ సముచిత స్థానం కల్పించి 2014, 2019 ఎన్నికల్లో టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించారు. అధికారం చేతిలో ఉందని విర్రవీగిన కోటంరెడ్డిపై అధిష్టానం సీరియస్ కావడంతో ఫోన్ ట్యాపింగ్ పేరుతో డ్రామా చేసి టీడీపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆత్మ ప్రభోదానుసారం ఓటు వేస్తానంటూ టీడీపీ అభ్యర్థికి ఓటు వేసి పెంచి పెద్ద చేసిన వైఎస్సార్సీపీకి వెన్నుపోటు పొడిచారు. కొండాపురంలో.. కొండాపురం: మండలంలోని కొమ్మి గ్రామంలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు శుక్రవారం ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటిచంద్రశేఖర్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయన ఫ్లెక్సీకి చెప్పులు వేలాడదీశారు. అనంతరం చెప్పులతో కొట్టి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గానికి పట్టిన పీడ విరగడైందని ఆనందం వ్యక్తం చేశారు. టీడీపీకి అమ్ముడుబోయిన చంద్రశేఖర్రెడ్డికి సరైన శిక్ష వేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు మన్నం వెంకటసుబ్బయ్య, మాల్యాద్రి, ప్రభాకర్, ఖాజారంతుల్లా, హరి చౌదరి, తేజ నాయక్, మధు, రాజేష్, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
అందరం కలిసి సుపరిపాలన అందిద్దాం
సాక్షి, అమరావతి: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాలునీళ్లలా కలిసి మెలిసి పనిచేయాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. అవినీతికి తావు లేకుండా సుపరిపాలన అందించేందుకు అంతా కృషి చేయాలన్నారు. శాసనసభ శీతాకాల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో మంగళవారం రాత్రి విజయవాడలోని బరంపార్కులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులకు సీఎం విందు ఇచ్చారు. ఇద్దరు ఎంపీలు కూడా దీనికి హాజరయ్యారు. కలెక్టర్లు, ఎస్పీలు, ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ ఇందులో పాల్గొన్నారు. చదవండి: ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులు! మనకు ప్రజా ప్రయోజనాలే ముఖ్యం అధికారులు, ప్రజాప్రతినిధులు సఖ్యతగా ముందుకు సాగాలని సీఎం ఆకాంక్షించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో వాటిని ప్రజలకు సంపూర్ణంగా అందించేందుకు పనిచేయాలన్నారు. అహంభావానికి తావు ఇవ్వవద్దని, ప్రజాప్రయోజనాలే అంతిమమని స్పష్టం చేశారు. జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం కోసం తరచూ సమావేశమవ్వాలని, సీఎం కార్యాలయ అధికారులు సహకరిస్తారని సీఎం చెప్పారు. కృష్ణా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల విందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సీఎస్, డీజీపీ 1 నుంచి గ్రామాల బాట జనవరి 1 నుంచి గ్రామ సచివాలయాలు పూర్తి స్థాయిలో పనిచేయనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, అధికారులు గ్రామాల బాట పట్టాలని ఆదేశించారు. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను పరిశీలించాలని కోరారు. పథకాల లబ్ధిదారుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శిస్తామని, పేరు లేకపోతే అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా సూచిస్తున్నామన్నారు. మనకు ఓటు వేయని వారికి కూడా అర్హులైతే పథకాల ప్రయోజనాలు అందించాలన్నారు. ఉదయం 8 గంటల్లోపు, రాత్రి 9 గంటల తర్వాత అధికారులకు ఫోన్లు చేసి వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది కలిగించొద్దని ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రజాప్రతినిధులు ఫోన్ చేసినప్పుడు అధికారులు కచ్చితంగా స్పందించాలన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు, అధికారుల విందులో సీఎం జగన్, సీఎస్, డీజీపీ -
రైతు దినోత్సవానికి సర్వం సిద్ధం
సాక్షి, జమ్మలమడుగడు : దివంగత ముఖ్యమంత్రి వైఎస్రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా రాష్ట్ర రైతు దినోత్సవం కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రైతు దినోత్సవ కార్యక్రమాన్ని సొంత జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ప్రారంభించడానికి ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి నిర్ణయించడంతో సోమవారం పట్టణంలోని ముద్దనూరు రహదారిలో పనులను వేగ వంతంగా పూర్తి చేశారు. ఇప్పటికే సభాప్రాంగణం పూర్తి చేయడంతోపాటు రైతులకు సంబంధించిన పరికరాల పంపిణీ కోసం, వివిధ శాఖలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి, ఎమ్మెల్యేలు, నాయకులు సీఎం సభకు భారీగా వస్తారని అంచనాతో.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సారి జిల్లాకు వస్తుండటంతో భారీగా ప్రజలు, రైతులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అదే స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. రైతులకు, మహిళలకు, ప్రజలకు, వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేయించారు. వర్షం పడినా సభకు అంతరాయం కలుగకుండ రేకుల షెడ్లతో కూడిన సభావేదికను తీర్చిదిద్దారు. భారీగా బందోబస్తు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు దినోత్సవ సభకు హాజరవుతుండటంతో పాటు జిల్లాలోని డిప్యూటీ సీఎం అంజాద్బాషా, వ్యవసాయాశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీలు వైఎస్ అవినాష్రెడ్డి, మిధున్రెడ్డిలతోపాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు కర్నూల్ జిల్లాలోని బనగానపల్లి, ఆళ్లగడ్డ, అనంతపురం జిల్లా నుంచి తాడిపత్రి, ధర్మవరం ఎమ్మెల్యేలు సైతం ఈ సభకు హాజరవుతుండటంతో పట్టణంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. -
నేడు 2వ రోజు ఎమ్మెల్యే,ఎమ్మెల్సీల శిక్షణ తరగతులు
సాక్షి, అమరావతి : రాష్ట్ర శాసనసభలో అనుసరించాల్సిన నియమ, నిబంధనలపై శాసన సభ్యులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు గురువారం రెండవ రోజు ప్రారంభంకానున్నాయి. ఏపీ అసెంబ్లీ కమిటీ హాలులో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ఉదయం సుపరిపాలన అంశంపై ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణ రావు ప్రసంగం ఇవ్వనున్నారు. అనంతరం సభ్యులతో ముఖాముఖి కార్యక్రమం ఉండనుంది. మధ్యాహ్నం సంక్షేమ కార్యక్రమాలు, గౌరవ సభ్యుల పాత్ర అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం మాట్లాడతారు. శాసన సభ్యులు రాజకీయ నైతికత, ప్రజామోదం అంశంపై డెమోక్రటిక్ రిఫార్మ్స్ వ్యవస్థాపకులు, జనరల్ సెక్రటరీ జయప్రకాష్ నారాయణ ప్రసంగించనున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement