breaking news
Minority groups
-
BAN: కుమిల్లా ఘటన.. భగ్గుమన్న హిందూ సంఘాలు
బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీ వర్గం మరోసారి ఆందోళన బాట పట్టింది. కుమిల్లా(Comilla) జిల్లా దారుణ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ.. గత మూడు రోజులుగా ఉధృతంగా నిరసనలు చేస్తున్నారు. వివాహితపై స్థానిక నేత ఒకరు అత్యాచారానికి దిగడం, అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో లీక్ చేయడమే ఇందుకు ప్రధాన కారణం. కుమిల్లా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లోకి చొరబడిన ఫజోర్ అలీ అనే వ్యక్తి.. హిందూ మతానికి చెందిన ఓ వివాహితను బెదిరించి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా ఆ ఘోరాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో వదిలాడు. ఈ వీడియో వైరల్ కావడంతో హిందూ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఢాకా యూనివర్సిటీ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా పిర్యాదును వెనక్కి తీసుకోవాలని బాధితురాలిపై ఒత్తిడి పెరుగుతోందన్న మీడియా కథనాల నేపథ్యంలో.. ఈ ఆందోళనలు మరింత ఉదృతంగా మారాయి. అయితే ప్రజలు మాత్రం బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని చెబుతున్నప్పటికీ ఆందోళనలు చల్లారడం లేదు. Urgent protest march by Hindu students at Dhaka University after the horrific rape of a Hindu girl in Muradnagar, Comilla last night. The Islamist rapist must face justice and the harshest punishment. Silence is not an option! #StopHinduGenocideInBangladesh #JusticeForHindus pic.twitter.com/yAaGGkm82f— Voice of Bangladeshi Hindus 🇧🇩 (@VHindus71) June 29, 2025ఏం జరిగిందంటే..బాధితురాలు(21) వివాహిత. ఆమె భర్త దుబాయ్లో పని చేస్తుంటాడు. హరిసేవా పండుగ కోసం ఆమె తన పిల్లలను తీసుకుని కుమిల్లా జిల్లా మురాద్నగర్ ఉపజిల్లా రామ్చంద్రాపూర్ పాచ్కిట్ట గ్రామంలోని తన పుట్టింటికి వెళ్లింది. రాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడిన ఫజోర్ అలీ.. కత్తి చూపించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను హింసిస్తూ ఆ ఘోరాన్ని తన ఫోన్లో బంధించాడు. జూన్ 26వ తేదీ.. ఈ ఘోరం జరిగింది. జూన్ 27వ తేదీ.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. విచారణలో నిందితుడు ఫజోర్ అలీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) నేతగా నిర్ధారణ అయ్యింది. దీంతో రాజకీయ దుమారం రేగింది. జూన్ 28వ తేదీ.. సోషల్ మీడియాలో లైంగిక దాడికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో హిందూ సంఘాలు భగ్గుమన్నాయి.జూన్ 29 వేకువఝామున.. ప్రధాన నిందితుడు ఫజోర్ అలీని ఢాకాలోని సయేదాబాద్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. మిగిలిన నలుగురిని బాధితురాలి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు అరెస్ట్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ మైనారిటీ సంఘాలు, ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళకు దిగారు. జూన్ 30.. బాధితురాలిని కేసు వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిళ్లు వస్తున్నాయని అక్కడి మీడియా సంస్థల్లో వరుస కథనాలు.. దీంతో తమ ఆందోళనను ఉధృతం చేశాయి హిందూ సంఘాలుమరోవైపు.. కుమిల్లా వివాహిత అత్యాచార కేసుకు సంబంధించిన తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది అత్యాచారం కాదని వివాహేతర సంబంధ వ్యవహారమని.. బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడిందని.. బాధితురాలికి సంబంధించిన వీడియోలు అంటూ ఫేక్ పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో పలు ఫ్యాక్ట్చెక్ వెబ్సైట్ల అక్కడి అధికారులను సంప్రదించి అవి ఫేక్న్యూస్గా తేల్చేస్తున్నాయి. కిందటి ఏడాది మొదలై.. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హిందూ సంఘాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడం గత ఏడాది కాలంగా జరుగుతోంది. 2024 డిసెంబరులో, ఢిల్లీ, లఖ్నవూ, జైపూర్, నాగ్పూర్ వంటి నగరాల్లో హిందూ సంస్థలు నిరసన ర్యాలీలు నిర్వహించాయి. నిరసనకారులు “బంగ్లాదేశ్లో హిందువుల నరమేధాన్ని ఆపాలి” అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.బంగ్లాదేశ్లో 2024 ఆగస్టు నుండి అక్టోబరు మధ్య 88 మతపరమైన హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని అక్కడి తాత్కాలిక ప్రభుత్వమే అంగీకరించింది. వీటిలో ఎక్కువగా హిందువులపై దాడులే ఉన్నాయని పేర్కొంది కూడా. ఈ నేపథ్యంతో.. ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీన థాయ్లాండ్ బ్యాంకాక్ వేదికగా జరిగినబిమ్స్టెక్ (BIMSTEC) శిఖరాగ్ర సమావేశంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్తో భారత ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఆ సమయంలో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పడాలంటే.. బంగ్లాదేశ్ తీరు మారాల్సిందేనని ప్రధాని మోదీ చెప్పినట్లు తెలుస్తోంది. -
నిరసన హోరు
బాబ్రీ మసీదు కూల్చివేత దినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో శనివారం నిరసనలు హోరెత్తాయి. బాబ్రీ మసీదు పున ర్నిర్మాణం కాంక్షిస్తూ మైనారిటీ సంఘాలు, రామాలయం నిర్మాణం లక్ష్యంగా హిందూ సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. పోటాపోటీ ఆందోళనలు ఎక్కడ ఉద్రిక్తతను రేపుతాయోనన్న ఉత్కంఠ నడుమ పోలీసులు విధుల్ని నిర్వర్తించి చివరకు ఊపిరి పీల్చుకున్నారు. సాక్షి, చెన్నై: బాబ్రీ మసీదు కూల్చి వేసిన రోజు అంటే పోలీసులకు హైటెన్షన్. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జన సంచారం అధికంగా ఉండే ప్రదేశాలు, అన్ని మతాలకు చెందిన ఆలయాల్ని తమ ఆధీనంలోకి తీసుకుని కట్టుదిట్టమైన భద్రతతో వ్యవహరించారు. తనిఖీలు ముమ్మరం చేసి అప్రమత్తంగా వ్యవహరించడంతో బ్లాక్ డే కేవలం నిరసనలతో గడిచింది. అయితే, హిందూ సంఘాలు ఈ సారి రామాలయం నిర్మాణం నినాదంతో ఆందోళనలకు దిగడంతో ఉత్కంఠ నెలకొంది. అనుమతులు లేకుండా నిరసనలు తెలియజేసిన హిందూ సంఘాల్ని పలు చోట్ల పోలీసులు అరెస్టు చేయడంతో బ్లాక్ డే ప్రశాంతగా గడిచింది. నల్లచొక్కాలతో...: బాబ్రీ మసీదు పున ర్నిర్మాణం, జాతీయ సమైక్యతను కాంక్షిస్తూ మైనారిటీ సంఘా లు, పార్టీలు నిరసనలతో హోరెత్తించాయి. తమిళనా డు ముస్లిం మున్నేట్ర కళగం, తమిళనాడు ముస్లిం లీగ్, తమిళనాడు తౌపిక్ జమాత్, మనిదనేయ మక్కల్ కట్చి, ఎస్డీపీఐ, ఐఎన్టీజే తదితర సం ఘాలు, పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చోటు చేసుకున్నాయి. నల్ల చొక్కాల్ని ధరించి తమ నిరసనల్ని తెలియజేశారు. చెన్నై నగంరలో నాలుగు చోట్ల నిరసనలు సాగాయి. తమిళనాడు ముస్లిం మున్నేట్ర కళగం నేత అబూబక్కర్ నేతృత్వంలో జరిగిన నిరసనలో శ్రీలంక తమిళుల పరిరక్షణ కమిటీ నేత పల నెడుమారన్, మనిమారణ్ సైతం పాల్గొని తమ సంఘీభావం తెలియజేశారు. ఇదే వేదిక మీద చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జాతీయ సమైక్యతను, సర్వమత సామరస్యాన్ని చాటే విధంగా వస్త్రాల్ని ధరించి తమ ఐక్యతను చాటుకోవడం విశేషం. తమను ఎవ్వరూ విడదీయలేరని, తాము భారతీయులం, జాతీయ సమైక్యతకు పాటుపడుతామని నినదించారు. చెన్నైలో జరిగిన నిరసనలకు పెద్ద ఎత్తున ముస్లిం మహిళలు సైతం తరలి వచ్చారు.రామాలయం లక్ష్యం: అయోధ్యలో రామాలయం నిర్మాణమే లక్ష్యంగా పిలుపునిస్తూ హిందూ సంఘా లు ఆందోళనకు దిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, హిందూ మున్నని, విశ్వహిందూ పరిషత్ల నేతృత్వంలో నిరసనలు సాగాయి. రామాలయం నిర్మా ణం నినాదంతో ఫ్లకార్డులను చేత బట్టి ఆందోళనల కు దిగారు. పలు చోట్ల ఎలాంటి అనుమతులు లేకుండా నిరసనలు చేపట్టిన హిందూ సంఘాల్ని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలో ఎగ్మూర్, తాంబ రం, మాధవరంలలో ఈ నిరసనలు సాగాయి. ముందస్తు అనుమతులు లేకుండా నిరసనలు చేపట్టినందుకు గాను 200 మంది హిందూ సంఘాల నాయకుల్ని అరెస్టు చేసి, సాయంత్రం విడుదల చేశారు.